Tag Archives: nagababu

Niharika: ఆ హీరోతో రెండో పెళ్లికి సిద్ధమైన మెగా డాటర్… కూతురి విషయంలో నాగబాబు కీలక నిర్ణయం!

Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట హోస్ట్ గా బుల్లితెర మీద సందడి చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో నటనకు దూరంగా ఉంటూ ప్రస్తుతం నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తాజాగా కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది.

ఇదిలా ఉండగా కొంతకాలంగా నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక విడాకుల గురించి మెగా కుటుంబం ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. అయినప్పటికీ నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు అందరికీ అర్థమవుతుంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక రెండో పెళ్లి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

చాలా కాలంగా చైతన్యకి దూరంగా ఉంటున్న నిహారిక అతనికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక రెండవసారి పెళ్ళి చేసుకోబోయే ఆ వ్యక్తి మరెవరో కాదు మెగా హీరో సాయిధరమ్ తేజ్. నిహారికకి సాయి ధరమ్ తేజ్ వరుసకి బావ అవుతాడు. అయితే మొదట నిహారికని సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు.

Niharika: సాయి ధరమ్ తేజ్ తో నీహారిక రెండో పెళ్లి…

నీహారిక మీద సాయి ధరమ్ తేజ్ కి అలాంటి ఒపీనియన్ లేకపోవటంతో జొన్నలగడ్డ చైతన్యకి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వివాహాం జరిగిన కొంత కాలానికే ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకోవటానికి సిద్ధపడ్డారు. అందువల్ల నీహారిక ని సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి మళ్ళీ వివాహం చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సిందే.

K Raghavendra Rao: 80 కోట్లు ఖర్చు చేశారని లెక్కలున్నాయా…. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు ఫైర్!

K Raghavendra Rao: తమ్మారెడ్డి భరద్వాజ్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారనే దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు తోచినది మాట్లాడుతూ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.ఎక్కువగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే ఈయన తాజాగా మెగా హీరో నందమూరి హీరో నటించిన RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆస్కార్ కోసం ఖర్చుపెట్టిన 80 కోట్ల రూపాయలతో తాను 8 సినిమాలు చేసి మీ మోహన కొడతాను, ఈ సినిమా ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ల కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు.ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే నాగబాబు స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ తనదైన శైలిలో తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

K Raghavendra Rao: జేమ్స్ కామెరూన్ స్పిల్ బర్గ్ డబ్బు తీసుకొని పొగిడారా….

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు స్పందిస్తూ… మిత్రుడు భరద్వాజ్ కి అంటూ మొదలుపెట్టిన రాఘవేంద్రరావు తెలుగు సినిమాకి తెలుగు సాహిత్యానికి తెలుగు దర్శకుడికి మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి కానీ 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉందా? హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరూన్ స్పిల్ బర్గ్ వంటి వారు కూడా డబ్బులు తీసుకొని ఈ చిత్రాన్ని గొప్పగా పొగుడుతున్నారనా నీ ఉద్దేశం అంటూ ఈ సందర్భంగా ఈయన తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది రాఘవేంద్ర రావు గారికి మద్దతు తెలుపుతున్నారు.

Nagababu: నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా… తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు!

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్య సినిమాలో నిర్మించడం తక్కువ అయినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడుతూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే తమ్మారెడ్డి తాజాగా RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో మేము ఎనిమిది సినిమాలు చేసే మీ మోహన కొట్టే వాళ్ళం అంటూ కామెంట్లు చేశారు. వీరి అమెరికా ఫ్లైట్ టికెట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అంటూ ఈయన RRR సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనం రేపాయే.

ఇలా తమ్మా రెడ్డి ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం తో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే తమ్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తనకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Nagababu: కొందరికి ఇలాగే సమాధానం చెప్పాలి..


ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా… 80 కోట్లు RRR కోసం.(#RRR మీద కామెంట్ కు వైసిపి వారి భాషలో సమాధానం) అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కొందరికి ఇలాంటి భాషలో సమాధానం చెబితేనే అర్థం అవుతుంది అంటూ ఈయన ట్వీట్ పై సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Nagababu: మేధావులు ఏడవకండి… సినీ విమర్శకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

Nagababu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇక నాగబాబు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి తరచూ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా సినీ విమర్శకుల గురించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు సినీ విమర్శకుల గురించి మాట్లాడుతూ… సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు అయితే సినిమాల వల్ల ఎవరు చెడిపోరని సినిమాలు కేవలం ఒక వ్యాపారం మాత్రమేనని తెలిపారు.

సినిమాలలో జరుగుతున్న హింస వల్ల చాలామంది చెడిపోతున్నారని భావించినప్పుడు సినిమాల ద్వారా చూపించే మంచి వల్ల కూడా చాలామంది బాగుపడాలి కదా అని ప్రశ్నించారు. సినిమాలు బాగుపడాలని, చెడిపోవాలని ఉద్దేశంతో ఎవరు చేయరని ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నారని తెలిపారు.
ఇక సినిమాలలో ఏదైనా ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది.

Nagababu: సినిమా వ్యాపారం మాత్రమే…

సినిమాల వల్ల చెడిపోతున్నారని భావించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే సినిమా ఒక వ్యాపారం మాత్రమే…కుహనా మేధావులు ఏడవకండి అంటూ ఈయన వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఈయన చేసినటువంటి ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన వ్యాఖ్యలపై కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ నాగబాబు చెప్పినది నిజమే నంటూ ఈ ట్వీట్లను షేర్ చేశారు.

Varun Tej: పెళ్ళి పీటలు ఎక్కనున్న మెగా వారసుడు… అసలు విషయం బయటపెట్టిన నాగబాబు!

Varun Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది యంగ్ హీరోలు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఎంతోకాలంగా బ్యాచిలర్స్ గా ఉన్న ఈ యంగ్ హీరోలు ఇప్పుడు పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ కూడా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని తన వివాహాన్ని ప్రకటించాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న మరో యంగ్ హీరో గురు పెళ్లి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్. చాలా కాలంగా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతకాలంగా వరుణ్ తేజ్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని వరుణ్ పెళ్లాడబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై ఇప్పటివరకు మెగా కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. ఇక ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు స్వయంగా స్పందించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి మాట్లాడుతూ తొందరలోనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని వెల్లడించాడు.

Varun Tej: వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..

ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడిస్తాడని, అయితే వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా వరుణ్ వెల్లడిస్తాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఇలా స్పందించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Singer Mano: సింగర్ మనో జబర్దస్త్ వీడటానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన మనో!

Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.

ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.

ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.

Singer Mano: జబర్దస్త్ కు చిన్న బ్రేక్ ఇచ్చాను..


ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Nagababu: నటి పాకీజాకు నాగబాబు ఆర్థిక సాయం… కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా!

Nagababu: ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారందరూ ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని చివరికి ఎంతో దీన పరిస్థితులలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొందరి పరిస్థితి చూసి చాలామంది ఆర్థిక సహాయం చేస్తూ వారికి భరోసా కల్పించగా మరికొందరు మాత్రం ఎలాంటి సహాయం అందక ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఇలా తెలుగు తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వాసుకి గురించి పరిచయం అవసరం లేదు అయితే తెలుగులో ఈమె పాకీజా పేరుతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఒకప్పుడు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఆర్థిక ఇబ్బందులు గురించి తెలిపారు.

తనకు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదని పూట గడవడం కూడా కష్టంగా మారిందని తాను హాస్టల్లో ఉంటున్నానని తెలిపారు. అయితే ఈమె ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు చూసి చలించి పోయిన మెగా బ్రదర్ నాగబాబు ఈమెకు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తనకు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో అవకాశం కల్పించాలని తాను కూడా ప్రయత్నం చేస్తాను అంటూ తెలియజేశారు.

Nagababu: ఎవరు రూపాయి సహాయం చేయలేదు…

ఇలా నాగబాబు తనకు ఆర్థిక సహాయం చేశారని తెలియడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగబాబు గారు తనకు ఎదురుగా ఉంటే కాళ్లకు దండం పెట్టేదాన్ని అని తెలిపారు.తమిళంలో తాను ఎన్నో సినిమాలలో చేసిన తనకు ఎవరూ కూడా ఒక ₹1000 కూడా ఆర్థిక సహాయం చేయలేదని ప్రస్తుతం తాను నాలుగు ముద్దలు తింటున్నాను అవి కేవలం తెలుగువారు, తెలుగు సినిమా పెట్టిన భోజనమేనని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పెద్దగా ఆస్తులు ఏవి లేవు…. డబ్బు కావాలంటే సినిమాలు చేయాల్సిందే: నాగబాబు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఈయన గత తొమ్మిది సంవత్సరాలుగా తన జనసేన పార్టీని స్థాపించి పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇలా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపించాలంటే ఎంతో డబ్బు అవసరం అవుతుంది.

పవన్ కళ్యాణ్ వద్ద పార్టీని నడిపించే స్తోమత ఉందని చాలామంది భావిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ సోదరుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఆస్తిపాస్తుల గురించి అన్ని విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా పవన్ ఆస్తుల గురించి నాగబాబు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తేనే ఆయనకు డబ్బులు వస్తాయని, డబ్బు కావాలంటే సినిమాలు చేయాల్సిందేనని తెలిపారు. అందరి మాదిరిగా ఆయనకు ఇతర వ్యాపారాలు లేవని నాగబాబు వెల్లడించారు.సినిమా చేసిన తర్వాత వచ్చే డబ్బులో తన అవసరాలకు కొంత ఉంచుకొని మిగిలినది మొత్తం ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారని నాగబాబు తెలియజేశారు.

Pawan Kalyan: అప్పు చేసి ఇన్కమ్ టాక్స్ కట్టారు…

మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఆస్తులు లేవా అని యాంకర్ అడగడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుంటున్నటువంటి ఇల్లు ఫైనాన్స్ లో ఉంది అలాగే ఈయనకు 15ఎకరాల పొలం ఉంది. అది వ్యవసాయం చేయాలన్న ఉత్సాహంతో కొనుగోలు చేశారని నాగబాబు తెలిపారు. ఇది తప్ప పవన్ కి ఎలాంటి ఆస్తులు లేవు ఇక ఇన్కమ్ టాక్స్ కట్టడానికి కూడా అప్పు చేసి ఇన్కమ్ టాక్స్ చెల్లించాడంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Getup Srinu: మీ ఉనికి కోసం అపద్దాలు చెప్పి గౌరవాన్ని కోల్పోకండి….. రోజాపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్!

Getup Srinu: గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి గెటప్ శీను మెగా ఫ్యామిలీకి విధేయుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక శ్రీను కూడా ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్లేవాడు అందుకే ఈయన పట్ల ఏ విధమైనటువంటి వివాదాలు కూడా చెలరేగలేదని చెప్పాలి.

ఇక మెగా ఫ్యామిలీకి ఎంతో విధేయుడుగా ఉన్నటువంటి ఈయన తాజాగా రోజా గారి పట్ల షాకింగ్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ టూరిజం మంత్రి రోజా మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్ వైరల్ అయ్యాయి.

దీంతో రోజా వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి గారి సేవ గుణం దానగుణం తెరిచిన పుస్తకం… ఒక స్ఫూర్తి ఆ విషయం మీకెందుకు కనపడలేదో? రోజా గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజలలో మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోకండి.మీ నోటి నుంచి ఇలాంటి పచ్చి అబద్ధాలు వినాల్సి వస్తుందని అనుకోలేదు దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ పోస్ట్ చేశారు.

Getup Srinu: గెటప్ శ్రీనుకి మద్దతుగా మెగా ఫాన్స్…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. గెటప్ శ్రీను రోజా గురించి ఇలా మాట్లాడారేంటి అంటూ కొందరు వైసిపి అభిమానులు గెటప్ శ్రీనుని దారుణంగా ట్రోల్ చేయగా గెటప్ శ్రీనుకి మాత్రం మెగా అభిమానుల సపోర్ట్ చేస్తున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Thammareddy Bharadwaja: నాగబాబు మాట్లాడకపోతేనే చిరంజీవి గౌరవం పదిలంగా ఉంటుంది: తమ్మారెడ్డి భరద్వాజ్

Thammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ది అలుపెరుగని ప్రస్థానం . ఎవరి అండ దండాలు లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉంది. మధ్యలో కొంతకాలం రాజకీయాలలో ప్రవేశించి సినిమాలకు దూరమైనప్పటికీ.. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు.

ఇక అప్పటినుండి వరస సినిమాలలో నటిస్తూ నేటి యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలలో మరొక హీరో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయం గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో చిరు మార్కెట్ తగ్గిపోయిందని వస్తున్న వార్తలలో నిజం లేదని.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ ఆయనకు సపరేట్గా ఉంటుందని వెల్లడించాడు.

చిరంజీవిగారిని ఎవ‌రో వ‌చ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవ‌స‌రం లేదని.. ఆయ‌న ఫాలోయింగ్, రెవెన్యూ ఆయనకు ఉన్నాయని తమ్మారెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా నాగబాబు గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి ఆ తర్వాత చిరంజీవి గురించి తక్కువగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.

Thammareddy Bharadwaja: చిరంజీవిని జాకీ పెట్టి లేపాల్సిన పనిలేదు…


ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ… చిరంజీవి గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడారని నాగబాబు వారు అన్నారు.. కానీ చిరంజీవి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరని.. మనం అలాంటి విషయాలను పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని తమ్మారెడ్డి వెల్లడించాడు. అందువల్ల నాగ‌బాబు గారు అలాంటి విష‌యాల‌ను మాట్లాడ‌క‌పోతే చిరంజీవి గారి గౌర‌వం ఇంకా పెరుగుతుంద‌ని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.