Tag Archives: lakshmi pranathi

Lakshmi Pranathi: వామ్మో పెళ్లిలో ఎన్టీఆర్ భార్య కట్టిన చీర ఖరీదు ఎంతో తెలుసా… తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Lakshmi Pranathi: లక్ష్మీ ప్రణతి పరిచయం అవసరం లేని పేరు.యంగ్ హీరో ఎన్టీఆర్ సతీమణిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి లక్ష్మీ ప్రణతి సినిమాలకు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ ఒక సాధారణ గృహినిల ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా ఒక భార్యగా అన్ని వ్యవహారాలను చక్కగా నిర్వర్తిస్తూ ఎన్టీఆర్ కెరియర్ కు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం 2011 మే 5వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలివచ్చారు.ఎన్టీఆర్ వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అయితే తాజాగా ఎన్టీఆర్ వివాహం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహ వేడుకలలో భాగంగా లక్ష్మీ ప్రణతి కట్టిన చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. లక్ష్మీ ప్రణతి వివాహ సమయంలో బంగారు వర్ణపు రంగు చీరను కట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ చీరకు మ్యాచింగ్ డైమండ్ జువెలరీని కూడా ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈమె దరించిన చీర ఖరీదు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Lakshmi Pranathi: కోటి రూపాయల చీర కట్టిన ప్రణతి..


లక్ష్మీ ప్రణతి ధరించిన ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ చీరను తయారు చేయడం కోసం బంగారు వెండి పోగులతో తయారు చేశారని తెలుస్తోంది.ఇలా బంగారు వెండితో తయారుచేసిన ఈ చీర ఖరీదు అక్షరాల కోటి రూపాయలన్న విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎన్టీఆర్ భార్య పెళ్లిలో కట్టుకున్న ఈ చీర ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Ntr: దేవరకు చిన్నవిరామం…ఫ్యామిలీతో వెకేషన్ బయలుదేరిన ఎన్టీఆర్… ఫోటోలు వైరల్!

Ntr:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇలా వరుస షెడ్యూల్స్ తో బిజీగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పనులకు ఎన్టీఆర్ కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కి కాస్త విరామం దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ నిమిత్తం వెళ్లారని తెలుస్తుంది. అయితే వారం రోజులపాటు ఎన్టీఆర్ హాలిడే వెకేషన్ లో ఉండబోతున్నారని తిరిగి హైదరాబాద్ చేరుకొని సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Ntr: పాన్ ఇండియా స్థాయిలో దేవర…


ఇక ఈ వెకేషన్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తిరిగి దేవర సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను యువసుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

Jr.NTR: వాస్తవంలో బతకడం తనే నేర్పించింది…. ఆమె నా బలగం…. ఆ లోటు మాత్రం అలాగే ఉంది: ఎన్టీఆర్

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతంలో పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన తల్లి గురించి పలు విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు తను బాగా అల్లరి చేసేవాన్ని అయితే అమ్మ చాలా సహనంతో భరించేదని తెలిపారు. ఇక నా అల్లరితో ఓపిక నశించిపోయిన అమ్మ తనని బాగా కొట్టేదని కూడా తెలిపారు.

అమ్మకు నేనంటే చాలా ప్రాణం కానీ తనను ఎప్పుడు గారాబం చేయలేదని తెలిపారు. అమ్మ అలా ప్రవర్తించడం వల్లే నేను వాస్తవంలో బ్రతకడం నేర్చుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. అమ్మే నా బలగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈయన 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

Jr.NTR: కూతురు లేని లోటు ఉంది..


ఇలా ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ క్షేమంగా బ్రతికి బయటపడ్డారు. ఇలా ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈయన ఇప్పటికీ ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక తన భార్య గురించి కూడా మాట్లాడుతూ లక్ష్మీ ప్రణతి తనకు భార్యగా రావడం తన అదృష్టం అని తెలిపారు. అయితే తనకు ఇద్దరు కుమారులు కాగా కూతురు లేని లోటు అలాగే ఉండిపోయిందని ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

NTR: జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎలాంటి భార్య రావాలని కోరుకున్నారో తెలుసా… మరి ప్రణతిలో అలాంటి లక్షణాలు ఉన్నాయా?

NTR: నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. మొన్నటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వడంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. నిత్యం సినిమా పనులతో బిజీగా ఉండే ఎన్టీఆర్ కుటుంబం కోసం కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా గతంలో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకోకముందు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో కాబోయే భార్య గురించి తారక్ మాట్లాడుతూ…” జీవితంలో ఏది జరిగితే దానిని యాక్సెప్ట్ చేయాలే తప్ప ప్లానింగ్ అంటూ ఏమీ లేదని అన్నారు. అలాగే కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ..మా అమ్మను బాగా చూసుకునే అమ్మాయి నాకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నానని తారక్ తెలిపారు.

అంతే కాకుండా తనకు అమ్మే ప్రపంచమని, అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎన్టీఆర్ తాను కోరుకున్నట్లుగా తన తల్లిని బాగా చూసుకునే అమ్మాయి భార్యగా దొరికిందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ ప్రణతి నందమూరి ఇంటి కోడలిగా వంశ గౌరవాన్ని నిలబెడుతుందని, స్టార్ హీరో భార్య అయినప్పటికీ గొప్పలకు పోకుండా ఎంతో సింపుల్ గా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

NTR: నందమూరి వంశ గౌరవాన్ని నిలబెట్టిన ప్రణతి..

ఒక భార్యగా, కోడలిగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా లక్ష్మీ ప్రణతి చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. లక్ష్మీ ప్రణతి ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైంది.

Ntr Wife: స్టైలిష్ లుక్ లో లక్ష్మీ ప్రణతి… వైరల్ అవుతున్న న్యూ ఫోటో!

Ntr Wife: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ వేకేషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా యూఎస్ పర్యటనలో ఉన్నటువంటి ఎన్టీఆర్ తన పర్సనల్ ఫోటోలు ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే తాజాగా ఈయన అమెరికా వీధులలో తన భార్యతో కలిసి దిగినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ న్యూయార్క్ వీధులలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘ఎంజాయింగ్ ఎ న్యూయార్క్ మినట్’ అంటూ తన భార్యతో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫోటోలలో లక్ష్మీ ప్రణతి మేక్ ఓవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెప్పాలంటే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా చాలా స్టైలిష్ లుక్ లో లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. ఈ ఫోటోలో లక్ష్మీ ప్రణతి టైట్ జీన్స్, నీ హై షూస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు.ఇక ఈమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే బయట ఏదైనా ఫంక్షన్లలో కనిపించిన చాలా పద్ధతిగా చీరలో కనిపిస్తారు.

Ntr Wife: సోషల్ మీడియాకు దూరంగా లక్ష్మీ ప్రణతి..


లక్ష్మీ ప్రణతి తన కుటుంబంలో జరిగే ఏదైనా ఫంక్షన్లకు మినహా ఎక్కడ బయట కనిపించరు. దీంతో ఈమె ఫోటోలు కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Jr NTR: మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త తెలియగానే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె నివాసం వద్దకు చేరుకొని ఆమె అంత్యక్రియల వరకు అక్కడే ఉండి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈమె అంత్యక్రియలలో పాల్గొన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇండియాలో లేని కారణంగా ఆమె చివరి చూపుకు నోచుకోలేదు.

ఇక తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లిన ఎన్టీఆర్ తన అత్త మరణ వార్త తెలియగానే ఇండియాకు బయలుదేరారు. అయితే ఈయన ఇండియా చేరుకునే సమయానికి మరి కాస్త ఆలస్యం కావడంతో అప్పటికే అంతక్రియలు పూర్తి అయ్యాయి. ఇండియా తిరిగి వచ్చిన ఎన్టీఆర్ వెంటనే తన భార్య లక్ష్మీ ప్రణతి తన తల్లి శాలిని, అన్న కళ్యాణ్ రామ్ కలిసి ఉమామహేశ్వరి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడమే కాకుండా ఆమె రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి మానసిక ఒత్తిడే అసలు కారణమా మరి ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

Poojitha-Lakshmi Parvati: అలనాటి నటి పూజిత మళ్లీ తెరపై యాక్టివ్ కాబోతున్నారు. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’  వంటి ఎవర్ గ్రీన్ కామెడీ సినిమాలో పాటు 138కి పైగా సినిమాలు నటించిన పూజిత చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజగా మరోసారి ఆమె వెండితెరపై మెరవబోతున్నారు. వరసగా రెండు సినిమాలకు సైన్ చేశారు. అయితే తన కెరీర్లో జరిగిన ఓ విషయంపై ఆమె స్పందించారు. 

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

లక్ష్మీ పార్వతితో తనకున్న విభేదాలను బయటపెట్టారు. అప్పట్లో ’అమ్మో అల్లుడా.‘ అనే సినిమా వచ్చిందని పూర్తిగా పొలిటికల్ సినిమా అని చెప్పింది. దీంట్లో నేను లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చింది పూజిత. కోనేరు రవీంద్ర ఆ చిత్రానికి నిర్మాత. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి..  సినిమాలో నన్ను పెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కూడా ఉంటుందని ఆయనకు భార్యగా లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని చెప్పారు. అయితే ఆమె పేరును ఎక్కడా కూడా వాడలేదని తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండగానే ఎన్టీఆర్ గారు చనిపోయారని చెప్పింది.

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

ఎన్టీఆర్ చనిపోయినప్పడు.. ఆయన ఇంటికి వెళ్లానని.. స్టేడియంకి కూడా వెళ్లానని చెప్పింది. అయితే ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతి చేసిన కొన్ని విషయాలను… నేను సినిమాలో అలాగే చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ సన్నివేశాలు లక్ష్మీ పార్వతికి బలంగా తాకినట్లు చెప్పింది.

బాంబులతో లేపేస్తా అన్నారు…

ఎన్టీఆర్ చనిపోయిన సందర్భంలో కాఫీ తాగుతున్న లక్ష్మీ పార్వతి.. పీవీ నరసింహరావు రాగానే తాగే కప్పును పక్కన పెట్టి ఏడ్వడం స్టార్ట్ చేసిందని… చెప్పింది పూజిత. అయితే ఆ సన్నివేశం నామదిలో అలాగే ఉందని తెలిపింది. ఎవరైనా వస్తే ఉన్నపళంగా బాగా ఏడవాలన్నమాట అని అర్థమైంది. ఈ సన్నివేశాన్ని సినిమాలో యదాతథంగా నేను చేశాను. ఈసీన్ చూసి లక్ష్మీ పార్వతి నున్ను బాంబులతో లేపేస్తా.. యాసిడ్ పోయిస్తా.. అని చెప్పి అప్పట్లో నాపై కేసు పెట్టారు. అయితే దాన్ని చిత్ర నిర్మాత, డైరెక్టర్ చూసుకున్నారన్నారు. నేను ఓ నటిని.. డైరెక్టర్, నిర్మాతలు చెప్పినట్లు నటించడం మాత్రమే నాపని అని చెప్పుకొచ్చింది పూజిత. కేసులతో నాకేంటి సంబంధం అని అంది.  అయితే ఆ తరువాత లక్ష్మీ పార్వతిని రెండు మూడు సార్లు కలిశాను ఆమె సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది పూజిత.

జూనియర్ ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి తన భార్య ఓకె చెప్పలేదట.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ఎదురుగా కూర్చున్న కంటెస్టెంట్లతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. ప్రోగ్రామ్ పై మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పెళ్లి నాటి ముచ్చట్లను తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. ముందుగా తన తండ్రి హరికృష్ణతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

వివాహం గురించి ప్రస్తావిస్తుండగా.. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అసలు మాట్లాడలేదు అంటూ సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతిని చూడగానే ఎన్టీఆర్ ఓకె చెప్పగా.. తన భార్య మాత్రం ఓకె చెప్పలేదని చెప్పుకొచ్చాడు. అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిని అడిగారట అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని గానీ.. కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.

నిశ్చితార్థానికి మాకు ఎనిమిది నెలల సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. అప్పడు కూడా తాను ఎస్ చెప్పలేదన్నారు. ప్రపంచంలో దేనినైనా అర్థం చేసుకోవచ్చు కానీ.. ఆడవాళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.