Poonam Kour: వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవడం బాధనిపించింది.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ! వెంటనే డెలీట్..

Poonam Kour: పూనమ్ కౌర్.. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు దగ్గర అవుతూ.. నెట్టింట ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆమె నటించిన సినిమాలకు వచ్చిన ఫేమ్ కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటారు.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

ఇక ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు.. సినిమాలకు సంబంధించి విషయాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇలా ఆమె ఇన్ స్టా, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలా చేసిన ట్వీట్లలో ఆమె ఒకానొక సమయంలో వైరల్ అవుతూ ఉంటాయి.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సినీ పెద్దలు ఇటీవల సీఎం జగన్ ను కలిసిన విషయం విధితమే.

ఎంటర్‌‌టైన్మెంట్ రాజకీయాలుగా ..


అయితే అక్కడ సీఎం జగన్ దగ్గర చిరంజీవి లాంటి పెద్ద హీరోలు సీఎం జగన్ ను అభ్యర్థించారు సినిమా టికెట్ల రేట్లను పెంచమని. ఆ సీన్ నచ్చని పూనమ్ ఇలా రాశారు. అందులో ” నేను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి” అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసింది. తర్వాత మరో ట్వీట్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. రాజకీయాలు వినోదం గాను, వినోదాలు రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ వైరల్ గా మారాయి.