Tag Archives: naresh

Suchendra Prasad: పవిత్ర నా భార్యే.. కానీ సర్టిఫికెట్ మాత్రం లేదు.. పవిత్ర భర్త సుచేంద్ర షాకింగ్ కామెంట్స్?

Suchendra Prasad: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి ఈనటి పేరు సోషల్ మీడియాలో, మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.కన్నడ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఎన్నో కన్నడ సినిమాలలోనూ అలాగే తెలుగు సినిమాలలోను నటించి విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కూడా వార్తల్లో నిలిచారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం వల్ల పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను పవిత్ర లోకేష్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తను నా భార్యేనని, అయితే వివాహమైన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం తీసుకోలేదని సుచేంద్ర వెల్లడించారు.

మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది విదేశీ విధానం ఆ విధానం మాకు నచ్చకపోవటం వల్లే ఉద్దేశపూర్వకంగా తాము మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోలేదని ఈయన వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ మినహా మిగిలిన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి వాటిని పరిశీలిస్తే పవిత్ర నా భార్య అని అర్థమవుతుంది. ఇకపోతే మేమిద్దరం భార్యాభర్తలుగా ఎన్నో కార్యక్రమాలకు కూడా హాజరయ్యామని, నేను తనని హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నానని సుచేంద్ర వెల్లడించారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగింది….

ఇకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ విధానం కావడంతో కేవలం మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రమే తీసుకోలేదు మిగిలిన ఏ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూసిన తను నా భార్య అని స్పష్టంగా అర్థమవుతుంది.ఇకపోతే వీటిని ఆధారంగా చేసుకుని నేను నా మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా సులభంగా తయారు చేయించుకోవచ్చు అంటూ సుచేంద్ర వెల్లడించారు. అయితే గతంలో పవిత్ర లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను సుచేంద్రను వివాహం చేసుకోలేదని కేవలం ఆయనతో రిలేషన్ లో మాత్రమే ఉన్నానని ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా నరేష్ పవిత్ర వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే.. నేను అందంగా ఉంటాను నన్ను కూడా పిలిచేవాడుగా.. ఆయన మనసు ఎంతో మంచిది.. : నటి పూజిత

Actress Poojitha: గత కొద్ది రోజుల నుంచి నటుడు నరేష్ వ్యవహారం మీడియా వార్తలలో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురుకు విడాకులు ఇవ్వడం హాట్ టాపిక్ అయితే, నటి పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక వీటి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో రమ్య మూడో భార్య సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడిగేవాడు.. ఆయన మనసు ఎంతో మంచిది.. నటి పూజిత కామెంట్స్ వైరల్?

ఈ సందర్భంగా రమ్య నరేష్ ని ఉద్దేశిస్తూ తను ఉమనైజర్ అని,తనకు ఎంతో మంది మహిళలతో సంబంధం ఉంది అంటూ తన వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా రమ్య నరేష్ వ్యక్తిత్వం గురించి మాట్లాడటంతో నటి పూజిత స్పందించారు.పూజిత కూడా పలు సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి గుర్తింపు పొందారు.

ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ నరేష్ తో కలిసి తాను ఎన్నో సినిమాలలో నటించానని, నేను కూడా అందంగానే ఉన్నాను,ఆయన నిజంగానే ఉమనైజర్ అయితే నన్ను కూడా ఎక్కడికైనా వెళ్దాం పద పూజ అని అడగాలి కదా..నరేష్ ఎప్పుడు తనని అలా అడగలేదని ఆయన చాలా మంచివారు అంటూ ఈ సందర్భంగా పూజిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడిగేవాడు.. ఆయన మనసు ఎంతో మంచిది.. నటి పూజిత కామెంట్స్ వైరల్?

నరేష్ వందల మందికి సహాయం చేశారు…

నరేష్ తనని తోబుట్టువుగా చూసుకుంటారని ఆయన ఎన్నోసార్లు నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు సహాయం చేశారని ఈమె తెలిపారు. నాకు సహాయం చేశారు కదా అని నరేష్ గురించి ఇలా మాట్లాడటం లేదని, ఈయన నాలాంటి వాళ్లకు ఎంతో మందికి సహాయం చేశారు. ఏకంగా ఆయన ద్వారా సహాయం పొందిన వారు దాదాపు 1500 మంది వరకు ఉన్నారని, అయితే ఈ విషయాలు ఎక్కడ చెప్పలేదని పూజిత వెల్లడించారు. ఇక ఈ విషయాలను మీడియాకు వెల్లడిద్దామని నేను చెప్పగా వద్దు పూజ నువ్వు ఒక నటివి ఈ విషయాలన్నీ బయట పెడితే డీగ్రేడ్ అవుతావ్ అంటూ తనని ఆపారని అది నరేష్ వ్యక్తిత్వం అంటూ పూజిత రమ్య వ్యాఖ్యలను ఖండించారు

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

Ramya Raghupathi: గత కొన్ని రోజుల నుంచి నరేష్ రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ మధ్య ట్రయాంగిల్ వివాదం కొనసాగుతోంది.వీరి పెళ్లి, విడాకులు, సహజీవనం గురించి పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్ లోని ఒక హోటల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలిసిన రమ్య ఏకంగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు మైసూర్ లోని ఒక హోటల్లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రమ్య ఏకంగా హోటల్ కి వెళ్లి పవిత్ర లోకేష్ పై చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రమ్యను పోలీసులు అడ్డుకున్నారు.హోటల్లో రమ్మని చూస్తున్న నరేష్ విజిల్ వేస్తూ పవిత్రతో కలిసి లిఫ్ట్ లో పైకి వెళ్లడంతో రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రమ్య ఏకంగా నటి పవిత్ర పై దాడికి ప్రయత్నించిందని తెలుస్తుంది.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే పవిత్ర కారణంగానే నరేష్ కు తనకు మధ్య దూరం ఏర్పడిందని మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ మేము ఇంకా విడాకులు తీసుకోలేదని,నాకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ ఈమె ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రమ్య పవిత్ర గురించి ఆరోపణలు చేయడంతో పవిత్ర స్పందించారు.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

పవిత్ర పై దాడికి ప్రయత్నించిన రమ్య…

రమ్య ఉద్దేశపూర్వకంగానే తనని బ్యాడ్ చేయడం కోసమే హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చి ఇక్కడ తనని బ్యాడ్ చేస్తుందని ఆరోపించారు. తనకు భర్త కావాలి అనుకున్నప్పుడు కుటుంబంతో కలిసి కుటుంబ పెద్దలతో తన సమస్య గురించి మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదంటూ పవిత్ర రమ్య వ్యాఖ్యలపై స్పందించారు. అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్లో ఒక హోటల్లో కనిపించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

Actor Naresh: సినీ నటుడు నరేష్ వ్యక్తిగత విషయాలతో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ మూడు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే నరేష్ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

ఇక నరేష్ తో తనకు విడాకులు వద్దని తనతో కలిసి జీవించడానికి ఆసక్తి కనబరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే రమ్య మాట్లాడుతూ పవిత్ర లోకేష్ కారణంగానే నాకు నరేష్ కి మధ్య గొడవలు వచ్చాయని ఆమె వల్లే మేము విడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై నరేష్ స్పందిస్తూ రమ్య ఎప్పుడు కూడా నాకు భార్యగా వ్యవహరించలేదని, తను తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఎంతో బిజీగా గడుపుతో ఉన్నారని తనకు అక్రమ సంబంధం ఉండడం వల్లే తనకు విడాకులు ఇచ్చానని తెలిపారు.

Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

రమ్య తన జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.తన డబ్బు కావాలని పెద్ద ఎత్తున నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని జైలుకు వెళ్తానంటే పది లక్షలు నేనే ఇచ్చానని అలాగే తన అప్పులు మొత్తం తానే కట్టానని నరేష్ వెల్లడించారు.ఇక ఇప్పుడు బెంగుళూరుకు వెళ్లి అక్కడ నా గురించి తప్పుగా ఆరోపణలు చేస్తుందని నరేష్ వెల్లడించారు. ఇకపోతే తన భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తుందని, అందుకే నా దగ్గర డబ్బు గుంజి నన్ను మోసం చేయాలని చూస్తుందని నరేష్ ఆరోపించారు.

రమ్య మానసిక పరిస్థితి బాగాలేదు..

రమ్య మానసిక పరిస్థితి బాగోలేదని తనని మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలని నరేష్ కామెంట్స్ చేశారు. ఇకపోతే తనకు రమ్యా నుంచి రమ్య ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని తెలుసుకుని తనతో విడాకుల కోసం అప్లై చేశానని నరేష్ తెలిపారు. ఇక తనకూ కొన్ని అవసరాలు ఉంటాయి. తనకు ఎమోషనల్ సపోర్ట్ గా ఒకరు కావాలి ఆ సమయంలోనే తనకు పవిత్ర పరిచయమైందని,తను నాకు మూడు సంవత్సరాల క్రితమే పరిచయమైంది కానీ రమ్య నా జీవితంలో ఎనిమిది సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది అంటూ నరేష్ వెల్లడించారు.ఇక పవిత్రతో సహజీవనం చేస్తానా పెళ్లి చేసుకుంటానా అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తాను ఏం చేసినా అధికారకంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

Pavitra Lokesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కేవలం పవిత్ర లోకేష్, నరేష్ ల సహజీవనం అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంటర్ అయ్యారు.

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

ఈ క్రమంలోనే రమ్య సోషల్ మీడియా వేదికగా బెంగళూరులో నటి పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర లోకేష్ వల్లే మేము దూరం అయ్యాం అంటూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలపై పవిత్ర లోకేష్ స్పందించారు.ఈ సందర్భంగా ఒక వీడియోలో పవిత్ర మాట్లాడుతూ తనకు నరేష్ కు సంబంధం ఉందా అనే విషయాన్ని దాటవేస్తూ.. నేను ఏంటో అందరికీ తెలుసు. నరేష్ గారు ఆయన ఫ్యామిలీ ఎలాంటిదో టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు.

Pavitra Lokesh: దయచేసి నన్ను నరేష్ ను సపోర్ట్ చేయండి.. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు: పవిత్ర లోకేష్

రమ్య అనవసరంగా బెంగళూరుకు వచ్చి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తనకు తన భర్తతో కలిసి ఉండాలంటే ఆమె హైదరాబాదులోనే మీడియాతో మాట్లాడవచ్చు కానీ బెంగుళూరుకు వచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నన్ను బ్యాడ్ చేశారని ఆరోపించారు. వారిద్దరి రిలేషన్ కి తాను అడ్డుగా ఉన్నానని, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటూ లేనిపోని ఆరోపణలు చేశారు.

తన ఫ్యామిలీతో మాట్లాడి సమస్యను పరిష్కరించవచ్చు..

ఈ విధంగా రమ్య చేసిన ఆరోపణలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఈమె ఇక్కడకు వచ్చి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను దోషిగా నిలపెట్టింది. రమ్య గారికి తన భర్త కావాలంటే హైదరాబాదులో తనకు పెద్ద ఫ్యామిలీ ఉంది. తన ఫ్యామిలీ పెద్దలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఇలా నాపై ఆరోపణలు చేయడం బాధగా ఉంది. దయచేసి ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు నరేష్ కి ఉండాలంటూ ఈమె వెల్లడించారు.ఇలా అందరి సపోర్ట్ నరేష్ కు తనకు ఉండాలని ఈమె చెప్పడంతో ఈ వీడియో వైరల్ అయింది.

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

Naresh: సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ఏదో విషయంలో వివాదాస్పదం అవుతున్నాడు. గతంలో కామెడీగా క్రేజ్ సంపాదించుకున్న నరేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ‘ మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు మద్దతు తెలుపుతూ… తెగ హంగామా చేశాడు నరేష్. మంచు ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి పెద్ద మోహన్ బాబే అంటూ.. తెగ హడావుడి చేశారు. 

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే మరోసారి నరేష్ పేరు తెరపైకి వచ్చింది. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి.. నరేష్‌, ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. ఆమె మీద గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై నరేష్‌ స్పందిస్తూ.. రమ్యకు, తనకు ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు.

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.  నరేష్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట్లో తల్లి విజయ నిర్మల చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు.

ఆ తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. మూడో పెళ్లిగా ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే వీరికి కూడా విడాకులు అయ్యాయని..

మూడో పెళ్లి కూడా పెటాకులు..

మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను  వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం రమ్యకు కూడా విడాకులు ఇచ్చాడని.. నెలనెల మెయింటనెన్స్ చెల్లిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Senior Actor Naresh: ఇండస్ట్రీకి, మాకి పెద్దన్న ఆయనే… నరేష్ కామెంట్స్ వైరల్!

Senior Actor Naresh: దివంగత దాసరి నారాయణరావు మరణించిన తరువాత సినీ పెద్ద ఎవరు అనే విషయం గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయం మా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీకి మోహన్ బాబు పెద్దగా వ్యవహరిస్తే బాగుంటుందని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేయగా మరికొందరు ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Senior Actor Naresh: ఇండస్ట్రీకి, మాకి పెద్దన్న ఆయనే… నరేష్ కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ… ఇండస్ట్రీకి మా అందరికీ పెద్ద మోహన్ బాబు గారే అంటూ ఆయన గురించి మాట్లాడారు.

Senior Actor Naresh: ఇండస్ట్రీకి, మాకి పెద్దన్న ఆయనే… నరేష్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికీ అన్న, అందరి కంటే మిన్న మోహన్ బాబు గారు. ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప హీరోలు, గొప్ప విలన్లు ఉన్నారు. అలాగే గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు వీరందరూ కలిస్తేనే మోహన్ బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా కోసమే పుట్టిన వ్యక్తి…

ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యాసంస్థలను నెలకొల్పి ఆ విద్య సంస్థలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మోహన్ బాబు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని….సినిమా కోసమే ఆయన పుట్టిన వ్యక్తి అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Senior Naresh: ఖరీదైన స్పోర్ట్స్ కార్ కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేష్.. వీడియో వైరల్!

Senior Naresh:సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ తారలు ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో ఉంటారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఏదో ఒక విషయం ద్వారా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

Senior Naresh: ఖరీదైన స్పోర్ట్స్ కార్ కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేష్.. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నరేష్ గత కొద్ది రోజుల క్రితం సొంత కారవ్యాన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తన కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా కారవాన్ కొనుగోలు చేసిన కొన్ని రోజులకే మరొక స్పోర్ట్స్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Senior Naresh: ఖరీదైన స్పోర్ట్స్ కార్ కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేష్.. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే తన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా కారుతో కలిసి దిగిన ఫోటోని తన ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత తన కల నెరవేరిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువ..

పర్పుల్ కలర్ కలర్ కలిగిన ఈ స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేస్తూ సరదాగా రోడ్డుపై చక్కర్లు కొట్టారు. ఎంతో అందంగా కనిపించే ఈ స్పోర్ట్స్ కారు ధర సుమారు 35 లక్షల వరకు ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కారుని డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వీడియోని కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఎంతో మంది అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Actor Naresh: ఖరీదైన కారవ్యాన్ కొనుగోలు చేసిన యాక్టర్ నరేష్.. ఫోటోలు వైరల్!

Actor Naresh: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే హీరో హీరోయిన్లకు కారవ్యాన్ ఉండటం సర్వసాధారణం.ఈ విధంగా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు వారికి అనుగుణంగా అన్ని సదుపాయాలతో ప్రత్యేకంగా ఈ కారవ్యాన్ ఏర్పాటు చేయించుకొని షూటింగ్ లొకేషన్ కి వెళుతుంటారు. వారిపై షాట్ పూర్తికాగానే చాలామంది నటీనటులు ఈ కారవ్యాన్ లో రెస్ట్ తీసుకుంటూ అనంతరం తదుపరి షాట్ కి రెడీ అవుతారు.

Actor Naresh: ఖరీదైన కారవ్యాన్ కొనుగోలు చేసిన యాక్టర్ నరేష్.. ఫోటోలు వైరల్!

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఎంతో విలువ చేసే కారవ్యాన్ లను కొనుగోలు చేశారు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నరేష్ సైతం కారవ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా సొంతంగా కారవ్యాన్ లేదు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇతరుల కారవ్యాన్ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదని భావించిన నరేష్ సొంతంగా కారవ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ముంబై నుంచి ఈ
కారవ్యాన్ అన్ని సదుపాయాలతో తయారు చేయించారని సమాచారం.

కారవ్యాన్ ప్రత్యేకతలు ఇవే..

కొన్ని కోట్ల ఖరీదు చేసే ఈ కారవ్యాన్ లో వెయిటింగ్ రూమ్, ఏసి బెడ్ రూమ్, మేకప్ ప్లేస్, జిమ్, వాష్ రూమ్ వంటి సదుపాయాలతో ఈ కారవ్యాన్ ను రూపొందించారు. ప్రస్తుతం నరేష్ కారవ్యాన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈయన కెరీర్ లో హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ ఏడాది నుంచి ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభిస్తున్నట్లు తాజాగా నరేష్ వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.

అమ్మ పేరు పెట్టి తిడతారా.. ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్స్..!

ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యవహారం ముగిసిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో విష్ణు కు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని చెప్పాడు.

ఇలా.. మా ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం తగ్గలేదు. ఆ రాజీనామాలను తాను ఆమోదించనని.. అందరం కలిసి ముందుకు వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ఉత్తేజ్ మాట్టాడారు. ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత ‘మా’లో నరేష్ ప్రవర్తన అస్సలు బాగాలేదేని.. ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అమ్మల పేరు పెట్టి మరీ బూతులు తిడుతున్నారని అన్నారు. ఈసీ సభ్యులం అయిన తాము ‘మా’ కార్యాలయానికి వెళ్లాలంటే.. థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల రోజు నరేష్ అన్న మాటలు తాను మర్చిపోలేను అని.. అతడు తన మొహంలో పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ సవాల్ విసిరాడు అని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము వారితో కలిసిపోయి ఎలా పని చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.