Tag Archives: anchor anasuya

Anchor Anasuya: అత్తా పితా అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. కోడలైన సరే అలా పిలవకూడదు: అనసూయ

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావటం వల్ల ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఎత్తున వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ సైతం తనదైన శైలిలో కౌంటర్ వేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి ఈ ఆంటీ అనే వివాదాన్ని అనసూయ తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ తాజాగా సుమ వ్యవహరిస్తున్నటువంటి క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ తనకు వంట రాదని చాలామంది అనుకుంటారు కానీ తాను ఎలా వంట చేస్తానో ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తానని చెప్పారు.

Anchor Anasuya: అత్త అని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆంటీ అనే విషయం గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ నన్ను ఎవరైనా అత్తా పిత్తా అంటే అసలు ఊరుకోను.అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు చివరికి నా కోడలైనా సరే నన్ను ఆంటీ అని పిలవకూడదు కేవలం అను అని పిలిస్తే చాలు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Anchor Anasuya: అనసూయ వెనుక ఇంత కుట్ర జరుగుతోందా.. ఆమె ఎదుగుదలను ఓర్వలేకే ఇలా చేస్తున్నారా?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ చేసిన పరోక్ష ట్వీట్ ఇందుకు కారణం అని తెలుస్తుంది.ఈమె కర్మ సిద్ధాంత ఫలితం ఇప్పుడు కాకపోయినా మరి కాస్త ఆలస్యంగా అయినా రావచ్చు రావడం మాత్రం పక్కా అంటూ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారని అభిమానులు రెచ్చిపోయారు.

ఈ విధంగా అనసూయ ఒక్క ట్వీట్ చేయడంతో నేటిజెన్లు ఈమెపై పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తూ తనని దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు తనని ఏజ్ బాడీ షేమింగ్ చేస్తూ తనని ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన అనసూయ గట్టిగా తనని విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ తనపై ఇలాంటి విమర్శలకు పాల్పడిన వారి మీద పోలీసు కేసు కూడా పెట్టారు.

నా ఆత్మగౌరవం కాపాడుకోవటం కోసం తాను ఎక్కడి వరకు అయినా వెళ్తానని,తనని విమర్శించిన వారికి సంబంధించిన ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ నా దగ్గర ఉందని ఆధారాలతో సహా వాటిని బయటపెట్టి తప్పకుండా చర్యలు తీసుకొనేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.అలాగే నా కెరియర్ ను దెబ్బ కొట్టాలని కొందరు చూస్తున్నారని అలాంటి వారిని కూడా అసలు వదిలిపెట్టనంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: అనసూయ కెరీయర్ ను దెబ్బతీస్తున్నారా…

అయితే అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగానే తన ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేస్తున్నారా ఈమె వెనక ఇంత కుట్ర జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి అనసూయ తనని విమర్శించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తన పంతం వదులుకోదని తెలుస్తోంది. మరి ఈ వివాదంలో ఎవరు నెగ్గుతారో లేచి చూడాలి.

Anchor Anasuya: పనీపాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది… వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్!

Anchor Anasuya: యాంకర్ అనసూయ గత వారంలో ఈమెను పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది తనని ఆంటీ అంటూ ట్వీట్ చేయడంతో తనని ఏజ్ షేమింగ్ కిగురి చేస్తున్నారంటూ ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసింది.

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత అనసూయ ఈ కేసు విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నేటిజన్స్ మరోసారి అనసూయను గెలికారు. ఇంతకీ అనసూయ కేసు పెట్టడంతో పోలీసులు ఏమన్నారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోని ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ నీలా మాకు పని పాట లేదు అనుకున్నావా అని పోలీసులు అనసూయకు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై స్పందించిన అనసూయలేదండి మీలా పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి పంపించారు అంటూ కామెంట్ చేశారు.
మీరు ఎంత తొందరగా నోరు జారుతారు అంతే తొందరగా బోల్తా పడతారు కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని జరుగుతాయ్.. జరుగుతున్నాయి అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anchor Anasuya: ఇంతమందిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారబ్బా…

ఇక అనసూయను కొన్ని వేలమంది ఆంటీ అంటూ ట్రోల్ చేశారు..ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి ఇంత మందిపై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఎంతో మంది నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయని కాదు ఎంతో కీలకమైన నేతలు మంత్రులు ముఖ్యమంత్రులను కూడా ఇలా ట్రోల్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు మరి అనసూయ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Anchor Anasuya: ఎన్నాళ్లకు మెడలో అది చూసాము.. అనసూయ పై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి అనసూయ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు నేటిజెన్లు సైతం అనసూయ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఈమెను ఏకంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఈ విధంగా తనని ఆంటీ అన్న వారిపై ఈమె కేసు వేస్తానంటూ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా నెటిజన్లతో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన అనసూయ ఇక ఈ విషయంపై మర్చిపోయినప్పటికీ నెటిజెన్స్ మాత్రం అనసూయను ఇప్పటికి దారుణంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా అనసూయ విజయవాడలో తన ఫ్యామిలీతో కలిసి పలు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయవాడ అని క్యాప్షన్ పెట్టగా ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ వెల్కమ్ విజయవాడ ఆంటీ అంకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Anasuya: తగ్గేదేలే అంటున్న నేటిజన్స్..

ఇలా అనసూయ పోస్ట్ పై స్పందించిన 80 శాతం మంది నేటిజన్స్ ఆమెను ఆంటీ అనే పదంతోనే కామెంట్ చేస్తూ చేస్తున్నారు. ఇక మరొక నెటిజన్ అయితే దారుణంగా ఎన్ని రోజులకు మీ మెడలో ఇలా తాళిబొట్టు చూసాము అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి అనసూయ ఎన్ని కేసులు పెట్టిన నేటిజన్స్ మాత్రం తగ్గేదే అంటూ ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Anchor Anasuya: ఆ అవకాశమే ఉంటే ట్విట్టర్ పేలిపోయేది.. మెగాస్టార్ చిరంజీవి పై అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస అవకాశాలను అందుకుంటున్న ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమానికి దూరం కావడానికి గల కారణాలను కూడా అనసూయ తెలియచేశారు. ఇకపోతే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి అనసూయ అంటే ప్రత్యేకమైన అభిమానం అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ఈయన సినిమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ మెగాస్టార్ అంటూ కామెంట్లు మోత మోగిపోయింది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేస్తూ…సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరిచే ఆప్షన్ లేదు కానీ ఒకవేళ అదే ఆప్షన్ కనుక ఉంటే ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేశారు. ఇలా నేటిజన్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై అనసూయ స్పందించి అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు.

Anchor Anasuya: ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన అనసూయ…

ఇలా సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసేలా ఉంటే కచ్చితంగా ఈయన అభిమానుల అరుపులకు ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేయడంతో అనసూయ కూడా అది నిజమేనంటూ ఇలా ఒక్క మాటతో అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తానికి అనసూయ ఈ ట్వీట్ పై రెస్పాండ్ అవుతూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని పదాల రూపంలో తెలియజేసి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Anchor Anasuya: నా ఆత్మగౌరవం ఎప్పటికీ చంపుకోను…అవకాశాలు లేకపోతే అంట్లు తోముకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇలా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ఈ కార్యక్రమం నుంచి ఈమె వెళ్లిపోవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్తుంటే తన సొంత ఇంటిని వదిలి వెళుతున్నాను అనే బాధ తనలో కలిగిందని, టీవీ కార్యక్రమాలకు తాను దూరం అవుతానా అనే భయం కూడా తనలో కలిగిందని ఈమె తెలిపారు. ఇకపోతే తాను ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న మొదట్లో చాలామంది నువ్వు మేకప్ వేసుకోగలవా? కెమెరాను ఫేస్ చేయగలవా? అంటూ ప్రశ్నించినట్లు ఈమె తెలిపారు.

మనం ఇదే రంగం అని కాదు ఏ రంగంలోకి వెళ్లిన చెడు మంచి అనేది ఉంటాయి. అయితే మనం ఎంచుకొనే గమ్యం పట్టి మన ప్రయాణం ఉంటుందని అనసూయ వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం తనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని అయినా కానీ ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డానని ఈమె తెలిపారు. ఇలా నాకు ఈ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల వల్లే తాను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని ఈమె తెలిపారు.

Anchor Anasuya: ఎప్పటికీ ఆ తప్పు చేయను…

తనకు తన ఆత్మ గౌరవం కన్నా ఏది ముఖ్యం కాదని మన ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఈమె తెలిపారు. ఇక ఈ ఫీల్డ్ లో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తాను ఎంబీఏ చదివానని అలా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతానని తెలిపారు.ఇక అక్కడ కూడా ఇబ్బందులు ఎదురైతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటాను కానీ తన ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ చంపుకోనని అనసూయ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: జబర్దస్త్ లో వెకిలి చేష్టలు, బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను… బయటికి రావడం కోసం రెండేళ్లు ప్రయత్నించా.. : అనసూయ

Anchor Anasuya: బుల్లితెర ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇక ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక అనసూయకు సినిమా అవకాశాలు రావటం వల్లే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకుందనే వార్తలు వచ్చాయి.ఇలా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం గురించి ఎన్నో వార్తలు రావడంతో ఎట్టకేలకు ఈమె ఈ వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తనకు సినిమా అవకాశాలు రావటం వల్ల తరచూ డేట్స్ అడ్జస్ట్ చేయమని అడగడానికి చాలా గిల్టీగా ఉందని నా ఒక్కదాని కోసం అందరూ వారి షెడ్యూల్ మార్చుకోవడానికి తనకు ఇష్టం లేదంటూ వెల్లడించారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ గా తాను 9 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని అయితే తనకెప్పుడూ ఈ కార్యక్రమం బోర్ కొట్టలేదని తెలిపారు. అయితే కొన్ని సందర్భాలలో తాను చాలా ఇబ్బంది పడ్డానని,క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణమని అనసూయ వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా తనపై ఎన్నో పంచులు వేసేవాళ్ళు అలాగే తన బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడేవారు. ఆ సమయంలో నేను నచ్చని ఎక్స్ప్రెషన్స్ పెట్టిన అవి ప్రేక్షకుల వరకు చేరేవి కాదు.

Anchor Anasuya: జబర్దస్త్ కు కావాల్సినంత పని చేశాను…

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని,ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడం కోసం తాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని అనసూయ వెల్లడించారు. ఇక నాగబాబు గారు రోజా గారు సుధీర్ అందరూ వెళ్లిపోయారని తాను వెళ్లిపోవడం లేదని, అలా వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద కాదంటూ అనసూయ తెలిపారు.ఈ కార్యక్రమం కోసం నేను జీతం తీసుకుంటున్నాను నా జీతానికి కావాల్సినంత పని నేను చేస్తున్నాను నావల్ల ఎక్కడ తప్పు జరిగింది నష్టం వచ్చిందని మాట ఇంతవరకు వినిపించలేదని ఈ సందర్భంగా అనసూయ తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి వెళ్లిపోవడానికి కారణం తెలిపారు.

Anchor Anasuya: సిల్వర్ రంగు చీర కట్టి మెరిసిపోతున్న అనసూయ… ముసలమ్మలా ఉన్నావ్ అంటూ నేటిజన్స్ కామెంట్స్?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి గుఎంతో ర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈమె గుడ్ బై చెప్పి వెళ్లారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ఓవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెర సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఈ యాంకరమ్మ.ఇలా పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సిల్వర్ రంగు చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా సిల్వర్ రంగు చీరలో అనసూయ దేవ కన్యలా మెరిసిపోతూ ఉండగా మరికొందరు మాత్రం ఈమె ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అనసూయ ఈ ఫోటోలపై స్పందిస్తూ అచ్చం ముసలమ్మలా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Anasuya: వేశ్య పాత్రలో అనసూయ….

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అనసూయ వస్త్రధారణ గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడం ఇది మొదటిసారి కాదు.ఇలా ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్స్ చేసినప్పటికీ అనసూయ వాటిని చూసి చూడనట్టు వెళ్లిపోవడమే కాకుండా కొన్నిసార్లు వీటిపై రియాక్ట్ అవుతూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె మధురవాణి అనే ఒక వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Anchor Anasuya: జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ… లైఫ్ ఇచ్చిన షోకు, డేట్స్ లేవా అంటూ నెటిజన్స్ కామెంట్స్?

Anchor Anasuya: యాంకర్ అనసూయ కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా ఉన్నప్పటికీ ఈమె అనంతరం యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ విధంగా యాంకర్ గా పలుకు కార్యక్రమాలకు ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చింది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా ఇదే పాపులారిటీతో వెండితెర అవకాశాలను కూడా అందుకుంది.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

ప్రస్తుతం అనసూయ కెరియర్ ఇలా ఉంది అంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం అనసూయ సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా అనసూయ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల తనకు బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేసే సమయం లేకుండా పోతుందని అందుకే తాను జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు గతంలో పరోక్షంగా వెల్లడించారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా అనసూయకు అదే చివరి ఎపిసోడ్ అని తెలుస్తుంది. ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల తాను బుల్లితెర కార్యక్రమాలు చేయకూడదని భావించుకున్నారట అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీ కానున్న అనసూయ…

అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతుందని ఈ ప్రోమో ద్వారా తెలియడంతో జబర్దస్త్ కమెడియన్స్ అలాగే జడ్జిలు సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ప్రోమో చూసిన ఎంతోమంది నెటిజన్లు అనసూయకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమం కోసం తన దగ్గర డేట్స్ లేవా?ఈ కార్యక్రమం కోసం రెండు రోజులు సమయం కేటాయించలేవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే అనసూయ వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ పడిపోవడం ఖాయమని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా అందాల యాంకరమ్మను జబర్దస్త్ కార్యక్రమంలో చూడలేకపోతాము అనే వెలితి మాత్రం ప్రేక్షకులలో ఉంటుందని చెప్పాలి.

Anchor Anasuya: నెలలో మూడు రోజులు కేటాయించలేవా.. అనసూయని ప్రశ్నించిన చంటి?

Anchor Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్తున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.అనసూయ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతున్నానని పరోక్షంగా వెల్లడించారు.అయితే వచ్చే గురువారము తనకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తాజాగా వదిలిన ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ లో స్కిట్ చేశారు. నాకు ఈ కార్యక్రమానికి రావడం కుదరట్లేదు వెళ్లిపోతానని చెప్పగా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

 

అనసూయ గెటప్ లో ఉన్నటువంటి తాగుబోతు రమేష్ జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. బట్ జబర్దస్త్ మాత్రం స్టిల్ రన్నింగ్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా తాగుబోతు రమేష్ చెప్పేసరికి అనసూయ ఎమోషనల్ అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమం నిన్ను చాలా మిస్ అవుతుంది అంటూ కంటతడి పెట్టుకున్నారు.

చిన్నపిల్లలను వదిలి వచ్చావు…

స్కిట్ అనంతరం చలాకి చంటి మాట్లాడుతూ..చిన్న పిల్లలు ఉన్నప్పుడే నువ్వు ఆ పిల్లలను మీ అమ్మకి ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చావు. ఇప్పుడు నెలలో మూడు రోజులు ఈ కార్యక్రమం కోసం కేటాయించలేవా అంటూ ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు అనసూయ ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుందో తెలియాల్సి ఉంది.మొత్తానికి అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తెలియడంతో ఇంద్రజ సైతం అనసూయను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.