Tag Archives: comment

Actress Meena: భర్త అంత్యక్రియలను దగ్గరుండి తానే జరిపిన మీనా.. త్వరగా మామూలు మనిషి కావాలంటూ కామెంట్స్

Actress Meena: తెలుగు తమిళ సినిమాలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా జీవితంలో విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడిన విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఈయన అంత్యక్రియలు బుధవారం జరిగాయి.అయితే ఈ అంత్యక్రియలలో మీనా అన్ని తానే తన భర్త అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.

Actress Meena: భర్త అంత్యక్రియలను దగ్గరుండి తానే జరిపిన మీనా.. త్వరగా మామూలు మనిషి కావాలంటూ కామెంట్స్?

మీనా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ జంట వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే కొంతకాలం నుంచి ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.

Actress Meena: భర్త అంత్యక్రియలను దగ్గరుండి తానే జరిపిన మీనా.. త్వరగా మామూలు మనిషి కావాలంటూ కామెంట్స్?

ఈ క్రమంలోనే ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందగా ఆయన అంత్యక్రియలను మీనా దగ్గరుండి జరిపించారు. ఇలా మీనా అంత్యక్రియలలో పాల్గొనడానికి ఓ కారణముంది. విద్యాసాగర్ కి మీనా తన కూతురు నైనిక అంటే అంతమైన ప్రేమ. ఈ విషయాన్ని మీనా ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.ఇకపోతే తను తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని పలుసార్లు చెప్పిన మీనా తన భర్త పై ఉన్న ప్రేమను చివరి క్షణం వరకు తనకు అందించాలని ఇలా స్వయంగా అంత్యక్రియలలో పాల్గొన్నారు.

చివరి క్షణం వరకు భర్త పై ప్రేమను చూపించిన మీనా..

ఆయన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత విద్యాసాగర్ చిత బస్మాన్ని స్వయంగా తన చేతులతో తీసుకొని వెళ్లారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది మీనా పై ప్రశంసల కురిపిస్తున్నారు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ ఉన్న మీనా ప్రస్తుతం తన భర్త లేకుండా ఎలా ఉండగలుగుతారు. ఈమె తన కూతురు నైనిక కోసం త్వరగా మామూలు మనిషి కావాలంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

Pooja Hegde: అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తరువాత ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో అందరు ఐరన్ లెగ్ అంటూ ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్స్ పై పూజ స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ లో ఉన్న హిట్టు, ప్లాప్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. నేను తెలుగులో నటించిన 6 సినిమాలు వరుసగా హిట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన కెరీర్ లో ఉన్న ప్లాప్ ల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పూజ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్లాప్ సినిమా మొహంజొదారో . నేను నటించిన సినిమాలలో చెత్త సినిమా ఇది. ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవ్వటంతో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అంటూ చెప్పుకొచ్చింది.

ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది…

ఈ సినిమా వల్ల ఏడాది పాటు నాకు సినిమా ఆఫర్లు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈథ్‌ కభీ దివాలీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన” సినిమాలో నటించనుంది. అంతే కాకుండా పాన్ ఇండియా హీరో యశ్ సరసన నటిస్తూ కన్నడలో కూడా అడుగు పెట్టనుంది.

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటికి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా కృష్ణం రాజు ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి.

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొదటి చిత్రం. 2002 జులై 28 వ తేదీన రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ‘ఈశ్వర్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలై ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమా దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ. .. “ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి 20 ఏళ్ళు గడిచాయి అంటే నమ్మలేకపోతున్నాను. నిజానికి ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాం. కానీ ఒక రోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు.

పాన్ ఇండియా హీరో అవుతాడని ఊహించలేదు…

ఈక్రమంలో ‘ఈశ్వర్’ సినిమా కథ విన్నప్పుడు ఈ సినిమా తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందని అనిపించింది. ఆ నమ్మకంతో సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి బాధ్యతగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా ద్వార ప్రభాస్ ఇండస్ట్రీలో మంచి హీరో అవుతాడు అనుకున్నా కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

Indra Movie: ఇంద్రా సినిమాలో ఆ డైలాగ్ విని చిరంజీవి గిఫ్ట్ ఇచ్చారు.. పరుచూరి కామెంట్స్ వైరల్?

Indra Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటులుగా పరుచూరి బ్రదర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన డైలాగులను సినిమా కథలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత వీరికి ఉంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ని కృష్ణ సిద్ధం చేసిన ఈ కథను బి.గోపాల్ వినిపించగా వీరిద్దరు సినిమా చేయటానికి ఒప్పుకోలేదు.అనంతరం చిన్నికృష్ణ ఫ్లాష్ బ్యాక్ కొన్ని మార్పులు చేయడంతో బి.గోపాల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అశ్వినీదత్ ఒప్పుకోలేదు. ఇకపోతే ఈ సినిమాని చిరంజీవి గారికి వినిపించడంతో తాను ఈ సినిమా చేస్తానని అయితే కొన్ని యాక్షన్ డైలాగ్స్ తగ్గించి రాయాలని సూచించారు.

Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral

చిరంజీవి చెప్పిన విధంగానే యాక్షన్ డైలాగ్స్ తగ్గించి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. అయితే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడుతూ 80 శాతం షూటింగ్ పూర్తయింది ఇక ఇరవై శాతం షూటింగ్ లో మీ ఇష్టం వచ్చిన డైలాగ్స్ రాయండి అని చెప్పారు. ఆయన అలా చెప్పేసరికి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా… రాననుకున్నావా రాలేననుకున్నావా అనే డైలాగ్స్ రాసి మెగాస్టార్ గారికి వినిపించాను.

సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు…

ఈ డైలాగ్స్ విన్న ఆయన అశ్విని దత్ ను పిలిపించి ఆయనకు ఒక ఖరీదైన సెల్ ఫోన్ చూపించి ఒక గంటలో ఇలాంటి ఫోన్ పరుచూరి గారి చేతిలో ఉండాలి అని తనకు బహుమానంగా ఇచ్చారని గోపాలకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా వేడుకల్లో భాగంగా అభిమానులు ఎప్పుడో చిరంజీవి గారిని వేదికపై ఒక స్టెప్ వేయాలని అడిగేవారు అలాంటిది ఈ సినిమా వేడుకలో డైలాగ్ చెప్పాలని అడిగారు. అంతగా ఇంద్ర సినిమాలో డైలాగులు ఫేమస్ అయ్యాయని ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

Star Actress: ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్ ఏక్ బార్ అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అందరికీ సుపరిచితమే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేక పోయిన ఈ పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

అడపాదడపా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు.అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఇక ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో రంగు వివక్షత చాలా ఉంది అంటూ కామెంట్ చేశారు.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

ఎక్కువ ఫెయిర్ ఉంటేనే అందం అనుకునేవాళ్ళు ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉన్నారని, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటనా నైపుణ్యం కన్నా కలర్ ఎంతో ఇంపార్టెంట్ అని వెల్లడించారు. ఈ విధంగా కలర్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాలా నలుపు రంగులో ఉన్నవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

రంగు తక్కువగా ఉన్న వాళ్లు కూడా స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు…

బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కొంతమేర సౌత్ ఇండస్ట్రీ ఎంతో మేలని అక్కడ నాలాంటి వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయని ఈషా గుప్తా కామెంట్ చేశారు.ఇకపోతే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో కలర్ కి సంబంధం లేకుండా ఎంతో మంది అవకాశాలు పొందిన వాళ్లు కూడా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఏదిఏమైనా ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.

Ranbeer Kapoor: అలియా నా మొదటి భార్య కాదు.. మొదటి వివాహం గురించి రణబీర్ షాకింగ్ కామెంట్స్?

Ranbeer Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఏప్రిల్ 14వ తేదీ నటి అలియా భట్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహమైన అనంతరం వీరిద్దరు కలిసి సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన బ్రహ్మాస్త్రం సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Ranbeer Kapoor: అలియా నా మొదటి భార్య కాదు.. మొదటి వివాహం గురించి రణబీర్ షాకింగ్ కామెంట్స్?

రణబీర్ బ్రహ్మాస్త్రతో పాటు ‘షంషేరా’ ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రణబీర్ కపూర్ అలియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలియా తనకు రెండవ భార్య అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు తాను తన మొదటి భార్యను చూడలేదని ఆయన తన మొదటి భార్య గురించి అసలు విషయం చెప్పారు.

Ranbeer Kapoor: అలియా నా మొదటి భార్య కాదు.. మొదటి వివాహం గురించి రణబీర్ షాకింగ్ కామెంట్స్?

తాను కొన్ని సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ తో కలిసికృష్ణరాజ్ బంగ్లాలో ఉండేవారట. ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి పురోహితుడిని పిలుచుకొని ఏకంగా తన ఇంటి గేటు ముందు నిలబడి తన గేటుతో పెళ్లి చేసుకుందని, గేటుకు బొట్లు పెట్టి పూలమాలవేసి తను కూడా పూల మాల వేసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిందని తెలిపారు.

త్వరలోనే మొదటి భార్యను కలుస్తానని ఆశిస్తున్నా…

అయితే ఆ సమయంలో తాను ఇంట్లోలేనని ఇంటికి వచ్చాక వాచ్ మెన్ ఈ విషయం చెప్పే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యానని రణబీర్ తెలిపారు.అయితే ఇప్పటివరకు ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అనే విషయం తనకు తెలియదని అయితే త్వరలోనే తనను కలుస్తానని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ తన మొదటి పెళ్లి గురించి తెలియజేశారు. ఇలా ఈయన పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

Actor Saikiran: మోసం చేసే వాళ్ళు ఉంటే ఎలాంటి వారైనా మోసపోతారని అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎంతో మంది చదువుకున్న మేధావులు పెద్దపెద్ద వ్యాపారస్తులు, సినీ సెలబ్రిటీలు సైతం ఇతరులను నమ్మి దారుణంగా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే నువ్వేకావాలి సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కిరణ్ సైతం దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

సాయి కిరణ్ నిర్మాత జాన్ బాబు , లివింగ్ స్టెన్‌ల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో సాయి కిరణ్ దగ్గర నుంచి వీరిద్దరూ రూ.10.6 లక్షల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని డబ్బులు అడిగితే తనని బెదిరిస్తున్నారని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420,406 సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

ఇలా సాయికిరణ్ నిర్మాతల చేతిలో దారుణంగా మోసపోవడంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ సింగర్ రామకృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ నువ్వే కావాలి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో హీరోగా నటించారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన బుల్లితెర టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

దేవుడి పాత్రలలో సందడి చేసిన సాయి కిరణ్…

బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా పలు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణు వంటి దేవుడి పాత్రలో కూడా ఈయన ఎంతో అద్భుతంగా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సాయికిరణ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లో నటిస్తూ సాయికిరణ్ బిజీగా ఉన్నారు.

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

MS Raju: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలో ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈయన ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తాజాగా ఈయన కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదలయ్యి మంచి ఆదరణ సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ టికెట్ల విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లు గురించి ప్రస్తావిస్తూ సింగిల్ థియేటర్ కి కూడా దాదాపు 200 వరకు టిక్కెట్ల రేట్లు ఉన్నాయని తెలిపారు.

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

ఈ విధంగా సింగిల్ థియేటర్లో 200 రూపాయల టికెట్ ధరలు ఉంటే చాలా మంది సినిమాని థియేటర్ లో చూడటానికి ఇష్టపడటం లేదు. ఇలా టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్ల చాలామంది సినిమాని ఓటీటీలో చూడాలని భావిస్తున్నారు. తద్వారా చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. టికెట్ల రేట్లు అధికంగా ఉంటేనే పెద్ద సినిమాలకు ప్రేక్షకులు రావడం కష్టమైంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పనవసరం లేదు.

చిన్న సినిమాలను బ్రతికించండి….

చిన్న సినిమా బ్రతకాలంటే టికెట్ల రేట్లు పూర్తిగా తగ్గించాలని ఈ విషయంపై సినీ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంటుందని నిర్మాత ఎమ్మెస్ రాజు వెల్లడించారు. గతంలో టికెట్ల రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొందరు హీరోలు ప్రభుత్వాలతో మాట్లాడి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని సూచించారు.ఇలా సినిమా టికెట్లు రేట్లు పెంచడంతో సామాన్యుడికి సినిమాలు చూడటం భారంగా మారింది. తద్వారా ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి ఇష్టపడటం లేదని వీలైనంత త్వరగా టికెట్ల రేట్లు విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని ఆయన తెలిపారు.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు చేయాల్సిందే.. వైరల్ అవుతున్న దివ్యవాణి ఆడియో కాల్ లీక్ !

Divyavani: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా టీడీపీలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన నటి దివ్యవాణి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు కూడా చేయాల్సిందే.. దివ్యవాణి ఆడియో సంభాషణ వైరల్!

ఈ విధంగా ఈమె పార్టీని వదిలి బయటకు రావడమే కాకుండా టీడీపీ నేతలపై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ క్రమంలోనే దివ్యవాణి మరొక టీడీపీ మహిళా నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మరొక టీడీపీ మహిళా నేత దివ్యవాణికి ఫోన్ చేసి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్లారు అని ప్రశ్నించారు.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు కూడా చేయాల్సిందే.. దివ్యవాణి ఆడియో సంభాషణ వైరల్!

పెద్దాయన (చంద్రబాబు) తో కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది. ఈసారి గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమో అంటూ అవతలి మహిళ దివ్యవాణితో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యవాణి సమాధానం చెబుతూ మీకు తెలిసినదే కదా నాకు పదవి ముఖ్యం కాదు.పార్టీ కోసం గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను అయితే అక్కడ తనకు ఏమాత్రం గౌరవం లేదని దివ్యవాణి తెలిపారు.

పదవుల కోసం కుక్కల మాదిరి అందరి చుట్టూ తిరగాలి అంటే నేను చేయలేను ఒక లిమిట్ వరకు పనులు చేస్తున్నాం అంటూ ఈమె తెలిపారు. నన్ను పార్టీలో ఎవరో టార్గెట్ చేశారు అంటూ ఈమె పలు విషయాలను వెల్లడించారు. నేను రాజకీయాల కోసం బ్రతకడం లేదు. మేము పబ్లిక్ ఫిగర్స్ వంద మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ దివ్యవాణి తెలిపారు.

కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత లేదు..

ఇకపోతే అవతల మహిళ మాట్లాడుతూ నా పదవి నీకు ఇస్తే తీసుకుంటావా అని ప్రశ్నించగా…అశోక్ బాబు, అచ్చెన్నాయుడు,జనార్థన్ ప్రస్తుతం రాజకీయం అంతా వీళ్ల చుట్టే ఉందన్నారు. వారి చెప్పినట్లే చేయాలి లేదంటే పదవులు ఎవరికి ఇవ్వరు. దివ్యవాణికి అంగన్వాడి పదవి బాధ్యతలు ఇవ్వాలన్నారు అంటూ మహిళా నేత చెప్పగా.. ఆమెపర్సనల్ పని చేయదు కదా అన్నారు అంటూ మహిళా నేత చెప్పగా దివ్యవాణి అంగన్వాడి పదవి ఇస్తే ఇలా బాడ్ పనులు చేయాలా అంటూ ప్రశ్నించారు. కష్టపడిన వాళ్ళకు పార్టీలో విలువ లేదని ఈ సందర్భంగా దివ్యవాణి అవతలి మహిళా నేతతో మాట్లాడిన ఈ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Prudhvi Raj: ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు నా మైండ్ పొల్యూట్ చేసి నన్ను వైసీపీ పార్టీ వైపు తీసుకెల్లాడు. అప్పుడు కొవ్వు ఎక్కువై అలా మాట్లాడాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిన పృథ్విరాజ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

2014వ సంవత్సరంలో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఎంతో కీలకంగా వ్యవహరించారు.ఇక ఈయన పార్టీ ప్రచారంలో భాగంగా పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ ఎస్విబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు అయితే ఈయన ద్వారా ఆ పదవిని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

ఇతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనని ఆ పదవి నుంచి తొలగించారు. ఇలా పదవికి దూరమైనపృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన వైసిపి పార్టీపై పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ ఏకంగా వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

నాలో ఉగ్రవాది ఉన్నారు..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు ఏ విధంగా శిక్షణ ఇస్తారో అలాగే ఒక వ్యక్తి నా మైండ్ మొత్తం పొల్యూట్ చేసి తనని వైసీపీ పార్టీ వైపు వెళ్లేలా చేశారని తెలిపారు. ఇక పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేనే వళ్ళు కొవ్వుపట్టి నోటికొచ్చినది మాట్లాడానని తెలిపారు. ఆ సమయంలో నాలో పృధ్విరాజ్ కాకుండా ఒక వైసీపీ ఉగ్రవాది ఉన్నారని ఈ సందర్భంగా పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.