Tag Archives: anasuya

Anchor Anasuya: నొక్కితే నొక్కించుకోవాలి తప్ప మేం మాట్లాడకూడదు…అనసూయ షాకింగ్ కామెంట్స్ ?

Anchor Anasuya: గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కాలం బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేసిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరమే వెండితెర మీద ప్రేక్షకులను అలరిస్తోంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో అనసూయకి సినిమాలలో మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఈ క్రమంలో టీవీ షోలకు దూరంగా ఉంటూ సినిమాల పైన ఫోకస్ పెట్టింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి అనసూయ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పురుషాధిక్యమే నడుస్తోంది. ఇక్కడ హీరోలను ఆధారం చేసుకుని సినిమాలు చేస్తుంటారు. అంతేకానీ హీరోయిన్లను ఎక్కువగా పట్టించుకోరు. సినిమాలలో కేవలం మేము సాయం కోసం అరిస్తే హీరోలు వచ్చి కాపాడతారు. అంతే తప్ప అందులో మాకు ఇంపార్టెన్స్ ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.

Anchor Anasuya: హీరోలకే ప్రాధాన్యత…

అంతే కాకుండా ” సినిమాల్లో హీరోలు అవి నొక్కితే నొక్కించుకోవాలి తప్ప…మేం మాట్లాడకూడదు. వారు ఏం చేసినా కూడా మేం చేయించుకోవాలి అంటూ సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అనసూయ మాత్రమే కాకుండా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని వాపోతున్నారు.

Anasuya: చలాకి చంటి కోసం హాస్పిటల్ కి వెళ్లిన అనసూయ ఏం చేసిందో తెలుసా..?

Anasuya: ప్రముఖ నటుడు కమెడియన్ చలాకి చంటి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల చంటి కి ఛాతీనొప్పి రావడంతో అతని కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చంటి నీ పరీక్షించిన వైద్యులు గుండెపోటు అని వెల్లడించారు . మెరుగైన వైద్యం కోసం ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. రక్తనాళాలలో కూడికలు ఉండటం వల్ల వచ్చిందని, అయితే ప్రస్తుతం డాక్టర్లు సర్జరీ చేసి స్టంట్ వేయడంతో చంటి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

ఇక చంటి అనారోగ్యం గురించి తెలియగానే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా హాస్పిటల్ కి వెళ్లి చంటి నీ పరామర్శించారు. ఈ క్రమంలో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ కూడా చంటి నీ పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్ళిన అనసూయ చంటిని పరామర్శించడమే కాకుండా డాక్టర్స్ ని సంప్రదించి చంటి ఆరోగ్యం గురించి తెలుసుకొని .. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరినట్టు సమాచారం.

ప్రస్తుతం వీరిద్దరూ జబర్డస్త్ లో లేకపోయినా కూడా ..మంచి అనుబంధం ఉంది. కేవలం చంటితో మాత్రమే కాకుండా జబర్థస్త్ ఆర్టిస్టులతో ఇప్పటికీ అనసూయ టచ్ లో ఉంటోంది. ఇదిలా ఉండగా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన చంటి జబర్దస్త్ కి వచ్చిన తర్వాత తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ చలాకి చంటిగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా కమెడియన్ గా మాత్రమే కాకుండా టీవీ షోలలో యాంకర్ గా కూడా వ్యవహరించాడు.

Anasuya:చంటినీ పరామర్శించిన అనసూయ…

ఇక జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొన్ని వారాలకి చలాకి చంటి బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు షోలలో కనిపించిన చలాకీ చంటి చాలాకాలంగా బుల్లితెర మీద ప్రేక్షకులకు కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం చంటి అనారోగ్యం గురించి తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ చంటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Anasuya: ఆంటీ అంటే ఎందుకంత కోపం అనసూయ… అనసూయ సమాధానం ఇదే!

Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండిపోయారు.

ఇలా పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టులు కారణంగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఇలా నేటిజన్స్ తనని ట్రోల్ చేసినప్పటికీ ఈమె ఘాటుగా స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంది.

ఈ క్రమంలోనే లైగర్ సినిమా విడుదల సమయంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ పై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ భారీగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారింది. ఈ విషయంపై అనసూయ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.

Anasuya:ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది…

అయితే తాజాగా మరోసారి ఆంటీ వివాదం పై అనసూయ స్పందించారు.అభిమానులతో సరదాగా ముచ్చటించిన అనసూయకు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురయింది. ఎందుకు అక్క మీకు ఆంటీ అంటే అంత కోపం అంటూ అనసూయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… తనకు ఆంటీ అనే పదం అసలు నచ్చదని తెలిపారు. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుందని ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు కోపం రావడం లేదని ఎందుకంటే ట్రోలర్స్ ను చక్కదిద్దే అంత సమయం తనుకు లేదని అంతకన్నా ముఖ్యమైన పనులు తనకు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Anchor Anasuya: మొదటిసారి మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ… జీవితానికి ఇది చాలంటూ ఎమోషనల్!

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నేను ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు రంగ మార్తాండ సినిమాలో నేను నటించాను. నా జీవితానికి ఇది చాలు నేను నిన్నే సినిమా చూశాను.ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను. 


Anchor Anasuya:ఎంతో పుణ్యం చేసుకున్నా…


ఇలా ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాగా గుర్తుండిపోతుంది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చిందిఅంటూ ఈమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anasuya: నాకు ఎలాంటి రోగం ఉంది… వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్..!

Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ బాగా క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత అనసూయ పేరు రంగమ్మత్తగా మారిపోయింది. బుల్లితెర మీద ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం డి గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా టీవీ షోలు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టుల వల్ల విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారికి అనసూయ గట్టి కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా తరచూ తన పోస్టుల వల్ల వివాదాల్లో నిలిచే ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో..” నాకో వ్యాధి ఉంది.నా గురించి చెడుగా మాట్లాడే వారిని నేను అస్సలు పట్టించుకోను.” అంటూ వీడియో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anasuya: వారిని అస్సలు పట్టించుకోను…


ఇలా తనని ట్రోల్ చేసేవారికి మరొకసారి అనసూయ ఇలా కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్ల పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే అనసూయని ట్రోల్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుల్లితెరకు దూరమైన అనసూయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే దర్శకుడు క్రిష్ సమర్పణలో రూపొందుతున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తోంది.

Jabardasth Anchor Sowmya: ఆ విషయంలో అనసూయని మరిపించలేకపోతున్న జబర్ధస్త్ కొత్త యాంకర్.. ఈ యాంకర్ మాకొద్దు బాబోయ్ అంటున్న ఆడియన్స్ !

Jabardasth Anchor Sowmya: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమౌతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ద్వారా కమెడియన్లతో పాటు జడ్జిలు , యాంకర్లు కూడా బాగా పాపులర్ అయ్యారు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన నాగబాబు జబర్దస్త్ జడ్జిగా బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రోజా జబర్దస్త్ పొందింది.

ఇక జబర్దస్త్ యాంకర్లుగా రష్మి, అనసూయ దక్కించుకున్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో యాంకర్లుగా కొనసాగుతున్న అనసూయ, రష్మీ తమ యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం అనసూయకి సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో జబర్దస్త్ కి దూరం అయింది. అనసూయ జబర్దస్త్ కి దూరమైన తర్వాత ఒక కొత్త యాంకర్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ లో కూడా రష్మి ని యాంకర్ గా ఉంచి కొంతకాలం షో నడిపించారు. ఇక జబర్దస్త్ కొత్త యాంకర్ గా సీరియల్ నటి సౌమ్యరావును తెరపైకి తెచ్చారు. షో లో ఎంట్రీ ఇవ్వటంతోనే సౌమ్య అందరి మీద పంచులు వేస్తూ సందడి చేసింది. ఇక ప్రస్తుతం జబర్థస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సౌమ్య యాంకరింగ్ గురించి ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth Anchor Sowmya: యాంకరింగ్ విషయంలో అనసూయకు సరితూగని సౌమ్య..

అనసూయతో పోల్చితే సౌమ్య గ్లామర్ విషయంలో కానీ…యాంకరింగ్ విషయంలో కానీ ఏమాత్రం సరితుగటం లేదని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. యాంకరింగ్ చేసే సమయంలో సౌమ్యరావు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది. కాకుండా కమెడియన్ల మీద పంచులు వేసే సమయంలో కూడా ఆమె పంచులు చాలా సీరియస్గా అనిపిస్తాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా సౌమ్య అనసూయను దాటలేకపోతోంది. ఇలా అన్ని విషయాలలోనూ అనసూయ మందు సౌమ్య తేలిపోతోంది. దీంతో జబర్దస్త్ అభిమానులు సౌమ్య రావుకి బదులు రశ్మినే మళ్ళీ యాంకర్ గా తెచ్చి పెట్టండి బాబు అంటూ తమ గోడు వినిపిస్తున్నారు.

Anasuya: జబర్దస్త్ ను చాలా మిస్ అవుతున్నా… అనసూయ షాకింగ్ కామెంట్స్!

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ షోలో యాంకరింగ్ తో పాటు తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఛానల్ తో సంబంధం లేకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది.

టీవీ షోలో ఎంతో ఆ గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం చాలా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇలా వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్ట్ నిమిషాలలో వైరల్ గా మారుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో అనసూయ చేసే వ్యాఖ్యలకు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉండగా సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో కొంతకాలం క్రితం అనసూయ జబర్దస్త్ కి దూరం అయింది. ప్రస్తుతం అనసూయ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో టీవీ షోలలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. కావాలని టీవీ షోలకు బ్రేక్ తీసుకున్నా.. ఏదైనా మంచి కంటెంట్ ఉన్న షో ఆఫర్ వచ్చినప్పుడు కచ్చితంగా స్మాల్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది.

Anasuya: నా జీవితంలో జబర్దస్త్ కు ప్రత్యేక స్థానం ఉంది…


అలాగే మీరు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా? అని మరొక అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. అవును జబర్దస్త్ ని చాలా మిస్ అవుతున్నా. నా జీవితంలో జబర్దస్త్ కి ఎప్పుడు ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం కోరుకున్న చోటులో ఉండలేకపోవచ్చు. అలాగే జీవితంలో రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకతప్పదు అంటూ సమాధానం చెప్పింది. జబర్దస్త్ గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood Anchors: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్లు వీళ్లే?

Tollywood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ల పేర్లు చెప్పమంటే వెంటనే సుమ, అనసూయ ,రష్మీ, శ్రీముఖి, ప్రదీప్, రవి ఇలా వరుసగా అందరి పేర్లు టకటక చెప్పేస్తాము.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమా కార్యక్రమాలు టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాంకర్లు సైతం నేటితరం యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…

సుమ: దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. సుమ షెడ్యూల్ చూసుకొని సినిమా ఈవెంట్లు నిర్వహించుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.ఇక సుమ ఒక్కో ఈవెంట్ కు సుమారు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

ప్రదీప్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షో కి ప్రదీప్ రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

అనసూయ:జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వెండి తెర సినిమాలతో బిజీగా ఉన్నారు.

రష్మీ:జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

శ్రీముఖి: ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి హవ కొనసాగుతుంది ఏ టీవీ ఛానల్ లోకి వెళ్లిన శ్రీముఖి కార్యక్రమం ఏదో ఒకటి ప్రసారమవుతోంది.ఇక శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కి సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

రవి: ప్రదీప్ తర్వాత మేల్ యాంకర్ గా గుర్తింపు పొందిన రవి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Tollywood Anchors:

శ్యామల: యాంకర్ శ్యామల సైతం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కి సుమారు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితోపాటు యాంకర్ వర్షిని మంజూష వంటి వాళ్ళు ఒక్కో ఎపిసోడ్ 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Sudheer -Anasuya: ఏంటి అనసూయ.. సుధీర్ పరిస్థితి ఇలా అయ్యింది.. పూర్తిగా బుల్లితెరకు కనుమరుగయ్యారుగా?

Sudheer -Anasuya:బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ సుడిగాలి సుదీర్ వంటి వాళ్లు కూడా ఒకరు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనసూయ వెండితెర అవకాశాలను అందుకొని పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సుధీర్ సైతం వెండితెర అవకాశాలను అందుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై స్టార్ మా కార్యక్రమంలో సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సుడిగాలి సుదీర్ అనసూయ ఏ కార్యక్రమాలలోనూ సందడి చేయడం లేదు. ఇలా వీరిద్దరూ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారనే చెప్పాలి.ఇక స్టార్ మా ఏదైనా ప్రత్యేక ఈవెంట్లు చేసినప్పుడు మినహా వీరిని ఆహ్వానించడం లేదు. ఇక ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది.

Sudheer -Anasuya: జబర్దస్త్ వదిలేసి తప్పు చేశారా…

ఈ క్రమంలోనే వీరిద్దరూ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో కొందరు నెటిజెన్స్ ఈ విషయంపై స్పందిస్తూ జబర్దస్త్ వీడి తప్పు చేశారు. అందుకే ఏ ఒక్క షో కూడా వీరి చేతుల్లో లేకుండా పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తిరిగి వీరు ఏదైనా బుల్లితెర కార్యక్రమ అవకాశాలను అందుకుంటారా లేకపోతే హైపర్ ఆది గెటప్ శీను తరహాలోనే తిరిగి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

Vishnu Priya: ఆంటీ అంటూ మరోసారి అనసూయ పరువు తీసిన విష్ణు ప్రియ.. వైరల్ అవుతున్న వీడియో !

Vishnu Priya: గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది. అయితే ఈ ఆంటీ అనే పదం ఇంత వైరల్ అవ్వటానికి కారణం యాంకర్ అనసూయ. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలై ప్లాప్ అవటంతో అనసూయ ఇన్ డైరెక్ట్ గా ‘ అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. ఖర్మ రావటం లేటవచ్చు కానీ రావటం మాత్రం పక్కా..’ అంటూ విజయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో విజయ్ అభిమానులు కూడా ఆంటీ అంటు అనసూయ ని తెగ ట్రోల్ చేశారు.

అనసూయ కూడా ఇలా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన నేటిజన్స్ మీద ఫైర్ అయ్యింది. ఇలా ఏజ్ షేమింగ్ చేస్తూ తనని తిడుతూ ట్రోల్ చేసిన వారందరి స్క్రీన్ షాట్ తీసుకొని అందరి మీద కేసులు పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే నెటిజన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆంటీ ఆంటీ అంటు అనసూయని ట్రోల్ చేశారు. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది.

ప్రస్తుతం ఈ వివాదం కొంత సర్ధుమనిగినట్టు కనిపిస్తుంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ అనసూయని పొరపాటున ఆంటీ అని తర్వాత నాలుకరచుకుంది. యాంకర్ గా , నటి గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఇటీవల వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించింది.

Vishnu Priya:ఆంటీ అంటే ఫీలయ్యే అనసూయ..

తాజగా బిగ్ బాస్ మానస్ మానస్‌ తో కలిసి జరి జరి పంచెకట్టు అనే పాటలో తన డాన్స్ తో దుమ్ము రేపింది. ఇప్పుడు ఈ పాట సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో విష్ణుప్రియ తాజాగా ఆర్జే కాజల్‌కు యాంకర్ గా వ్యవహరించిన షోలో పాల్గొంది. ఈ షో లో కాజల్.. ర్యాపిడ్ పైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడుగుతు.. ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని అడగ్గా…అనసూయ అంటూ విష్ణు ప్రియ ఒక సెకెన్ లో సమధానం చెప్పింది. ఆ తర్వత రియలైజ్ అయ్యి నాలుక కరచుకుంది.