Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగంలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ఒంటెద్దు బండి నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
వాళ్ళు చనిపోడానికి అసలు కారణాలు అవే…
సుబ్బరాయ శర్మ గారితో మొదటి సినిమా నుండి కలిసి నటించిన వాళ్లలో గుండు హనుమంత రావు ఒకరు. ఆయనకు షుగర్ అలానే ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల మరణించారు. అయితే హాస్పిటల్ బిల్స్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే మరీ ఆర్థిక సమస్యలేమి లేవు ఆయన జాగ్రత్త పరుడు అంటూ తెలిపారు. ఇక రంగనాధ్ గారు చాలా మంచి మనిషి, ఆయనే ఎంతో మందికి మనల్ని మనం చంపుకునే హక్కు లేదు అంటూ చెప్పిన వ్యక్తి అలా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఖచ్చితంగా అందుకు బలమైన కారణం ఉండి ఉంటుంది.
ఆయన భార్య అనారోగ్య సమస్యలతో అలాగే కాళ్ళు పడిపోవడంతో వీల్ చైర్ కి పరిమితమైన ఆమెను ఆయనే చూసుకునేవాడు. చివరకు ఆమె మరణించడంతో బాధలోకి వెళ్ళిపోయారు అంటూ చెప్పారు. ఇక జంధ్యాల గారు తాగే అలవాటు ఉండటం వల్ల మరణించారని చెప్పడం తప్పు, రాత్రి పగలు తేడా లేకుండా తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లంతా మరణించలేదే. ఆయనకు షుగర్ ఉండటం వల్ల కిడ్నీ పాడైంది అలా మరణించారు అంతే, నిజాలు తెలుసుకోకుండా తాగి తాగి మరణించారు అనడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…