Tag Archives: andhrapradesh

RK Roja: సీనియర్ నటి, మంత్రి రోజా ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

RK Roja: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్న రోజా వైసీపీ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె జగన్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా రోజా పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేసేవారు.అయితే ప్రస్తుతం ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇకపోతే రోజా రాజకీయాలలోనూ సినిమాలలోను నటించిన ఆస్తుల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రోజా ఆస్తులు విలువ 7 కోట్ల 38 లక్షల రూపాయలు కావడం విశేషం. రోజా ఆస్తులలో స్థిరాస్థుల విలువ 4 కోట్ల 64 లక్షల రూపాయలు కాగా చరాస్థుల విలువ 2 కోట్ల 74 లక్షలు. ఇక ఈమె కూతురు కొడుకు పేర్లపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇక తన భర్త సెల్వమణి ఆస్తుల విషయానికి వస్తే.. ఆయనకు ఎలాంటి స్థిరాస్థులు లేవు. చరాస్థులు మాత్రం 58 లక్షల 2 వేల రూపాయలుగా ఉంది. 22 లక్షల రూపాయల వరకు అప్పు ఉన్నట్టు తెలుస్తోంది.

 

ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన.. రోజా

ఇకపోతే నటి రోజాకు కార్లు అంటే ఎంతో ఇష్టం కనుక ఈమె దగ్గర ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా సినీ ప్రపంచానికి దూరమయ్యారు. గత పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజాకు మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉన్నారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

Andhrapradesh: ఏపీలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ తమకు సమ్మతం కాదని.. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ నిరసనలను కొనసాగిస్తూ… ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

మరోవైపు తమ డిమాండ్ల నెరవేరకపోతే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇదివరకే హెచ్చరించారు. 
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ సమస్యలను మంత్రుల కమిటీకి చెప్పాలని చర్చలకు ఆహ్వానించారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

అయితే ఉద్యోగుల మాత్రం చాలా సార్లు కమిటీ ఆహ్వానానికి స్పందించలేదు. అయితే నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. కాగా ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి. 


ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో..

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓ వైపు నిరసనలు, ఆందోళనలను పట్టించుకోకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలను జమచేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యో గుల అకౌంట్లలో ఉదయం నుంచే వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇంకా పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో.. ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు.