Tag Archives: angry

Thamannah: తమన్నాకు కోపం వస్తే చేసే పని ఏంటో తెలుసా.. ఇదేం అలవాటు?

Thamannah: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుని ప్రస్తుతం అక్కడ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం తమన్న సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో సినిమాలలో మాత్రమే నటించేవారు కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అందరిని చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు ఇక మీడియా పట్ల కూడా ఈమె దురుసుగా ప్రవర్తించరు. ఇలా ఎప్పుడు నవ్వుతూ సహనంతో ఉండే తమన్నకు కోపం వస్తే కనుక ఆమె కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరని తెలుస్తుంది.

ఒంటరిగా గడుపుతారు..
ఈమెకు కనుక కోపం వస్తే చుట్టుపక్కల వారితో ఏమాత్రం మాట్లాడరని వెంటనే తన గదికి వెళ్లి తలుపులు వేసుకొని గదిలో ఒంటరిగా కూర్చుంటారని తెలుస్తుంది. ఇలా తన కోపం చల్లబడిన తర్వాత చల్లనీటి షవర్ చేసి బయటకు వచ్చి తాను ఎందుకు అలా ఉన్నాననే విషయాన్ని అందరితోనూ పంచుకుంటారట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదేం అలవాటు అంటూ పలువురు ఈమె అలవాట్లపై కామెంట్లు చేస్తున్నారు.

Nagarjuna: నాగార్జునకు కోపం వస్తే అలాంటి పని చేస్తారా… నాగార్జున సీక్రెట్ బయటపెట్టిన అఖిల్!

Nagarjuna: టాలీవుడ్ నటు సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మన్మధుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది మహిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగార్జునను మనం ఎలాంటి పరిస్థితులలో చూసిన ఆయన మొహంపై చిరునవ్వు ప్రశాంతత మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తాను సీరియస్ గా అయినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు.ఇలా ఎప్పుడు సరదాగా ఉండే నాగార్జునకు కోపం వస్తే ఊహించని విధంగా రియాక్ట్ అవుతారని తెలుస్తుంది.

ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు కూడా కోపం వస్తుందా అన్న సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కూడా మనిషే కదా తనకు కూడా కోపం వస్తుందని ఆ కోపం వస్తే నాగార్జున ఏం చేస్తారో అనే విషయాలను ఒకానొక సందర్భంలో అఖిల్ బయట పెట్టారు.ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి కోపం గురించి మాట్లాడుతూ నాన్నకు కోపం వస్తే ఆయన వెంటనే కిచెన్లోకి వెళ్లిపోతారని తెలిపారు.

Nagarjuna: నాన్నకు కోపం వస్తే వంట వండుతారు..

ఇలా కిచెన్ లోకి వెళ్లి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారని నాన్న చాలా అద్భుతంగా కుకింగ్ చేస్తారు అంటూ అఖిల్ తెలియజేశారు. ఇక తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఏదో జరిగిందని అందుకే నాన్న సీరియస్ గా ఉన్నారని తనకు అర్థమయ్యే కొంత సమయం పాటు నాన్నతో ఏమీ మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ప్రతి మనిషికి కోపం, ఆనందం, బాధ లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాలలో వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.

ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే సామాన్య ప్రజలు కోపంలో చేసే పనుల గురించి ఎవరు పట్టించుకోకపోయినా కూడా సెలబ్రిటీలు కోపంతో ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అది సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో కోపం వస్తే అల్లు అర్జున్ ఏం చేస్తాడు అన్న విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి కోపం ఎక్కువ .

ఆ సినిమాలో తన పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ కి స్ట్రాంగ్ డోస్ ఇస్తాడు. అయితే అలా సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అల్లు అర్జున్ కి కోపం వస్తే ఏం చేస్తాడు ..? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఈ ప్రశ్నలకు అభిమానుల దగ్గర నుంచి వెరైటీ వెరైటీ ఆన్సర్లు వినిపిస్తున్నాయి . కొందరు అల్లు అర్జున్ కి అసలు కోపం రాదని.. చాలా కూల్ గా ఉంటాడని అంటున్నారు.

Allu Arjun: సైలెంట్ గా నిద్రపోతారు…


మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ కి కోపం వస్తే సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకునేస్తాడని ..కోపం కంట్రోల్ అయ్యాక బయటికి వచ్చి మళ్ళీ చిల్ అవుట్ అవుతాడని అంటున్నారు. సాధారణంగా కోపం వస్తే ఆ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తూ ఉంటారు.కానీ బన్నీ మాత్రం ఎంత కోపం వచ్చినా కూడా వస్తువులను పగలగొట్టడం ఇతరుల మీద అరవడం లాంటి చీప్ పనులు చేయడని చెప్పుకొస్తున్నారు .

Ntr: ఎన్టీఆర్ కు కోపం వస్తే అలా ప్రవర్తిస్తారా… ఇదేం అలవాటు అంటూ ముక్కున వేలేసుకున్న నేటిజన్స్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎప్పుడూ అందరితో చాలా సరదాగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.

అందరితో చాలా సరదాగా మాట్లాడే ఎన్టీఆర్ కు కోపం సాధారణంగా రాదని కానీ ఈయనకు కోపం వస్తే కనుక ఈయన కోపాన్ని ఎదుర్కోవడం కష్టమని తెలుస్తుంది. ఎన్టీఆర్ కోపం ఎలా ఉంటుంది అనేది గత కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఈవెంట్లో చూసాము.ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వమంటూ సుమా చెప్పడంతో ఎన్టీఆర్ సుమపట్ల ఎంత కోపంగా చూసారో అందరికీ తెలిసిందే.

ఇక ఇంట్లో ఉన్నప్పుడు గనుక ఈయనకు కోపం వస్తే ఎవరితోనో మాట్లాడకుండా సరాసరి కిచెన్ లోకి వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యాని చేసుకొని తింటారట. ఇలా ఎన్టీఆర్ కి కోపం వస్తే చికెన్ దమ్ బిర్యాని చేసుకొని తింటారనే వార్త తెలియడంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Ntr: చికెన్ దమ్ బిర్యాని చేస్తారు..


ఎవరైనా కోపం వస్తే ఏమి తినకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతారు అలాంటిది ఎన్టీఆర్ మాత్రం చాలా భిన్నంగా కిచెన్ లోకి వెళ్లి తనకి ఇష్టమైన చికెన్ బిర్యాని చేసుకొని తింటారా అయినా ఇదేమి అలవాటు గురు అంటూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అలవాటు గురించి తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

Prabhas Srinu: ప్రభాస్ బలహీనత అదే… కోపం వచ్చిందంటే ఆ పని చేస్తాడు… అసలు విషయం బయటపెట్టిన ప్రభాస్ శ్రీను!

Prabhas Srinu: ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ శ్రీను అందరికి సుపరిచితమే.ఈయన ప్రభాస్ కి మంచి స్నేహితుడు కావడమే కాకుండా ఆయన ప్రతి ఒక్క సినిమాలలో కూడా నటించారు. ప్రభాస్ వల్ల తాను ఇండస్ట్రీలో ఉన్నానని ఈయన ఎన్నోసార్లు తెలియజేశారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ప్రభాస్ హీరో కాకముందు హీరో అయిన తర్వాత అలాగే పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు లేదని ప్రభాస్ శ్రీను తెలిపారు.

అతని స్థాయి మారే కొద్దీ అతనిలో ఎలాంటి మార్పులు లేవని ఆయన అప్పటికి ఇప్పటికీ ఒకేలాగే ఉన్నారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇకపోతే ప్రభాస్ మంచితనం గురించి కూడా ఈయన చెబుతూ ఆయన మంచితనమే తనకు ప్లస్ మైనస్ అంటూ కామెంట్ చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరితోనూ చాలా మంచిగా ఉంటారు. అయితే ఆయనకు ఎవరి మీదైనా కోపం వస్తే వారితో అస్సలు మాట్లాడరు.

Prabhas Srinu: అతని సైలెన్స్ భయంకరంగా ఉంటుంది…


ప్రభాస్ వీక్ నెస్ ఇదేనని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇక ఈయన నవ్వు ఎంత అందంగా ఉంటుందో ఆయనకు కోపం వస్తే ఆ సైలెన్స్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ప్రభాస్ శ్రీను చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

Vijay Devarakonda: తెలుగుతో పాటు కన్నడలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ,బాలీవుడ్ లో కూడా లీడింగ్ స్టార్ హీరోయిన్ సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది నటి రష్మిక మందన. ఇకపోతే పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

ఆ తర్వాత అర్జున్‌ రెడ్డితో యూత్‌కు బాగా దగ్గరైన విజయ్.. రష్మికతో కలిసి జంటగా నటించిన గీత గోవిందం సినిమా వీరిని ఎక్కడికో తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అప్పట్లో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి అభిమానులు కథలు కథలుగా చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి డియర్ కామ్రేడ్‌ అంతగా ఆడకపోయినా ఓ లెవల్లో యూత్‌ను ఆకట్టున్నట్టు చెప్పవచ్చు.

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

ఇకపోతే వీరిద్దరూ ఇంత సాన్నిహత్యంగా ఉండడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పోస్ట్‌లు, మీమ్స్ వైరల్‌ అవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు గానీ, లేదా లేనట్టు గానీ ప్రకటించలేదు. అంతే కాకుండా విజయ్‌కి సంబంధించిన పర్సనల్ పార్టీలలోనూ రష్మిక ఉండడం, తన మదర్‌తో షాపింగ్‌ చేయడం లాంటివన్నీ కూడా ఆ వార్తలు నిజమనేటట్టు గానే నిరూపిస్తున్నాయి.

పెళ్లి వార్తలపై స్పందించిన విజయ్…


ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన మరో వార్త వైరల్‌గా మారింది. విజయ్, రష్మిక తొందర్లోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్‌ మరియు కొన్ని వార్తా వెబ్‌సెట్లు ప్రకటించాయి. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే విజయ్ దేవరకొండ ఇలాంటి వార్తలు వ్యాపింపజేసే వారికి తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. తనపై వచ్చే వార్తలపై అగ్రెసివ్‌గా రియాక్టవడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారిద్దరి పెళ్లిపై ఇప్పటి వరకూ స్పందించని విజయ్ మాత్రం తొలిసారిగా స్పందించి, బూతు పురాణం మొదలెట్టారు. ఎప్పటిలాగే తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అన్నీ నాన్సెన్స్ అని తిడుతూ, ఓ బూతు పదాన్ని జత చేస్తూ విజయ్ ట్వీట్‌ చేశారు. ఇలా తనపై వార్తలన్నీ అసత్యాలని తనకు నచ్చిన స్టైల్‌లో సమాధానమిచ్చారు విజయ్.

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

Rajamouli: దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. కోవిడ్ కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు పట్టుకున్న అభిమానులు నిరాశకు లోనయ్యారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

దీంతో అభిమానులు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ట్రిపుల్ ఆర్ సినిమాపై తెగ ట్రోలింగ్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. రాజమౌళి ఎంతసేపు తన సినిమా, కలెక్షన్లు, లాభాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇండస్ట్రీ మంచి కోసం, ఇతర ఇండస్ట్రీ వ్యక్తుల కోసం ఆలోచించడం లేదని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లీడ్ క్యారెక్టర్లలో అలియాభట్, ఒలివియా మోరిస్ వీరికి జోడీగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ ను దాదాపు రూ. 450 కోట్లతో నిర్మించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.

మరోవైపు బాలీవుడ్ స్టార్ అజమ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేద్దాం అని ముందుగా అనుకున్నప్పటికీ.. కరోనా మరోసారి దెబ్బ తీసింది. కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాల్సిన పరిస్థితి దీంతోొ సినిమాను మరోసారి వాయిదా వేశారు.

సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని..

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పవన్ భీమ్లానాయక్ విడుదల పోస్ట్ పోన్ అయింది. శివరాత్రి కానుకగా విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు భీమ్లా నాయక్ టీం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన ఆర్ ఆర్ఆర్ సినిమాను సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు. అయితే సమ్మర్ లో రాజమౌళి సినిమా వస్తే మళ్లీ మూవీల షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది. ఆర్ ఆర్ఆర్ దెబ్బకు పలు మూవీలు వెనక్కి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రిపుల్ ఆర్ టీం పై.. మొత్తం సినిమా ఇండస్ట్రీ కొంత అసహనంతో కనిపిస్తుంది. అయితే నార్త్ మాట ఎలా ఉన్నా.. తెలుగు, తమిళం భాషల్లో సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురైంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా వాయిదా వేసుకోండని చెప్పడంతోనే మూవీ యూనిట్ తలొగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Mangli: ఇదేం పాడు పద్ధతి.. అభిమానులపై సింగర్ మంగ్లీ ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా..!

Mangli: సెలబ్రిటీ హోదా వస్తే ఒక బాధ.. రాకపోతే మరో బాధ. ఎవరైనా సెలబ్రిటీ కావాలనే కోరుకుంటారు. దానికి తగ్గట్లు అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే తెలంగాణ జానపదం..షెడ్యూల్ తెగలు, లంబాడీలకు సంబంధించి పాటలను పాడటంతో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్న సింగర్ మంగ్లీ. తీన్మార్ లో ఒక జర్నలిస్ట్ గా ఆమె టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం.

Mangli: ఇదేం పాడు పద్ధతి.. అభిమానులపై సింగర్ మంగ్లీ ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా..!

తర్వాత సినిమాల్లో పాటలు పాడుతూ.. పండుగల నేపథ్యంలో .. ఆ పండుగ యొక్క కీర్తిని.. విశేషాలను పాటల రూపంలో ఆమె పాడుతూ.. మంగ్లీ అంటే ఏంటో నిరూపించుకుంది. అయితే ఆమె పాడే పాటల్లో లిరిక్స్ కు సంబంధించి కొన్ని పదాలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చాలాసార్లు వివాదాల్లోకి కూడా వచ్చారు. ఇలా ఆమె పెద్ద సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. చిన్న చితకా సినిమాల్లో కూడా నటిస్తోంది.

Mangli: ఇదేం పాడు పద్ధతి.. అభిమానులపై సింగర్ మంగ్లీ ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా..!

అయితే తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే.. అయితే ఈ మధ్య సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కారణం కరోనా కాదు . అభిమానులు. అవును.. అభిమానుల కారణంగా సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ కావడంతో అక్కడ సెల్ఫీలతో విసిగిపోతున్నారు.

Mangli : యువకుల తీరుతో విసుగు చెందిన మంగ్లీ..

అలాంటిదే తాజాగా సింగర్ మంగ్లీ విషయంలో కూడా ఇలానే జరిగింది. సెల్ఫీలతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆమె మంత్రి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వచ్చింది. దీంతో మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఫోటోల కోసం అభిమానులు ఒక్కసారిగా హంగామా చేయడంతో మంగ్లీ తట్టుకోలేకపోయింది. ఇక అక్కడి యువకుల తీరుతో మంగ్లీ కలవరపడింది. ఇదేం పద్దతి అని మండిపడింది. ఈ సెల్ఫీలతో ఇబ్బంది పడటం మంగ్లీ ఒక్కరే కాదు.. గతంలో చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరిగింది. షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్‌, ఇతర కార్యక్రమాలకు వెళ్లిన అభిమానులు.. అక్కడకు వచ్చిన సెలబ్రిటీతో సెల్ఫీలను దిగాలనే ఆశతో ఉంటూ.. వచ్చిన సెలబ్రిటీకి అసహనం తెప్పిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మంగ్లీ వీడియో వైరల్ గా మారింది.

కథ మొత్తం చెప్పమంటారా.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జక్కన్న!

1920లలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా.. RRR సినిమా స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవితాల నుండి ప్రేరణ పొందింది. రామ్ చరణ్ సీతారామ పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ , నిర్మాతలు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. తెలుగు టాప్ హీరోలు రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మీడియాతో ఇంటరాక్ట్ చేసిన దర్శకుడు, వారు తమ పాఠశాలలో మొదటి రోజు “పిల్లల”లా నటించారని అన్నారు.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ అర్ధంలేని గొడవల కారణంగా 20 రోజులకు పైగా షూటింగ్ రోజులు వృధా అయ్యాయని రాజమౌళి పేర్కొన్నాడు. ” ఇక ఈ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.

ట్రైలర్ లోనే దాదాపు స్టోరీని అంతా రివీల్ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడు.. నాటు నాటు సాంగ్ కు కొమురం భీమ్ డ్యాన్స్ వేయడం ఏంటి వంటి ప్రశ్నలు మీడియా ప్రతినిధులు అడగడంతో కోపం తెచ్చుకున్నారు రాజమౌళి. ట్రైలర్ లోనే అంతా రివీల్ చేసిన తర్వాత కూడా.. ఇలాంటి ప్రశ్నలు ఏంటి అని.. స్క్రిప్ట్ మొత్తం మీ ముందు ఉంచమంటారా.. కథ మొత్తం చెప్పమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మీడియాను కాకులని సంబోధిస్తూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్ ఝాన్సీ..!

సాధారణంగా మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ఫోకస్ చేస్తుంది. అది రాజకీయాలలో నైనా లేదా సినిమా పరిశ్రమలో నైనా మీడియా మరింత ఎక్కువగా ఆతృతను చూపిస్తూ.. చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది అంటూ పలువురు సెలబ్రిటీలు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఝాన్సీ తాజాగా మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సెలబ్రెటీకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని వారి వ్యక్తిగత విషయాలు వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తారు. కానీ మీడియా ఫోకస్ వల్ల ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఝాన్సీ మీడియాపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలియజేస్తూ అనగనగా ఒక ఎద్దు ఎద్దు కాలిలో పుండు… ఆ పుండులో పురుగులు..ఎద్దు తో కబుర్లు చెప్పాల్సిన కాకి ఆ పుండును పొడుస్తూ పొడుస్తూ పురుగులు తింటుంది. ఆ ఎద్దు రెచ్చిపోయి బుసలు కొడుతూ కాకుల గోల పెంచి మైకులు పట్టి మరీ మా మురికిని అందరి ఇంటిలోకి చేరవేస్తున్నాయి. ఇండస్ట్రీలో పెళ్లి జరిగిన విడాకులు జరిగిన ఎన్నికలు జరిగిన కాకుల హడావిడి చేస్తున్నారంటూ మీడియాను కాకులతో పోలుస్తూ యాంకర్ ఝాన్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత విడాకుల విషయం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు, మా ఎన్నికల గురించి ఝాన్సీ పరోక్షంగా మీడియాపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.