Tag Archives: jai bhim

Dosa King Movie: మరో రియల్ స్టోరీతో రాబోతున్న జై భీమ్ దర్శకుడు.. న్యాయం కోసం 18 ఏళ్లు పోరాడిన యువతి కథ ఆధారంగా?

Dosa King Movie: సూర్య హీరోగా తమిళ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ఓ దళిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాటం చేసింది తనకు లాయర్ చంద్రు ఏ విధంగా సహాయం చేశారు అనే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా ఎలాంటి మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలబడింది. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు వివాదాలలో కూడా చిక్కుకుంది.ఇకపోతే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకులను సందడి చేసిన డైరెక్టర్ జ్ఞానవేల్ మరొక నిజజీవిత కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమాని దర్శకుడు తమిళ తెలుగు భాషలలో కాకుండా హిందీలో దోశ కింగ్ అనే సినిమా చేయబోతున్నారు. శరవణ భవన్‌’ పి.రాజగోపాల్‌ ‘దోసె కింగ్‌’ గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు హోటల్లు దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.అయితే ఈయనకు జోస్యం పిచ్చి కారణంగా ఓ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా తన దగ్గర మేనేజర్ గా పని చేసే వ్యక్తి కుమార్తె జీవజ్యోతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.

న్యాయం కోసం 18 ఏళ్లు పోరాడిన జీవ జ్యోతి..

ఈ క్రమంలోనే అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన రాజగోపాల్ తనని మూడో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా దారుణంగా సినిమా స్టైల్ లో చంపించారు. దీంతో జీవ జ్యోతి తనపై న్యాయం కోసం 18 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి గెలిచింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ కష్టాలను ఆమె ఏ విధంగా ఎదుర్కొని ఈ కేసు గెలిచిందనే కథాంశంతో జ్ఞానవేల్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

రియల్ చిన్నతల్లికి రూ.15 లక్షలు అందజేసిన సూర్య..

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ లో విడుదలైన జై భీమ్ .. ఎంతటి ఘన విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్టులను తిరగరాసింది ఈ సినిమా. యదార్థ ఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. దీనిలో కోలీవుడ్‌ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్ పాత్రలో నటించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కురిపించుకున్నారు.

ఈ సినిమా ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్‌’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది.

దీనిలో సిన్నతల్లిగా నటించి లిజోమోల్ అద్భుతంగా నటించారు. రియల్ సిన్నతల్లి పేరు పార్వతి. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు ఆమెకు. అయితే దీనిపై స్పందించిన లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. సూర్య కూడా అంతక ముందే ఆమెకు రూ. 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు సార్థకం చేసే రోజు రానే వచ్చింది.

ఆమెకు రూ.15 లక్షల రూపాయలను అందజేశారు సూర్య. తన తరఫున రూ.10 లక్షలు.. చిత్ర నిర్మాణం తరఫున మరో రూ.5లక్షలు అంటూ ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయించారు హీరో సూర్య. చెప్పడమే కాకుండా.. ఆ మాటను నిలబెట్టుకొని చూపించిన సూర్యను అక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు.

జై భీమ్ వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

2020 సంవత్సరంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటూ.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. దీనిలో నటించిన ప్రతీ ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. రియల్ అడ్వకేట్ అయిన చంద్రు క్యారెక్టర్ ను సూర్య పోషించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రు బాధ్యతలు నిర్వహించారు. మానవ హక్కులకు సంబంధించిన 96,000 కేసులను చంద్రు పరిష్కరించారు.

అయితే ఈ సినిమాలో అమాయకులైన ఓ కుటుంబాన్ని అక్రమంగా పోలీసులు ఓ కేసులో ఇరికించి చిత్ర హింసలు పెడతారు. ఇదే ఈ సినిమాకు మెయిన్ పాయింట్.ఇక పోతే ఇటీవల రియల్ సినతల్లికి డ్యాన్స్ మాస్టార్ ఇల్లు కట్టిచ్చి ఇస్తాన్నన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా.. దానిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను 10 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చిత్రీకరించగా అమెజాన్లో రూ.45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతే సూర్యాకు దాదాపు రూ.35 కోట్లు లాభం వచ్చినట్లు. అంతే కాకుండా ఈ సినిమా గూగుల్ యూజర్లకు తెగ నచ్చేసింది. 97 శాతం మంది గూగుల్ యూజర్లు ఈ చిత్రం చాలా బాగుంది అంటూ కొనియాడారు. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది.

మరో రికార్డు స్పష్టించిన జై భీమ్.. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా..!

ఇటీవల అమెజాన్‌ ఓటీటీలో రిలీజ్ అయిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అద్భుతంగా నటించాడు. దీనిలో సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించేసింది.

దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. అయితే ఈ చిత్రం మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమాకు 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

97 శాతం మంది గూగుల్ యూజర్లు ఇష్టపడ్డారు. ఈ సినిమా కంటే ముందు ఈ స్థానంలో 1994లో విడుదలైన ది షాషాంక్ రిడంప్షన్‌ సినిమా 9.3తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్తానంలో జై భీమ్ సినిమా 9.6 రేటింగ్ తో మొదటి స్థానం సంపాదించింది.

ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ మూడో స్థానంలో నిలిచింది. ‘ది డార్క్ నైట్’ మూవీ 9.0/10తో నాల్గో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఓటీటీలో సూర్య నటించిన సినిమా ఆకాశమే హద్దురా సినిమా కూడా టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాతో సూర్య తన రికార్డును తానే తిరగరాశాడు.

రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తా.. డ్యాన్సర్ రాఘవ లారెన్స్ హామీ..

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం జై భీమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. దీనిని 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో సినతల్లి ఎదుర్కొన్న కష్టాలను స్పష్టంగా చూపించారు. ఈ చిత్రాన్ని చూసిన సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు.

తమిళ‌నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సినిమా చూసి సూర్యకు లేఖ రాయడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమా చూసిన నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ చలించిపోయారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు. ఒక తప్పుడు కేసు కారణంగా రాజకన్ను భార్య పార్వతి పడిన బాధ హీరో లారెన్స్ దృష్టికి వచ్చింది.

ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో జీవిస్తున్నట్లు తెలుసుకుని చలించిపోయారు. పార్వతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పార్వతి అమ్మాళ్‌కి తన స్వంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. లారెన్స్ ప్రకటనతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దాతృత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, లిజోమోల్ జోస్, మణికందన్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ నటన అద్భుతం అనే చెప్పాలి. అంతగా డీ గ్లామర్ గా మారి ఆమె ప్రేక్షకులను మెప్పించారు. లాయర్ చంద్రు పాత్రలో హీరో సూర్య జీవించేశాడు.

డైరెక్టర్ కట్ చెప్పిన కన్నీళ్లగాలేదు.. ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను: నటి లిజోమోల్

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జైభీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గిరిజన వర్గాల పై పోలీసులు ఎలా కేసు పెడతారు. వారిని ఎలా శిక్షిస్తారు, అదేవిధంగా నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

1993లో తమిళనాడులో జరిగిన ఒక గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు ఇక ఇదే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చందు పాటలు హీరో సూర్య నటించగా,సిన తల్లి పాత్రలో నటి లిజోమోల్ నటించింది. ఇందులో సూర్య నటనకు, అలాగే లిజోమోల్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఆమె పూర్తి డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది.

ఇంకా తాజాగా జై భీమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది నటి లిజోమోల్. ఆ సినిమా ప్రభావం తనపై ఎక్కువగానే చూపించిందని చెప్పుకొచ్చింది. ఆమె సినిమా చేస్తున్నంత సేపు గ్లిజరిన్ అవసరం లేకుండానే చేసిందట..అంతగా ఆమె ప్రభావం చూపించదని తెలిపింది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నింటిలో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అని ఆమె తెలిపింది.

ఇందులో ఈమె భర్త రాజన్న మరణానికి సంబంధించిన పలు సీన్స్, పోలీసులు చిత్రహింసలు పెట్టి పెట్టినప్పుడు ఆమె గ్లిజరిన్ ఉపయోగించే లేదని తెలిపింది. ఇందులో పలు సన్నివేశాలు చేస్తున్నంతసేపు కన్నీళ్లు వచ్చేవి అని ఆమె తెలిపింది. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా కన్నీళ్లు ఆగేవి కాదని తెలిపింది.లిజోమోల్ కేరళ కు చెందిన అమ్మాయి.

కావాలనే నన్ను వివాదంలోకి లాగుతున్నారు.. ఆ సన్నివేశంలో తప్పేంటి: ప్రకాష్ రాజ్

ఇటీవల సూర్య హీరోగా నటించిన జై భీమ్ విజయవంతంగా అమెజాన్ ఓటీటీలో రన్ అవుతోంది. టాప్ లో ఆ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దీనిలో రావు రమేష్, సూర్య మధ్య జరిగే సన్ని వేశాలు అమోఘం అని చెప్పాలి. వీరిద్దరు వకీల్ పాత్రలో నటించారు. ఇక చిన్నతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది.

ఆమె డీ గ్లామర్ గా మారి తన నటనతో అందరి మన్ననలు పొందింది. ఒక లాయర్ చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా తీసినది ఈ సినిమా. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సమాజంలో వైరల్ గా మారింది. ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తుంటే మంచి కథలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

అయితే దీనిలో ఓ సన్నివేశం కొంతమంది వివాదం స్పష్టిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ సీబీఐ ఎంక్వైరీ చేసే ఆఫీసర్ పాత్రలో నటించాడు. దీనిలో ఓ వ్యక్తిని విచారించే క్రమంలో అతడు హిందీలో మాట్లాడుతుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతడిని తెలుగులో మాట్లాడు అంటూ చెంప దెబ్బ కొట్టి హెచ్చరిస్తాడు. ఇది హిందీ భాషను అవమానించడమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

దీనిలో అణగారిన వర్గాల బాధని పూర్తిగా చూపించామని.. వాళ్లు పడే ఇబ్బందులు, కష్టాలను చూపించామన్నారు. ఇవన్ని పక్కన పెట్టేసి కేవలం చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాను ఈ సినిమాలో నటించాన్న కారణంతోనే ఎక్కువగా సినిమాను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి వివాదాలకు స్పందించడం .. ఎలాంటి అర్థం లేదంటూ చెప్పుకొచ్చాడు.