Tag Archives: emotional comments

Hyper Aadi: ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి హక్కున చేర్చుకుంది ఆయనే.. ఎమోషనల్ అయిన ఆది?

Hyper Aadi: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

Hyper Aadi: నోటి దూలతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది… భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఎమోషనల్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో భాగంగా హైపర్ ఆది పొట్టి నరేష్ తో కలిసి స్కిట్ చేశారు. ఈ స్కిట్ అందరిని పెద్ద ఎత్తున నవ్వించింది. ఈ స్కిట్ అనంతరం జబర్దస్త్ రాము మాతృదేవోభవలోని ఓ పాటకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన చేసినటువంటి ఈ పర్ఫామెన్స్ అక్కడ ఉన్నటువంటి వారందరి చేత కంటతడి పెట్టించింది.

ఆకలి బాధలు తీర్చారు..

ఈ పర్ఫామెన్స్ అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను కెరియర్ పరంగా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి అదిరే అభి అన్న ఒక కారణం. అయితే నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి హక్కున చేర్చుకున్నటువంటి వారిలో రాము అన్న ఒకరు అంటూ ఈ సందర్భంగా ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: నేను రాజకీయాలలోకి రావడం ఆ డైరెక్టర్ కి ఇష్టం లేదు… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల రాజకీయ సభలలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి రావడం ఒక డైరెక్టర్ కు ఇష్టం లేదంటూ వెల్లడించారు.

పవన్ రాజకీయాలలోకి రావడం ఎవరికి ఇష్టం లేదు ఈయన ఎవరి గురించి చెప్పారనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది మరెవరి గురించో కాదు తన స్నేహితుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియజేశారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అని తెలిపారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని ఈయన వెల్లడించారు.

ఇక నేను రాజకీయాలలోకి రావడం త్రివిక్రమ్ కి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. నేను సమాజం గురించి ఆలోచించి రాజకీయాలలోకి వచ్చాను కానీ త్రివిక్రమ్ మాత్రం నా గురించి ఆలోచిస్తూ ఉంటారని పవన్ తెలిపారు. ఇక నేను సంపాదించిన డబ్బులని రాజకీయాలలో పార్టీ కోసం ఖర్చు పెడుతూ ఉండగా ఆయన మాత్రం నాకు సినిమాలను తీస్తూ నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేలాగా చేస్తూ ఉంటారు.

నా గురించే ఆలోచిస్తాడు..
ఇలా త్రివిక్రమ్ నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు కానీ రాజకీయాలలోకి వచ్చేటప్పుడు మనకు పాలిటిక్స్ ఎందుకు అంటూ చాలా సార్లు చెప్పారు కానీ నేను వినకపోవడంతో ఆయన చెప్పడం కూడా మానుకున్నారని పవన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Pallavi prashanth: బర్రెలక్కతో పెళ్లి పై స్పందించిన ప్రశాంత్… నా చెల్లి అంటూ ఎమోషనల్ కామెంట్స్!

Pallavi prashanth: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి పల్లవి ప్రశాంత్ ఒకరు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెళ్లి వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. పల్లవి ప్రశాంత్ బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా ఈ వార్తలపై ఇప్పటికే బరెలక్క స్పందించారు.

పల్లవి ప్రశాంత్ నాలాగే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అందుకే ఆయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను తనకు సపోర్ట్ చేశాను ఆయనను నాకు అన్నయ్యతో సమానం అంటూ ఈమె ఈ పెళ్లి వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించారు.

ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ తన గురించి శిరీష గురించి వస్తున్నటువంటి పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొందరు ఉద్దేశం పూర్వకంగానే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఆమె నా చెల్లితో సమానం ఒక అన్నయ్యగా తనకు జీవితాంతం తోడుగా ఉంటానని తనకు ఏ అవసరం వచ్చిన అన్నయ్యగా నా చెల్లిని ఆదుకుంటాను అంటూ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు.

అన్నయ్యగా తోడుంటా…

ఇక వీరిద్దరూ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఒకరు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి సెలబ్రెటీ హోదా సొంతం చేసుకోగా మరొకరు తెలంగాణ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు. ఈమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటి చేయడంతో అందరి ఆ టెన్షన్ ఈమె పైనే ఉంది ఈ ఎన్నికలలో ఈమె గెలవలేకపోయినా సెలబ్రెటీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Amar Deep: ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే స్నేహితులు పార్టీలు చేసుకున్నారు.. ఎమోషనల్ అయిన అమర్!

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బుల్లితెర నటుడు అమర్. ఈ కార్యక్రమం ద్వారా ఈయన రన్నర్ గా నిలిచారు అయితే ఈ కార్యక్రమం మొదట్లో అమర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ చివరికి టైటిల్ రేస్ లో వచ్చారు. కానీ రన్నర్ గా మాత్రమే మిగిలిపోయారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అమర్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన స్నేహితుల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్నేహితులు అంటేనే మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేవాళ్లు కాదని మనం కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఆదుకునే వారే నిజమైన స్నేహితులని తెలిపారు.

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా బయట మాత్రం నా స్నేహితులు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదని ముఖ్యంగా కొంతమంది నా హార్ట్ కి దగ్గరైనటువంటి వారు ఏ మాత్రం హెల్ప్ చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పార్టీలు చేసుకున్నారు..

తనని సపోర్ట్ చేయడం మానేసి డోంట్ గివప్ అంటూ తనకు మెసేజ్లు పెట్టారని, ఆ విషయం తనకు బాధ కలిగించింది అంటూ అమర్ ఎమోషనల్ అయ్యారు. ఇలా తనకు సపోర్ట్ చేయకపోవడమే కాకుండా పార్టీలు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేశారని ఈయన ఈ సందర్భంగా తన స్నేహితుల గురించి కామెంట్స్ చేశారు కానీ ఆ స్నేహితులు ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అమర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అవన్నీ చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదనీ.. చేతులు జోడించి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఛార్మి!

టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను చేపడుతూ బిజీగా ఉన్నారు. అదికూడా పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే చూసుకుంటున్నారు. అయితే తాజాగా చార్మి ఈ విషయంపై స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ చార్మి ముంబైలోనే ఉంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా మరోసారి కరోనా అడ్డుపడుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై వంటి ప్రాంతాలలో రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విలయ ప్రతాపాన్ని చూసి ఛార్మి చలించిపోయారు. ఇటువంటి పరిస్థితులను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని ఛార్మి తెలిపారు.

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఛార్మి చేతులు జోడించి వేడుకున్నారు.