Movie News

కరోనా బారిన పడ్డ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ బుట్టబొమ్మ తాజాగా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే నటి పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. పూజ కరోనా బారిన పడిన విషయం తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు covid-19 పాజిటివ్ గా తేలింది.ఈ క్రమంలోనే క్వారంటైన్ కి వెళ్లాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా జాగ్రత్తలను, ప్రోటోకాల్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పూజా హెగ్డే కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సినదిగా ఆమె తెలియజేశారు. ఈ సమయంలో నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పూజ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే పూజాహెగ్డే అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రాలలో నటించారు.అదేవిధంగా మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

1 hour ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

1 hour ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

1 hour ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

1 hour ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

1 hour ago

తిరుమల మాడ వీధుల రహస్యాలు.. ఈ ప్రదక్షిణకు అంతటి పవిత్రత ఎందుకు?

తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…

2 hours ago