Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ప్రతిమ రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెం పై సలహాలు సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఇలా ఏడాది పాటు ఈ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి నాణేలపై
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన ప్రతిమతో వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…