సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

రజనీకాంత్ సినిమా షూటింగ్ నిమిత్తం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అయితే అదే షూటింగ్ లో పాల్గొన్న ఆరుగురికి సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలడంతో రజనీకాంత్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ కు కరోనా లక్షణాలు లేవని, అయన హైబీపీతో బాధపడుతున్నారని, దానికి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే రజినీ ఇలా అస్వస్థత గురవడంపై అయన అభిమానులు షాక్ కు గురిచేస్తుంది.




























