Tag Archives: Godfather movie

Acharya Movie: ఆచార్య ఫ్లాప్.. సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చరణ్ ,చిరు.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

Acharya Movie:మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే కాకుండా ఆచార్య సినిమా గురించి కూడా మాట్లాడారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ విషయం గురించి ఎప్పుడు చిరంజీవి ప్రస్తావించిన కొరటాల ఖాతాలోకే వేసేవారు.తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతలకు 80% రెమ్యూనరేషన్ నేను చరణ్ తిరిగి వెనక్కి ఇచ్చామంటూ తెలియజేశారు.

Acharya Movie: సినిమా బాధ్యత మొత్తం మాదే…

మేము నటించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన ఆ సినిమా బాధ్యత మేమే తీసుకుంటామని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ 80% రిటర్న్ ఇచ్చినప్పటికీ కొరటాల ఈ సినిమా కోసం ఆస్తులను ఎందుకు అమ్ముకున్నారనే విషయంపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Anantha Sriram: గరిక వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవే… సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత శ్రీరామ్?

Anantha Sriram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ గేయ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అనంత శ్రీరామ్. ఈయన ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ చేసిన వాక్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

 

ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ…రామాయణంలో రాముడు, సీతాదేవిని గాయపర్చిన కాకిపైకి గరికెను బ్రహ్మాస్త్రంగా సంధిస్తాడు. రాముడు ఈ విధంగా ఆ గరికను పట్టుకోవడం వల్ల గరిక విలువ ఎంతో పెరిగింది కానీ తగ్గలేదు. గరిక ఈ విషయాన్ని వినయంతో ఒప్పుకోవాలి తప్ప అహంకారం ప్రదర్శించకూడదని అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా గరిక గురించి అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి చేశారంటూ మరో వాదన తెరపైకి వచ్చింది.ఈ విధంగా అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

Anantha Sriram: యాదృచ్చికంగా అనలేదు

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గరిక గురించి చేస్తున్న వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశాను అని చెప్పడం అబద్ధం అవుతుంది… ఉద్దేశపూర్వకంగానే తాను గరిక గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశానని ఆయన వెల్లడించారు.అయితే ఆయన గరిక గురించి చెప్పారా లేదా గరికపాటి గురించి ఈ వ్యాఖ్యలు చెప్పారా అనే విషయంపై ఇంటర్వ్యూ సందర్భంగా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఈయన పరోక్షంగానే గరికపాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Nayanathara: నయనతార రెమ్యూనరేషన్ విషయంలో అలా ప్రవర్తించారా.. అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్?

Nayanathara:నయనతార లేడీ సూపర్ స్టార్ గా గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. ఇలా చెల్లెలి పాత్రలో నటించిన నయనతార ఈ సినిమా కోసం ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి ఎన్వి ప్రసాద్ నయనతార గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవితో తాను ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను అయితే గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఆకల నెరవేరిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో నయనతార గురించి ఈయన మాట్లాడుతూ ఆమె.. చివరి రోజు షెడ్యూల్లో భాగంగా చెన్నై నుంచి వచ్చి కేవలం గంట వ్యవధిలోనే తన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని తెలిపారు.

Nayanathara: నయనతార క్రమశిక్షణ నాకు నచ్చింది..

ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిపోయినప్పటికీ తన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ ఉన్న తాను ఏమాత్రం రెమ్యూనరేషన్ గురించి అడగలేదని తను మాత్రమే కాకుండా తన టీం కూడా ఎవరు తన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ అడగలేదని ఈయన తెలిపారు. షూటింగ్ విషయంలో నయనతార ప్రవర్తన, క్రమశిక్షణ తనకు ఎంతో బాగా నచ్చాయని ఈ సందర్భంగా ఎన్ వి ప్రసాద్ నయనతార పై ప్రశంసల కురిపించారు. అయితే తర్వాత తామే నయనతారకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేశామని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకుంటున్నావా.. అనసూయ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇకపోతే అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవినీ జైలుకు పంపించే ఒక రిపోర్టర్ పాత్రలో నటించారు. ఈ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు గాడ్ ఫాదర్ సినిమాలో మంచి పాత్రలో నటించిన సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించారు.

ఇలా సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించగా అనసూయ చాలా సిల్లీ రీసన్ చెప్పారు. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని ఈమె సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఈమె చెప్పిన రీజన్ విన్నటువంటి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అనసూయని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మెగా ఫ్యాన్స్ నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Anasuya: మరోసారి ట్రోలింగ్ కి గురైన అనసూయ..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటున్నటువంటి అనసూయ ఇలాంటి మంచి పాత్రలు నటించినప్పుడు అలాగే స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పుడు ప్రమోషన్లలో పాల్గొంటే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్ విషయంలో మరోసారి ఈమెకు నెటిజెన్ల నుంచి చేదు అనుభవం తప్పలేదు.

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి తాజాగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు.గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన రోజే నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందిందని ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలియచేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలు వారి అభిమానుల గురించి కూడా మాట్లాడారు సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని తెలియజేశారు.తన సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టే వాడినని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలియజేశారు.

Chiranjeevi: ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా…

ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు కూడా చేశారు. అయితే నేనెప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi -Vishnu: మరోసారి మెగా కుటుంబంతో పోటీకి సై అంటున్న మంచు విష్ణు… ఎవరు ఊహించని డెసిషన్ తీసుకున్న మా ప్రెసిడెంట్!

Chiranjeevi -Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందనే విషయం మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య బహిరంగ మనస్పర్ధలు లేకపోయినా అంతర్గత మనస్పర్ధలు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే. గతంలో మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో మనకు తెలిసిందే.

మా అధ్యక్షత పదవికి మంచు విష్ణు పోటీ చేయగా మెగా ఫ్యామిలీ మద్దతుతో నటుడు ప్రకాష్ రాజు కూడా ఈ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇలా ఎన్నో విమర్శల నడుమ మా ఎన్నికల జరగడం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఏదో ఒక విషయంలో మంచు మెగా ఫ్యామిలీల మధ్య గొడవ జరుగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మా అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చారు.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా అదే రోజు విడుదల కావడంతో ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఇలా ఇద్దరు హీరోలు దసరా బరిలో దిగుతుండగా ఊహించని విధంగా వీరికి పోటీగా మంచు విష్ణు సైతం దసరా బరిలోకి పోటీ నిలిచారు.

Chiranjeevi -Vishnu: చిరంజీవికి పోటీగా మంచు విష్ణు జిన్నా విడుదల…

మంచు విష్ణు సూర్య అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నటించినటువంటి చిత్రం జిన్నా.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఒకసారిగా మెగా అభిమానులు షాక్ అయ్యారు.ఇలా ఒకేరోజు నాగార్జున చిరంజీవి విష్ణు సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందని పూర్తిగా అందరి సినిమాలపై ప్రభావం ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి మంచు విష్ణు ఊహించని విధంగా జిన్నా సినిమా విడుదల తేదీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.