రేపటి (20 ఏప్రిల్) నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గి, జొమాటో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయా ఫుడ్ డెలివరీ యాప్స్ రాష్ట్రంలో ఆర్డర్స్ తీసుకోరాదని స్పష్టం చేసారు. ఫుడ్ డెలివరీల వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అందువల్ల వాటిని రాష్ట్రములో ఇకపై అనుమతించబోమని తెలిపారు.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా సోకడంతో అతను 60 మందికి అంటించాడని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్స్ ను రాష్ట్రంలో అనుమతించకూడదని నిర్ణయించామని తెలిపారు. అలాగే ప్రజలు కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దని సుమారు 15 రోజులపాటు బయట తిండి తినకపోవడమే మంచిదని తెలిపారు. వీలైనంత వరకు కిరాణా సరుకులు డెలివరీ చేసుకోవచ్చని స్పష్టం చేసారు.
హైదరాబాద్ లో స్విగ్గి డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. నాంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువకుడికి రెండు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. అయితే అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాధమికంగా తెలుసుకున్నారు. అతడు ఈ మధ్యకాలంలో ఫుడ్ ఎవరెవరికి డెలివరీ చేసాడు అనే దానిపై ద్రుష్టి పెట్టారు పోలీసులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…