Tag Archives: attack

విజయ్ సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి.. ఒక్కసారిగా సెలెబ్రెటీ అయిపోయాడుగా..

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై నటుడు స్పందించాడు కూడా. అతడికి.. మాకు ఫ్లైట్ ఉన్నప్పుడు చిన్న విషయంపై వివాదం అయిందని.. అయితే అతడు తాగి ఉన్నాడని సేతుపతి చెప్పుకొచ్చాడు.

కానీ ఈ విషయంపై బయట పెద్దది చేస్తున్నారని.. అంతలా ప్రచారం చేసేంత అక్కడ ఏమి లేదని చెప్పుకొచ్చాడు. అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని.. అక్కడితోనే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని కూడా చెప్పాడు విజయ్. అయితే విజయ్ సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి పేరు మహా గాంధీ. అతడు ప్రస్తుతం ఓ పెద్ద సెలబ్రిటీ హోదాను పొందాడు.

అతడు అక్కడ కన్నడ యూట్యూబ్ ఛానళ్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. నీతి బోధలు చేస్తున్నాడు. తాను కూడా చిన్పపాటి నటుడినే అని చెప్పుకొచ్చాడు గాంధీ. విజయ్ సేతుపతి నటన అంటే తనకు బాగా ఇష్టమని.. ఇప్పటి వరకు తన సినిమాలు చూడలేదని అన్నాడు. తాను విజయ్ సేతపతి ఇద్దరం ఒకే ఫ్లైట్ లో జర్నీ చేశామని. మొదట అతడిని చూడగానే విష్ చేశానని.. కాని అతడు వెటకారంగా స్పందించాడని వాపోయాడు.

మర్యాద ఇచ్చినప్పుడు.. తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సంస్కారం అని.. అక్కడ ఆ హీరో హావభావాల్లో కనిపించలేదన్నాడు. అయినా తను ఫీల్ అవ్వలేదని.. అక్కడే ఉన్న అతడి అసిస్టెంట్ మాత్రం దురుసుగా ప్రవర్తించాడని చెప్పాడు. అందుకు అక్కడ కాస్త గొడవ మొదలైందన్నాడు. విజయ్ సేతుపతి ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉంటే.. ఈ మహా గాంధీ పెద్దది చేసి .. తన పాపులారిటీ పెంచుకునే పనిలో ఉండటంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి పై దాడికి అదే కారణమా..?

విజయ్ సేతుపతి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతను తమిళ, తెలుగు సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇక ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతని ఎప్పుడెప్పుడు కలవాలా అని అభిమానులు కుతూహలంగా ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి పై అనూహ్య రీతిలో దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే.

అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అయితే విజయ్ సేతుపతి ఫై దాడికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ఎవరు? అందుకు గల కారణం ఏమిటి?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ సేతుపతిని కాలితో తన్నడం వెనుక ఏదో అసలైన కారణం ఉంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

ఇటీవలే కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణించిన విషయం అందరికి తెలిసిందే. నదీ జలాల పంపకం విషయంలో కన్నడిగులు, తమిళ ప్రజల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీనితో ఆ వివాదాల కారణంగా పునీత్ ను కడసారి చూసేందుకు కానీ, అంత్యక్రియలకు కానీ తమిళ హీరోలు ఎవరూ రాలేదు. తమిళ హీరోలు అలా వెళ్లకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి.

పునీత్ రాజ్ కుమార్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా తమిళ హీరోలపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సేతుపతి తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో, కన్నడిగుడు ఆవేశంతో ఇలా చేసి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. అంతే కానీ కావాలని విజయ్ సేతుపతి పై దాడి చేసి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరితో కలివిడిగా ఉండే ఈ స్టార్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.

అందుకే నన్ను కొట్టారు.. ‘సుఖీభవ’ శరత్..!

అయ్యయ్యో వద్దమ్మ… సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడయో ద్వారా ఫెమస్ అయిన శరత్ పై దాడి ఘటన ఇప్పుడు బాగా సంచలనం అయింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేశారు. కన్ను వాపు వచ్చేలా కొట్టిన యువకులపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అస్సలు అతడిని ఎవరు కొట్టారు.. దీనికి గల కారణం ఏంటనేది నిన్న రాత్రి నుంచి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

అయితే దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. గతంలో శరత్ చెల్లిని సాయి, హరి అనే వర్గం వేధిస్తున్నాడని అతడు మందలించాడు. దీంతో శరత్ పై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఇటీవల అతడు జైలు నుంచి బయటకు వచ్చి.. సుఖీభవ.. సుఖీభవ అంటూ వైరల్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం.. దీనిలో అతడు హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశాడని..

హిజ్రాలు అతడిపై దాడి చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదని.. తాను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యానని.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని.. అందుకే కొంతమంది తనపై కక్షకట్టి ఓ వర్గం దాడి చేశారని అతడు చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలో రెండు ఆఫర్లు వచ్చాయని.. ఇది తట్టుకోలేక కొంతమంది తనపై దాడి చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.

కూరగాయలు కోసే కత్తితో కోడలు తన అత్తను 26 చోట్ల పొడిచింది.. ఎందుకు ఇలా జరిగిందంటే..!

కొన్ని కుటుంబాల్లో అత్తాకోడళ్లు తల్లి కూతురులా ఉంటారు. మరి కుటుంబాల్లో అత్తా కోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంటారు. అయితే తన కొడుకు ముందు కోడలు అత్తతో బాగానే మెసులుతుంది. భర్త అలా వెళ్లగానే ఏదో ఒక చిన్న కారణంతో మళ్లీ రణరంగం మొదలవుతుంది. ఇలా గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్త పై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు.. 62 ఏళ్ల మోహిని దేవి.. తన కుమారుడికి 14 ఏళ్ల కిందట 35 ఏళ్ల మమతా దేవితో తో వివాహం జరిపించింది. మొదట్లో వారిద్దరు బాగానే ఉన్నా.. రానురాను మరింత వైరం పెరిగింది. ఒకరంటే.. ఒకరికీ అస్సలు పడేది కాదు.

ఈ నేపథ్యంలో ఓ రోజు కోడలు కూరగాయలు కోస్తుండగా.. అదేం కూరగాయలు కోసుడు.. మంచిగా కొయ్యి అంటూ .. కోడలిపై రుసురుసులాడింది. దీంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్త పై దాడికి పాల్పడింది. ఏకంగా ఇరవై ఆరు చోట్ల పొడవడంతో మోహిని దేవి కి తీవ్ర గాయాలయ్యాయి.

ఒక్కసారిగా ఉలిక్కిపడిన కోడలు.. తన పిల్లలకు తీసుకొని అక్కడ నుంచి పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు అతడి కొడుకుకు సమాచారం అందించడంతో ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు మమతను పోలీసులు అరెస్టు చేశారు.

తేనే తుట్టపై దాడికి వంతెన నిర్మించిన చీమలు.. చివరికి?

ఇప్పటివరకు మనం కేవలం మనుషులు మాత్రమే తన మేధా శక్తిని ఉపయోగించి ఎత్తయిన వంతెనలు, భవనాలు నిర్మిస్తామని భావిస్తాము. అయితే ఇప్పటి నుంచి ఈ ఆలోచన నుంచి బయటకు రావాలి. ఎందుకంటే కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా తమలో ఉన్న తెలివి తేటలను అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అవి కూడా వంతెనను నిర్మించగలవని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

సాధారణంగా చీమలు చూడడానికి ఎంతో చిన్నవిగా అనిపించిన అవి కష్టపడేతత్వం ఎంతో ఎక్కువగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆహారాన్ని సేకరించడంలో చీమలకు మరేదీ సాటి ఉండదు. ఒక్కసారి చీమలు వేటిపై అయినా దాడి చేశాయి అంటే కచ్చితంగా వాటిని సాధించి తీరుతాయి అనడానికి నిదర్శనమే ఈ వీడియో.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చీమలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీమలు ఒక గోడ నుంచి వంతెనలా ఏర్పడి పక్కనే ఉన్న తేనెపట్టు పై దాడి చేశాయి. ఈ క్రమంలోనే తేనెపట్టు పై దాడి చేసి తేనెను ఆక్రమించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీమలు ఒకదానికొకటి పట్టుకుని వేలాడుతూ ఒక వంతెన లాగా ఏర్పడ్డాయి.

ఈ విధంగా ఏర్పడిన వంతెన ద్వారా చీమలన్నీ తేనెపట్టును చేరుకొని అక్కడ ఉన్నటువంటి తేనెటీగలను తరిమి తేనెను ఆక్రమించుకున్నాయి. దూరం నుంచి చూస్తే ఇక్కడేదో గోడకు ఒక తాడు వేలాడినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అది తాడు కాదు చీమలని దిమ్మతిరిగే నిజం బయట పడుతుంది.ఈ విధంగా చీమలన్నీ ఎంతో ఐకమత్యంతో ఆహారాన్ని పోగు చేసుకుని ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. మరెందుకాలస్యం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

అది గూండా రాజ్యం అంటున్న సీరియల్ నటి.. ఎందుకంటే?

ఒకప్పుడు అన్నమయ్య,భారతీయుడు వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కస్తూరి శంకర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్న కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. చదివినది లాయర్ చదువు కావడంతో సమాజంలో జరిగే సమస్యలు, అన్యాయాలను ఎదిరిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈమె చేసే ట్వీట్స్ కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తుంటాయి.

తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనలపై స్పందించారు.బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అక్కడకు రావడంతో అతనిపై రాళ్ల దాడి జరగడంతో ఈమె స్పందించారు.

ఒక కేంద్ర మంత్రి హోదాలో ఎంతో సెక్యూరిటీతో వచ్చినమంత్రి పై ప్రజలు దాడి చేస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక కేంద్ర మంత్రికి ఈ విధమైనటువంటి సంఘటన జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఊహించలేకపోతున్నాను. అసలు వాళ్ళు మనుషులేనా? అది గూండా రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా గౌరీశంకర్ పశ్చిమ బెంగాల్ ఘటనపై జరిగిన సంఘటనకు స్పందించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.