Tag Archives: emotional

Dancer Pandu: ప్రియురాలిని తెలుసుకొని వేదికపైడే కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్ పండు.. వైరల్ అవుతున్న వీడియో!

Dancer Pandu: సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రతివారం ఒక స్పెషల్ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమాల ద్వారా తమ జీవితంలో జరిగిన కొన్ని చేత సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమో అందరి చేత కంటతడి పెట్టించిందని చెప్పాలి. మంగమ్మగారి కొడుకు అనే ఎపిసోడ్ ద్వారా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో ఎప్పటిలాగే తమదైన శైలిలో సందడి చేస్తూ ఆటపాటలతో అందరిని నవ్వించారు. ఇక చివరిలో ఒక్కసారిగా డాన్సర్ పండు తన ప్రియురాలిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై పండు మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయితే తన ప్రియురాలు తన జీవితంలోకి వచ్చి తాను తన తల్లిలా చూసుకుంటానని తనకు ప్రామిస్ చేసింది. నేను కూడా తనని తల్లి తల్లి అంటూ పిలుచుకునే వాడిని. అయితే తను కూడా నా తల్లి వద్దకే వెళ్లిపోయింది. ఆ అమ్మాయి నన్ను బాగా చూసుకోవడంతో బహుశా మా అమ్మకే కుళ్ళు వచ్చిందేమో నాకన్నా నా కొడుకుని బాగా చూసుకుంటుందని తన వద్దకు తీసుకెళ్లింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

Dancer Pandu: అందరినీ ఏడిపించిన డాన్సర్ పండు…

ఈ విధంగా పండు తన ప్రియురాలు గురించి తలుచుకొని ఎమోషనల్ కాగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

Star Actress: ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్ ఏక్ బార్ అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అందరికీ సుపరిచితమే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేక పోయిన ఈ పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

అడపాదడపా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు.అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఇక ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో రంగు వివక్షత చాలా ఉంది అంటూ కామెంట్ చేశారు.

Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా… నటి ఎమోషనల్ కామెంట్స్!

ఎక్కువ ఫెయిర్ ఉంటేనే అందం అనుకునేవాళ్ళు ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉన్నారని, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటనా నైపుణ్యం కన్నా కలర్ ఎంతో ఇంపార్టెంట్ అని వెల్లడించారు. ఈ విధంగా కలర్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాలా నలుపు రంగులో ఉన్నవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

రంగు తక్కువగా ఉన్న వాళ్లు కూడా స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు…

బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కొంతమేర సౌత్ ఇండస్ట్రీ ఎంతో మేలని అక్కడ నాలాంటి వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయని ఈషా గుప్తా కామెంట్ చేశారు.ఇకపోతే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో కలర్ కి సంబంధం లేకుండా ఎంతో మంది అవకాశాలు పొందిన వాళ్లు కూడా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఏదిఏమైనా ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

Gopichand: టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రముఖ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడుగా ఈయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ అనంతరం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి.

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

ఈ క్రమంలోనే సిటీ మార్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేది దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన చిత్రబృందం తాజాగా సుమ క్యాష్ కార్యక్రమంలో సందడి చేశారు.

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

ఈ క్రమంలోనే నటుడు గోపీచంద్ తో పాటు డైరెక్టర్ మారుతి,బన్నీవాసు, శ్రీనివాస కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక సుమ వీరందరికీ గిఫ్ట్ ఇస్తూ వారిచేత డబ్బులు తీసుకుంటుండగా గోపీచంద్ గిఫ్ట్ అని డబ్బులు అడుగుతున్నారు ఏంటి అంటూ తన పై పంచ్ వేసాడు. ఇలా అందరితో కలిసి సరదాగా ఈ కార్యక్రమం కొనసాగిందని తెలుస్తోంది.

చిన్నప్పుడు ఏం కోల్పోయానో ఇప్పుడు తెలుస్తుంది…

ఈ కార్యక్రమం చివర్లో గోపీచంద్ ఫాదర్ ఫోటోని స్క్రీన్ పై వేశారు. తన తండ్రి ఫోటోని చూసిన గోపీచంద్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయానని చిన్నతనంలోనే జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ తెలిపారు. నేను చిన్నప్పుడు ఏం కోల్పోయానో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది అంటూ గోపీచంద్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

TikTok Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయిన దుర్గారావు దంపతులు!

Tik Tak Durgarao: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎంతగా అంటే ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోయేలా క్రేజ్ దక్కించుకొని ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు.

Tik Tak Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయినా దుర్గారావు దంపతులు?

ఈయన ఎక్కడో మారుమూల గ్రామంలో రోజువారి కూలి పనులు చేస్తూ మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళుతూ సాయంత్ర సమయంలో తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వారు. ఇలా వీరిద్దరి డాన్స్ వీడియోలకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

Tik Tak Durgarao: భార్యతో డాన్సులు చేపిస్తున్నానని సొంత వాళ్ళే ఎన్నో మాటలు అన్నారు.. ఎమోషనల్ అయినా దుర్గారావు దంపతులు?

టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో నే ఏకంగా 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇక ఇలా వీరిద్దరికి వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను, అలాగే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సెలబ్రిటీలుగా మారారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గా రావు దంపతులు వారి జర్నీ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఊర్లో చాలామంది మా పై విమర్శలు చేశారు…

రోజువారీ కూలీ పనులు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న తనకు తన మేనల్లుడు ద్వారా టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నాను. అయితే తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సమయంలో ఊర్లో దాదాపు 80% మంది తనని విమర్శించారని ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. వీడు పెళ్ళాంతో కలిసి చిందులు వేయడం ఏంటి అంటూ సొంత వాళ్లే మమ్మల్ని దారుణంగా తింటారు. అయితే మేం అవేమీ పట్టించుకోకుండా మేము చేసే పని చాలా నిజాయితీగా చేస్తున్నాము, ఎలాంటి తప్పు పని చేయలేదనీ వారి మాటలు పట్టించుకోకుండా మా ప్రయత్నాలు మేము చేసాము. ఆ భగవంతుడి దయవల్ల, అభిమానులు ఎంతగానో ఆదరించి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారని ఈ సందర్భంగా టిక్ టాక్ దుర్గా రావు దంపతులు ఎమోషనల్ అవుతూ ఈ విషయాలను వెల్లడించారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

Dasari Narayana Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈయన దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ బరువు బాధ్యతలను కూడా తన భుజాలపై మోశారు. దాసరిగారు డైరెక్టర్ ధవళ సత్యం ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో దాసరి సహాయంతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

అప్పటికే దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఇక ఇండస్ట్రీలో దాసరి గారి దగ్గర అలా మెలగాలి ఇలా మెలగాలి అంటూ చాలా మంది చాలా కండిషన్స్ పెట్టారు. అయితే అది నచ్చక ఇండస్ట్రీ నుంచి వెనక్కి వచ్చేద్దామని భావించాను. కానీ గురువు గారి ప్రోత్సాహంతో తాను ఇండస్ట్రీలో కొనసాగానని ధవళ సత్యం తెలిపారు. ఇద్దరం స్నేహితులమే అయినప్పటికీ తనని ఎప్పుడు గురువుగానే భావిస్తూ అన్నయ్య అంటూ పిలుస్తానని ధవళ సత్యం తెలిపారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

ఇండస్ట్రీలో వీరిద్దరి అనుబంధం గురించి చెబుతూ దాసరి చివరి క్షణాలు గురించి కూడా ఈ సందర్భంగా దవళ సత్యం తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. దాసరి గారితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన చనిపోయే ముందు తన పక్కన ధవళ సత్యం అనే వాడు ఉండాలని కోరుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యారు.

నాతో పాటు ఉండరా…అన్నారు

దాసరి గారి చివరి రోజులలో తన పక్కన ఉండాలని పిలిపించడంతో నేను, రామకృష్ణ, రేలంగి నరసింహారావు ముగ్గరం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళితే దాదాపు ఎనిమిది గంటల వరకు ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆయనతోనే సమయం గడిపాము. ఒక రోజు కాస్త ఆలస్యంగా వెళితే నాతోపాటు ఉండరా.. అని అడగగా ఉంటాను అన్నయ్య అంటూ తన చేతిని ఇలా పట్టుకున్నాను. తాను కూడా నా చేతిని అలా పట్టుకొని స్ట్రేక్చర్ పై లోపలికి వెళ్ళాడు. ఇక తిరిగి రాలేదు. ఆయన అడిగాడని నేను ఉన్నాను,కానీ ఆయన తిరిగి రాలేదు అంటూ ఈ సందర్భంగా దాసరి గారి గురించి ధవళ సత్యం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచి వారు… ఆయన ఫ్యాన్స్ నా తల్లి కూతురిని నీచంగా మాట్లాడారు.. హీరో రాజా ఎమోషనల్!

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేయించుకున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను అలాగే సినిమాలలో దూసుకుపోతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయనకు సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఎవరైనా ఒక్క మాట మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోయి కామెంట్లు చేస్తారో మనకు తెలుస్తుంది.

ఇకపోతే హీరో రాజా అప్పట్లో వైయస్సార్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇకపోతే రాజకీయపార్టీలో ఉన్న రాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివితే నీకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి అంటూ అతని పై కామెంట్ చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ ను అనడంతో ఒక్క సారిగా పవన్ అభిమానులు రెచ్చిపోయి తన తల్లి భార్య కూతురుని దారుణంగా అసభ్యకరమైన కామెంట్ చేస్తూ దూషించారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచి వారు… ఆయన ఫ్యాన్స్ నా తల్లి కూతురిని నీచంగా మాట్లాడారు.. హీరో రాజా ఎమోషనల్!

ఇకపోతే ప్రస్తుతం రాజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ దేవుడు సువార్తలు చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచివారు. ఆయన తనలో ఉన్న ఎమోషన్స్ ఆపుకోలేరు. నేను అతనితో కలిసి పని చేశాను ఆయన ఎలాంటి వ్యక్తి అనే విషయం నాకు తెలుసు.కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచి వారు… ఆయన ఫ్యాన్స్ నా తల్లి కూతురిని నీచంగా మాట్లాడారు.. హీరో రాజా ఎమోషనల్!

పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు…

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో ముందుకు వెళ్లాలని ఎన్నో పథకాలు రచించారు. అయితే ఆయన రాజకీయాలకు అభిమానులే అడ్డుగా మారారు. అభిమానులు ఇలాంటి కామెంట్లు చేయడం అందరిపై దూషించడం వల్ల ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.వారు తెలుసుకొని ఇలాంటివి మానుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. అయితే అభిమానులు చేసిన ఈ కామెంట్ లకు పవన్ కళ్యాణ్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు.అతని ఫ్యాన్స్ అలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు ఎదురవుతాయని రాజా వెల్లడించారు.

పెద్ద అందగత్తె కాదని ఎగతాళి చేసారు.. ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా : నటి ఆమని

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జంబలకడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని ఆ తర్వాత శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ తల్లి పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆమని మరొక హీరోయిన్ ఇంద్రజతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమని కెరియర్ మొదట్లో తను ఎదుర్కొన్న అవమానాలను గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో కాస్త వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా ఆమనీ మాట్లాడుతూ.. తనకు దొంగతనం చేసిన మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమని ఈ విధంగా తన ఇష్టాఇష్టాలను తెలిపారు. అదే విధంగా తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాలంటే ఎంతో పిచ్చని, అప్పుడే శ్రీదేవి, జయసుధ జయప్రద వంటి తారలను చూస్తూ పెరిగానని,ఆమని తెలిపారు.

ఇక పెద్దయిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో తన కుటుంబ సభ్యులు తనని చూసి హేళన చేశారని.. నలుగురితో సరిగ్గా మాట్లాడటం రాదు నువ్వు సినిమాలలో ఏం నటిస్తావు? పైగా పెద్ద అందగత్తెవి కూడా కాదని తన కుటుంబ సభ్యులు అనడంతో ఆ సమయంలో చాలా బాధ పడ్డానని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడమే కాకుండా బుల్లితెరపై ముత్యమంతా ముద్దు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన షన్ను?

Shanmukh Jaswanth: యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వెబ్ సిరీస్ ల ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇలా వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన షన్ను?

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్నారు. అయితే ఈయన కంటెస్టెంట్ సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల చివరికి రన్నర్ గా మిగిలిపోయారు. రన్నర్ గా మిగిలి పోవడమే కాకుండా తన ప్రియురాలితో బ్రేకప్ చెప్పుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ లో సిరితో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా షన్నూకి బ్రేకప్ చెప్పుకుంది.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన షన్ను?

ఈ విధంగా లవ్ బ్రేకప్ కావడంతో ఎంతో డిప్రెషన్లోకి వెళ్లి పోయిన షణ్ముఖ్ జస్వంత్ ఈ విషయంలో మరో చేదు సంఘటన జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ బామ్మా నేడు తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ఇంటిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు.

తీరని బామ్మ కోరిక…

తన బామ్మ చనిపోయిన విషయాన్ని షణ్ముఖ్ యశ్వంత్ తెలియజేస్తూ తనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ గురించి కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన బామ్మతో కలిసి ఉన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. తన పెళ్లి వరకు బతికి ఉంటావా అంటూ షన్ను అడగగా.. ఏమో అంటూ తన భామ సమాధానం చెప్పింది.ఈ క్రమంలోనే వెనుకనుంచి తప్పకుండా ఉంటుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా తన పెళ్లి కూడా చూడకుండానే తన బామ్మ చనిపోవడంతో షన్ను ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ది వారియర్ చిత్రంలో నటించారు.తెలుగు తమిళ భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కావడంతో ఇప్పటికే తమిళంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి బిహైండ్‌వుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమెను ప్రాంక్‌స్టర్లు ఆషిక్‌, సారథిరన్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఫ్రాంక్ చేస్తూ భారీ ఎత్తున గొడవ పడ్డారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు…

కృతి శెట్టిని ముందుగా ప్రశ్నలు తాను అడగాలంటే తాను అడగాలని ఇద్దరు గొడవ పడ్డారు. సారథిరన్‌ ఆషిక్‌పై చెయ్యి చేసుకోవటంతో మరింత ఆందోళనకు గురైంది. ఇలా వీళ్లిద్దరూ గొడవ పడటంతో ఎంతో ఆందోళనకు గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇది కేవలం ఫ్రాంక్ అని చెప్పి తనను నవ్వించారు. అయినా మీరు ఎందుకు ఏడ్చారు అంటూ తనని ప్రశ్నించగా ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు భయం వేస్తుంది అంటూ కృతి శెట్టి చెబుతూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mucherla Aruna: చిరంజీవి గారికి లైవ్ లో మెసేజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి ముచ్చెర్ల అరుణ!

Mucherla Aruna: ముచ్చెర్ల అరుణ ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోల సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీని ఏలిన ముచ్చెర్ల అరుణ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.

Mucherla Aruna: చిరంజీవి గారికి లైవ్ లో మెసేజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి ముచ్చెర్ల అరుణ!

అప్పట్లో హీరోయిన్ విజయశాంతితో తనకి ఎంతో మంచి అనుబంధం ఉండేదని ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం అంటూ తెలియజేశారు. ఇక షూటింగ్ లొకేషన్లో అయితే అప్పట్లో కారవాన్ ఉండేది కాదు చెట్లకింద కూర్చుని ఎంతో సరదాగా మాట్లాడుకునేవాళ్ళం అంటూ గత విషయాలను అరుణ గుర్తు చేసుకున్నారు.

Mucherla Aruna: చిరంజీవి గారికి లైవ్ లో మెసేజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి ముచ్చెర్ల అరుణ!

ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా గత విషయాలను గుర్తుచేసుకుంటూ అప్పట్లో షూటింగ్ లొకేషన్లో తన అమ్మకు హీరోలు మోహన్ బాబు, చిరంజీవి వంటి వారితో మంచి అనుబంధం ఉండేది అని వాళ్లు కూడా లొకేషన్ వారికి ఇష్టమైన వంటలను అమ్మతో తయారు చేయించుకుని తినే వాళ్లని అమ్మతో మంచి అనుబంధం ఏర్పడిందని అరుణ వెల్లడించారు.

కూతురు పెళ్ళికి పిలవాలని ఆరాటపడింది..

అప్పుడు అందరం ఎంతో మంచి స్నేహంగా ఉండే వాళ్లని అయితే ప్రస్తుతం వీరితో పెద్దగా పరిచయాలు లేవని అరుణ వెల్లడించారు. కనీసం వారి ఫోన్ నెంబర్లు కూడా తన దగ్గర లేవని తెలిపారు.ఈ క్రమంలోనే చిరంజీవి గారికి మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా అంటూ యాంకర్ అడగగా లైవ్ లోనే అరుణ తనకు మెసేజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి గారు హాయ్ అని చెబుతూనే తన కూతురు పెళ్లికి తన తల్లి మిమ్మల్ని ఎంతగానో పిలవాలనుకున్నారు కానీ కుదరలేదు అంటూ అరుణ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.