Surekha Vani: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారం కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే తాజాగా నిర్మాత కె.వి చౌదరి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో కస్టడీలో ఉన్నటువంటి కేపీ చౌదరినీ అధికారులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా కేపీ చౌదరి తాను ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన 12 మందికి డ్రగ్స్ అమ్మానని స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయగా ఎంతోమంది సెలబ్రిటీలతో ఈయన వందల కొద్ది ఫోన్లలో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇలా ఎక్కువగా ఫోన్లు చేసినటువంటి వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు ఉన్నారు.అంతేకాకుండా కేపీ చౌదరితో సురేఖవాణి చాలా చనువుగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సురేఖవానికి కూడా ఈ డ్రగ్స్ కేసులో బాగా ముందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో అధికారులు సురేఖ వాణిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే తన గురించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ డ్రగ్స్ పేరును ప్రస్తావించకుండా గత రెండు రోజులుగా తన గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదని వీటి వల్ల తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని అలాగే తమ కెరియర్ కూడా నాశనం అవుతుందని దయచేసి ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…