Tag Archives: liger movie

Liger Movie: లైగర్ సినిమా ఫ్లాప్ అని తెలియగానే విజయ్ దేవరకొండ అలా చేశారా?

Liger Movie: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 25వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలను పెంచుతూ ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు కానీ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే ఈ సినిమా జాతకం ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అంటూ రిజల్ట్ ఇచ్చేసారు.

ఈ విధంగా ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ పెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రేక్షకులు డిజాస్టర్ అనగానే ఆయన రియాక్షన్ గురించి తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ బేబీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

Liger Movie: సినిమాలంటే అన్నయ్యకు పిచ్చి…

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ లైగర్ సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చిన తర్వాత దాని గురించి అన్నయ్య విజయ్ దేవరకొండ ఏ మాత్రం ఆలోచించలేదని,ఆరోజు సాయంత్రానికల్లా ఆయన తన తదుపరి సినిమా ఖుషి సినిమా కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ సినిమా పనులలో బిజీ అయ్యారని ఆనంద్ దేవరకొండ తెలిపారు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. ఇప్పటివరకు అన్నపెట్టిన ఎఫర్ట్స్ మీద ఎవరు వేలు ఎత్తి చూపలేరు. అంతగా అన్నయ్యకి సినిమాలంటే ఇష్టం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda: ఆ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయంతో మరో ప్లాప్ నుండి బయటపడిన విజయ్ దేవరకొండ..?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం మంచి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా కూడా అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ మరొక ప్లాప్ సినిమా నుండి తృటిలో తప్పించుకున్నాడని తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు ఇటీవల విడుదలైన ” అన్నీ మంచి శకునములే ” సినిమా.

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పెళ్లిచూపులు సినిమా హిట్ అయిన తర్వాత నందిని రెడ్డి మొదట ఈ సినిమాని విజయ్ దేవరకొండకి వినిపించిందట. విజయ్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత విజయ నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలై విజయ్ క్రేజ్ పెరిగిపోవడంతో ఈ సినిమా విజయ్ రేంజ్ కి సరిపోదని నందిని రెడ్డి భావించారట.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు సెట్ అవ్వదు అని భావించిన నందిని రెడ్డి…


విజయ్ దేవరకొండకు ఈ సినిమా సెట్ అవ్వదు అని భావించిన నందిని రెడ్డి ఆ తర్వాత ఈ సినిమా స్టోరీని సంతోష్ శోభన్ కి వినిపించి సినిమాని రూపొందించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్లాఫ్ గా నిలిచింది. ఇలా నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల విజయ్ మరొక ఫ్లాప్ నుండి బయటపడ్డాడు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంత తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.

Anchor Anasuya: అత్తా పితా అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. కోడలైన సరే అలా పిలవకూడదు: అనసూయ

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావటం వల్ల ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఎత్తున వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ సైతం తనదైన శైలిలో కౌంటర్ వేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి ఈ ఆంటీ అనే వివాదాన్ని అనసూయ తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ తాజాగా సుమ వ్యవహరిస్తున్నటువంటి క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ తనకు వంట రాదని చాలామంది అనుకుంటారు కానీ తాను ఎలా వంట చేస్తానో ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తానని చెప్పారు.

Anchor Anasuya: అత్త అని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆంటీ అనే విషయం గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ నన్ను ఎవరైనా అత్తా పిత్తా అంటే అసలు ఊరుకోను.అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు చివరికి నా కోడలైనా సరే నన్ను ఆంటీ అని పిలవకూడదు కేవలం అను అని పిలిస్తే చాలు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Ramya Krishna: డాన్స్ ఐకాన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Ramya Krishna: రమ్యకృష్ణ తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతే బిజీగా ఉన్నారు.తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోల ద్వారా సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె కేవలం హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా మెప్పించారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చడంతో తనకు బాలీవుడ్ ఇండస్ట్రీ అచ్చు రాలేదని తిరిగి సౌత్ ఇండస్ట్రీలోని కొనసాగారు.ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Ramya Krishna: హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న రమ్యకృష్ణ…

ఓంకార్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె జడ్జిగా కొనసాగడం కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 4.5 లక్షల రెమ్యూనరేషన్ అందు కుంటుందని సమాచారం.అయితే ఈ విషయం గురించి క్లారిటీ తెలియకపోయినాప్పటికీ ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఎవరూ కూడా తీసుకోనటువంటి రెమ్యూనరేషన్ ఈమె తీసుకుంటుందని చెప్పాలి.

Vijay Devarakonda: లైగర్ ఎఫెక్ట్ జబర్దస్త్ లోనూ ట్రోలింగ్ కు గురైన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి మొదట మొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇకపోతే ఈ సినిమాకి ముందు విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. అదేవిధంగా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన చెప్పిన డైలాగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఇలా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అయి ఉంటే పెద్దగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు గురించి పట్టించుకునే వారు కాదు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం వల్ల విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాలలో చేసిన వ్యాఖ్యలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలోభాగంగా బుల్లెట్ భాస్కర్ టీం లో విజయ్ దేవరకొండపై ఈ విధమైనటువంటి ట్రోల్లింగ్స్ జరిగాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..అరేయ్ ఏందీరా క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు’ అని కామెంట్ చేశారు. అయితే ఇదే వ్యాఖ్యలను బుల్లెట్ భాస్కర్ తన స్కిట్లో విజయ్ దేవరకొండ పరోక్షంగా ట్రోల్ చేశారు.

Vijay Devarakonda: మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్…

లైకర్ సినిమా ఫ్లాప్ కావటం వల్లే చివరికి జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈయనపై ఈ విధమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా విజయ్ దేవరకొండ డైలాగ్స్ విన్నటువంటి అభిమానులు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. విజయ అభిమానుల సైతం విజయ్ దేవరకొండపై ఈ విధమైనటువంటి రావడంతో పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

Anchor Anasuya: ఎన్నాళ్లకు మెడలో అది చూసాము.. అనసూయ పై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి అనసూయ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు నేటిజెన్లు సైతం అనసూయ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఈమెను ఏకంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఈ విధంగా తనని ఆంటీ అన్న వారిపై ఈమె కేసు వేస్తానంటూ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా నెటిజన్లతో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన అనసూయ ఇక ఈ విషయంపై మర్చిపోయినప్పటికీ నెటిజెన్స్ మాత్రం అనసూయను ఇప్పటికి దారుణంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా అనసూయ విజయవాడలో తన ఫ్యామిలీతో కలిసి పలు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయవాడ అని క్యాప్షన్ పెట్టగా ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ వెల్కమ్ విజయవాడ ఆంటీ అంకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Anasuya: తగ్గేదేలే అంటున్న నేటిజన్స్..

ఇలా అనసూయ పోస్ట్ పై స్పందించిన 80 శాతం మంది నేటిజన్స్ ఆమెను ఆంటీ అనే పదంతోనే కామెంట్ చేస్తూ చేస్తున్నారు. ఇక మరొక నెటిజన్ అయితే దారుణంగా ఎన్ని రోజులకు మీ మెడలో ఇలా తాళిబొట్టు చూసాము అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి అనసూయ ఎన్ని కేసులు పెట్టిన నేటిజన్స్ మాత్రం తగ్గేదే అంటూ ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Vijay Devarakonda: లైగర్ ఫ్లాప్.. నిర్మాతలకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ.. రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన హీరో?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యి హిందీ వెర్షన్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగిలిన అన్ని భాషలలో కలిపి ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నష్టాలను భరించడం కోసం పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా లాభాలతో కలిపి ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలలో వచ్చిన లాభాలను హీరోకి ఇవ్వలేదని అయితే ఆ లాభాలు తనకు వద్దని చెప్పడమే కాకుండా తనకి ఇచ్చిన ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.

ఈ విధంగా ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ చార్మిలతో కలిసి చేయాల్సి ఉంది.

Vijay Devarakonda: జనగణమన లాభాలలో వాటా..

పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే అందులో వచ్చే లాభాలను విజయ్ దేవరకొండ తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఇలా సినిమా నష్టపోవడంతో నిర్మాతలకు విజయ్ దేవరకొండ అండగా నిలబడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి, జనగణమన సినిమాలపై దృష్టి పెట్టారు.

Anasuya: నన్ను ఆంటీ అంటారా..? మిమ్మల్ని జైలుకి పంపిస్తా… నెటిజన్స్ ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన అనసూయ.. వైరలవుతున్న ట్వీట్స్!

Anasuya:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో వెంటనే అనసూయ పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండ పై సంచలనమైన ట్వీట్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ ఫలితం రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఈ విధంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు దారుణంగా అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ… ఛీ… ఛీ బోలెడంత చెత్త వస్తోంది ఎంత క్లీన్ చేసిన ఈ చెత్త ఇలాగే వస్తోంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్ చేయడంతో అభిమానుల సైతం రెచ్చిపోయి అనసూయ ను ఏకంగా ఆంటీ అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్ను ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తారా…మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది తప్పకుండా మీపై చర్యలు తీసుకుంటా అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anasuya: ఓ మహిళ చేస్తున్న పోరాటం…

ఈ క్రమంలోనే ఆంటీ అంటేనే కేసు ఫైల్ చేస్తే ట్విట్టర్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో వెంటనే అనసూయ ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇక్కడ చాలా జైలు, సెక్షన్లో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె తన గురించి వచ్చినటువంటి ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఘాటుగా స్పందించడమే కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరాటం అని, తన గౌరవం కోసం చేస్తున్న పోరాటమిదని రుజువు చేయడం కోసమే ఇలా రీ ట్వీట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మీరు నన్ను మాత్రమే కాకుండా ఈ విషయంలోకి నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధపడతారంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Puri jagannadh: ఆమె ఉసురే పూరి జగన్నాథ్ కి శాపంగా మారిందా… సంచలనంగా మారిన బండ్ల గణేష్ కామెంట్స్?

Puri jagannadh: ఆగస్టు 24వ తేదీ వరకు పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టబోతున్నారని ప్రతి ఒక్కరూ భావించారు. ఇలా ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ అలాగే అభిమానులలోను ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Puri Jagannadh: చీప్ గా మాట్లాడొద్దు.. బండ్ల గణేష్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన పూరి.. వైరల్ అవుతున్న ఆడియో?

ఈ సినిమా ఫస్ట్ షో బొమ్మ డిజాస్టర్ కావడంతో ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరి అయిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదు.ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున పూరి జగన్నాథ్ గురించి కామెంట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు పోకిరి సినిమా చేసిన పూరి జగన్నాథ్ సినిమా నేనా ఇది అంటూ కొందరు కామెంట్లు చేశారు.

ఏది ఏమైనా పూరి జగన్నాథ్ సినిమాలు ఒకప్పటిలా లేవని ఈయన కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయికానీ నీకోసం వదిన ఎంతో కష్టపడింది తనను కష్టపెట్టకు తనని బాగా చూసుకో అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Puri jagannadh: పుండు పై కారం చల్లుతున్న నెటిజన్స్…

ఈ విధంగా కొందరు ఈ విషయాలపై స్పందిస్తూ ప్రస్తుతం కామెంట్లు చేస్తున్నారు ఒకప్పుడు పూరి జగన్నాథ్ తన భార్యను చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె ఉసురే తనకు తగిలిందని, అందుకే తన సినిమా ఇలా డిజాస్టర్ అయ్యింది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ అసలే సినిమా ఫ్లాప్ అయిందన్న బాధలో పూరి జగన్నాథ్ ఉండగా మరి ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టడం అవసరమా అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

Vijay Devarakonda: యాటిట్యూడ్ కన్నా కంటెంట్ అవసరం… హిట్టు కొడితేనే యాటిట్యూడ్ కి అర్థం.. విజయ్ పై నేటిజన్స్ కామెంట్!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో భిన్నంగా చేస్తూ ఉంటారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ హీరో చూపించే యాటిట్యూడ్ కొందరికి మంచిగా అనిపించిన మరికొందరికి ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి.

ఇకపోతే లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ కు యూత్ ఫిదా అయ్యారు.అయితే ఇలాంటి యాటిట్యూడ్ చూపించాలంటే సినిమా హిట్ కొడితేనే తన చూపించే యాటిట్యూడ్ అర్థం ఉంటుంది లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఇబ్బందులను ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎదుర్కొంటున్నారు.

ఈ హీరోకి హిట్టు వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. గీతగోవిందం తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ హీరో మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున తన యాటిట్యూడ్ చూపిస్తూ ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే లైగర్ విషయంలో కూడా కాళ్లు పైకి పెట్టుకోవడం బాయ్ కాట్ అంటే కొట్టేయడమే అంటూ ఎంతో భిన్నంగా సినిమాని ప్రమోట్ చేశారు.

Vijay Devarakonda: కథ ఎంపిక విషయంలో పొరబడుతున్న విజయ్…

అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున యాంటీ ఫ్యాన్స్ మనం చేసే సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడే యాటిట్యూడ్ చూపించాలి, సినిమా హిట్ అయితేనే దానికి ఒక అర్థం ఉంటుంది ఈ విషయం నీకు అర్థం కావట్లేదు అంటూ పెద్ద ఎత్తున ఈయనపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.