Tag Archives: hyper adi

Thamannah: టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్న… అసలేమన్నారో తెలుసా?

Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడటం వల్ల ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం తమన్న ఎంతో బిజీగా మారిపోయారు.

తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది చేసిన ఇంటర్వ్యూలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆది తమన్నాను ప్రశ్నిస్తూ…టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు. అయితే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోలతో కలిసి సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తమన్న టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ చిరంజీవి చాలా యూనిక్, అల్లు అర్జున్ స్టైలిష్ పర్సన్.

Thamannah: టాలీవుడ్ హీరోలపై తమన్న ప్రశంసలు..


మహేష్ బాబు చాలా అందగాడు, ఎన్టీఆర్ ఆల్ రౌండర్. పవన్ కళ్యాణ్ వెరీ మాస్ హీరో,ప్రభాస్ అందరి డార్లింగ్ అంటూ ఈమె టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమన్నా ఇలా అందరి హీరోల సరసన సందడి చేశారు.ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

Anchor Rashmi: హైపర్ ఆది చేసిన పనికి వేదికపై కంటతడి పెట్టుకున్న రష్మీ.. అసలు ఏం జరిగిందంటే?

Anchor Rashmi: నటిగా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై అవకాశాలను అందుకునే పలు సినిమాలలో కూడా నటిస్తూ రష్మీ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే రష్మీ బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ ఈమెకు కమెడియన్ సుధీర్ తో ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి వార్తలు వచ్చేవి అయితే ప్రస్తుతం సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ సుదీర్ రష్మిల రిలేషన్ గురించి ప్రస్తావనకు తీసుకురావడం గమనార్హం.అయితే త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రానున్న నేపథ్యంలో మరోసారి రష్మీ సుధీర్ గురించి ఆది ప్రస్తావనకు తీసుకువచ్చారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చెప్పు బుజ్జి కన్నా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చివర్లో హైపర్ ఆది FLAMES ఆడారు.

Anchor Rashmi: సుధీర్ ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ…

ముందుగా వర్ష ఇమ్మానియేల్ ఇద్దరి పేర్లను ఫ్లేమ్స్ చేయగా మ్యారేజ్ అని వచ్చింది అనంతరం హైపర్ ఆది రష్మీ సుధీర్ పేర్లను రాస్తూ ఫ్లేమ్స్ చేయబోతూ ఉండగా వెంటనే రష్మీ తన చేతిలో ఉన్న పేపర్ లాక్కొని చింపేయడమే కాకుండా అక్కడే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ ను గుర్తు చేసుకుంటూ రష్మీ కంటతడి పెట్టుకుందని పలువురు భావిస్తున్నారు.

Sri Reddy: ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు .అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎవరిని టార్గెట్ చేసిన లేదా ఎలాంటి వీడియో చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ అతనిని బండబూతులు తిడుతూ ఫైర్ అయ్యింది. ఇంతకీ శ్రీ రెడ్డి హైపర్ ఆది పై ఫైర్ అవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ పరోక్షంగా ఇతరులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎంతో కించపరుస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో వైసిపి పార్టీ పై కూడా తన పంచు డైలాగులు ఉపయోగిస్తూ ఉంటారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజా గారితో మంచి అనుబంధం ఉండడంతో రోజా పిలుపుమేరకు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు.ఈ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పటికీ హైపర్ ఆది మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు. దీంతో శ్రీ రెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేశారు.

Sri Reddy: సిగ్గు లేని ఎదవ…


ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు హైపర్ ఆది తన కుక్క బుద్ధి చూపించుకున్నారు. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా తాను సిద్ధమేనని నిరూపించుకున్నాడు.. నీకు ఇష్టం లేకపోతే రాకుండా ఉండాలి అంటూ రెచ్చిపోయింది. డబ్బులు ఇస్తే ఇష్టం లేకపోయినా వస్తావా అని ప్రశ్నించారు. ఆదిగాడికి మన పార్టీ గాలి పడదు… వాడు ఆకులో ఈకగాడు.. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత..ఆది రాకపోతే జగనన్న బర్తడే ఆగిపోతుందా… సిగ్గులేని ఎదవ అంటూ బండు బూతులు తిట్టేశారు.ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Josh Ravi: జబర్దస్త్ వాళ్లతో ఫోటోలు అడిగితే హీరోల మాదిరిగా బిల్డప్ ఇస్తారు… హైపర్ ఆది అలా మెసేజ్ చేసేవాడు: జోష్ రవి

Josh Ravi: సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుని నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ జబర్దస్త్ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.

ప్రస్తుతం జోష్ రవి జబర్దస్త్ నుంచి విడిపోయారు. పలు సినిమాలలో అవకాశాలు రావడంతోనే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. కాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డానని అయితే తనకు బాగా పరిచయమున్న దర్శకులు నిర్మాతలు కారణంగా తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు.

ఇకపోతే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న తనకు ఏ దర్శకుడితో ఏ విధమైనటువంటి విభేదాలు లేవని, ఒక షార్ట్ తీసేటప్పుడు ఎన్నిసార్లు టేక్ లు తీసుకుంటారని అడిగిన డైరెక్టర్ ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు అంటూ రవి వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది తనుపెద్ద సెలబ్రిటీ అని భావిస్తుంటారు. ఇకపోతే మా ఊరికి కనుక వెళ్తే ఊరు మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి, తనపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారని వెల్లడించారు.

జబర్దస్త్ లో వాళ్లంటే ఇష్టం..


ఇక బయట మేము కనుక కనబడితే పెద్ద ఎత్తున ఫోటోలు కోసం ఎగపడతారని జోష్ రవి వెల్లడించారు. ఇక జబర్దస్త్ వాళ్ళతో ఫోటోలు కోసం వెళితే వాళ్లు పెద్ద హీరోలంటూ బిల్డప్ ఇస్తారు. అయితే అది ఆ క్షణం వరకు మాత్రమే.. ఆ తర్వాత తిరిగి మనం ఏంటో మనకు తెలుసు కనుక హీరో అనే ఊహ నుంచి బయటకు రావాలని ఆయన వెల్లడించారు.ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటానని జబర్దస్త్ వారితో తనకు మంచి అనుబంధం ఉందని జోష్ రవి తెలిపారు. ఇక జబర్దస్త్ లో తాను సుడిగాలి సుధీర్ హైపర్ ఆదికి ఫేవరెట్ అని తెలిపిన జోష్ రవి వారి స్కిట్లు కనుక బాగా ఉంటే నేను చాలా అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేస్తాను. వాళ్లు కూడా నాకు నీ పర్ఫామెన్స్ బాగుంది, సినిమాలు బాగున్నాయని మెసేజ్ చేస్తారని, హైపర్ ఆది ఎప్పుడు కూడా ఇలాగే మెసేజ్ చేస్తారని ఈ సందర్భంగా జోష్ రవి తెలిపారు.