Tag Archives: health tips

పరగడుపున మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే!

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయం. కానీ మొలకెత్తిన విత్తనాలు ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన విత్తనాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కానీ కొందరికి మాత్రమే పరగడుపున ఆ విత్తనాలను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారు. వేరుశెనగలు, పల్లీలు, పెసలు, సద్దులు వంటి వాటిని ఒకరోజు మొత్తం నానబెట్టుకుని రాత్రిపూట ఒక బట్టలో ఒకటి పెడితే ఉదయానికి మొలకలు వస్తాయి.

మొలకలు వచ్చిన విత్తనాలు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు, బీపీ వంటి సమస్యలు కంట్రోల్ చేయవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, వృద్ధులు వాటిని పరగడుపునే తినటం వల్ల వారికి అజీర్తి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు పచ్చివి తినటం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి నేరుగా వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువలన మొలకెత్తిన విత్తనాలను నీళ్లలో ఉడక పెట్టుకొని తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. మొలకెత్తిన గింజలను పచ్చిగా తినటం కంటే ఉడకబెట్టుకొని తినటం ఆరోగ్యానికి మంచిది.

డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. ప్రతిరోజు ఆహారంలో ఇవి తప్పనిసరిగా!

రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనం తినే ఆహారంలో కొన్ని ఔషధాలు గుణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి తినటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకొనే పసుపు, అల్లం మరియు ఉసిరి కాయలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ అందరికీ తెలిసిన విషయం. పసుపులో ఎన్నో యాంటీఆక్సిడెంట్, విటమిన్స్, ఐరన్ ఉంటాయి. పసుపు వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఉసిరికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయను పసుపుతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే జామకాయ తినడం కానీ లేదా జామ ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు.

అల్లం మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలలో ఒకటి అని చెప్పవచ్చు. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అప్పుడప్పుడు అల్లం వేసుకొని వండుకొని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది . డయాబెటిస్ తో బాధపడేవారు పాలలో కొంచెం పసుపు లేదా అల్లం కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

చెప్పులు లేకుండా నడుస్తున్నారా..అయితే ఈ ప్రయోజనాలు మీ సొంతం..!

ప్రస్తుత కాలంలో ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పులు వేసుకొని నడవటం బాగా అలవాటైపోయింది. చెప్పులు వేసుకొని నడవడం వల్ల మన పాదాలకు రక్షణ ఇవ్వటమే
కాకుండా కొంత అందాన్ని కూడా తెచ్చి పెడతాయి. కానీ పూర్వకాలంలో చాలామంది చెప్పులు వేసుకోకుండా నడిచేవారు. ప్రస్తుత కాలంలో కొందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.కానీ ప్రతి రోజూ ఒక ఐదు నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం..

చెప్పులు వేసుకోకుండా కొద్దిసేపు నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో నిపుణులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల మన పాదాలలోని కండరాలకు కదలిక వచ్చి పాదాలు నొప్పులు లేకుండా మన పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పాదాలలోని చిన్నా పెద్ద కండరాలకు న్యూరల్ కనెక్షన్ ఉండటం వల్ల కొద్దిసేపు చెప్పులు లేకుండా నడిస్తే కండరాలు స్థిరంగా ఉంటాయి.

చెప్పులు లేకుండా నడిస్తే పాదాలలోని కండరాలు కదిలే మన శరీర భంగిమ మరియు నడక స్థిరంగా ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచేవారు శరీరాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలరు. రోడ్డుమీద, మట్టి మీద పాదాలతో నడవటం వల్ల పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరిగి పాదాలు గట్టిపడతాయి.

అలాగే చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడవడం వల్ల వారికి డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే పిల్లలు చెప్పుల్లేకుండా అడగటం మట్టిలో ఆటలాడుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది.

ఈ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..జాగ్రత్త సుమీ!

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం. నిజానికి కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

వేసవికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ మరియు శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం.

జలుబు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉండే చలవ వల్ల జలుబు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.కొబ్బరి నీళ్లలో బీపీని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు మందులు వాడుతూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లో-బిపి పెరిగే ప్రమాదం ఉంది. కావున బిపి ఉన్న వాళ్ళు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు.

కడుపులో ఏదైనా సమస్యలు ఉన్న వారు కానీ, లేక ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ కొబ్బరి నీళ్లు తాగకూడదు . ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుని సలహా తప్పనిసరి. పొట్ట ఉబ్బరం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.

పచ్చి బఠాణీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వదలరు!

బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే మీరు క్రమం తప్పకుండా బఠాణీలను తింటారు. బఠానీలు రుచి ఉండటం మాత్రమే కాకుండా బఠాణి లలో ఉండే అనేక పోషకాల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలిగా అనిపించదు. పచ్చిబఠాణీలను ఉడకబెట్టికొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సన్నబడాలనుకుంటున్న వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
బఠానీలలో ప్రోటీన్ ఫైబర్, ఐరన్ మరియు ఏ ,కె, సి మొదలగు విటమిన్స్ ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది . విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బఠాణీలు తినడం వల్ల మధుమేహ సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

బఠాణీలు గ్లైసిమిక్ ఎక్కువ కలిగి ఉంటాయి. అందువలన డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠాణీలను తీసుకోవాలి. పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైబర్ వంటి యాంటీ న్యూట్రీయన్లు ఉంటాయి.
పచ్చి బఠానీలలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బఠానీలు తినటం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు. పచ్చి బఠానీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ?

మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజుకి 6 నుండి 7 లీటర్ల నీరు త్రాగటం వల్ల మన శరీరం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆ నీటిని మనం ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.

ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ మన అందరి జీవితాలలో రోజువారి పనులలో తప్పక వాడవలసి వస్తున్నది. ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని త్రాగటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల కలిగి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం…

ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి తరచూ నీటిని త్రాగటం లేదా ఇతర ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు .ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీటిని త్రాగటం ద్వారా ఆ బాటిల్ కు సూర్య కిరణాలు తాకటం వల్ల ఆ వేడికి ఒక రకమైన టాక్సిన్ బాటిల్ నుండి విడుదలవుతుంది. ఆ ఆ నీటిని త్రాగటం ద్వారా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీరు త్రాగటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి డయాబెటిస్,ఒబిసిటీ,
సంతాన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చిన్నారులు అతి చిన్న వయసులోనే ఋతుస్రావ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే అని చెప్పవచ్చు.

చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

నిమ్మరసం ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిన విషయమే కానీ నిమ్మరసం కేవలం వేసవి కాలంలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చలికాలంలో తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయనే ఒక అపోహ ఉంది. కానీ చలికాలంలో కూడా నిమ్మరసం ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మరసం ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి వల్ల మన శరీరంలోని అధిక బరువును అదుపులో ఉంచవచ్చు. నిమ్మరసాన్ని ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల స్థూలకాయంతో బాధపడేవారు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

నిమ్మరసం తీసుకోవడం వల్ల జ్వరం మరియు వైరల్ ఫీవర్ వంటి లక్షణాలకు చెక్ పెట్టవచ్చు.చలి కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు మరియు సీజనల్ వ్యాధుల నుండి నిమ్మరసం మనల్ని కాపాడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్- సి వల్ల అది యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి మనకు రోగాల నుండి విముక్తి లభిస్తుంది.

చలికాలంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు ఇతర చర్మ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు .ముఖ్యంగా చలికాలంలో చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. విటమిన్-సి వల్ల అదే యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలోని మలినాలను శుభ్రం చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

తరచూ దాహం వేస్తుందా.. అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే?

మనిషి శరీరంలో 80 శాతం నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగా పని చేయాలి అంటే సరైన మోతాదులో నీటిని తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే చాలామంది నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంత మంది రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉంటారు. అయితే నీటిని తక్కువ తీసుకున్నా అనేక సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే మనలో చాలామంది దాహం లేకుండా కూడా నీళ్లు తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం…

మధుమేహం : ప్రస్తుత జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. దీనికి గల ముఖ్య కారణం రక్తంలో చక్కెర శాతం పెరగడం. అందువల్ల ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో సరిపడా నీరు లేకపోతే కూడా మూత్రపిండాలు సరిగా పని చేయవు.

అజీర్ణం : మనం ఎక్కువగా కారం ఉన్న పదార్థాలను తినడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. ఈ క్రమంలోనే నీటి కొరత ఏర్పడి అధిక దాహానికి కారణమవుతుంది.

విపరీతంగా చెమటలు : శరీరం నుంచి ఎక్కువగా చెమట విడుదల ఉన్నప్పుడు శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి శరీరం ఎక్కువ నీటిని కోరుతుంది.

ఆందోళన : ఈ ఆందోళన కారణంగా నోరు ఎండిపోవడమే కాకుండా వ్యక్తి ఎక్కువగా నీరు కూడా తాగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో కొన్ని ఎంజైములు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. అధికంగా దాహం వేస్తుంది .

చలికాలంలో ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది.ఎలాంటి ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణం అయిపోతుంది.అయితే ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అజీర్తి సమస్యలు చలికాలంలో ఎక్కువగా కలగవు.ఎలాంటి ఆహరం తిన్నా కూడా త్వరగా జీర్ణం అయి పోవడమె కాకుండా చాలా రకాల ఆహార పదార్థాల మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది.

అలాగే చలి కాలంలో పదే పదే ఆకలి కూడా వేస్తుంది. అయితే అసలు ఎందుకు ఆకలి చలికాలంలో ఎక్కువగా వేస్తుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.చలికాలంలో టెంపరేచర్ అవసరం కాబట్టి ఒళ్ళు వేడిగా మారడానికి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. ఎనర్జీని సప్లై చేయడానికి మెటబాలిక్ రేటు పెరుగుతుంది.

దీంతో ఆకలి బాగా పెరుగుతుంది. అందుకనే చలి కాలంలో ఎక్కువ ఆహారం తీసుకుంటాము.అలాగే ఎక్కువ ఆహరం తీసుకోవడం వల్ల బరువు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే బరువు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా ఉంటుంది.

పైగా ఫైబర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. రాగి, ఓట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి.అలానే క్యారెట్లు, కమలాలు, పాలకూర, మెంతులు, బీట్రూట్ వంటి వాటిని డైట్లో ఎక్కువగా తీసుకోండి. ఇవి అజీర్తి సమస్యలు రాకుండా చూసుకుంటాయి. ఇలా పాటిస్తే ఒబిసిటీ కూడా రాదు.వేడి నీళ్లు తాగడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. అలానే జలుబు, ఫ్లూ వంటివి ఉండవు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది.

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి..!

మానవ శరీరంలో ప్రతీ ఒక్క అవయవం ఆరోగ్యకరంగా ఉంటేనే మానవుడు బతుకుతాడు. లేదంటే.. చావు అంచుల్లోకి వెళ్లాల్సిందే. తర్వాత ఆసుపత్రుల వెంట తిరిగినా ఉపయోగం లేకుండా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంటుందన్న విషయం తెలిసిందే.

అయితే దానిని అనారోగ్యానికి గురి కాకుండా మనం ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అందులో ముఖ్యంగా బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే.. ఆయుర్వేదంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తారు.

ఇది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. రెండోది చేప. చేపలు ప్రతీ ఒక్కరూ తినొచ్చు. దీనిలో ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఆపిల్ పండు తీసుకోవడం కూడా చాలామంచిది. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు చేసే పని సామార్థ్యం అధికంగా పెరుగుతుంది.

ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరో పండు బీట్ రూట్. ఇది ఎక్కువగా రక్తం పెరగడానికి.. రక్తహీనత అధికంగా ఉండే వారు తీసుకుంటారు. వాటితో పాటు వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక చివరకు భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే వెల్లులి. దీనిలో అల్లిసిన్ ఉంటుంది. దీని వల్ల ఉబ్బసం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.