తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోగా మారి విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని తిరిగే విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలో నటించి అనంతరం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమాలో వరదరాజులు అనే విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సందర్భంగా అఖండ చిత్ర బృందంతో కలిసి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడ చిత్ర బృందం ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ముచ్చటించిన శ్రీకాంత్ ను అలీ ప్రశ్నిస్తూ ఒక సినిమా సమయంలో డైరెక్టర్ తో గొడవపడి బయటకు వెళ్లారట కదా.. ఆ గొడవ ఏంటని అలీ అడగడంతో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి సంకోచించిన అతను ఒక పెద్ద డైరెక్టర్ అని ఒకే మూమెంట్ పదే పదే మారుస్తూ షూటింగ్ చేయడంతో చిరాకు దొబ్బి అక్కడున్న వస్తువులను నేలకేసి కొట్టి తనతో గొడవపడి వెళ్లిపోయానని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఒకప్పుడు హీరోగా అందరిని కొట్టి ఇప్పుడు విలన్ గా దెబ్బలు కొట్టించుకుంటే ఎలా ఉందని అడుగగా తన కెరియర్ మొదట్లో విలన్ గా దెబ్బలు తిన్నారని ఆ తర్వాత హీరోగా కొట్టానని ప్రస్తుతం తిరిగి దెబ్బలు తినడంతో తనకు ఎలాంటి కొత్త అనుభవం లేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…