Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా అడుగు పెట్టారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఈయన సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలలోకి రావాలని భావించారు. ఇలా పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా తారకరత్న మరణించడంతో నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా కొంతకాలం పాటు ఈయన తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయితే బాలకృష్ణ విషయంలో జోక్యం చేసుకొని తనని కుటుంబ సభ్యులకు దగ్గర చేశారు.
ఈ విధంగా బాలకృష్ణ తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధముందే అయితే ఈయన గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తారకరత్న వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తారకరత్న హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయనకు మాత్రం బయట బిజినెస్ లు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి మోహనకృష్ణ కలిపి హైదరాబాద్లో రామకృష్ణ థియేటర్స్తో పాటు తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ల ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్లు ఉన్నట్టు సమాచారం వీటి విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే వారు ఈమె పేరు కూడా సుమారు 250 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న ఆస్తులు సుమారు 1500 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…