Sudheer Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈనెల 15వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.ఈ విధంగా కృష్ణ గారు మరణించడంతో ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కృష్ణ గారిని తలుచుకొని మాట్లాడుతున్న ప్రతిసారి మహేష్ బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్లో కృష్ణ గారి పెద్దకర్మ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక అభిమానుల కోసం మహేష్ బాబు కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 రకాల వంటకాలను తయారు చేయించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా కృష్ణ గారికి నివాళులు అర్పించారు.
అనంతరం కృష్ణ గారి విగ్రహవిష్కరణ కూడా చేపట్టారు.ఇకపోతే మహేష్ బాబు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా కృష్ణ గారి అల్లుడు సినీ నటుడు సుధీర్ బాబు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వేదిక పైన కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణ మంచితనం గురించి తెలియజేయడమే కాకుండా తనకు ఎన్ని జన్మలెత్తినా కృష్ణ గారికి అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా సుధీర్ బాబు ఎమోషనల్ కావడంతో కృష్ణ గారి మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇకపోతే కృష్ణ గారి పెద్దకర్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…