Tag Archives: corona positive

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

Actress Meena: బాల నటిగా గుర్తింపు తెచ్చుకుని… అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మీనా గురించి ప్రత్యేకంగా పరియచం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో తన నటన, అందం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ , మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో వర్క్ చేసింది.

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తోంది. ఇటీవల మళయాళంలో మోహల్ లాల్ సరసన, తెలుగులో వెంకటేశ్ పక్కన దృశ్యం2 మూవీలో యాక్ట్ చేసింది.

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  అయితే తాజాగా ఓ విషయం మీనా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. 2022 కొత్త సంవత్సరంలో అనుకోని అతిథి మీనా ఇంట్లోకి వచ్చింది. అయితే ఈ అతిథి ఎవరో కాదు కరోనా అని చెప్పింది. ఈ మాటతో ఇటు ప్రేక్షకులతో పాటు ఆమె ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. 

కొత్త ఏడాది మా ఇంటికి వచ్చిన తొలి అతిథి..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనా.. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఫన్నీగా చేసిన ఈ ట్విట్ చాలా వైరల్ అవుతోంది. మీనా ట్విట్టర్ లో ‘‘ ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్ట పడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసులుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి ప్రతిగా కొంత మంది త్వరగా కోలుకోవాలి మేడమ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

Manchu Manoj: కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. గత వారం రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను క్షేమంగానే ఉన్నాను మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా వెంటే ఉన్నాయి నాకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి:

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి శివ శంకర్ మాస్టర్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరో తమిళ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. పెరుగుతున్న కేసులు..ఆందోళనలో ప్రజలు!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషపడుతున్న సమయంలో ఒమిక్రాన్‌ మళ్లీ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కరోనా పరీక్షలు చేయించకున్న వారికి ఒక వేళ పాటిజివ్ వస్తే.. దానిని టెస్టుల కొరకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ లాంటివి ఏమైనా సోకిందా అనే కోణంలో పరీక్షించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు పంపిస్తున్నారు. అయితే విక్రమ్ కు సోకిందా కరోనా.. ఒమిక్రాన్ అనేది వైద్యులు నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

అతడి రిపోర్టును కూడా జీనోమ్ కు పంపించనట్లు తెలుస్తోంది. ఇక హీరో విక్రమ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఈ మమమ్మార కేసులు మళ్లీ పెరుగుతుండటం.. సినీ ప్రముఖులకు వదలకపోవడంతో సినీ వర్గాలు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్.. అతడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

క‌రోనా మ‌హ‌మ్మారి తగ్గినట్లే చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. రెండు వేవ్ లల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికం.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్.

కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ మాస్టార్ శివశంకర్ కు కరోనా సోకి.. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు.

ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై’’ అంటూ రాసుకొచ్చారు అర్జున్.

తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని అతడు వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. దయచేసి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

భార్యకి కరోనా పాజిటివ్ వచ్చిందని.. కసాయి భర్త ఏం చేశాడంటే?

దేశ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించి అధికారులు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు.కరోనా బారిన పడిన వారు ఏమాత్రం ఆందోళన చెందకుండా కేవలం జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని అధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈ మహమ్మారి పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా గురించి ఈ విధమైనటువంటి అపోహల వల్ల ఓ పచ్చని కుటుంబం ముక్కలైపోయింది.

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి అతుల్ లాల్ భార్య తులికకి ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తన భార్యకు పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ భర్త భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు. పాజిటివ్ వచ్చిన తన భార్యకు చికిత్స చేయించడం కాకుండా భార్య అన్న జాలి కూడా లేకుండా ఆ భర్త ఆమెను రెండు ముక్కలు గా చేశాడు.

ఈ విధంగా తన భార్యను చంపడమే కాకుండా అతను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే పోలీసులు మాట్లాడుతూ కేవలం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతోనే ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.

కరోనా వైరస్ పై కొందరిలో అపోహలు ఏర్పడటం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కేవలం కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని మరోసారి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా బారిన పడ్డ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ బుట్టబొమ్మ తాజాగా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే నటి పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. పూజ కరోనా బారిన పడిన విషయం తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు covid-19 పాజిటివ్ గా తేలింది.ఈ క్రమంలోనే క్వారంటైన్ కి వెళ్లాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా జాగ్రత్తలను, ప్రోటోకాల్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పూజా హెగ్డే కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సినదిగా ఆమె తెలియజేశారు. ఈ సమయంలో నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పూజ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే పూజాహెగ్డే అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రాలలో నటించారు.అదేవిధంగా మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ జోరుగా ప్రచారం.. నిజమేనా..?

బుల్లితెర స్టార్ కమెడియన్, జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ తో పాటు పలు ఈవెంట్లతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం సుధీర్ అనారోగ్యం బారిన పడ్డాడని.. పరీక్షలు చేయించగా వైరస్ నిర్ధారణ అయిందని వార్తలు వస్తున్నాయి.

సుధీర్ కానీ ఆయన టీమ్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకూ ఇంకా స్పందించలేదు. అయితే సుధీర్ కు కరోనా నిజంగా సోకిందో లేదో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీగా ఉండే యాంకర్లలో కమెడియన్లలో సుధీర్ ఒకరు. టీవీ షోల ద్వరా సుధీర్ రోజురోజు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.

రెండు మూడు రోజుల నుండి సుధీర్ కు కరోనా సోకిందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. సుధీర్ కు కరోనా సోకితే ఆయనతో కలిసి పని చేసిన నటులు, యాంకర్లు, సిబ్బంది హోం క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. సుధీర్ కు కరోనా అంటే ఆమెతో షోలలో, ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొనే రష్మీకు కూడా టెన్షన్ తప్పదు.

మరోవైపు సుధీర్ ను కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఇప్పటికే సినిమా, టీవీ ఇండస్ట్రీలో చాలామందికి కరోనా నిర్ధారణ అయింది. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఈ మధ్యే కరోనా నుంచి కోలుకుని షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.