Tag Archives: Nukaraju

Punch Prasad: తను లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని… పిల్లలను గుర్తు చేసుకుంటే ఏడుపాగదు: పంచ్ ప్రసాద్

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ ఆరోగ్యం రోజురోజుకీ క్షమించిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు రోజా గారు నాగబాబు గారు తనకు ఆర్థికంగా చాలా సహాయం చేశారని తెలియజేశారు.

నూకరాజు తనకు తమ్ముడి కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు. ఇక కిరాక్ ఆర్ పి లక్ష రూపాయల వరకు సహాయం అందించారని తెలిపారు.ఇక నేను ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే తనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని ప్రసాద్ తెలిపారు. అయితే తన పిల్లల గురించి ఆలోచించి సర్జరీ కాస్త ఆలస్యం చేశానని ఈయన వెల్లడించారు. తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

Punch Prasad: పిల్లల గురించి తలుచుకుంటే ఏడుపొస్తుంది…


తన భార్య తన పిల్లల కన్నా నన్నే చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారని ఆమె లేకపోతే నేను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని అంటూ ఈయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నా పిల్లల గురించి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగవని ఒకప్పుడు నా గురించి చాలామంది ఆలోచించి తనకు సహాయం చేస్తామని చెప్పినా నేను వద్దని చెప్పానని ప్రసాద్ తెలిపారు. అయితే డాక్టర్లు మాత్రం టాబ్లెట్స్ వాడటం కన్నా సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని చెప్పారు. కానీ ఈ సర్జరీ కొందరికి సక్సెస్ అవుతుంది మరికొందరికి సక్సెస్ కాదు అన్న భయంలో తాను ఉన్నానని తెలిపారు.ఇలా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Punch Prasad: మరింత విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం… దాతల సాయం కోసం ఎదురుచూపులు?

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా కమెడియన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొంతకాలంగా తన రెండు కిడ్నీలో ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ప్రసాద్ రెండు కిడ్నీలో ఫైల్ అవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ దాతల కోసం ఎదురుచూశారు. అయితే తనకు కిడ్నీ దొరికింది అంటూ ఒకానొక సమయంలో తన భార్య సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నూకరాజు సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలియజేశారు.

రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రసాద్ అన్న కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని లేకపోతే ఏ క్షణం అయినా ఏదైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారని నూకరాజు తెలిపారు.

Punch Prasad: ఫోన్ పే చేయవచ్చు..


ఇక డాక్టర్లు సర్జరీ చేయాలి అంటే భారీగా డబ్బు అవసరం అవుతుంది అందుకోసమే ఎవరైనా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నామని నూకరాజు తెలిపారు. అంతేకాకుండా ఈయనకు ఎవరైనా తనకు ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ కి చేయొచ్చు అంటూ నెంబర్ ఇవ్వడమే కాకుండా తన భార్య బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Vishnu Priya: మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతా… తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయినా విష్ణు ప్రియ!

Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు విష్ణు ప్రియ యాంకర్ గా కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలు చేసిన అనంతరం ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఇకపోతే విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఇలా తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ విష్ణు ప్రియ చేసినటువంటి పోస్టులు అందరినీ ఎంతగానో కలిచి వేసాయి. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రియమైన అమ్మకు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరినీ వారి తల్లులతో ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఇందులో రాకింగ్ రాకేష్ నూకరాజు ఒక స్కిట్ చేశారు. ఆ కొడుకులు ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల తన తల్లి చనిపోతుంది ఇలా తల్లి చనిపోవడంతో తమవల్లే చనిపోయిందని ఆ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తారు.

Vishnu Priya: నీకు కూతురుగానే పుడతాను…


ఈ సన్నివేశం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ సన్నివేశం చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతానమ్మా ఐ లవ్ యు సో మచ్ అమ్మ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే విష్ణు ప్రియని చూసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahesh Babu: ఒక్కడు సినిమా స్పూఫ్ చేసిన నూకరాజు.. మండిపడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబుకి ఉన్న అభిమానుల గురించి మనకు తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక మహేష్ బాబు సినీ కెరియర్ లో ఆల్ టైం రికార్డ్ గా ఉన్నటువంటి చిత్రాలలో ఒక్కడు సినిమా ఒకటి. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు నటనతో పాటు ప్రకాష్ రాజ్ నటన కూడా అద్భుతమనీ చెప్పాలి.

ఇకపోతే ఇలా ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలను బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కమెడియన్లు స్పూఫ్ చేయడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కమెడియన్స్ చేసే స్పూఫ్ నవ్వు తెప్పించడమే కాకుండా మరి కొన్నిసార్లు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తూ ఉంటాయి.తాజాగా జాతి రత్నాలు కార్యక్రమాలలో భాగంగా నూకరాజు మహేష్ బాబు ఒక్కడు స్పూఫ్ చేశారు.

Mahesh Babu: నూకరాజు పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్…

మహేష్ బాబు చేతితో ముక్కును అనుకోవడం మొన్న క్యాలీఫ్లవర్ లో సంపూర్ణేష్ బాబు నేడు మహేష్ బాబు అనే డైలాగ్ చెప్పడమే కాకుండా.. ఎలాగైనా కబడిలో గెలవాలన్నయ్య అనే డైలాగులను వెటకారంగా చెబుతూ క్లాప్స్ కొట్టారు. ఇలా మహేష్ బాబు సినిమాలు స్పూఫ్ చేస్తూ ఆయనని అవమానించడంతో మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే నూకరాజు ఇలా చేశారంటూ భారీ స్థాయిలో మహేష్ ఫ్యాన్స్ నూకరాజు పై ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.

Rocking Rakesh – Sujatha: స్టేజ్ మీదే ముద్దులతో రెచ్చిపోయిన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత..!

Rocking Rakesh -Sujatha: ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ద్వారా కేవలం కమెడియన్ లు మాత్రమే కాకుండా పలువురు జంటలు కూడా తెగ పాపులర్ అవుతున్నాయి. జబర్దస్త్ షోలో కొంతమంది లేడీ కమెడియన్స్, కమెడియన్ తోనే ప్రేమలో పడినట్లు అనేక రకాల వార్తలు వినిపించగా వారు కూడా అందుకు అనుగుణంగానే అడ్వాంటేజ్ గా మాట్లాడుతూ చేస్తుండడంతో అది నిజమే అని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే వర్ష- ఇమాన్యుల్, ఆసియా -నూకరాజు, సుజాత- రాకేష్ ఇలాంటి జంటలు తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో రియాలిటీ షోలలో ప్రేమ వ్యవహారాలను హైలెట్ చేస్తూ రేటింగ్స్ అందుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన జంటల్లో సర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ జంట కూడా ఒకటి. కాగా ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టాప్ కమెడియన్స్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లో చేస్తున్న సుజాత, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా వీరిద్దరూ అప్పుడప్పుడు స్కిట్ల మధ్యలో ఎమోషనల్ అవ్వడం హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేయడంతో వీధి మధ్య లవ్ నిజంగానే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..తనది ప్రేమ కాదు అంతకంటే ఎక్కువ బంధం అని కూడా చెప్పడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.

Rocking Rakesh -Sujatha:ఎమోషనల్ అయినా సుజాత..

ఇక తాజాగా జరిగిన షోలో భాగంగా రాకేష్ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టడంతో రాకింగ్ రాకేష్ మాటలు విన్న సుజాత స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ గా దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. అంతేకాకుండా నుదుటి పై ముద్దు కూడా పెట్టి తన ప్రేమను తెలియజేసింది సుజాత. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.