Tag Archives: indraja

Rashmi: రాత్రికి వస్తావా అంటూ రశ్మిని అవమానించిన కమెడియన్… ఇంద్రజ రియాక్షన్ ఇదే?

Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ పట్ల స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ రష్మీ పట్ల చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా రష్మీ వద్దకు వెళ్లి ఈ రాత్రికి వస్తావా అంటూ తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ మాట్లాడారు. అసలు నేనెందుకు రావాలి రాత్రికి అంటూ రష్మీ అనడంతో రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా అంటూ తెగ సిగ్గు పడిపోయారు. ఇలా రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి జడ్జ్ ఇంద్రజ స్పందించారు.

Rashmi: రాంప్రసాద్ పై సీరియస్ అయిన ఇంద్రజ…


రశ్మిని ఇలా అడుగుతూ రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా వెంటనే ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో రాంప్రసాద్ ఒక్కసారిగా ఉలికి పడుతూ మా ఊర్లో జాతరుంది అందుకే పిలిచామండి అంటూ కవర్ చేసుకుంటారు.అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మీరు మీ చెత్త డబుల్ మీనింగ్ డైలాగులు ఇకపై మీరు మారరా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Rashmi: తన పై పడిన ఆ స్టాంప్ కారణంగానే సినిమా అవకాశాలు రాలేదు…. సినిమా అవకాశాలపై ఓపెన్ అయిన రష్మీ!

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా చేసిన వారందరూ కూడా వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రశ్మి సైతం పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈమెకు వెండితెరపై ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా వెండితెరపై రష్మికి సరైన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి గుర్తింపు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మీ మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలతో కలిసి ఓపెన్ హార్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మి పలువురు సెలబ్రిటీలను అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇంద్రజ సైతం రశ్మిని ప్రశ్నిస్తూ టెలివిజన్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మి వెండితెరపై ఎందుకు రాణించలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే రాత్రికి రాత్రికి నా పాత్రలు మారిపోతున్నాయని తెలియజేశారు.

Anchor Rashmi: రాత్రికి రాత్రి పాత్రలు మారిపోతున్నాయి…


సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు వీళ్ళే చేయగలరు అనే స్టాంప్ ఉంది కొందరు తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు చెల్లెలు పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు సెకండ్ హీరోయిన్గా మాత్రమే పరిమితం అనే స్టాంపు ఉంది. అయితే తనపై కూడా అలాంటి స్టాంప్ పడిన కారణంగా మంచి పాత్రలలో నటించే అవకాశం రాలేదని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Indraja: వామ్మో… కీర్తి సురేష్ పాటకి మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన ఇంద్రజ..వీడియో వైరల్..?

Indraja: నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పాటల కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాలోని పాటలే వినిపిస్తున్నాయి.ముఖ్యంగా చమ్కీల అంగిలేసి అనే పాటకి సెలబ్రిటీలు సైతం రీల్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పెళ్లి కూతురిగా చీరలో కీర్తి వేసిన మాస్ డ్యాన్స్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కీర్తీ చేసిన ఈ మాస్ డాన్స్ ని రీల్స్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఇంద్రజ కూడా ఆ మాస్ బీట్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో ఇంద్రజ తన జడ్జిమెంట్ తో పాటు అప్పుడప్పుడు డాన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్తా వంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. కొంతకాలం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించి తన పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.

Indraja:మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న ఇంద్రజ…

తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక ఈ షోలో దసరా సినిమాలోని కీర్తి సురేష్ చేసిన ఆ మాస్ స్టెప్పులను తనదైన శైలిలో వేసి ఇంద్రజ రచ్చ చేసింది. ఈ ప్రోమోలో ఇంద్రజ చేసిన మాస్ డాన్స్ హైలెట్గా నిలిచింది. ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జీ తో ఇంద్రజ వేసిన మాస్ స్టెప్పులు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ కి ఏ మాత్రం తీసిపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Indraja: జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ…మీ ఓవరాక్షన్ ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!

Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఎప్పటిలాగే తమ అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వెంకీరమేష్ నేను మంచోడిన నేను మంచోడినా అంటూ తన తండ్రి కృష్ణ భగవాన్ వద్దకు వెళ్లి అడగడంతో మీ ఇద్దరి కన్నా నేను మంచోడిని అంటూ పంచ్ వేశాడు.మీ ఇద్దరు ఎలాంటి వారో తెలిసి కూడా మీకు స్కిట్ చేసే అవకాశం ఇచ్చాను అని చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు. అనంతరం వెంకీ మాట్లాడుతూ మీ బాధ చూడలేక మీకోసం ఒక పని మనిషిని తీసుకు వచ్చానని చెప్పడంతో వెంటనే కృష్ణ భగవాన్ ఏది రమ్మని చెప్పు అనగా ఒక అమ్మాయి రావడం తనతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ సెటైర్లు వేయడం చేశారు.

ఇలా అంతా బాగా ఉన్నప్పటికీ ఈ స్కిట్ కు ఇంద్రజ మార్పులు ఇస్తూ 9 మాత్రమే ఇచ్చారు. అందుకు వెంకి మాట్లాడుతూ పది ఇవ్వచ్చు కదా మేడం అని అడిగారు.పది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని అడగలేదు అంటూ ఇంద్రజ చెప్పగా అప్పుడు బాగా చేశామని వెంకీ చెప్పారు.ఇప్పుడు అంతకన్నా కాస్త తక్కువగా చేశారు కనుక తొమ్మిది ఇచ్చాను కృష్ణ భగవాన్ గారు కూడా తొమ్మిదో ఇచ్చారు మరి ఆయనని అడగండి అంటూ అక్కడి నుంచి ఆమె లేచి వెళ్ళిపోయారు.

Indraja: రేటింగ్స్ కోసం ఓవరాక్షన్ అవసరమా…

ఇలా ఈ ప్రోమోలో ఇంద్రజ వెంకీ టీం తో గొడవపడి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో చూసిన నేటిజన్స్ దారుణంగా ఇంద్రజ పై ట్రోల్ చేస్తున్నారు. అమ్మ ఇంద్రజ ఇకనైనా మీ ఓవరాక్షన్ ఆపండి.ప్రతివారం విడుదల చేసే ప్రోమోలో మీరు సీట్లో నుంచి వెళ్లిపోవడం మమ్మల్ని ఎదవల్ని చేయడం. రేటింగ్ కోసం ఈ ట్రిక్స్ ఇకనైనా మానుకోండి చూడలేక చస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Actress Indraja: ఇక నన్ను అడగాల్సిన అవసరం ఏంటి… సౌమ్య రావు పై సీరియస్ అయిన ఇంద్రజ!

Actress Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎందరికో జీవితాన్ని అందించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సౌమ్య రావు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండగా ఇంద్రజ కమెడియన్ కృష్ణ భగవాన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే వచ్చేవారం శ్రీరామనవమి పురస్కరించుకొని ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇంద్రజ సౌమ్యరావు పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో ఏం జరిగిందనే విషయానికి వస్తే…రాఘవ, తాగుబోతు రమేశ్-వెంకీ టీమ్స్ వేర్వేరుగా పానకం తయారు చేశారు.

ఇలా తయారుచేసిన పానకాన్ని టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పాలని సౌమ్య రావు అడిగారు దీంతో ఇంద్రజ టెస్ట్ చేసి తనకు రాఘవ తయారు చేసిన పానకం నచ్చిందని తెలిపారు.మరోసారి రమేష్ వెంకీ టీం తయారు చేసినది కూడా చూసి చెప్పాలని సౌమ్యరావు అడగగా తనకు రాఘవ తయారు చేసినదే బాగుందని తెలిపారు. అయితే సౌమ్యరావు అంతటితో ఆగకుండా అక్కడున్న వారందరికీ టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పమని అడిగారు.

Actress Indraja: ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు…


ఇలా అడిగేసరికి ఇంద్రజ ఇలా అందరి ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను ఎందుకు అడిగావు.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఇంద్రజ సౌమ్యరావు పై సీరియస్ అయ్యారు. ఇక రాఘవ సైతం స్టేజ్ నుంచి బయటకు వెళ్లినట్లు చూపించారు. అయితే ఇదంతా నిజంగానే జరిగిందా లేకపోతే ఎపిసోడ్ పై హైప్ పెంచడం కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే విషయం మాత్రం తెలియడం లేదు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

కే.ఆర్. విజయ గారే ట్రైన్ లో వస్తానంటే ఇంద్రజకి ఫ్లైట్ కావాలట.. ఆమె కంటే గొప్పా.. : డైరెక్టర్ సాగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా, ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ సాగర్ గారికి ఉందని చెప్పవచ్చు. ఈయన కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సాగర్ మూడు సార్లు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే సాగర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా మౌళి క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం జగదేకవీరుడు. ఈ సినిమాలో ఎంతోమంది పేరున్న నటీ నటులు నటించారు.

ఈ క్రమంలోనే సాగర్ ఈ చిత్రంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ చిత్రంలో కె ఆర్ విజయ గారు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఎక్కువ భాగం మైసూరు, అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. కెఆర్ విజయ గారికి సొంతంగా ఫ్లైట్స్ ఉన్నప్పటికీ ఆమె బెంగళూరు ఫ్లైట్ లో వచ్చి బెంగళూరు నుంచి కారులో మద్రాసుకు రావడం ఇబ్బందిగా ఉందని, ట్రైన్లో వస్తానని చెప్పారు. విజయ గారు ఈ విధంగా చెప్పడంతో కె.ఆర్.విజయతో పాటు ఇంద్రజకి కూడా ట్రైన్ లో రమ్మని చెప్పాను.

ఈ క్రమంలోనే ఇంద్రజ మేనేజర్ దగ్గరికి వెళ్లి తనకు ట్రైన్ పడదని వాంతులవుతాయని చెప్పారు. ఇదే విషయం డైరెక్టర్ సాగర్ వద్దకు వెళ్తే.. ఇప్పటివరకు తాను ట్రైన్ లో వాంతులు అవుతాయన్న విషయం గురించి వినలేదు సరే ఇంద్రజ గారికి ఫ్లైట్ లో రమ్మనండి అని చెప్పారు. అయితే సెట్ లో ఉన్న అందరికీ సాగర్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇంద్రజతో ఎవరు మాట్లాడకూడదు.ఏదైనా అవసరం వస్తే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పండి అంటూ అందరికీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పానని ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ చెప్పినట్లు సెట్ లో మూడు రోజులు ఎవరు ఇంద్రజతో మాట్లాడకపోవడంతో సరాసరి డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఏడ్చినట్లు డైరెక్టర్ తెలిపారు.అలా ఇంద్రజ ఏడవడంతో నువ్వు ట్రైన్లో జర్నీ చేస్తేనే వాంతులు చేసుకుంటావమ్మ, ఏడిస్తే కూడా వాంతులు చేసుకుంటావేమో ఏడవద్దు అంటూ ఇంద్రజకు చెప్పినట్లు ఈ సందర్భంగా ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన డైరెక్టర్ సాగర్ తెలిపారు.

Indraja: రోజా జబర్దస్త్ తిరిగి జబర్దాస్ట్ కి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ !

Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమౌతున్న ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా ప్రస్తుతం వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?

జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఈ ఏడాది మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమాన్ని వదిలి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు. అయితే తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రోజా గురించి ఇంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?

తాను రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుడిని ప్రార్థించడమే కాకుండా, రోజా ఈ కార్యక్రమానికి తిరిగి వస్తే తాను తప్పుకుంటానని తెలిపారు. అయితే తాను ఈ విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు. రోజా గత తొమ్మిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఒక లెగసీ క్రియేట్ చేశారు. తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి రావాలనుకున్న తాను తన స్థానాన్ని తనకు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఇంద్రజ తెలిపారు.

రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వెళ్తా…

నేను ఈ విషయాన్ని ఏ వేదిక పైనైనా చెబుతాను ఇంద్రజ నేను జబర్దస్త్ కార్యక్రమానికి వస్తున్నాను అని రోజా తనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు నేను రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

Indraja: నటి ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి, జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఇంద్రజ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ వీడియో ద్వారా ఇంద్రజను ప్రశ్నిస్తూ.. మీ జీవితంలో క్రిటికల్ సిచువేషన్ ఏది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ 1998 లో ఇంద్రజ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అదే సమయంలోనే తన తల్లికి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.చేతిలో రూపాయి కూడా లేదు అమ్మకు సర్జరీ ఎలా చేయాలో దిక్కు తెలియడం లేదనీ ఇంద్రజ తెలిపారు.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీలో ఇచ్చిన రెండు చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఆ సమయంలో నా నగలని తాకట్టు పెట్టి అలా ఏదో చేసి అమ్మకు ఆపరేషన్ చేయించాము. అలా అమ్మను బ్రతికించు ఉన్నామని అయితే ప్రస్తుతం తన తల్లి తనకు దూరం అయ్యారని ఇంద్రజ తన కన్నీటి కష్టాలను కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

మనీ సెకండరీ

తన జీవితంలో చాలా క్రిటికల్ సిచువేషన్ అదేనని అప్పటి నుంచి తన లైఫ్ లో మనీ అనేది సెకండరీగా మారిపోయిందని ఈమె వెల్లడించారు. నాకు ఈ సిచువేషన్ ఎదురైన తర్వాత ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు అందుకే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే తన దగ్గర డబ్బు ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

అందరూ చూస్తుండగానే హైపర్ ఆదిపై ప్రియమణి పంచ్.. నెట్టింట్లో వైరల్?

జబర్దస్త్ కామెడీ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. హైపర్ ఆది వేసే పంచ్ డైలాగ్స్ కు ఎవరైనా సరే కడుపుబ్బ నవ్వాల్సిందే.అలాంటి హైపర్ ఆదిని ఓ ఆట ఆడుకుంది సినీ నటి, హీరోయిన్ ప్రియమణి. ఓవైపు హాట్ కామెంట్ చేస్తూనే మరోవైపు ఆది గాలి తీసేసింది. అంతే కాదు ఈ అంశంలోకి రోజా, ఇంద్రజలను కూడా లాగేసింది ప్రియమణి.

అసలు విషయం ఏంటంటే.. దీపావళి పండగ సందర్బంగా మల్లెమాల సంస్థ ఒక ప్రత్యేక ఈవెంట్ చేసింది.ఈ ప్రోగ్రామ్ కోసం జబర్దస్త్ కంటెస్టెంట్స్ అందరితో స్కిట్స్ చేయించారు నిర్వాహకులు. తగ్గేదే లే అని ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కు పేరు కూడా పెట్టారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రోమో విడుదల చేయగా అందులో జబర్దస్త్ జడ్జ్ రోజా, ఇంద్రజ, ప్రియమణి సందడి చేశారు.

ఈ ముగ్గురు డ్యాన్స్ లతో హోరెత్తించారు. ఈ క్రమంలో హైపర్ ఆదితో రోజా, ఇంద్రజ, ప్రియమణి వేసిన ఓ స్కిట్ అందరిని ఆకట్టుకునేలా ఉంది.ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లోని స్కిట్ లో సినిమా డైరెక్టర్ అవతారమెత్తిన హైపర్ ఆది ఐదుగురు హీరోయిన్లతో సినిమా ప్లాన్ చేస్తాడు. ప్రియమణి ఎంట్రీ ఇవ్వగానే తనలోని రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టిన హైపర్ ఆది, సెట్లోకి రాగానే డైరెక్టర్ గారికి ఓ హగ్ ఇచ్చే ఆ రెస్పెక్ట్ తెలియదా మీకు అని చిరు కోపం ప్రదర్శించాడు.

ఆది అలా అడిగే సరికి మొహం అదోలా పెట్టిన ప్రియమణి, అదిరిపోయే పంచ్ డైలాగ్ విసిరింది. రోజా, ఇంద్రజలను ఉద్దేశిస్తూ ఆల్రెడీ మా అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారా అని ఆదిని అడిగింది. ప్రియమణి అలా అడిగే సరికి రోజా, ఇంద్రజ ఒక్కసారిగా షాకైపోయారు. వాళ్లిద్దరు కూడా హీరోయిన్సే అని హైపర్ ఆది చెప్పడంతో, ముందే చెప్పలేదు కదరా బొకడా అని ప్రియమణి కామెంట్ చేసింది. ఇంకేముంది ప్రియమణి అంత మాట అనేసరికి ఆదితో సహా అంతా అవాక్కయ్యారు.

నటి ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ కొన్నేళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉంది.ఈ మధ్య కాలంలో అల్లుడు అదుర్స్, సాఫ్ట్ వేర్ సుధీర్, హ్యాపీ వెడ్డింగ్ ఇలాంటి సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో జడ్జీగా వ్యవరిస్తోంది. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.

అయితే ఇంద్రజ అసలు పేరు ఇంద్రజ కాదట. సినిమాలలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం తన పేరు ఇంద్రజ గా మార్చుకుందట. ఈమె అలీ ఇలాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య మోహన్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే కాకుండా కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

ఈమె తెలుగు తమిళం మలయాళం ఇలా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 50 సినిమాలకు పైగా నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తూ అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పోలీసులకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఇంద్రజ నటి అయినప్పటికీ సింగర్ కూడా కావడం గమనార్హం.

ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అదే విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రజ 1978లో చెన్నైలో జన్మించింది. ఈమె తన 15 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇక తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈమె నటించింది. అక్కడ కూడా ఈమెను ఒరిజనల్ పేరు కాకుండా ఇంద్రజ అనే పిలిచేవారు.