Tag Archives: Alekhya Reddy

Tarakaratna Wife: రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అలేఖ్య రెడ్డి… తారకరత్న కోరికను తీర్చబోతున్నారా?

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా ఆయన కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు.ఇలా ఉన్నఫలంగా తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఒక్కసారిగా తన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ముఖ్యంగా తన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

తారకరత్న బ్రతికున్నప్పుడు కూడా బాలయ్య అండదండలు తారకరత్నకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన మరణం తరువాత తారకరత్న కుటుంబ బాధ్యతలను బాలయ్య తన భుజాలపై వేసుకున్నారు. ఇక తారకరత్న లేరనే వార్తను జీర్ణించుకోలేక అలేఖ్య రెడ్డి ఏకధాటిగా కంటతడి పెట్టడం అందరిని కలిచి వేస్తోంది.ఈ క్రమంలోనే ఆమెను ఈ బాధ నుంచి బయటకు తీసుకువచ్చి తనని తన జీవితంలో బిజీగా ఉంచడం కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో కలిసి అలేఖ్య రెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తారకరత్నకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఉండేది అయితే తన కోరికను తన భార్య అలేఖ్య ద్వారా తీర్చబోతున్నారని తెలుస్తోంది.

Tarakaratna Wife: వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…

ముందుగా అలేఖ్య రెడ్డిని ఈ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమెకు తెలుగుదేశం పార్టీలో ఏదైనా మహిళ విభాగంలో ఒక పదవిని ఇప్పించాలని అనంతరం వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tarakaratna: తారకరత్న చిన్న కర్మలో ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి… తల్లిని ఓదారుస్తున్న కూతురు నిష్క!

Tarakaratna: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యులతో పోరాడారు. అయితే ఈ పోరాటంలో తారకరత్న ఓడిపోక తప్పలేదు.ఇలా 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఈయన ఫిబ్రవరి 18వ తేదీ కన్నుమూశారు.ఈ విధంగా తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలోనూ అభిమానులను తీవ్ర విషాదం నింపింది.

ఇక ఈయన మరణించడంతో కుటుంబ సభ్యులు తారకరత్న చిన్న కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తారకరత్న తల్లిదండ్రులతో పాటు తన సోదరి హాజరయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణ కుటుంబం కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి కూడా ఈ చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక తారకరత్న చిన్న కర్మలో భాగంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక తారకరత్న తిరిగిరారనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తన భర్తను గుర్తు చేసుకుంటూ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తనను ఓదార్చడం కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తనని ఆపడం ఎవరి తరం కాలేదు.

Tarakaratna: ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్న అలేఖ్య…

ఇక అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా తన పెద్ద కుమార్తె నిష్క సైతం తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరినీ బాలకృష్ణ తన అన్నయ్య మోహన్ కృష్ణతో కలిసి స్వయంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tarakaratna: నందమూరి తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా అడుగు పెట్టారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఈయన సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలలోకి రావాలని భావించారు. ఇలా పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా తారకరత్న మరణించడంతో నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా కొంతకాలం పాటు ఈయన తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయితే బాలకృష్ణ విషయంలో జోక్యం చేసుకొని తనని కుటుంబ సభ్యులకు దగ్గర చేశారు.

ఈ విధంగా బాలకృష్ణ తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధముందే అయితే ఈయన గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తారకరత్న వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tarakaratna: భారీగా ఆస్తులు కూడ పెట్టిన తారకరత్న…

ఇక తారకరత్న హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయనకు మాత్రం బయట బిజినెస్ లు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి మోహనకృష్ణ కలిపి హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్స్‌తో పాటు తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్‌లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ల ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్‌లు ఉన్నట్టు సమాచారం వీటి విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే వారు ఈమె పేరు కూడా సుమారు 250 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న ఆస్తులు సుమారు 1500 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

Balakrishna: తారకరత్న పిల్లలతో బాలయ్య… వైరల్ అవుతున్న రేర్ పిక్స్!

Balakrishna: నందమూరి వారసుడు తారకరత్న అనారోగ్య సమస్యలతో గత 23 రోజులుగా పోరాడుతూ చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. తారకరత్న అతి చిన్న వయసులోనే మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అమాయకంగా తన తండ్రి వైపు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు అందరికీ కన్నీరు పెట్టిస్తున్నాయి.

ఇలా తారకరత్న గుండెపోటుకి గురై ఆస్పత్రిలో చేరిన క్షణం నుంచి ఆయనని ఎలాగైనా ప్రాణాలతో దక్కించుకోవాలని నందమూరి నటసింహం బాలకృష్ణ పడిన తపన ఆరాటం చూస్తుంటే వీరిద్దరికీ ఎంతో మంచి అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన బాలయ్య తనని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు.

ఇలా తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఈయన బెంగుళూరులోనే మకాం మారుస్తూ నిత్యం డాక్టర్లతో మాట్లాడుతూ అతనికి ఎంతో మెరుగైన వైద్య చికిత్సలు చేయించారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ విధి చేతిలో తారకరత్న ఓడిపోవాల్సి వచ్చింది. ఇక తారకరత్న మరణించడంతో తన పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.


Balakrishnaతారకరత్న పిల్లల బాధ్యతలు తీసుకున్న బాలయ్య…

ఇక తారకరత్నతో బాలయ్యకు ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ తారకరత్న ఎంతో ఆప్యాయంగా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని తెలుస్తోంది. ఇలా బాలయ్యకు తారకరత్నకు మధ్య ఉన్న అనుబంధంతోనే తనని ఎలాగైనా బ్రతికించుకోవాలని బాలయ్య ఆరాటపడ్డారు.ఇక బాలయ్యకు తారకరత్న పిల్లలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న పిల్లలతో బాలయ్య కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Balakrishna: తారకరత్న మరణంతో పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బాలయ్య?

Balakrishna: నందమూరి తారకరత్న మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తోంది. ఒకవైపు నందమూరి ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీస్తోంది.గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నప్పటికీ క్షేమంగా బయటకు రాలేకపోయారు.

ఇలా మృత్యువుతో పోరాడుతూ చివరికి విధి చేతిలో తారకరత్న ఓడిపోయి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇక తారకరత్న మరణ వార్త నందమూరి నటసింహం బాలకృష్ణకు తీవ్ర విషాదంగా మిగిలిపోయింది.చిన్నప్పటినుంచి తారకరత్నతో బాలకృష్ణకు ఎంతో మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమాభిమానాలను చూపుకుంటారు..

ఈ విధంగా బాబాయ్ అబ్బాయి మధ్య ఎంతో ప్రేమ ఉండడంతో తారకరత్న కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడుతూ ఎలాగైనా తనని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు. అయితే చివరికి బాలకృష్ణ తారకరత్న మరణ వార్త విని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక తారకరత్న మరణంతో బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Balakrishna: పిల్లల పూర్తి బాధ్యత నాదే….


తారకరత్న అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన మరణించడంతో తారకరత్న పిల్లల బాధ్యతలను పూర్తిగా బాలకృష్ణ తన చేతులలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా తెలియజేశారు.తన పిల్లలకు ఏ లోటు లేకుండా వారి బాధ్యతలను తానే చూసుకుంటానంటూ బాలయ్య హామీ ఇవ్వడంతో బాలయ్య మనసు బంగారం అంటూ అభిమానులు బాలయ్య నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Sai Reddy: తారక రత్న ఆరోగ్య విషయంలో బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి…?

Vijay Sai Reddy: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండె పోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్నటి వరకు అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన పెరిగిపోయింది. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఇక ఆయన ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించాడు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల పరామర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురు అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నాడు. ఇలా నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డికి బంధుత్వం ఏర్పడింది. అయితే అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబంలో విభేదాలు మొదలై తారకరత్నని దూరం పెట్టారు. వీరి వివాహం తర్వాత కొంతకాలానికి మళ్లీ కుటుంబ సభ్యులందరూ కలిసిపోయారు.

ఇక ఇటీవల పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అనారోగ్యం పాలవటంతో స్వయంగా బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవల విజయసాయిరెడ్డి బెంగళూరుకు చేరుకొని డాక్టర్లను సంప్రదించి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలియజేశారు.

Vijay Sai Reddy: కోలుకుంటున్న తారకరత్న…

తారకరత్న గుండె పనితీరు మెరుగు పడటమే కాకుండా రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందని, తొందర్లోనే తారకరత్న కోలుకుంటాడని విజయసాయిరెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా తారకరత్నకు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకుంటున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశాడు.

Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డి వివాహం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రతిమ చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నందమూరి తారకరత్న మహిళా అనారోగ్యం పాలవటంతో ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నందమూరి తారక రామారావు కుమారుడైన నందమూరి మోహనకృష్ణ కుమారుడే ఈ నందమూరి తారకరత్న.

తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డి అనే యువతని వివాహం చేసుకున్నాడు. అలేఖ్య రెడ్డి మరెవరో కాదు ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురే ఈ అలేఖ్య రెడ్డి. స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇర కుటుంబ సభ్యులు నిరాకరించటంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వీరి వివాహానికి మద్దతుగా నిలిచాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య రెడ్డి వెల్లడించింది.

Nandamuri Tarakaratna: పెళ్లికి నో చెప్పారు…

వీరి వివాహం తర్వాత ఇటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా కొంతకాలం తారకరత్నని దూరం పెట్టారు. ఎందుకంటే తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య రెడ్డికి గతంలోనే ఒకసారి వివాహం జరిగి విడాకులు తీసుకుంది. అందువల్ల నందమూరి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించకపోగా.. కొంతకాలం తారకరత్నను దూరంగా ఉంచారు. ఇక నాలుగు సంవత్సరాల క్రితం తారకరత్న పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసిపోయారు.

Tarakaratna Family: ఫ్యామిలీతో నందమూరి తారకరత్న బెస్ట్ మూమెంట్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Tarakaratna Family: నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా నందమూరి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. 2002 వ సంవత్సరంలో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అయితే తారకరత్న హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.
దీంతో ఆ తర్వాత విలన్ గా కూడా అమరావతి, రాజా చెయ్యి వేస్తే వంటి సినిమాలలో నటించాడు. అయితే విలన్ గా కూడా సరైన గుర్తింపు లభించకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన తారకరత్న బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇదిలా ఉండగా తారకరత్న
అలేఖ్య రెడ్డి అనే యువ తిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కూతురు.

చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తారకరత్న సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన ఇవ్వగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు రావడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. ఇలా గుండెపోటు రావడం వల్ల గృహ కోల్పోయిన తారకరత్న అని మొదట కుప్పంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

Tarakaratna Family: విషమంగా తారకరత్న పరిస్థితి….

ప్రస్తుతం తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. తారకరత్న కుటుంబ సభ్యులందరూ అతన్ని పరామర్శించడానికి బెంగళూరుకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తారకరత్న తొందరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నందమూరి తారకరత్న కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.