Tag Archives: hyderabad

Allu Arjun: త్వరలోనే ప్రారంభం కానున్న ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్… దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Allu Arjun: సాధారణంగా సినిమా హీరోలు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపార రంగంలో స్థిరపడి వ్యాపారాల ద్వారా కూడా మంచిగా సంపాదిస్తూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన హీరోలు చేసే వ్యాపారాల విషయానికి వస్తే హీరోలుగా సక్సెస్ అయినటువంటి వారు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తూ ఉండగా మరి కొందరు మాత్రం థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ క్రమంలోనే పలువురు హీరోలు థియేటర్లను నిర్మిస్తూ ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే ఏషియన్స్ వారు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్స్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో ఇది నెంబర్ వన్ మల్టీప్లెక్స్ థియేటర్ గా పేరు సంపాదించుకుంది ఇలా ఏషియన్స్ వారు ఇదివరకే మహేష్ బాబుతో కలిసి థియేటర్ నిర్మించగా తాజాగా వీరు అల్లు అర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఏసియస్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ కోసం ఇప్పటికే పనులు ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్లో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మల్టీప్లెక్స్ గురించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

Allu Arjun: ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా బన్నీ..

మరికొన్ని నెలలలో ప్రారంభం కానున్నటువంటి ఈ మల్టీప్లెక్స్ లో విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ వర్చువల్ ఇమేజ్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ ఇమేజ్ ముందు మనం ఎలా అయితే నిలబడి రియాక్షన్స్ ఇస్తామో అదేవిధంగా అల్లు అర్జున్ ఇమేజ్ నుంచి కూడా అలాంటి రియాక్షన్ వస్తుందని తెలుస్తోంది.ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ కనుక ఏర్పాటు చేస్తే అలాంటి మొదటి ఘనత అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ ఉంటారని చెప్పాలి.

Abdullapurmet: నవీన్ హత్య కేసులో భారీ ట్విస్ట్.. నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన నిందితుడి తల్లిదండ్రులు!

Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ క్రైమ్ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి నవీన్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. తన స్నేహితుడు హరిహర తనని నమ్మించి దారుణంగా తనని హత్య చేయడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారింది. అయితే నిందితుడు హరిహర తల్లిదండ్రులు తాజాగా ఈ విషయంపై స్పందించారు.

హరిహరకృష్ణ కుటుంబ నేపథ్యానికి వస్తే.. వీరి స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్‌. తండ్రి పేరాల ప్రభాకర్‌.. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా.. తల్లి గృహిణి. ఇక ప్రభాకర్ స్థానికంగా క్లినిక్ నడుపుతున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా అమ్మాయికి పెళ్లి చేశారు ఇంకొక అబ్బాయి హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కొడుకు నైనా సక్రమంగా పెంచుకోవాలని గత 14 సంవత్సరాలుగా తనని హైదరాబాదులో ఉండి చదివిస్తున్నారు.

తన అక్క ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పగా స్నేహితులతో కలిసి ఒక రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నామని చెప్పారు. అయితే శివరాత్రి రోజు తన కుమారుడు వరంగల్ వచ్చారని అప్పుడు తనకు ఎన్నో ఫోన్ కాల్స్ రావడంతో చాలా ఆందోళనగా కనిపించారని తెలిపారు. ఏమైంది అని అడగ్గా ఏమీ లేదని చెప్పారు. అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికే నవీన్ మిస్సింగ్ అని తెలియడంతో కాస్త కంగారు పడ్డాము.

Abdullapurmet: అమ్మాయిని కూడా విచారించాలి..


కుమారుడు ఈనెల 23వ తేదీ వరంగల్ వచ్చారని ఏమైందని నిలదీస్తే తాను నవీన్ ను హత్య చేసి చంపానని ఒప్పుకున్నట్లు తన తండ్రి తెలిపారు.చేసిన తప్పును తాము మందలించి పోలీసులకు లొంగిపోవాలని చెప్పడంతో తాను హైదరాబాద్ వచ్చి పోలీసులకు లొంగిపోయారని హరిహర తండ్రి ప్రభాకర్ తెలిపారు. అయితే నవీన్ ను తన కుమారుడు దారుణంగా చంపినందుకు ప్రభాకర్ నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేశారు.ఇలా పెద్ద కుమారుడు హత్య కేసులో నిందితుడిగా మారి అవమానంతో ఉరి వేసుకొని చనిపోగా రెండవ కుమారుడు కూడా ఇలా హత్య కేసులో నిందితుడుగా మారి జైలు పాలు కావడంతో హరిహర తల్లిదండ్రులు కన్నీటి పర్యంతరం అవుతున్నారు.

Ram Charan: అమెరికాలో రామ్ చరణ్ బాడీగార్డ్ ను చూశారా… అతని హైట్ చూసి ఆశ్చర్యపోతున్న నేటిజన్స్!

Ram Charan: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా వారు బయటకు ఎక్కడికి వెళ్లినా వారిని సంరక్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియాలో వారి చుట్టూ కనిపించే సెక్యూరిటీ అక్కడ కనిపించదు.

ఇలా కొన్ని దేశాలకు సెలబ్రిటీలు కనుక వెళ్తే అక్కడ ప్రభుత్వం వారికి స్పెషల్ సెక్యూరిటీని కల్పిస్తుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు.ఈ విధంగా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రామ్ చరణ్ కు ఇండియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ కాకుండా అక్కడ ప్రభుత్వం ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే రాంచరణ్ హైదరాబాద్ లో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు రాంచరణ్ కారు దిగి బయటకు వచ్చారు. అయితే రామ్ చరణ్ కారు డోర్ తీసి ఆయనకు సెక్యూరిటీ కల్పించిన వ్యక్తి మాత్రం ప్రస్తుతం హైలైట్ అయ్యారు.

Ram Charan:ఇంతెత్తు ఉన్నాడేంటి….

రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చూడటానికి చాలా హైట్ వెయిట్ ఉండడంతో ఈయన పర్సనాలిటీ చూసినటువంటి నెటిజెన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఈయన ఏంటి ఇంత హైట్ ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ramgopal Varma: హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి వీధి కుక్కలను తోలాలి… సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ!

Ramgopal Varma: హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన అందరిని ఎంతగానో కలిచి వేస్తోంది. ప్రదీప్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడమే కాకుండా ఈ దాడిలో చిన్నారి మరణించడంతో ఒక్కసారిగా నగరం మొత్తం ఉలిక్కిపడింది.ఇలా ఈ చిన్నారి మరణించడంతో పలువురు ఈ ఘటన పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ ఘటనపై వ్యవహరించిన తీరు పట్ల సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూ మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేశారు.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ గతంలో విజయలక్ష్మి కుక్కలకు కుడి చేతితో అన్నం తిని పెడుతూ తాను ఎడమ చేతితో తింటున్నటువంటి వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేస్తూ మేయర్ గారికి కుక్కలు అంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఇలా వీధిలో కుక్కలన్నింటినీ తన ఇంటికి పంపించాలని వీటికి ఆమె అన్నం పెడితే అవి మన పిల్లలను తినవు అంటూ కామెంట్ చేశారు. అలాగే మరొక ట్వీట్ చేస్తూ… కుక్కలపై మేయర్ గారికి ఇంత ప్రేమ ఉంది కనుక నగరంలో ఉన్నటువంటి ఐదు లక్షల కుక్కలను తన ఇంటికి పంపించి మధ్యలో తనని కూర్చోబెడితే బాగుంటుంది అంటూ మరొక ట్వీట్ చేశారు.


Ramgopal Varma:నాకు మహిళలు అంటే ఎంతో గౌరవం…

ఇలా మేయర్ గురించి వర్మ చేసినటువంటి ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన మరొక వీడియోని షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి ఐదువేల వీధి కుక్కలను పంపించాలి. ఇలా వీధి కుక్కలను విడిచి పెడితే ఆమె వాటిపై ఎంత ప్రేమ చూపిస్తారో చూడాలని ఈయన చెప్పుకొచ్చారు. ఈ వీడియో చివరిలో వర్మ మాట్లాడుతూ తనకు మహిళలంటే చాలా గౌరవం కానీ ఇప్పుడు మీ మీద అసలు గౌరవం లేదు అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://telugudesk.net/wp-content/uploads/2023/02/whatsapp-video-2023-02-24-at-65524-am.mp4

Tarakaratna: సోమవారం హైదరాబాదులో తారకరత్న అంత్యక్రియలు… హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం!

Tarakaratna: నందమూరి తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఇలా గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతోనే ఈయన మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిందని తద్వారా ఈయన గత 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఈయన శరీరం వైద్యానికి సహకరించలేదని నిపుణులు వెల్లడించారు. ఇలా ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరిగినప్పటికీ చివరికి ఈయనని ప్రాణాలతో కాపాడుకోలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈయన ఫిబ్రవరి 18వ తేదీ శ్వాస విడిచారు. ఇలా నందమూరి తారకరత్న మృతి చెందారని వార్త ఇటు నందమూరి అభిమానులలో కుటుంబ సభ్యులలో జీర్ణించుకోలేని విషయంగా మారింది. తారకరత్న మరణించడంతో ఈయన పార్థివ దేహం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది.మొదటగా ఈయన పార్థివదేహాన్ని మోకిలలో ఉన్నటువంటి తన సొంత నివాసానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు.

Tarakaratna: మహాప్రస్థానంలో అంత్యక్రియలు…


ఇలా అభిమానుల సందర్శనాంతరం సోమవారం ఈయన అంతిమయాత్ర మొదలవుతుంది.సోమవారం సాయంత్రం హైదరాబాదులోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇక తారకరత్న మరణించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పై స్పందిస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Kiraak RP: హైదరాబాద్ లోనే కాదు.. అమెరికాలో కూడా ఆర్పీ చేపల పులుసు… అసలు విషయం చెప్పేసిన ఆర్పీ !

Kiraak RP: ప్రస్తుతం ఎక్కడ చూసినా కిరాక్ ఆర్పీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది. ఇందుకు గల కారణం ఈయన గత కొద్దిరోజులుగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చే ఆ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శల ద్వారా వార్తల్లో నిలిచిన అనంతరం ఏ బుల్లితెర కార్యక్రమాలలోనూ పాల్గొనకుండా ఏకంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఈయన వివిధ రకాల చేపలు పులుసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా ఆర్పీచేపల పులుసుకు అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి డిమాండ్ రావడంతో ఈయన రెస్టారెంట్ ముందు కస్టమర్లు క్యూ కట్టారు. అయితే కష్టమర్లకు సరిపడా ఫుడ్ ప్రిపేర్ చేయలేకపోతున్న నేపథ్యంలో ఈయన కొంత కాలం పాటు రెస్టారెంట్ మూసివేసి అనంతరం తిరిగి ఓపెన్ చేశారు.

ఈ విధంగా ఈయన రెస్టారెంట్ ఎంతో సక్సెస్ అవుతుండగా కొందరు పనిగట్టుకుని తన రెస్టారెంట్ పై కుట్ర పడుతున్నారని కావాలనే నెగిటివ్ గా రివ్యూ ఇస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ తన బిజినెస్ ఎంతో సక్సెస్ అయిందని తనని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా అదిరే అభి ఓవర్సీస్ లో కూడా మీరు చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు.

Kiraak RP: మ్యాన్ పవర్ కావాలి..


ఈ ప్రశ్నకు ఆర్పీ సమాధానం చెబుతూ తన చేపల పులుసు రెస్టారెంట్ హైదరాబాదులోనే కాకుండా అమెరికాలో కూడా ఏర్పాటు చేయబోతున్నానని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి తన చేపలు పులుసు రుచి చూపించబోతున్నానని తెలిపారు.అయితే అందుకు కాస్త సమయం పడుతుంది. నాకు ఇందులో మరింత అనుభవం మ్యాన్ పవర్ కూడా కావాలని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తాను అంటూ ఆర్ పి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Vani Jayaram: వాణి జయరాంకు హైదరాబాద్ తో వీడదీయరానిబంధం ఉందని మీకు తెలుసా?

Vani Jayaram: ఎన్నో భాషలలో,వేల సినిమాలలో సుమారు 20 వేలకు పైగా పాటలను పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న లెజెండరీ సింగర్ వాణీ జయరాం మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈమె చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలా వాణి జయరాం మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఈమె మృతి పై స్పందిస్తూ తనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె గురించి పలు విషయాలు కూడా బయటకు వస్తున్నాయి.సింగర్ గా ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె మద్రాస్ లోనే ఎస్బిఐ బ్యాంకులో పనిచేసేవారు అనంతరం తను హైదరాబాద్ కోటిలోని ఎస్బిఐ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు.తన సోదరుడు హైదరాబాదులోనే పనిచేస్తుండడంతో ఈమె కూడా ఇక్కడే విధులు నిర్వహించారు.

ఇక జయరాంతో తన వివాహం సికింద్రాబాద్ లోనే జరిగింది.ఈ క్రమంలోనే ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హైదరాబాద్ తో తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుబంధం గురించి తెలియజేశారు. నా మనసులో హైదరాబాద్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాకు జన్మజన్మల అనుబంధం ఉంటుందనిపిస్తుంది.

Vani Jayaram: హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం…

తన అసలు పేరు కలైవాణి. ఇక్కడ జయరాం అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తాను వాణి జయరామ్ గా మారిపోయానని తెలిపారు. అయితే తన భర్త ఉద్యోగ నిమిత్తం తనతో పాటు కలిసి ఈమె ముంబై వెళ్ళిపోయారు. ఇక తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత పీబీ శ్రీనివాస్ అవార్డు, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, సత్కారాలన్నీ హైదరాబాద్‌లోనే అందుకున్నాను అంటూ హైదరాబాద్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పుకు వచ్చారు.

K. Viswanath: చివరి క్షణాల వరకు కళామతల్లి ఒడిలోనే గడిపిన విశ్వనాథ్… ఆయన మరణించే క్షణాల ముందు ఏం జరిగిందో తెలుసా?

K. Viswanath: గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు నెలలలో ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు దిగ్గజ నటీనటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గతవారం లెజెండరీ యాక్టర్స్ జమున మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె మరణ వార్త నుంచి బయటపడక ముందే టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు కన్నుమూశారు.

ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆఖరి శ్వాస వదిలారు. అయితే ఈయన చనిపోయే క్షణాల ముందు వరకు కూడా కళామతల్లికి సేవలు చేస్తూ కన్నుమూశారు.గురువారం రాత్రి ఈయన పాటలు రాస్తూ ఉన్నారు. అయితే ఉన్నఫలంగా ఈయనకు అనారోగ్యం చేయడంతో ఆ పాటను పూర్తి చేయమని తన కొడుకుకు చెప్పారు. ఇలా తన కుమారుడు పాట పూర్తి చేస్తుండగానే ఈయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇలా విశ్వనాధ్ గారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఇలా ఐదు దశాబ్దాలుగా తెలుగు కళామతల్లికి సేవలు అందించిన విశ్వనాథ్ గారు చివరి క్షణాలలో కూడా కళామతల్లికి సేవలు చేస్తూనే తుది శ్వాస విడిచారు.

K. Viswanath: బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు..

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశ్వనాధ్ గారి మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ తరలివచ్చి ఈయనకు నివాళులు అర్పించారు. ఇక నేడు హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఈయన అంత్యక్రియలను బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. ఈయన అంత్యక్రియలలో సినీ సెలబ్రిటీలపాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

Sreemukhi: కొత్తింట్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి… వైరల్ అవుతున్న ఫోటోలు!

Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె మరోవైపు వెండితెరపై కూడా సినిమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా శ్రీముఖి సందడి చేస్తున్నారు.

ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఈమె నూతన గృహప్రవేశం చేస్తున్నట్టు తెలుస్తుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.కొత్త ఇంట్లో తన తల్లితో కలిసి పాలు పొంగిస్తున్నటువంటి ఫోటోలతో పాటు తన సోదరుడు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను శ్రీముఖి షేర్ చేశారు. శ్రీముఖి స్నేహితులను ఎవరిని ఆహ్వానించకుండా కేవలం కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.

Sreemukhi: వైరల్ అవుతున్న శ్రీముఖి కొత్త ఇంటి ఫోటోలు…

ఇలా తన కుటుంబ సభ్యులు మొత్తం పసుపు రంగు దుస్తులను ధరించి గృహప్రవేశ కార్యక్రమాలను పూర్తి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది శ్రీముఖికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Gunasekhar Son In Law: గుణశేఖర్ అల్లుడు ఎవరు… తన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Gunasekhar Son In Law: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పౌరాణిక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గుణశేఖర్ తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే గుణశేఖర్ ఈ సినిమా ద్వారా తన కుమార్తె నీలిమ గుణను కూడా ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నీలిమ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ప్రఖ్య అనే వ్యక్తిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 31 నిమిషానికి ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాదులోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుణశేఖర్ అల్లుడు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి నేటిజన్స్ అరా తీస్తున్నారు.

Gunasekhar Son In Law:వందల కోట్ల ఆస్తి కలిగిన రవి ప్రఖ్య…

గుణశేఖర్ అల్లుడు రవి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యా, పారిశ్రామిక వ్యాపారవేత్త. ఇక శ్రీ శక్తి అధినేత డాక్టర్ రామకృష్ణ శ్రీ సత్య దంపతుల కుమారుడు. ఇలా రవి ప్రఖ్యా ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిగా వందల కోట్లకు ఆస్తిపరుడని చెప్పాలి.ఇక రవి కూడా పలు బిజినెస్ లను చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విషయం తెలిసిన నేటిజన్స్ మొత్తానికి గుణశేఖర్ అల్లుడు బాగా సౌండ్ పార్టీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.