టాలీవుడ్ లో మొదటి తరం అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున స్టార్ హారోలుగా పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసి పోకుండా మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఈ స్టార్ హీరోలు యాంకర్స్ గా మారిపోయి.. అందులో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు.
అటు వెండితెరలోనే కాదు.. టెలివిజన్ లో కూడా తమ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. సినిమాలకు తగ్గకుండా తీసుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి యాంకర్స్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు.
నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పడు సీజన్ 5 వరకు హోస్ట్ గా చేస్తున్నారు. దీంతో అతడు హ్యాట్రిక్ కొట్టేశాడు. అయితే బాలయ్య కూడా త్వరలో ఆహాలో ప్రసారం కానున్న టాక్ షోలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక పోతే విక్టరీ వెంకటేష్ మాత్రమే యాంకర్ గా ఇంకా తన కెరీర్ ను మొదలు పెట్టలేదు. ఇక జూనియర్ హీరోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై .. టెలివిజన్ పై రెచ్చిపోతున్నారు. ఇక వారిలో ముఖ్యంగా నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దగ్గుపాటి రానా అయితే నంబర్ వన్ యారీ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. ఇక సాయి కుమార్ గురించి చెప్పాల్సి అవసరం లేదు. అతడు ఈ టీవీలో ప్రసారం అవుతున్నా వావ్ కు హోస్ట్ గా వ్వవహరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…