Tag Archives: hyderabad

Mahesh Babu: హైదరాబాద్లో మహేష్ బాబు రెస్టారెంట్ ఒకరోజు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే థియేటర్ బిజినెస్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెస్టారెంట్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

00

ఏషియన్ నమ్రత ప్యాలెస్ హైలెట్స్ అనే పేరుతో బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే మహేష్ బాబు రెస్టారెంట్ అని మనం ఈ రెస్టారెంట్ కి వెళ్లి కనుక టిఫిన్ చేసాము అంటే మన జోబి కాలీ కావాల్సిందే. అంత రిచ్ గా ఈ హోటల్ నడుస్తుంది. ఒక కప్పు కాఫీ తాగాలన్న వందల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఒక ప్లేట్ ఇడ్లీ తినాలి అంటే 500 రూపాయల వరకు ఖర్చు చేయాలి.

ఇలా ఈ రెస్టారెంట్లో ప్రతిదీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. ఇలా ఈ రెస్టారెంట్లో ఎక్కువ ధరలు అయినప్పటికీ ఎంతోమంది ప్రతి రోజు ఈ రెస్టారెంట్ కు వెళ్లి వాళ్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా నమ్రత మహేష్ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ రెస్టారెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

లక్షల్లో బిజినెస్…


ఈ రెస్టారెంట్ ఒకరోజులో భారీగానే బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఒక్క రోజుకు ఈ రెస్టారెంట్లో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతుందంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా రోజుకు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ డబ్బుతో ఒక సాధారణ వ్యక్తి తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Manchu Lakshmi: హైదరాబాద్లో నన్ను చూస్తే లేచి నిలబడతారు… వైరల్ అవుతున్న మంచు లక్ష్మి కామెంట్స్!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మంచు లక్ష్మి ఇండస్ట్రీలో ఒక నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ వదిలి ముంబై మకాం మార్చారు.

ఇలా ముంబై వెళ్లినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా సినిమా అవకాశాలను అందుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముంబైలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ముంబైలో నేను ప్రతి ఒక్కరికి తనని తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

హైదరాబాద్లో అయితే నన్ను చూస్తే లేచి నిలబడతారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపించగా మరికొందరు మాత్రం మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా…

మరి ముంబై వెళ్ళినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా అవకాశాలు అందుకొని సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మంచు హీరోల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మంచు మనోజ్ వాటిది ఫిష్ అనే సినిమాతో పాటు మరోవైపు టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మంచు విష్ణు సినిమాలో విషయానికి వస్తే ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం న్యూజిలాండ్ లో షూటింగ్ పనులు జరుపుకుంటున్నారు.

Rashmika: వామ్మో రష్మికలో ఈ టాలెంట్ చూశారా… ఏకంగా అన్ని భాషలలో మాట్లాడగలరా?

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం వరుస భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక వివిధ భాష చిత్రాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా రష్మిక తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అందుకే తనకు సోషల్ మీడియాలో ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు ఏమాత్రం విరామం దొరికిన సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు ఎన్ని భాషలలో మాట్లాడగలరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతాను ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ సమాధానం తెలియజేశారు అదే విధంగా తాను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలను నమస్తే బాగున్నారా అంటూ పలకరిస్తానని ఈమె తెలియజేశారు.

Rashmika: ఆరు భాషలలో మాట్లాడగలను…


ఇలా ఈమె ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు తన వృత్తి అంటే చాలా దానిని తాను ఎంతో ప్రేమిస్తున్నానని రష్మిక తెలిపారు. ఇకపోతే తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ తనకు కొరియన్ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా తనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Singer Mangli: ప్రమాదానికి గురైన సింగర్ మంగ్లీ… సాంగ్ చిత్రీకరణలో ప్రమాదం?

Singer Mangli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలను పాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రవేట్ సాంగ్స్ పాడుతూ ఆ పాటలకు వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

మంగ్లీ పాడిన పాటలకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈమెకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. దీంతో ఈమెకు సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశాలు వచ్చాయి.ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంగ్లీ అనంతరం తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ భాషలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా పాటలు పాడుతూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇక ఏదైనా పండుగ వచ్చిందంటే ప్రతి ఏడాది మంగ్లీ తప్పకుండా ఆ పండుగ గురించి పాట పాడి ఆ పాటకు వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో బోనాలు పండుగ రావడంతో ఈమె బోనాల పండుగ కోసం ఒక పాటను పాడి ఈ పాటకు వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఈమెకి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Singer Mangli: ప్రమాదంలో కాలికి గాయం…


ఇలా ఈ ప్రమాదంలో మంగ్లీ కాలికి గాయం తగిలిందని అయితే వెంటనే వైద్యుని సంప్రదించగా పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదని,కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు ఈమె తొందరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు.

Mrunal Thakur: హైదరాబాదులో ఇల్లు కొన్న మృణాల్… అడ్రస్ చెబుతారా అంటూ స్పందించిన నటి!

Mrunal Thakur: బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ సీరియల్ నటిగా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందిన ఈమె తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇలా మొదటి సినిమాతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు పెద్ద ఎత్తున తెలుగులో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇలా వరుస తెలుగు సినిమాలలో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈమె తరచూ షూటింగ్లో నిమిత్తం హైదరాబాద్ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ హోటల్లో ఉండలేక స్వయంగా హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పైన నటి మృణాల్ స్పందించారు.

Mrunal Thakur: నేను నా ఇంటిని చూస్తాను…


ఈ సందర్భంగా తాను హైదరాబాద్ లో ఇల్లు కొన్నాననే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన ఈమె నా ఇంటి అడ్రస్ నాకు కాస్త చెబుతారా నేను కూడా నా ఇంటిని చూస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇలా ఈమె కామెంట్ చేశారు అంటే ఇల్లు కొన్నట్టు వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోతుంది. ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇల్లు కొనాలని ఎవరికైతే ఉండదు అంటూ కూడా ఈమె చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఈమె హైదరాబాదులో ఇల్లు కొనాలనే ఆలోచనలో కూడా ఉందని తెలుస్తోంది.

Tik tak: టిక్ టాక్ దుర్గారావు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారో తెలుసా?

Tik tak: టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి టిక్ టాక్ ఎంతో మందిని సెలబ్రెటీలుగా మార్చిందని చెప్పాలి. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినటువంటి వారిలో దుర్గారావు దంపతులు ఒకరు.

టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈ దంపతులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే వీరికి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా బుల్లితెర అవకాశాలు అలాగే వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వీరి చేసినటువంటి నాది నక్కలీసి గొలుసు అనే పాట ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి దుర్గారావు దంపతులకు పలు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే ప్రస్తుతం వీరికి అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి. కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో వీరికి అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక హైదరాబాద్లో స్థిరపడినటువంటి దుర్గారావు దంపతులు తిరిగి వారి సొంతూరికి వెళ్లిపోయారని తెలుస్తుంది.

Tik tak: వ్యవసాయ పనులలో బిజీ…

ఈ క్రమంలోనే సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తామని దుర్గారావు దంపతులు తెలియజేస్తున్నారు. ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా నెలకు సుమారు30000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది.

Chaitanya Master: చైతన్య చనిపోవటానికీ అప్పులు కాకుండా ఏదో కారణం ఉంది: చైతన్య మేనమామ

Chaitanya Master: ఢీ ఫేమ్ చైతన్య మాస్టర్ తాజాగా ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఢీ షో ద్వారా డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య చాలా కాలంగా డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడనీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నెల్లూరులోనే ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చైతన్య మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన కెరీర్ కోసం, కుటుంబం కోసం చైతన్య మాస్టర్ అప్పులు చేశాడని, అయితే అప్పులు తీర్చే స్తోమత లేక మరణించాడని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైతన్య ఆత్మహత్య గురించి తాజాగా ఆయన మేనమామ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చైతన్య మరణానికి అప్పులు కారణం కాదని, మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.

లక్షల్లో అప్పు చేసే అవసరం చైతన్యకు లేదని తాను చిన్నప్పటినుండే హైదరాబాదులో ఉంటున్నాడని చైతన్య మేనమామ వెల్లడించాడు. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బు మీద అతన్ని కుటుంబం ఆధారపడలేదని, చైతన్యకి అవసరమైనప్పుడు అతని కుటుంబ సభ్యులే డబ్బు పంపేవారని ఆయన తెలిపాడు..అంతేకాకుండా ఇటీవల చైతన్య చెల్లి పెళ్లి కోసం కూడా ఒక రూపాయి ఇవ్వలేదని కుటుంబ సభ్యులే పెళ్లి భారాన్ని భరించారని ఆయన తెలిపాడు.

Chaitanya Master: పేమెంట్ ఆగిపోవడమే…


ఒకవేళ అప్పులు ఉన్న వేళల్లోనే కానీ లక్షల్లో అప్పులు చేసే అవసరం చైతన్యకి లేదని చైతన్య మేనమామ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చైతన్య మాస్టర్ మరణం గురించి తోటి డాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ ఇటీవల ఒక ఈవెంట్ ఒప్పుకున్నాడని అయితే కొంతమంది డాన్సర్లు అతనికి హ్యాండ్ ఇవ్వటంతో దాదాపు లక్షల్లో పేమెంట్ ఆపేసారని , అందువల్ల చైతన్య మాస్టర్ బయట అప్పు చేసి డాన్సర్లకు ఇచ్చినట్లు తెలుపుతున్నారు.

Lavanya Tripathi: అనాధ ఆశ్రమంలో లావణ్య త్రిపాఠి… ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు..?

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది.

తాజాగా లావణ్య త్రిపాఠి అనాధ పిల్లలకు సహాయం చేసి మంచి మనసు చాటుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ సంపాదించిన దానిలో కొంత భాగం చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా తాను సంపాదించిన దానిలో కొంతవరకు సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ తన మంచి మనసు చాటుకుంటుంది.

తాజాగా హైదరాబాద్ లోనే ఒక అనాధ ఆశ్రమంకి వెళ్లిన లావణ్య త్రిపాఠి అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపింది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది లావణ్య.
ఆ తర్వాత అనాధలైన విద్యార్థులకు తన వంతు సహాయం చేసి, ఆ తర్వాత విద్యార్థులకు భోజనం వడ్డించి తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi: వెబ్ సిరీస్లలో బిజీగా..

ఆ ఫోటోలు వైరల్ కావడంతో కొంతమంది అభిమానులు లావణ్య మంచి మనసు గురించి గొప్పగా చెబుతూ ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్ సినిమాల తర్వాత ఈ అమ్మడికి సరైన హిట్ లభించలేదు. అయినప్పటికీ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Actress Hema: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి హేమ… వారిపై ఫిర్యాదు చేసిన నటి!

Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నటి హేమ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పలువురుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె ఎవరిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

గత కొద్ది రోజుల క్రితం హేమ తన పెళ్లి రోజును జరుపుకున్నారు. ఇలా తన పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ దంపతులు స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Actress Hema: యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసిన నటి…

ఇలా తమ పరువు తీసినటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ లపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది తమ ఛానల్ కు మంచి ఆదరణ రావాలన్న ఉద్దేశంతో ఇలా విభిన్నమైన థంబ్ నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సదురు చానల్ పై చర్యలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు.

M M Sreelekha: ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లయిన సొంత ఇల్లు లేదు…. ఇప్పటికీ అదే ఇంట్లోనే ఉంటున్నా: ఎం ఎం శ్రీలేఖ

M M Sreelekha: ఎం ఎం శ్రీలేఖ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీలేఖ కీరవాణి చెల్లెలు అన్న విషయం మనకు తెలిసిందే. ఇలా అన్నయ్య బాటలోనే సంగీత దర్శకురాలిగా ఈమె ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన పాతిక సంవత్సరాలలో దాదాపు ఐదు భాషలలో 80 సినిమాలకు సంగీతం అందించారు.

ఈ విధంగా ఎం ఎం శ్రీలేఖ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల 17 నుంచి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 దేశాల్లో 25 మంది సింగర్లతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే ఈ వేడుకను పురస్కరించుకొని హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొని శ్రీలేఖ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ శ్రీలేఖకు చిన్నప్పుడు నేను చూపించిన ఒక్క ఆశ వల్ల తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు ఈ స్థాయిలో ఉందని తెలిపారు.ప్రస్తుతం తన అన్నయ్య కీరవాణి ఆస్కార్ రేసులో ఉన్నారు అలాగే శ్రీ లేక కూడా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

M M Sreelekha: ఆస్తులు కూడా పెట్టలేదు.. అభిమానాన్ని సంపాదించుకున్న…


ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లేక కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పాతిక సంవత్సరాలయింది. ఇలా పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇప్పటికి తనకు హైదరాబాద్ లోక సొంత ఇల్లు కూడా లేదని అద్దె ఇంట్లోనే ఉంటున్నానని ఈమె తెలిపారు.తాను గడిచిన పాతిక సంవత్సరాలలో పెద్దగా ఆస్తులు కూడుబెట్టుకోలేకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాను అంటూ ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.