ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సుధాకర్ బాబు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు పాటించని పక్షంలో ఏ అధికారంతో సీఎం జగన్ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని కోవారెంటో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ గురించి విభేదించడంతో పాటు ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ తరఫు లాయర్ హిందువులకు మాత్రమే తిరుమలలో ప్రవేశం ఉంటుందని.. దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలని ఉందని చెప్పారు.
సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153లకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జడ్జి లాయర్ ను సీఎం జగన్ క్రిస్టియన్ అని చెప్పేందుకు ఆధారాలు చూపించాలని ప్రశ్నించింది. సరైన ఆధారాలు చూపకుండా సీఎం మతం గురించి వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు సీఎంను కులం గురించి అడగదని.. వ్యాజ్యం దాఖలు చేసిన వాళ్కే ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది.
జగన్ క్రిస్టియన్ అని ప్రూవ్ చేసేందుకు గడువు ఇస్తామని పూర్తి వివరాలు లేకుండా పిటిషన్ విచారణ ముందుకు వెళ్లదని చెబుతూ హైకోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…