Tag Archives: babu mohan

Babu Mohan: చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాం.. మా నాన్న ఎక్కడున్నారో తెలియదు… స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!

Babu Mohan:బాబు మోహన్ పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తన నటనతో అందరిని మెప్పించిన ఈయన ప్రస్తుతం సినిమాలలో నటించకుండా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి బాబు మోహన్ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం జీ తెలుగులో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బాబు మోహన్ పిల్లలు వేసినటువంటి ఒక స్కిట్ చూసి స్టేజ్ పైన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి స్కిట్ చేశారు.

ఇది చూసినటువంటి బాబు మోహన్ తన ఫ్యామిలీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… నాకు మాట్లాడటానికి కూడా రావడం లేదు అంటూనే ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి కష్టాలన్నీ అనుభవించాము నేను మూడో తరగతిలో ఉన్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది అప్పటికి నాకు ఒక చిన్న చెల్లి కూడా ఉంది తనకు నేనే జడలు వేసి అన్నం తిని పెట్టి అన్ని పనులు చూసుకునేవాడిని.

Babu Mohan:

ఇక నాన్న మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు అలాంటి సమయంలో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగామని ఈ సందర్భంగా బాబు మోహన్ తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ ప్రోమో చూసిన వారందరూ అందరిని తెరపై నవ్విస్తూ ఉండే బాబు మోహన్ జీవితంలో ఇంత కన్నీటి గాధ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Babu Mohan: రెండు రోజులు మా ఇంట్లో ఉండు.. యాంకర్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

Babu Mohan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో ఈయన బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.

ఇక ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన విడిపోయి బిజెపి పార్టీలోకి చేరారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాబు మోహన్ పలు విషయాల గురించి మాట్లాడుతూ సదరు యాంకర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ మొదట్లో యాంకర్ తో కలిసి సరదాగా మాట్లాడిన ఈయన యాంకర్ అడిగిన ప్రశ్నలకు తరువాత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు కెసిఆర్ ను బావ అంటూ పిలిచేవారు. ఇప్పుడు ఎందుకు తనని తిడుతున్నారంటూ ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మీకు ఎంతవరకు సమాధానం కావాలో ఏం చెప్పాలో నాకు తెలుసు అంటూ మండి పడ్డారు. ఇలా డిస్కషన్ చేస్తేనే జనాలకు అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Babu Mohan: మండిపడుతున్న నెటిజెన్స్…

ఇలా యాంకర్ అడగడంతో బాబు మోహన్ సమాధానం చెబుతూ ఇప్పుడు తాను ఫ్రీగా లేనని మరోసారి తన ఇంటికి వస్తే ఒక పూట కాదు రెండు రోజులు మా ఇంట్లోనే ఉండి తీరికగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అంటూ బాబు మోహన్ యాంకర్ పై మండిపడ్డారు.ఇలా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నైటిజన్స్ బాబు మోహన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి వివిధ పురస్కారాలను అందుకున్న సీనియర్ నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ కెరీర్ లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రస్తుతం వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినీ ఇండస్ట్రీ పెద్ద గురించి మాట్లాడారు.దాసరి గారి మరణం తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరని ఉన్నా కూడా పెద్దగా పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా మా ఎన్నికల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

మా ఎన్నికలలో భాగంగా ఎక్కడో బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో పుట్టినవారు ఇక్కడికి వచ్చి మా ఎన్నికలలో పోటీ చేస్తాం అనడం ఏంటి? అదే ఒక తెలుగువారిని చెన్నైలో ఎన్నుకోమనండి చూద్దాం అంటూ బాబు మోహన్ పరోక్షంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. బెంగళూరులో మన తెలుగు సినిమాలు కూడా పెద్దగా ఆడనివ్వరు. అలాంటిది కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి వచ్చి మా ప్రెసిడెంట్ గా ఎలా పోటీ చేస్తాడు అంటూ ప్రశ్నించాడు.

ఎవరికి పట్టం కట్టాలో వారికే కట్టారు..

ఇలా గతంలో జరిగిన మా ఎన్నికలలో భాగంగా మా ప్రెసిడెంట్ గా ఎవరికి పట్టం కట్టాలో వారికే పట్టం కట్టారని, వారినే గెలిపించారని ఈ సందర్భంగా బాబు మోహన్ తెలిపారు. ఇకపోతే గత ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

Babu Mohan: నన్ను ప్రశ్నించేవారు ఇండస్ట్రీలో పుట్టలేదు.. నా ముందు సూట్ చేసి నిండా డబ్బు పడేసి అలిగి వెళ్ళిపోయారు.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా హీరోగా కూడా నటించారు. ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తన తల్లి చనిపోయిందని, తన తల్లి అంటే తనకు అపారమైన ఇష్టం ప్రేమ ఉండేదని బాబు మోహన్ వెల్లడించారు. ఇకపోతే తన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునే వాన్ని కాదని, ఒకరోజు పాఠశాలలో సహ విద్యార్థి నీయమ్మ అన్నందుకు తననీ చితక బాదానని బాబు మోహన్ వెల్లడించారు.

Babu Mohan: నన్ను ప్రశ్నించేవారు ఇండస్ట్రీలో పుట్టలేదు.. నా ముందు సూట్ చేసి నిండా డబ్బు పడేసి అలిగి వెళ్ళిపోయారు.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

బాబు మోహన్ హీరోగా సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడు అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సమయంలో ఇండస్ట్రీలో పలు విమర్శలు వచ్చాయి కదా అని ప్రశ్నించారు. ఈ మాటకు బాబు మోహన్ మాట్లాడుతూ తనని ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రశ్నించిన వారు లేరని, ప్రశ్నించేవాడు పుట్టలేదని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తనను అభినందించడానికి ఎంతో మంది హీరోలు అభిమానులు పెద్ద ఎత్తున స్టూడియోకు తరలి వచ్చారని బాబు మోహన్ తెలిపారు.

రామానాయుడు కూడా ఒకరు…

ఈ సినిమా షూటింగ్ సమయంలో పద్నాలుగు సినిమాలకు సూట్కేస్ నిండా డబ్బు పెట్టి మా సినిమాలలో చేయాలని అడిగారు. కుదరదని చెబుతున్న పక్షంలో ఈ డబ్బులు మీరు తీసుకోకపోయినా ఎవరికైనా దానం చేయండి అని చెప్పి వెళ్లిన వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో నిర్మాత రామానాయుడు కూడా ఒకరిని బాబు మోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా అందరూ తనని అభినందించిన వారే తప్ప విమర్శించిన వారు ఎవరూ లేరని ఈ సందర్భంగా బాబు మోహన్ తెలిపారు.

Babu Mohan: ఆసమయంలో అస్థి పంజరంగా మారాను.. చనిపోవాలని అనుకున్నా.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

Babu Mohan: తెలుగు సినిమా చరిత్రలో టాప్ కమెడియన్లలో ఖచ్చితంగా ఉండే పేరు బాబూ మోహన్. తనదైన మ్యానరిజంతో చాలా సినిమాల్లో కామెడీని పండించారు. కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్ జోడీ చాలా సినిమాల్లో సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరి కామెడీతో నిడిచిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక బాబూ మోహన్ కామెడీకి సపరేట్ ఫ్యాన్స్ ఉండేవారు. 

Babu Mohan: ఆసమయంలో అస్థి పంజరంగా మారాను.. చనిపోవాలని అనుకున్నా.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

ఇదిలా ఉంటే ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు బాబు మోహన్. గతంలో కమెడియన్, కొన్ని సినిమాల్లో హీరోగా రాణించిన బాబు మోహన్.. నటనకు దూరంగా ఉంటూ… రాజకీయాల్లో ఉన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి గతంలో పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. 

Babu Mohan: ఆసమయంలో అస్థి పంజరంగా మారాను.. చనిపోవాలని అనుకున్నా.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆ తరువాత టికెట్ నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. 

కొడుకుని తలుచుకుని కంటనీరు పెట్టిన బాబూమోహన్..

అయితే తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన కామెడీ షోలో ఆయన పాల్గొని అలరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని చాలా కాలంపాటు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో అస్తిపంజరంగా మారిపోయానని బాబుమోహన్‌ చెప్పుకొచ్చారు. ఒకనొక దశలో చనిపోవాలని అనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . కొన్నేళ్ల క్రితం బాబూమోహన్ ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

టాలీవుడ్ లో మగాడంటే చిరంజీవే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి ఎంతో మందిని నవ్వించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటులలో కమెడియన్ బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబు మోహన్ ఉన్నాడంటే ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన బాబు మోహన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంటర్వ్యూలో భాగంగా తన కొడుకును గుర్తుచేసుకుని భావోద్వేగం అయ్యారు. కోట శ్రీనివాస రావు బాబు మోహన్ కలిసి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.దురదృష్టవశాత్తు మా ఇద్దరి కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించి మా ఇద్దరికీ తీరని కడుపుకోత మిగిల్చారని బాబు మోహన్ ఈ సందర్భంగా తన కొడుకుని గుర్తు చేసుకున్నారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాబుమోహన్ మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఒక మగాడు, ఆయన ఒక రబ్బరు. ఎటు కావాలంటే తన శరీరాన్ని అటు తిప్పుతూ అద్భుతంగా డాన్స్ కు చేస్తారు. చిరంజీవి గారి సినిమా అంటే హీరోయిన్లు వణికిపోయే వారు. ఆయనతో కలిసి డాన్స్ చేయాలంటే హీరోయిన్లు కూడా ఆలోచించే వారిని తెలిపారు.

ఇక చిరంజీవికి పోటీగా రాధ, విజయశాంతి, రాధిక వంటి హీరోయిన్లు పోటీపడి మరీ చేసేవారని ఆయన టీవీలో కనబడి డాన్స్ చేస్తే నా కళ్ళు ఆకాశమంత చేసి చూసేవాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గారి డాన్స్ గురించి పొగుడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘మా’ బరిలో నిలిచిన తుది జాబితా ఇదే.. వెల్లడించిన కృష్ణమోహన్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 10 న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ తేదీ దగ్గర పడుతున్న వేళ అధ్యక్ష బరి నుంచి బండ్ల గణేష్ , సీవీఎల్ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇక అధ్యక్ష పోటీలో మిగిలింది మంచు విష్ణు, ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు.

2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు మినహా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నరసింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇక చివరకు వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగానే జరిగింది. చివరకు వీళ్లిద్దరే మిగిలారు. తుది జాబితాలో పేర్లు ఇలా ఉన్నాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబుమోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమలు పోటీలో ఉన్నారు. ఇక మా అసోసియేషన్ లో అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టు విషయానకి వస్తే.. మొత్తం ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.

అందులో జీవితా రాజశేఖర్, రఘుబాబు మరియు బండ్ల గణేష్.. అయితే దీనిలో బండ్ల గణేష్ తప్పుకోగా… ఇక విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవితా రాజశేఖర్ మిగిలారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా… రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి లు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఇక ఈసీ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 18 పోస్టులు ఉండగా.. దానికి 39 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరుగుతాయనే విషయం తెలిసిందే.

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: బాబు మోహన్

ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ దుర్గం చెరువ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. వైద్యులు బెలెటిన్ కూడా వెల్లడించారు.

ఇదిలా ఉంటే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి ప్రముఖ నటుడు బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు స్పోర్ట్స్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

యాక్సిడెంట్‌లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. స‌ర‌దా కోసం ప్రాణాల‌తో ఎవ‌రు చెల‌గాటం ఆడొద్దని బాబుమోహన్‌ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని వాపోయారు.

కుమారుడు కోల్పోయిన బాధ ఒక తండ్రిగా తనకు తెలుసునని.. సాయి హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడని అన్నారు. ఎవరు బైక్ నడిపినా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. ఎవరూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు.. కానీ దురదృష్టం వెంటాడితే ఎవరూ ఏమి చేయలేరన్నారు. అందుకే రోడ్డు మీదకు బైక్ తీసింది మొదలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ.. సూచించారు.

వయసు పెరిగినా తీరు మారలేదంటూ.. సుమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి !

బుల్లితెరపై అన్ని చానల్లో తనదైన రీతిలో వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అందరు టక్కున సుమ పేరు చెబుతారు.గత రెండు దశాబ్దాల కాలం నుంచి టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుమ వ్యవహరించే అన్ని కార్యక్రమాలలో కెల్లా అత్యధిక రేటింగ్స్ లో దూసుకుపోతున్న కార్యక్రమం క్యాష్ ఒకటి అని చెప్పవచ్చు.

తాజాగా ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వారం ఈ కార్యక్రమానికి సీనియర్ సెలబ్రిటీలు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతిలతో కలిసి సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఏ కార్యక్రమంలోనైనా సుమ వచ్చే గెస్ట్ ల పై పంచులు వేయడం సాధారణమే. కానీ ఈ మధ్యకాలంలో కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు సైతం సుమ పై పంచులు వేయడంతో కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోతోంది.

ఇక ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన గెస్ట్ లు యాంకరమ్మకు సరైన రీతిలో పంచులు వేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి రాజ్యలక్ష్మి సుమ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మి షోకి అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు.

సుమ ఈరోజు నాకు కాంపిటీషన్ గా మీరు తయారయ్యి వచ్చారు అంది. దీంతో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది… మేము మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేసాము.. కానీ నువ్వు ఇంకా అవే వేస్తున్నావు అంటూ ఆమె గురించి కామెంట్ చేశారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ ఈ మాటకు అర్థం ఏంటి? నాకు వయసు పెరిగినా ఇంకా ఇలాగే లంగా వోణీలు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా.. అని ప్రశ్నించడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

జగన్ పిల్లోడే కానీ నెంబర్ వన్ సీఎం.. బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్ మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేశారు. సీఎం జగన్ మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడంటూ బాబు మోహన్ కొనియాడారు.

గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పెన్షన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేలా చేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాల సహాయంతో ప్రతి ఊరిలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేలా చేశారని.. రాజకీయ అనుభవం లేని జగన్ అద్భుతంగా పాలన సాగించాడని అన్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా సమయంలో అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జగన్ ను మెచ్చుకున్నారని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ అద్భుతంగా పని చేయడంతో ఆయనకు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రధానిని మారుస్తానని చెబుతూ ఉంటారని.. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరిని మారుస్తారో తెలుస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లని చెప్పారని కేసీఆర్ కు మాత్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్లు మాత్రమే దేవుళ్లు అని అన్నారు. దళితులంటే కేసీఆర్ లెక్క ఉండదని.. పేదోళ్లంటే కేసీఆర్ కు అడ్రస్ ఉండదంటూ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.