Tag Archives: Interview

K. Viswanath: విశ్వనాథ్ వారసులు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి అదే కారణమా?

K. Viswanath: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా వారసత్వం కొనసాగడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో ఈ వారసత్వం మరికాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి.ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కే విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకులు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈయనకు ముగ్గురు వారసులు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నప్పటికీ ఈయన ముగ్గురు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. ఈ విధంగా విశ్వనాథ్ వారసులు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాలను ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

ఈ క్రమంలోనే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశ్వనాథ్ గారికి ఇదే ప్రశ్న ఎదురయింది.మీ పిల్లలను ఎందుకు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అనే ప్రశ్న ఎదురవడంతో ఈ ప్రశ్నకు విశ్వనాథ్ గారు సమాధానం చెబుతూ ఇండస్ట్రీలో నేను సక్సెస్ అయిన విధంగా తన పిల్లలు సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు లేదు అందుకే వారిని బాగా చదివించి ఇతర రంగాలలో స్థిరపడేలా చేశానని తెలిపారు.

K. Viswanath: సొంత డబ్బు పెట్టి నేను సినిమాలు చేయలేను…


నా పిల్లలను ఇండస్ట్రీలోకి రావాలని నేను ఎప్పుడు ప్రోత్సహించలేదని అయితే ఇక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని తెలిపారు. మా రోజుల్లో పరిస్థితులు వేరేగా ఉండేది. అప్పుడు ప్రతిభను గుర్తించే మనుషులు చాలా మంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ.. పేరు ప్రఖ్యాతల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్నివేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను ఇక తన పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గౌరవం మర్యాదలన్నీ వాళ్లకు చెందాలని లేదు ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్లే ప్రూఫ్ చేసుకోవాలి. నా పిల్లలు డైరెక్టర్లు కావాలని నేను నా సొంత డబ్బుతో సినిమాలు చేయలేను కదా..ప్రస్తుతం మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని తాను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను అంటూ గతంలో ఈయన తన వారసుల ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Keerthi Suresh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్… ఏమన్నారంటే?

Keerthi Suresh: నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వటంతో తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది .

మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించకపోవడంతో ఈ వార్తలలో నిజం ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ…. తన కుటుంబ సభ్యులు తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఇంకా మంచి మంచి సినిమాలలో నటించాలని ఉన్నట్లు ఆమె వెల్లడించింది.

Keerthi Suresh: తన అభిప్రాయాన్ని గౌరవించిన తల్లిదండ్రులు…

ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు వివరించడంతో వారు కూడా ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ.. తాను సినిమాలలో నటించటానికి అంగీకరించినట్లు కీర్తి సురేష్ వెల్లడించింది. ఇలా ఈ ఇంటర్వ్యూ ద్వారా తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబుకి జంటగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన హిట్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

Singer Sunitha: నన్ను చూసి ఇష్టపడుతున్నారా.. నా పాటను చూసి ఇష్టపడుతున్నారా.. అభిమానుల గురించి సునీత షాకింగ్ కామెంట్స్!

Singer Sunitha:సింగర్ సునీత టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత ప్రస్తుతం రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది నటీమణులకు డబ్బింగ్ చెప్పిన ఈమె హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీత తన వ్యక్తిగత జీవితం గురించి కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నుంచి సునీతకు ఒక ప్రశ్న ఎదురయింది. టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు ఉంది మీరు ట్రెండ్ సెట్టరా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నపై సునీత స్పందిస్తూ నాకు కూడా అదే అర్థం కాలేదు వాళ్ళు ఏం చూసి నన్ను అభిమానిస్తున్నారో అర్థం కాలేదు అంటూ సమాధానం చెప్పడంతో మీరు హీరోయిన్ పాపులారిటీ ఉందని ఒప్పుకున్నట్టే కదా అంటూ యాంకర్ అన్నారు.అయితే ఇలాంటి కొన్ని అంశాలు తరచూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాయని ఈ సందర్భంగా తన అభిమానుల గురించి సునీత పలు విషయాలను వెల్లడించారు. ఇంతమంది అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి.

Singer Sunitha: చీర ఎక్కడ కొన్నారని అడిగారు..

ఇలా నా అభిమానులు ఎక్కడికి వెళ్లినా మీ పాటంటే ఇష్టం అంటూ చాలామంది సమాధానం చెప్పారు అయితే వాళ్లు నన్ను చూసి ఇష్టపడ్డారా నా పాటను చూసి ఇష్టపడ్డారా అనే విషయం అర్థం కానిది.ఇలాగే ఓసారి ఓ కార్యక్రమానికి వెళ్లగా ఓ అభిమాని నన్ను చూసి పరుగులు పెడుతూ వచ్చారు. అప్పటికీ బౌన్సర్లు తనని అడ్డుకోగా తనని పంపించమని చెప్పాను ఆయన తన వద్దకు వచ్చి మీ పాటలంటే ఇష్టమని చెబుతాడని నేను భావించాను అయితే తను మాత్రం తన ఫోన్లో నుంచి నా ఫోటో చూపించి మీరు ఈ చీర ఎక్కడ కొన్నారు అంటూ ప్రశ్నించారు.ఈ చీర చాలా అద్భుతంగా ఉంది మా భార్యకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఎక్కడ కొన్నారు అంటూ నన్ను ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది అంటూ తన అభిమానులతో తనకు ఎదురైన సంఘటనల గురించి ఈ సందర్భంగా సునీత సమాధానం చెప్పారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ది వారియర్ చిత్రంలో నటించారు.తెలుగు తమిళ భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కావడంతో ఇప్పటికే తమిళంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి బిహైండ్‌వుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమెను ప్రాంక్‌స్టర్లు ఆషిక్‌, సారథిరన్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఫ్రాంక్ చేస్తూ భారీ ఎత్తున గొడవ పడ్డారు.

Krithi Shetty: ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చేసిన కృతి శెట్టి.. ఏం జరిగిందంటే?

కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు…

కృతి శెట్టిని ముందుగా ప్రశ్నలు తాను అడగాలంటే తాను అడగాలని ఇద్దరు గొడవ పడ్డారు. సారథిరన్‌ ఆషిక్‌పై చెయ్యి చేసుకోవటంతో మరింత ఆందోళనకు గురైంది. ఇలా వీళ్లిద్దరూ గొడవ పడటంతో ఎంతో ఆందోళనకు గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇది కేవలం ఫ్రాంక్ అని చెప్పి తనను నవ్వించారు. అయినా మీరు ఎందుకు ఏడ్చారు అంటూ తనని ప్రశ్నించగా ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు భయం వేస్తుంది అంటూ కృతి శెట్టి చెబుతూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంటర్వ్యూ మధ్యలో లేచి వెళ్లిపోయిన సిరి.. వాటి గురించి అడగొద్దంటూ సీరియస్..!

తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. ఇక టాప్ 5 స్థానాన్ని సంపాదించుకున్న సిరి మొదట ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత మానస్ వెళ్లాడు. టాప్ 3 నుంచి శ్రీరామచంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. చివరకు సన్నీ, షణ్ముక్ మధ్యలో చివరకు ఈ టైటిల్ కు సన్నీకి వరించింది. షణఖ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన సిరి ఇంటర్వ్యూలో బిజీ అయ్యారు.

ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లారంటే.. మొదట తన పేరు శిరీష అని.. కానీ తనకు సిరి అని పిలిపించుకోవడం ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ అవకాశం గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2లో వెళ్లాల్సి ఉంది.. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అని చెప్పుకొచ్చింది. చివరకు బిగ్ బాస్ సీజన్ 5కు అవకాశం వచ్చిందని చెప్పింది. మొదట మిగతా కంటెస్టెంట్ తో పోల్చుకంటే.. విన్నర్ అవ్వాలని అనుకోలేదని.. కానీ టాప్ 5లో ఉండాలని అనుకున్నా అని చెప్పారు.
షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు.. అని అడగ్గా.. అతడు తన ఫ్రెండ్ అని.. అతడు తనకు బాగా సపోర్ట్ చేశాడని అందుకే అతడు విన్ అవ్వాలని కోరుకున్నానన్నారు.

జెస్సీ మరి కొన్ని వారాలు ఉంటే బాగుండేదని అన్నారు. శ్రీహాన్ వచ్చి నన్ను వదిలేస్తున్నావా అని అడిగినప్పుడు.. మీరేమనుకున్నారని అడగ్గా.. అతడు నన్నుమిస్ అవుతున్నాడు అని అనిపించిందన్నారు. ముఖ్యంగా తన తల్లి వచ్చి హగ్గులు చేసుకోవద్దు అని చెప్పగానే కొద్దిగా బాధ పడ్డడానని.. తర్వాత కూడా అతడితో కనెక్ట్ అయ్యాయనని… నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాన్నారు. తల్లి వచ్చి చెప్పిన తర్వాత ఒకలా.. తర్వాత ఒకలా నేను లేనని.. నేను నాలాగే ఉన్నానని.. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో అర్థం అయ్యేవిధంగా చెప్పానన్నారు.

ఇక హగ్గుల గురించి మాట్లాడుతూ.. హగ్గుల వల్లనే మీకు నెగెటివిటీ వచ్చిందని.. దీనిపై మీరు ఏమంటారని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ వేరు.. లవ్ వేరు అని చెప్పారు. తమ మధ్య మంచి బాండ్ ఉందని.. ఎమోషనల్ గా మాత్రమే కనెక్ట్ అయ్యామని.. దానిని బ్యాడ్ వేలో తీసుకోవద్దని చెప్పారు. దీనిపై ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పుకున్నారని.. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యూయర్ హగ్గుల గురించే మళ్లీ మళ్లీ అడుగుతుండగా.. కోపంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ వచ్చి ఇంటర్వ్యూని కంటిన్యూ చేశారు. ఏదేమైనా.. బయటకు వచ్చిన తర్వాత తనపై నెగెటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని సిరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

వేరొకరి జీవితంతో ఆడుకోవద్దంటూ హెచ్చరించిన విశ్వా..?

బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వా ఎలిమినేషన్ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్ మేట్స్ తో పాటు.. నెటిజన్లను కూడా షాక్ కు గురి చేసింది. అయితే వీడ్కోలు సమయంలో అతడు సూపర్ హీరోగా బయటకు వచ్చాడు. ఓటింగ్ లో తక్కువ శాతం ఓట్లు రావడంతో విశ్వా హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

అతడు అరియానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరి గురించి తన అభిప్రాయాలను తెలియజేశాడు. ఇక హౌస్ లో తన ఫేవరెట్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. శ్రీరామ చంద్ర ఫైటర్ అని అన్నాడు. అతడిని చూస్తే తన తమ్ముడు గుర్తుకువస్తాడు అంటూ చెప్పాడు.

మానస్ గురించి మాట్లాడుతూ.. విజయాన్ని ఎంజాయ్ చేసే అతడు.. ఓటిమిని కూడా అంగీ కరించాలన్నారు. హౌస్ లో గ్రూప్స్ ల వల్ల ఎవరైనా సేవ్ అయ్యారా.. వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. యానీ మాస్టర్ స్ట్రాటజీ తనకు నచ్చదని.. ఆమె గేమ్ ను పక్కన పెట్టేసి.. వేరే వాళ్ల గేమ్ ను ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అది తనకు నచ్చలేదన్నారు.

ఇక షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ.. అతడు గెలిస్తే ఒకలా.. ఓడితే ఒకలా ఉంటాడన్నారు. రెండింటినీ ఒకేలా తీసుకోవాలని అతడు చెప్పాడు. సిరి, షణ్ముఖ్ బయట స్నేహితులు కావచ్చు.. ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు కానీ.. వేరెకరి జీవితంతో ఆడుకోవద్దంటూ హెచ్చరించాడు. పింకీ గురించి చెబుతూ.. మానస్ కు ఏమైనా దగ్గర ఉండి చూసుకునే ప్రియాంక.. ఆమె కిందపడితే మాత్రం అతడు వెళ్లలేదు. ఎందుకని అడిగితే తాను ఆమె దగ్గరకు పోను అంటూ చెప్పాడన్నారు.

నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాం.. కానీ అలా ఆగిపోయింది: గోపాల్ రెడ్డి

ఒక చిత్రాన్ని తెరపై అద్భుతంగా చూపించాలంటే కేవలం నటీనటులు దర్శకులు మాత్రమే కాకుండా సినిమాకు ఫోటోగ్రాఫర్ కూడా ఎంతో అవసరం.ఈ సినిమాటోగ్రఫీ కారణంగానే ఒక అద్భుతమైన సినిమా అని మనం చూస్తూ ఆనందించగలరు. ఈ విధంగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఎస్ గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి కెమెరామెన్ దర్శకుడిగా నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న గోపాల్ రెడ్డి తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే తన సినీ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలను గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన గోపాల్ రెడ్డి గారిని అలీ ఆశక్తికరమైన ప్రశ్నలు వేస్తూ అతని నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఇంటి పేరా..? అనడంతో ఎస్ అంటే శెనగల వేణుగోపాల్ రెడ్డి. పేరులో చిన్నప్పుడే వేణుని కట్ చేయడం వల్ల గోపాల్ రెడ్డిగా మారానని తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ప్రశ్నలు అవి అడగడంతో గోపాల్ రెడ్డి తమదైన రీతిలో సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలోనే అప్పట్లోనే నాగార్జున గారితో కలిసి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించారంటగా… అని అడగడంతో గోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అవును నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాము.ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము. ఇందులో హీరో 48 గంటలలో తనకు విషం ఎక్కించిన ముగ్గురు పిల్లలను చంపే సన్నివేశం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ ముగ్గులు మూడు రాష్ట్రాలలో ఉంటారు.

హీరో విలన్ లను వెతుకుతున్న మార్గంలో మధ్యలో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్లాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ విధంగా నాగార్జున హీరోగా పాన్ ఇదే చిత్రాన్ని ప్లాన్ చేయగా ఇందులో నటించడానికి డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది ఇక వారంలో సినిమా ప్రారంభించబోతున్నామన్న సమయంలో నాకూ కె.ఎల్‌. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాలలో మార్పులు చోటు చేయడం మంచిది అనిపించింది. అయితే ఈ విధంగా మార్పులు చేయడానికి అశోక్ మెహతా ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి తెలిపారు.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ & బైల‌రీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతోంది. స‌్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఐఎల్‌బీఎస్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

https://www.ilbs.in/?page=hrjobs_listing వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. 29 ఉద్యోగాలలో అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చ‌ర‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్, రీడర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 2వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్‌, డీఎం/ ఎంసీహెచ్ కోర్సులలో పాసై ఉండాలి. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లకు అధికంగా ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ కూడా తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులకు పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేస్తుండగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం పోస్టుల భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండటం గమనార్హం.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ లో ఉద్యోగాలు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 90 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్స్‌ పోస్టులను జగన్ సర్కార్ భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కృష్ణా జిల్లాలో అత్యధికంగా 62 ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 55, టీం లీడర్స్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 ఉద్యోగాలు ఉండగా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 14, టీం లీడర్స్ ఉద్యోగం ఒకటి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 13 ఉద్యోగాలు ఉండగా అందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 12 ఉండగా టీం లీడర్స్ ఉద్యోగాలు ఒకటి ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్ లను చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.

కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://krishna.ap.gov.in/, https://srikakulam.ap.gov.in/, https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎమ్మెస్సీ (న‌ర్సింగ్), ఎంఫార్మ‌సీ, బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై విద్యార్థులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.