Tag Archives: emotional

తల్లి పద్ధతిగా ఉంటే కదా.. కూతురు పద్ధతిగా పెరగడానికి.. ఎమోషనల్ అయిన సిరి!

బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో గురించి, అలాగే ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు గొడవలతో రోజుకొక విధంగా మారుతోంది. బిగ్ బాస్ కార్యక్రమంలో తాజాగా హౌస్ మేట్స్ వారి జీవితంలో జరిగిన పలు ఎమోషనల్ విషయాల గురించి పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కంటెస్టెంట్ లో ఎమోషనల్ కూడా అయ్యారు.

మొదటగా తనే మాట్లాడుతూ ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, ఆ కష్టము ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ తన తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత జెస్సీ నాకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉందని, అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అమ్మాయి ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత ప్రియా మాట్లాడుతూ పెళ్లి అనంతరం యాక్టింగ్ మానేశాను, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఒక బాబు కూడా పుట్టాడు. కానీ లైఫ్ లో సెటిల్ కాలేదు అంటూ ప్రియా ఎమోషనల్ అయ్యింది. సిరి హనుమంతు మాట్లాడుతూ మా ఊరిలో తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు పద్ధతిగా ఉండడానికి అని చాలామంది అన్నారు అంటూ సిరి ఎమోషనల్ అయ్యింది. ఇక చివరిగా మా ఊరి వారికి మా బంధువులకు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను పద్ధతిగానే ఉంటున్నాను అంటూ సిరి సమాధానమిచ్చింది.

ఇక సిరి విషయానికి వస్తే ఈమె గురించి ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.

నా కూతురుని లారీ గుద్ది కాలు తీసేశారు. కొడుకు అలా చనిపోయాడు. ఫ్యామిలీని తలుచుకుంటూ కంటతడి పెట్టిన కోట!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల కాలం పాటు విలక్షణ నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వయసు పైబడటంతో సినిమా అవకాశాలు తగ్గడంతో పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికరమైన విషయాల తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

కోట శ్రీనివాసరావు పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు తన అత్తగారు మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న తన భార్య ఒక సైకియాట్రిక్ వ్యాధితో బాధ పడిందని, ఆ సమయంలో తను ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో తన ఉండేదని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సినిమాల పరంగా తనకు ఎంతో మంచి పేరును తీసుకువచ్చిన ఆ భగవంతుడు తనకు కష్టాలను కూడా అదే స్థాయిలో తీసుకువచ్చారని తెలిపారు.

ఈ క్రమంలోనే తన భార్య వింత వ్యాధితో బాధపడటం గురించి తెలియజేసిన కోట శ్రీనివాసరావు తన కూతురు కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కూతురు విజయవాడలో తన అక్కయ్య పిల్లలు అన్నయ్య పిల్లలతో కలిసి సరదాగా రిక్షాలో బయలుదేరి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఒక లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డివైడర్ దాటుకుని వీరు ప్రయాణిస్తున్న రిక్షాను ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు మరణించారు. దీని అదృష్టం బాగుండి కాలు విరిగిందని తెలిపారు.

ఇలా కాలు విరిగిన తన కూతుర్ని చూస్తూ రోజు బాధపడే వాడిని. అయితే నేను మొదట ఏ బ్యాంకులో అయితే గుమస్తాగా పని చేశానో ఆ బ్యాంక్ మేనేజర్ చివరికి నాకు వియ్యంకుడిగా మారారు. తన కొడుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తనకు ఒక కూతురు తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇకపోతే కోట శ్రీనివాస్ రావు కొడుకు గురించి మనకు తెలిసిందే. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కోట శ్రీనివాస్ రావు కొడుకు బండి పై ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ కి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నింటిని తలచుకుని కోట శ్రీనివాస్ రావు ఎమోషనల్ అయ్యారు. అయితే ఎన్ని బాధలు ఉన్న ఎప్పుడు కూడా తన బాధను బయట పంచుకోలేదని, వారు గుర్తొచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తాను తప్ప నా బాధను బయటకు చెప్పుకోనని తెలియజేశారు. ఇక మరో జన్మంటూ ఉంటే నటుడిగా జన్మించాలని కోరుకుంటారా అనే ప్రశ్న ఎదురు కాగా తనకు ఇలాంటి జీవితమే కావాలని.. అయితే ఈ కష్టాలను తగ్గించి పది మందికి సేవ చేసే గుణం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంటూ ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలియజేశారు.

మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చాడు.. ఎమోషనల్ అయిన బెనర్జీ

మా ఎన్నికలు ముగిసినా.. అందులో వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికలు జరిగే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. నిన్న జరిగిన విలేకురుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మా లో ప్రస్తుతం మంచి వాతావరణం లేదని.. మాతో వాళ్లు కలిసి పని చేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. తమకు ఎన్నికల్లో అన్యాయం జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరగిందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

రాత్రికి రాత్రే ఈసీ మెంబర్ల ఫలితాలు మారపోయాయని.. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా.. నటుడు బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నికలు జరిగే రోజున మోహన్ బాబు తనను అరగంట బూతులు తిట్టాడని.. దానికి తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాను సనీ పరిశ్రమలో ఉంటున్నానని.. తనను మోహన్ బాబు అలా బూతులు తిట్టడం.. అది అందరిముందు అనడం.. అవమానించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మా ఎన్నికలు పూర్తయి మూడు రోజులు అవుతున్నా మోహన్ బాబు మాట్లాడిన మాటలు తనకు ఇంకా బాధ కలిగిస్తున్నాయని.. ఆ రోజు మోహన్ బాబు తనను కొట్టడానికి కూడా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. విష్ణు, మనోజ్ ఆపడంతో ఆగాడని.. అలాంటి అసోసియేషన్ లో నాకు రక్షణ ఉంటుందా.. అలాంటి వాటిలో తాను ఎందుకు ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు బెనర్జీ.

సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున..ఎమ్మన్నారంటే..?

అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య పలు మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే వీళ్ళు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై సమంత పరోక్షంగా అన్ని రూమర్లే అంటూ చెప్పడంతో అభిమానులు కాస్త సంబరపడ్డారు. అయితే వీరిద్దరు త్వరలో పిల్లలకోసం ప్లాన్ చేస్తున్నారనే శుభవార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదనే చెప్పాలి.

తాజాగా సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం విన్న అభిమానులకు కాస్త మింగుడు పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే సమంత చైతన్య విడాకుల విషయంపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగతం.. అంతర్గత అని తెలియజేశారు. అయితే సమంత తన ఇంటిలో ఉన్నన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేదని, ఆ రోజులన్ని తనకు తీపిగుర్తులు గా ఉంటాయని, చైతు సమంత ఇద్దరూ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే వారిద్దరి ఎక్కడ ఉన్నా.. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాగార్జున తెలియజేశారు.

భావోద్వేగానికి గురైన నటరాజ్ మాస్టర్.. కన్నీళ్లు పెట్టుకున్న హౌస్ మేట్స్.. కారణం?

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ఒకరోజు ఒకరిపై ఒకరు యుద్దం ప్రకటించుకుంటూ అనకూడని మాటలతో అరుచుకుంటారు. మరొక రోజు ప్రేమ కురిపించుకుంటారు. ఎట్టకేలకు కెప్టెన్సీ టాస్క్, ప్రమేకథలతో గురువారం సరదాగా బిగ్ బాస్ సాగిపోయింది. అయితే శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించి మొదటి ప్రోమోలు మళ్లీ ఒకరిపై ఒకరు భగ్గుమన్నారు. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. అందులో వరెస్ట్ మరియు బెస్ట్ పెర్‌ఫార్మర్ ఎవరు అంటూ చిచ్చు పెట్టేశాడు.

ఇలా సాఫీగా సాగిపోతుండగా.. ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వారి మధ్య దూరాన్ని పెంచేస్తున్నాడు. ఎవరిపై వరెస్ట్ అని చెబితే ఎక్కడ ఎవరు ఫీల్ అవుతారో అని హౌస్ మేట్స్ భయపడిపోతున్నారు. ఈ సందర్భంగా నటరాజ్‌ తన మాటలతో శివతాండవం చేశారు. బెస్ట్ నాలెడ్జ్, సెన్స్ ఉండదు.. ఎలా ఆడాలి అంటూ కోపంతో ఊగిపోతాడు.

అతడు ఎవరి గురించి అన్నాడో తెలియదు కానీ.. రెండో ప్రోమో బిగ్ బాస్ విడుదల చేసి నటరాజ్ మాస్టర్ కు కన్నీళ్లు పెట్టించాడు. రెండో ప్రోమో చంటి పిల్లాడు ఏడ్చే శబ్దం వస్తుంది. అందరూ ఎవరు అంటూ.. ఒకరి మోహం ఒకరు చూసుకుంటారు. నటరాజ్ కు అప్పుడే అర్థం అయిపోతుంది.. అది తన గురించే అని.. తన కళ్ల వెంట నీళ్లు కారిపోతుండగా.. ప్రియాంక సింగ్ వచ్చి ఓదార్చుతుంది. తర్వాత సోఫాలో అందరూ కూర్చున్న తర్వాత ఆ బిగ్ స్క్రీన్ పై తన భార్య సీమంతంకు సంబంధించి వీడియో కనిపిస్తుంది.

దీంతో కాసేపు నటరాజ్ మాస్టార్ భావోద్వేగానికి గురవుతాడు. ‘‘నైట్ నువ్వు మాట్లాడితే బేబీ కదిలేది కదా.. ఇప్పుడు బిగ్ బాస్ లో నీ మాటలు వింటూ బేబీ డిష్యూం డిష్యూం అంటూ ఫైట్ చేస్తుంది’’ అంటూ చెప్పగానే నటరాజ్ మాస్టార్ వెళ్లి బిగ్ స్క్రీన్ పై ఉన్న తన భార్య ఫొటోకు ముద్దు పెట్టేస్తాడు.

పదవ తరగతిలోనే ప్రేమించి..ఇంటి నుంచి వెళ్లిపోయా అంటూ.. ఎమోషనల్ అయిన సిరి..

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం లవ్ స్టోరీలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన పస్ట్ లవ్ గురించి తెలియజేయాలి. ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి ప్రేమ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. ఈ క్రమంలోనే సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సిరి పదవ తరగతిలో ఉన్నప్పుడే తన ఒక అబ్బాయిని ప్రేమించానని అతని పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అని పిలిచేవారు. అతను మా ఇంటి ఎదురుగానే ఉండటం వల్ల మేమిద్దరం ప్రేమలో పడ్డామని అయితే నేను వేరే ఎవరితోనైనా మాట్లాడితే విష్ణు ఓర్చుకునే వాడుకాదు. ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికే ఇంట్లో సంబంధాలు కూడా చూస్తుండడంతో అతనిపై కోపంతో పెళ్లికి ఒప్పుకున్నాను.

తెల్లవారితే నిశ్చితార్థం అనగా విష్ణు ఆరోజు రాత్రి వచ్చి నా కాళ్ళ పై పడి తప్పు చేశాను నాకు నువ్వు కావాలి నన్ను క్షమించమని అడిగాడు. విష్ణు అంటే నాకు కూడా ఎంతో ఇష్టం ఇక తెల్లవారితే నిశ్చితార్థం చేసుకోవాలని ఆ రోజు రాత్రి విష్ణుతో కలిసి ఇల్లు వదిలి పారిపోయానని, ఆ తరువాత అమ్మ వాళ్లు నాతో మాట్లాడి నన్ను వెనక్కి తీసుకు వచ్చారని తెలిపింది.

ఈ విధంగా కొద్ది రోజులపాటు రిలేషన్ లో ఉన్న మేము తరచూ గొడవలు జరిగిన మా రిలేషన్ చాలా బాగుండేది. అయితే ఓ రోజు రాత్రి పడుకున్న తర్వాత తెలవారి 3 గంటలకు మెలుకువ వచ్చింది. లేసి కాసేపాగి మరి పడుకొని తిరిగి 8 గంటలకు నిద్ర లేచాను. అలా నిద్ర లేవగానే ఒక షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందని సిరి ఎమోషనల్ అయ్యింది. తెల్లవారుజామున 3 గంటలకు ఎప్పుడైతే మెలకువ వచ్చిందో సరిగ్గా ఆ సమయంలో విష్ణు రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలిసి సిరి కన్నీటి పర్యంతం అయ్యింది. తన మొదటి లవ్ గురించి చెప్పడంతో అది విన్న మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.

రోజా పడిన బాధలు మాటల్లో చెప్పలేనిది.. రెండో సంతానానికి ఆమె ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా?

సినీ నటి రోజా అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినీ పరిశ్రమలోనూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొంది తన సత్తా ఏంటో చూపించారు. తర్వాత సినిమాలకు దూరం అయి.. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒకప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం తీవ్ర దుర్భరంగా ఉందంటూ ఓ టీవీ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చింది.

సెల్వమణితో వివాహానికి ముందు ఆమెకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారట.. కానీ పెళ్లైన సంవత్సరం లోపే ఆమెకు అన్షు పుట్టింది. అయితే రెండో సంతానంకు ఆమె ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ఆమె గర్భం దాల్చిన ఐదు నెలలకు తీవ్ర రక్త స్రావం అయిందట. దీంతో ఎంతో భయపడిపోయి వైద్యులను సంప్రదించారు రోజా.

అప్పటికే ఒక సంతానం ఉన్న ఆమెకు ఇది రెండో సంతానం. రక్త స్రావం ఎక్కవ అవుతుండటంతో ఆమెకు అబార్షన్ చేయాలని చెప్పారట వైద్యులు. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. చివరకు డాక్టర్లు ఒక పరిష్కారం చెప్పారు. ప్రస్తుతం ఐదోనెల కాబట్టి.. ఆబిడ్డ బతకాలంటే ఏడు నెలలు వస్తే సరిపోతుంది. కావునా ఇప్పటి నుంచి రెండు నెలల అంటే.. ఏడో నెల వచ్చే వరకు కాళ్లు పైకి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. బిడ్డ బతికే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారట.

దానికి రోజా ఒప్పుకొని.. దాదాపు రెండు నెలలు ఆసుపత్రిలోనే ఉంటూ ఆమె వైద్యుల సలహా మేరకు పాటించిందట. తర్వాత ఆమెకు కొడుకు(కృష్ణ లోహిత్) పుట్టడాని చెప్పుకొచ్చారు. ఇలా ఆమె రెండో సంతానం కోసం ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.

ఉత్తేజ్ కు సతివియోగం.. పరామర్శించిన మెగస్టార్ చిరంజీవి.. కంటతడి పెట్టిన ప్రకాశ్ రాజ్

ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉత్తేజ్‌. అతడి ఇంట నేడు విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్నారు. ఉత్తేజ్ భార్య చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌తో పాటు పలువురు నటీనటులు.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మెగస్టార్ ను చూసిన వెంటనే ఉత్తేజ్ గుండెలవిసేలా విలపించాడు. మెగస్టార్ ను వాటేసుకొని బోరున విలపించాడు. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరు కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రకాశ్ రాజు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తేజ్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మెగస్టార్ మరియు అతడితో వచ్చిన పలువురు సినీ ప్రముఖులు వాళ్ల కుటుంబసభ్యులను ఓదార్చారు.

అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ లో కూడా చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పద్మావతి.. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.

మూడు సంవత్సరాలుగా వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నా..: ప్రియాంక సింగ్

గత కొన్ని నెలల నుంచి ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున రెట్టింపు ఉత్సాహంతో బిగ్ బాస్ వేదికపైకి ఒక్కొక్క కంటెస్టెంట్ కు స్వాగతం చెబుతూ వారితో ముచ్చటించి వారిని హౌస్ లోనికి పంపించారు. గత సీజన్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు.

ఒక్కసారిగా కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి వెళ్లడం తో బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సందడి నెలకొంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాత్రి పెద్ద ఎత్తున గురక పెడుతూ తోటివారికి నిద్రలేకుండా చేస్తున్న లోబో గురకను యాంకర్ రవి ఆపే ప్రయత్నం చేశారు.అలాగే మరికొందరు కంటెస్టెంట్ లు నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఇక బిగ్ బాస్ ప్రణామం అనే పాటతో కంటెస్టెంట్ లను నిద్రలేపి వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రియాంక సింగ్, కాజల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయట పెట్టారు. తను ట్రాన్స్ జెండర్ గా మారి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన తండ్రికి ఈ విషయం తెలియదని ఈ విషయంలో తన తండ్రిని మూడు సంవత్సరాలనుంచి మోసం చేస్తున్నానని, ప్రియాంక తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఒకరోజు తన తండ్రి మీసం గడ్డం ఏవి రా అని అడిగినప్పుడు లేడీ గెటప్ కోసం తీసేసాను అంటూ అపద్దం చెప్పానని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే కాజల్ తనని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. తను లింగ మార్పిడి చేయించుకున్న విషయాన్ని బిగ్ బాస్ వేదికగా తన తండ్రికి చెప్పినట్లు ప్రియాంక కాజల్ దగ్గర చెబుతూ ఎమోషనల్ అయింది.

రోజా జీవితంలో కష్టాలు.. చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న రోజా..!

నగిరి ఎమ్మెల్యే రోజా అటు బుల్లితెర జడ్జిగాను.. మరో వైపు బాధ్యాతయుత నాయకురాలిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా ఉన్నారు. అయితే ఈటీవీలో త్వరలో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో రోజా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఈ షో ద్వారా బయటపెట్టారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో ఊరిలో వినాయకుడు పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. తన పెళ్లికి ముందు ఎన్నో కష్టాలను అనుభించానని.. చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదట్లో తన జీవితంలో మొత్తం అప్పులు కట్టడానికి తన సంపాదన సరిపోయేదని.. ఆమె వాపోయింది.

1991 లో చిత్ర పరిశ్రమకు వచ్చానని.. 2000 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించినా.. 2002 వరకు తాను నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ ఎమోషనల్‌ అయ్యారు. పెళ్లికి ముందు ఆమెకు డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారట.. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసేకొని భావోద్వేగానికి గురయ్యారు.

కానీ పెళ్లి అయిన ఏడాదిలోపే తనకు ప్రెగ్నేన్సీ వచ్చిందంటూ.. చెప్పుకొచ్చింది. మొదట తనకు అన్షు పుట్టిందని.. అందుకే తనంటే చాలా ఇష్టమంటూ చెప్పారు. ఈ విషయాలను చెబుతున్న సమయంలో ఇద్రజ, రష్మీ కూడా కన్నీళ్లను పెట్టుకొని రోజాను ఓదార్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో రష్మీ, సుధీర్‌, రోజా, హైపర్‌ ఆది, వర్ష చేసిన సందడి ఆకట్టుకుంటోంది.