Tag Archives: curd

వర్షాకాలంలో పెరుగు తింటున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి..!

పెరుగు అన్నం అంటే ఎవ్వరైనా ఇష్టపడతారు. కడుపులో చల్లదనం కోసం పెరుగు తింటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపులో మంటను కూడా పెరుగు తగ్గించేస్తుంది. అందులో ఉండే ఎంజైమ్ మలబద్దకం నుంచి కూడా బయటపడేస్తుంది. అంతే కాకుండా నిద్రలేమితో బాధపడే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే వానాకాలంలో మాత్రం పెరుగు తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందకంటే.. దీని వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు ఒక్కటే కాదు పెరుగుతో తయారయ్యే ఏ ఇతర పదర్ధాలను కూడా తినడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి లాంటివి కూడా తీసుకోవడం మంచిది కాదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాక్టీరియా ఎక్కువ కావడం ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. గొంతులో ఏదో పట్టేసినట్లు ఉంటుందని.. దీంతో ఏం తినాలన్నా ఇబ్బందిగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. చాలామందికి ఉదయమే పెరుగు తినడం అలవాటు ఉంటుంది. కానీ ఈ సీజన్ లో అలా తీసుకోవడం వల్ల అంతక ముందు కీళ్ల నొప్పులు లాంటివి ఉంటే.. అవి మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుందట. అందుకే ఆయుర్వేదం ప్రకారం.. భాద్రపద మాసంలో పెరుగు తినడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు.

ఈ వ్యాధులు ఉన్నవాళ్లు పెరుగును తినకూడదు.. ఎందుకంటే..!

పెరుగును ప్రతీ ఒక్కరు ఇష్టపడుతుంటారు. అన్నం తిన్న తర్వాత చివరలో ఎవరైనా పెరుగు వేసుకొని అన్నం తింటారు. దీనికి కారణం ఏంటంటే.. కడుపులో అది చల్లదనాన్ని ఇస్తుంటుంది. అందుకే పెరుగు అన్నం తినకుండా కూడా చాలామంది ఉండలేరు. అంతటి స్థానాన్ని సంపాదించుకుంది పెరుగు.

అయితే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మానవ శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలేవారికి కూడా ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం చాలా ప్రమాదకరం.

అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం మంచిది కారు. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి.

ఎందుకంటే అది నొప్పిని ఇంకా తీవ్ర తరం చేస్తుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు కూడా పెరుగును తీసుకోకుండా ఉండటమే మంచిది. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకపోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు అస్సలు ముట్టుకోవద్దు.

ఔషదగుణాలున్న వేపకు పెరుగును కలిపితే.. దాని ఫలితం ఎంతో అద్భుతం..!

వేపచెట్టు అనేది ప్రతీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. వేప యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ సెఫ్టిక్.. ఇంకా చెప్పాలంటే ట్యూమర్, అల్సర్, మలేరియా, ఆక్సిడెంట్ లను నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మరక్షణకు, వెంట్రులకు ఆరోగ్యంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది.

ఇక సహజంగా మన ఇళ్లలో ధాన్యం నిల్వచేసేందుకు, పొలాలలో ఎరువుగా కూడా వేప ఆకులను వాడతారు. అయితే ఇంతటి ఉపయోగాలు ఉన్న వేపకు పెరుగును వారానికి 3 లేదా 4 సార్లు కలపడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. రెండు చెంచాలు వేప ఆకులను పేస్ట్ చేసి..పెరుగుతో కలిపి ఉంచాలి. దీనిని చర్మానికి పట్టించినట్లయితే చర్మం కొద్ది సమయం తర్వాత దగదగమెరిసిపోతూ ఉంటుంది. వేప -పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మం దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేస్తుంది. ఇది చర్మశుద్ధిని పెంచుతుంది.

మొటిమలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లాక్ హెడ్స్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. దీనిని గాయం మీద అప్లై చేయడం ద్వారా, అది నయమవుతుంది అలాగే, మచ్చ కూడాపోతుంది. వేప – పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా డార్క్ సర్కిల్స్ కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ఇది చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

అందుకే పెద్దోళ్లు మనకు తెలియకుండానే ఇంటి ముందు వేప చెట్టు పెంచుతారు. వేపచెట్టు నుంచి వచ్చే గాలి చెడు బ్యాక్టీరియాను దరిచేరనీయదు. చుట్టూ వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ చెట్టు నీడలో పడుకుంటే ఆక్సిజన్ బాగా అందుతుంది. అందుకే పూర్వకాలంలో ఆరుబయట వేప చెట్టుకింద పడుకోవడం అలవాటుగా ఉండేది.

శ్రావణమాసంలో పాలను తాగకూడదు.. ఒకవేళ తాగితే ఏమవుతుంది..?

శ్రావణమాసం రాగానే చాలామంది పాలను తాగరు. వాటిని దూరంగా ఉంచుతారు. దానికి గల కారణం ఏంటనేది చాలామందికి తెలవదు. లక్ష్మీదేవికీ, శివుడికీ ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రాగానే ఎందుకు తాగరు అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పురాణాల్లో పాల సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది.

ఆ విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నట్లు పురాణాల ప్రకారం తెలుస్తోంది. అందువల్లే శ్రావణమాసంలో పాలకు దూరంగా ఉంటుంటారు. పూజకు తీసుకెళ్లిన పాలను స్వామికే అభిషేకం చేస్తే పరమేశ్వరుడి కృప పొందాలని భక్తులు అలా చేస్తారనే ప్రతీతి ఉంది. దీని వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో పురుగులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.

గేదెలు, ఆవులు తినే గడ్డిలో కూడా ఆ పురుగులు దాగి ఉంటాయి. పశువులు వాటిని తినేస్తాయి. దీంతో పాలలో హానికరమైన పదర్ధాలు ఉంటాయని.. అందువల్ల శ్రావణమాసంలో పాలను తాగరని చెబుతుంటారు. వ్యాధుల బారిన పడకుండా ఇలా పాలకు దూరంగా ఉంటడం మంచిదని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా వానాకాలంలో మనిషి వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.

ఉపవాస దీక్షలు చేయడంతో పొట్ట ఖాళీగా ఏర్పడుతుంది. అందులో పాలను తాగడం వల్ల అవి సరిగ్గా అరగవు. దీంతో గ్యాస్, డయేరియా, ఎసిడిటీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అందువల్ల పాలు తాగకపోయిన నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తే మంచిది.

రాత్రిపూట పెరుగు తింటే ఏం జరుగుతుంది?

సాధారణంగా మన శరీరానికి పెరుగు, పాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు,ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం సక్రమంగా అందుతుందని భావిస్తాము. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కానీ కొన్ని సార్లు మన పెద్దవారు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.నిజంగానే రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొందరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు:

  • సాధారణంగా పెరుగు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు తినడం వల్ల జలుబు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి పెరుగును బయటనుంచే తినాలి.
  • దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రాత్రిపూట ఎటువంటి పరిస్థితులలో కూడా పెరుగును తినకూడదు.

*జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడుతుందని, దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతాయని చెబుతున్నారు.

  • ఒకవేళ తప్పనిసరిగా పెరుగుతో తినాలనిపిస్తే పెరుగు బదులు పల్చటి మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం. అదే విధంగా రాత్రి వేళల్లో పెరుగు తినాలనిపిస్తే అందులోకి కొద్దిగా చక్కెర, నల్లటి మిరియాల పొడి కలుపుకొని తినడం వల్ల పెరుగును తొందరగా జీర్ణం చేస్తుంది