Tag Archives: CM Jagan

Pitapuram: పిఠాపురం పై ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానం.. పవన్ ఓటమి లక్ష్యమా?

Pitapuram: ఏపీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో భాగంగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి రాబోతున్నారు కూటమి నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గెలుపొందే దిశగా వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది.ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కో- ఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారిగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక నేడు ముద్రగడ్డ పద్మనాభం వంగ గీతా నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాపు ఓట్లే లక్ష్యంగా..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో టిడిపి పార్టీకి చెందిన వారందరినీ కూడా వైసిపి పార్టీలోకి చేరే విధంగా దృష్టి పెట్టాలా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90వేలకుపైగా కాపు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ కాపు ఓటర్లను వైసీపీకి వైపుకు మళ్లిస్తే గీత గెలుపు ఖాయం అవుతుందని భావిస్తున్నారు ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధిష్టానం అడుగుల ముందుకు వేస్తున్నారని తెలుస్తుంది.

Ap Cm: ఏపీ సీఎం పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్.. పోస్ట్ వైరల్!

Ap Cm: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని ఈయన పరిపాలన విధానంపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక త్వరలోనే మరోసారి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ వేడి రాజుకుంది ఇలాంటి తరుణంలోనే ప్రముఖ వివాదాస్పద నటి పూనమ్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందడం కంటే ఈమె సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. ఇలా వివాదాస్పద పోస్టుల ద్వారా ఫేమస్ అయినటువంటి పూనం ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారనే విషయం తెలియడంతో ఏకంగా కుక్క ఫోటోని షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఇకపోతే కరోనా సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చేపట్టిన పాలన గురించి పూనమ్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొవిడ్ మహామ్మారి విజృభించిన సమంయలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని, వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్విటర్ లో పోస్టు చేసింది.

చేనేత కార్మికులకు అండగా..
ఇక చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను చెబుతున్నానని ఇది ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా పూనమ్ ఏపీ ముఖ్యమంత్రి పరిపాలన విధానంపై చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Singer Mangli: సింగర్ మంగ్లీనీ కీలక పదవిలో కూర్చోబెట్టిన జగన్ సర్కార్!

Singer Mangli: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం తన పార్టీ కోసం కృషి చేసిన వారందరి సేవలను మర్చిపోకుండా వారి సేవలకు సరైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు గత ఎన్నికలలో భాగంగా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వారి సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారికి కీలకమైన పదవులను కట్టబెడుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా సింగర్ మంగ్లీకి సైతం జగన్ సర్కార్ కీలకమైన పదవిని అప్పజెప్పింది. తెలంగాణ బోనాల పాటలను పాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈమె కూడా ఎన్నికలలో భాగంగా పార్టీ తరపున ప్రచారాలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే మంగ్లీ సేవలను గుర్తించిన ఏపీ సర్కార్ ఆమెకు ఏకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు అడ్వైజర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఈమెకు ఈ పదవి అప్ప చెప్పడమే కాకుండా నెలకు లక్ష రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడమే కాకుండా రెండు సంవత్సరాలుగా భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశారు.

భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీ…

ఈ విధంగా ఏపీ ప్రభుత్వంలో మంగ్లీకి ఇలాంటి పదవి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇదివరకే కమెడియన్ ఆలీకి సైతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. అదేవిధంగా పోసాని కృష్ణ మురళికి సైతం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇలా వీరిద్దరి తర్వాత సింగర్ మంగ్లీకి జగన్ ప్రభుత్వంలో అవకాశం లభించింది.

Dulquer Salmaan: సీఎం జగన్ బయోపిక్ చేయాలని ఉంది.. నటుడు దుల్కర్ కామెంట్స్ వైరల్?

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఇలా మహానటి సినిమా తర్వాత ఈయన నటించిన తదుపరి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయనకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈయన తండ్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రంలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తానని అయితే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నటించాలి అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని దాన్నిబట్టి మనం నిర్ణయించుకోవాలని తెలిపారు.స్క్రిప్ట్ ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుందనే విషయాలను కనుక గ్రహించగలిగితే తప్పకుండా ఇలాంటి సినిమాలలో నటించవచ్చు అంటూ ఈయన తెలిపారు.

Dulquer Salmaan: ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు…

ఇకపోతే తనకు ఏపీ పాలిటిక్స్ గురించి పెద్దగా అవగాహన లేదని, కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం ద్వారా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే ఈయనకు సైతం ఈ విధమైనటువంటి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం జగన్ బయోపిక్ చిత్రం గురించి దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించారు. ఈ వివాదంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరమై యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను తెలియచేస్తూ ఉన్నారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

ఇకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైతోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టే శ్రీ రెడ్డి జగన్ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ ఆయనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తనదైన శైలిలో తిప్పికొడుతూ ఉంటుంది.ఇలా వైయస్సార్సీపి పార్టీకి మద్దతుగా నిలిచిన శ్రీ రెడ్డి తాజాగా పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫేస్ బుక్ వీడియో ద్వారా ఈమె ఒక వీడియో షేర్ చేస్తూ పార్టీ వ్యవహారశైలి గురించి తెలియజేశారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

తాను ఇన్నిరోజులు పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ జగన్ పార్టీకి మద్దతు తెలపడంతో తన అకౌంట్లో డబ్బులు పడతాయని చాలామంది భావిస్తారు నిజానికి వైయస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి ఆదాయం లేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలిపారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వచ్చే ఎన్నికలలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తే చిక్కుల్లోపడతారని సూచించారు.

గతంలో వచ్చిన సీట్ల కన్నా పది లేదా 20 సీట్లు తక్కువ వచ్చినా కానీ ప్రజలలో అసంతృప్తి ఉందని అర్థం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించకుండా అర్హత లేని వారికి పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం తప్పు చేస్తోందని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వెల్లడించారు. ఇక పోతే తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి తన తండ్రితో పాటు ఈమె ఎంతో కష్టపడుతోంది. గత ప్రభుత్వం హయాంలో గుడి నిర్మాణానికి రావాల్సిన నిధులు వచ్చాయని అయితే ఈ ప్రభుత్వ హయాంలో గుడికి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదని శ్రీరెడ్డి ఆరోపించారు.

పార్టీ వల్ల ఏ ప్రయోజనం లేదు..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కల నెరవేరబోతుందని ఎంతో సంతోషపడ్డాను అయితే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిన, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన గుడికి రావాల్సిన నిధులు మాత్రం రాలేదని, జగనన్న పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి లాభం లేకపోయినా కనీసం తన గుడి నిర్మాణానికి డబ్బులు అందుతాయని భావించాను చివరికి అది కూడా నెరవేరలేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వైయస్సార్ సీపీ పార్టీ గురించి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వం గుడి నిర్మాణానికి కావలసిన నిధులను ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని చూసిన సీఎం జగన్ దంపతులు.. భారతి రివ్యూ ఇదే!

Sarkaru Vaari Paata:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని చూసిన సీఎం జగన్ దంపతులు.. భారతి రివ్యూ ఇదే!

ఇక ఈ సినిమాని అభిమానుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వీక్షించి సినిమాపై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేష్ సర్కారు వారి పాట సినిమా పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించి ట్వీట్ చేయగా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోని సినిమా చూసిన అనంతరం జగన్ సతీమణి భారతి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని చూసిన సీఎం జగన్ దంపతులు.. భారతి రివ్యూ ఇదే!

ఈ సందర్భంగా మీడియాతో భారతి మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని తెలియజేశారు. తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని తప్పకుండా అతని సినిమాలు చూస్తానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు నటన ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది అంటూ భారతి ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు.

నేను విన్నాను… నేను ఉన్నాను..

ఇక ఈ సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని భారతి తెలియజేశారు. అయితే గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ ఉపయోగించి ఎన్నికలలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో కూడా ఈ డైలాగ్ పెట్టడంతో సినిమాకు మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

Tollywood:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంపై పలు వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు ఇలాంటి వివాదాలకు చోటివ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి వారిని సన్మానించి మన ఇబ్బందులను తెలియచేయాలని వెల్లడించారు.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

అయితే అప్పుడు మోహన్ బాబు చెప్పిన విధంగానే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ప్రవర్తించింది.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ తదితరులు వెళ్లి ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన కొద్ది రోజులకు కొత్త జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షరతులతో కూడిన టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభిస్తుందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

హాజరుకానున్న సినీ ప్రముఖులు…

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ పెద్దలు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడే అసలు స్పష్టత రానుంది. ఇకపోతే గతంలో సీఎంతో మీటింగుకు మమ్మల్ని ఆహ్వానించలేదని పలువురు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవడం కోసం ఎవరెవరు వెళ్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

Sakshi TV-CM Jagan: సీఎం జగన్ కు బిగ్ షాక్.. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత..?

Sakshi TV-CM Jagan: కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రానందువల్ల సాక్షి టీవీ ఛానల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. దీనిలో ఏముందంటే.. సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని 2021 డిసెంబర్ 31న ఆ సంస్థకు సమాచార శాఖ షో కాజ్‌ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.

Sakshi TV-CM Jagan: సీఎం జగన్ కు బిగ్ షాక్.. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత..?

అయితే ఆ నోటీసుకు సాక్షి టీవీ యాజమాన్యం బదులు సమాధానం కూడా ఇచ్చిందట. జనవరి 13, 2022న సాక్షి టీవీ ఛానల్ కు కేంద్ర హోంశాఖ ఎందుకు అనుమతులు ఇవ్వలేదో తమకు తెలియదని.. అయితే ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఇందిరా టెలివిజన్ కోరిందంట. క్లియరెన్స్ లేకుండా.. ఎలాంటి టీవీ ప్రసారాలకు అనుమనతిని పునరుద్ధరించలేమని చెప్పిందట.

Sakshi TV-CM Jagan: సీఎం జగన్ కు బిగ్ షాక్.. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత..?

అంతే కాకుండా.. ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు అనుమతి జారీని రద్దు చేస్తున్నట్లు కూడా వివరించిందట. అనుమతించిన టీవీ ఛానళ్ల లిస్ట్ నుంచి సాక్షి టీవీని తొలగిస్తున్నట్లు తెలిపిందట.
అయితే దీని నుంచి తప్పించుకునేందుకు ఇందిరా టెలివిజన్ ఉద్యోగుల నుంచి హైకోర్టులో పిటిషన్ వేయించినట్లు తెలుస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఉన్నందుకేనా..?


అనుమతులు రద్దును సవాల్ చేస్తూ.. సిబ్బంది హైకోర్టుకు వెళ్లారు. ఈ టీవీలో పనిచేసే 600 మందికి ఉపాధి కరువు అవుతుందని.. రద్దు ఆదేశాలను కొట్టివేయాలని కోరారట. వీటిపై వాదోపవాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 11వరకూ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది. అంతక ముందు కూడా ఇలాంటివి జరిగినట్లు కోర్టకు తెలిపారట. అయితే సెక్యూరిటీ క్లియరెన్స్ జగన్ మోహన్ రెడ్డి ఛానల్ అయిన సాక్షికి ఇవ్వకపోవడానికి కారణం.. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఉన్నందుకేనా.. అనే అనుమానాలు, ప్రశ్నలు తలెతుత్తున్నాయి. ఏదేమైనా సాక్షి టెలివిజన్ ప్రసారాలు ఇక ముందు కొనసాగుతాయా.. లేదా అనేది చూడాలి.

Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నా సినిమాకు టికెట్ రేట్లతో పనిలేదు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Balakrishna: సినిమా టికెట్ల విషయంపై టాలీవుడ్ హీరోలు దర్శకనిర్మాతలు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశానికి కొందరు హీరోలకు ఆహ్వానం అందినా రాలేదని తెలుస్తోంది. అలాంటి వారిలో బాలకృష్ణ కూడా ఒకరు.

Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నాకు ఆ అవసరం లేదు… బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ముఖ్యమంత్రితో సమావేశం కావడానికి రావాలని ఆయనకు ఆహ్వానం వచ్చినా ఆయన వెళ్లలేదని ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ విషయంపై మాట్లాడారు.

Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నాకు ఆ అవసరం లేదు… బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనకు సీఎం ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని అయినా కూడా నేను తనని కలవడానికి వెళ్లలేదని తెలిపారు. ఇప్పుడే కాదు ఇకపై ఎప్పుడు కూడా సీఎం జగన్ ను కలవననీ నాకు ఆ అవసరం లేదని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.

అఖండ సినిమా మంచి ఉదాహరణ..

నేను నటించే సినిమాలకు తక్కువ సినిమా టికెట్ల రేట్లు ఉన్నా పర్వాలేదు.. నేను నా సినిమాలను పరిమితికి మించి డబ్బులు ఖర్చు చేయకుండా చూసుకుంటాను. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా తాను నటించిన అఖండ సినిమా విజయవంతం అయింది. ఇదే ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. నాకు సినిమా టికెట్ల రేట్లు గురించి అవసరం లేదు కనుక నేను ఇక పై జగన్ ను కలవని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియచేశారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

Posani Krishna Murali:గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న సినీ హీరోలు డైరెక్టర్లు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఈ మీటింగుకు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, చిరంజీవి, కొరటాల వంటి వారు హాజరయ్యారు. ఇక వీరు సినిమా సమస్యల గురించి టికెట్ల వ్యవహారం గురించి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు బయటకు చెబుతున్నారే కానీ లోపల ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ లోపల ఈ అంశాల గురించిచర్చించి ఉండవచ్చు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఇక ఈ మీటింగుకు నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో పోసాని మాట్లాడుతూ స్టార్ హీరోలపై సెటైర్లు వేశారని వినికిడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోలందరూ భారీగా పారితోషకాలు పెంచడం వల్ల వైసీపీ ప్రొడక్షన్స్ పెరిగిపోయే నిర్మాతలపై భారం పడటం వల్ల సినిమా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారు అంటూ పోసాని స్టార్ హీరోలను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

విషయం పక్కదారి పట్టించ వద్దు…

పోసాని మురళి కృష్ణ ఈ విధంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించవద్దని పోసానికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు క్లారిటీ ఉందో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరం ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే సమస్యను సృష్టించారో వారికి వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్ల కన్నా పవన్ కళ్యాణ్, నాని, హీరో సిద్ధార్థ్ వంటి వాళ్లే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.