Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ప్రతిమ రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెం పై సలహాలు సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఇలా ఏడాది పాటు ఈ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి నాణేలపై
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన ప్రతిమతో వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…