అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య పలు మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే వీళ్ళు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై సమంత పరోక్షంగా అన్ని రూమర్లే అంటూ చెప్పడంతో అభిమానులు కాస్త సంబరపడ్డారు. అయితే వీరిద్దరు త్వరలో పిల్లలకోసం ప్లాన్ చేస్తున్నారనే శుభవార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదనే చెప్పాలి.
తాజాగా సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం విన్న అభిమానులకు కాస్త మింగుడు పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే సమంత చైతన్య విడాకుల విషయంపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగతం.. అంతర్గత అని తెలియజేశారు. అయితే సమంత తన ఇంటిలో ఉన్నన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేదని, ఆ రోజులన్ని తనకు తీపిగుర్తులు గా ఉంటాయని, చైతు సమంత ఇద్దరూ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే వారిద్దరి ఎక్కడ ఉన్నా.. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాగార్జున తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…