Tag Archives: charan

Rakesh Master : మా నాన్న చావకు వాళ్లే కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ కొడుకు!

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన మరణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగానే మరణించారని తెలుస్తుంది.

ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాన్న మరణం విషయంలో అనుమానాలు ఉన్నాయి అంటూ సందేహాలను వ్యక్తం చేశారు అలాగే రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ కూడా తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ మాట్లాడుతూ మా నాన్న చనిపోవడానికి కారణం సోషల్ మీడియాని సమాధానం చెప్పారు.

ఎన్నో యూట్యూబ్ ఛానల్ తన తండ్రి చేత ఇంటర్వ్యూలు చేసి పెద్ద ఎత్తున లబ్ది పొందాయని తెలిపారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్స్ వారే మా నాన్న మరణానికి కారణమయ్యారని తెలిపారు. ఇకపై మా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాల గురించి ఎవరు ఇన్వాల్వ్ కావద్దని ఈయన హెచ్చరించారు.

Rakesh Master: మద్యం తాపించి ఇంటర్వ్యూలు చేసేవారు..


రాకేష్ మాస్టర్ సినిమాలు లేని సమయంలో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే ఈయన పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీల గురించి పచ్చి బూతులు మాట్లాడటంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్ వెంటపడుతూ రోజుకు దాదాపు పది ఇంటర్వ్యూల వరకు తీసుకునేవారు.అయితే కొందరు యూట్యూబ్ ఛానల్ వారు రాకేష్ మాస్టర్ కు మద్యం తాపించి మరి ఇంటర్వ్యూలు చేశారని ఇలా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మరణం వరకు తీసుకెళ్లారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Telugu Anchor: ఫోన్ కాల్ లీక్ అవడంతో అందరి ముందు అడ్డంగా దొరికిపోయిన బుల్లితెర యాంకర్!

Telugu Anchor: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు. సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి ఎంతోమంది ఫోటా పోటీగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. అయితే వీరందరిలో కల్లా శ్రీముఖి మాత్రం కాస్త భిన్నం అని చెప్పాలి.ఇలా ఈమె ఒకవైపు వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే బుల్లితెరపై మాత్రం అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు.

ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రతి ఒక్క ఛానల్ లోను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇదివరకే ప్రసారమైన షోలో ఈమె సింగర్ శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ ఉన్నట్లు ఫ్రాంక్ చేశారు. అయితే అదంతా కూడా కేవలం టిఆర్పి కోసమేనని తేలిపోయింది. అయితే ప్రస్తుతం సరిగమప చాంపియన్ షిప్ నడుస్తోంది.

ఈ కార్యక్రమంలో పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ సైతం ఈ కార్యక్రమంలో భాగంగా తాళికట్టు శుభవేళ అనే పాట పాడుతాడు పాట అనంతరం యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ… ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్ లా ఉన్నారని అనగా వెంటనే జడ్జ్ అనంత శ్రీరామ్ ముందు సీజన్లో అయితే తనకు కావాల్సిన వాళ్ళు యాంకరింగ్ చేసే వాళ్ళు అని అంటారు.

Telugu Anchor:శ్రీముఖి కి ఫోన్ చేసి మాట్లాడిన చరణ్..

అనంత శ్రీరామ్ ఇలా అనగానే ప్రదీప్ వెంటనే శ్రీముఖికి ఫోన్ చేసి ఇవ్వగా చరణ్ జలజల జలపాతం నువ్వు అనే పాట పాడుతారు.అవతల వైపు శ్రీముఖి నాకు పాడాలని ఉంది కానీ జలుబు చేసిందని చెప్పగా ఎలా ఉన్నారండి అని శ్రీముఖిని అడుగుతారు. ఇలా సడన్ గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి మామయ్య గారు షూటింగుకు వచ్చారా.. అంటూ శ్రీముఖి మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ నవ్వుతారు. శ్రీముఖి ఫోన్ కాల్ లీక్ అవడంతో నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారా లేకపోతే షోలో భాగంగానే ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Jr.NTR: ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే ఎందుకు స్క్రోల్ చేశారు…. కావాలనే చరణ్ ను పక్కన పెట్టారా?

Jr.NTR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడం అందరిని ఎంతో సంతోషానికి గురి చేసింది.ఇలా 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా తెలుగు సినిమాకు ఇలా ఆస్కార్ అవార్డు రావడం నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని చెప్పాలి.

ఇక ఆస్కార్ వేడుకలలో భాగంగా గత పది రోజులుగా రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. అలాగే తారక్ సైతం ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని భారీగా ప్రమోట్ చేశారు. ఇలా రామ్ చరణ్ ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారక్ గురించి గొప్పగా చెబుతూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కొన్ని సందర్భాలలో రామ్ చరణ్ పేరును స్కిప్ చేయడం గమనార్హం.

ఇకపోతే ఆస్కార్ అవార్డు అందుకున్న వెంటనే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్ ను ట్యాగ్ చేయలేదు దీంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆస్కార్ ప్రకటించగానే వేదికపై కీరవాణి మాట్లాడుతున్న సమయంలో వెనుక కేవలం ఎన్టీఆర్ ఫోటోను మాత్రమే స్క్రోల్ చేశారు.

Jr.NTR: మ్ చరణ్ ను ట్యాగ్ చేయని తారక్…

ఈ పాటలో ఎన్టీఆర్ పాత్ర ఎంత ఉందో రాంచరణ్ పాత్ర కూడా అంతే ఉంది కనుక రామ్ చరణ్ ఫోటోని పక్కన పెట్టకపోవడంతో చరణ్ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ చిన్నపాటి విషయాలే ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదాలకి కారణమవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం గురించి చరణ్ తారక్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Acharya Movie: ఆచార్య ఫ్లాప్.. సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చరణ్ ,చిరు.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

Acharya Movie:మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే కాకుండా ఆచార్య సినిమా గురించి కూడా మాట్లాడారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ విషయం గురించి ఎప్పుడు చిరంజీవి ప్రస్తావించిన కొరటాల ఖాతాలోకే వేసేవారు.తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతలకు 80% రెమ్యూనరేషన్ నేను చరణ్ తిరిగి వెనక్కి ఇచ్చామంటూ తెలియజేశారు.

Acharya Movie: సినిమా బాధ్యత మొత్తం మాదే…

మేము నటించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన ఆ సినిమా బాధ్యత మేమే తీసుకుంటామని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ 80% రిటర్న్ ఇచ్చినప్పటికీ కొరటాల ఈ సినిమా కోసం ఆస్తులను ఎందుకు అమ్ముకున్నారనే విషయంపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

శంకర్ సినిమాలో చరణ్ కి జోడి కట్టనున్న.. మహేష్ హీరోయిన్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ లో ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన ఎవరు జోడి కట్టబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం తెర పైకి మాత్రం కియారా అద్వానీ పేరు వినబడుతోంది.

రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా ఆడిపాడుతున్నారనే వార్త వినబడుతోంది.ఇది వరకే వీరిద్దరి కాంబోలో “వినయ విధేయ రామ”తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. తిరిగి ఈ భారీ ప్రాజెక్టులో ఈ జోడి మరోసారి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్,క్యాస్టింగ్ ఫైనలైజేషన్ లో ఉంది. చరణ్ తన రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.