Tag Archives: Poorna

Actress Poorna: తనే నా ప్రపంచం.. ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన నటి పూర్ణ… వీడియో వైరల్!

Actress Poorna: సినీ నటి పూర్ణ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏప్రిల్ నాలుగవ తేదీ ఈమె మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ విధంగా పూర్ణ తలైందనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఈమె ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్ చైర్ లో వస్తుండగా తనకోసం ఒక గదిని ఎంతో అద్భుతంగా అలంకరించి బేబీ బాయ్ అని రాసి ఉంచి తనకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక ఈ వీడియోని పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు.

బాబు పుట్టినప్పటినుంచి అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పూర్ణ ఈ వీడియోని షేర్ చేస్తూ… నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమె నా ప్రపంచం. ఇప్పుడు నేను మరొకరికి తల్లిని అయ్యాను..ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Actress Poorna: పరిపూర్ణ స్త్రీ గా మారాను..


ఇక పూర్ణ గత ఏడాది జూన్ నెలలో ఆసిఫ్ అలీ అనే దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత కొన్ని నెలలకే ఈమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తను కూడా అభిమానులతో పంచుకొని తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈమె పలు తెలుగు సినిమాలతో పాటు తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

Tollywood Actress: శిల్పా శెట్టి నుంచి హన్సిక వరకు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే?

Tollywood Actress: సినిమా ఇండస్ట్రీలో నటీమణులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు మాత్రం ప్రముఖ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది నటీమణులు వ్యాపారవేత్తలతో ఏడడుగులు నడిచారు. మరి బిజినెస్ మేన్ లని పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…

శిల్పా శెట్టి: తెలుగు హిందీ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

ఆసిన్: గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న ఆసిన్ అనంతరం పలు తెలుగు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈమె మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ప్రియమణి: పెళ్లయిన కొత్తలో, రగడ, యమదొంగ వంటి పలు సినిమాలలో నటిస్తున్న ప్రియమణి ఈవెంట్ ఆర్గ‌నైజింగ్ బిజినెస్ చేసే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇది రెండవ వివాహం.

Tollywood Actress:

పూర్ణ: అవును సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

కాజల్: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను సొంతం చేసుకుని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన కాజల్ స్నేహితుడు కావడం విశేషం.

హన్సిక: దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమె ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈయనకు కూడా ఇది రెండవ వివాహం.

Poorna: రహస్యంగా వివాహం చేసుకున్న నటి పూర్ణ.. అలా బయటపడిన సీక్రెట్?

Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రీమహాలక్ష్మి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి పూర్ణ.ఇలా వరుస సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే పూర్ణ మే నెలలో ఆసిఫ్ అలీ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నట్టు ఈమె వెల్లడించారు.

ఇలా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ఈమె ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారని ఎదురుచూస్తున్నటువంటి అభిమానులకు పూర్ణ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ షాకింగ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు అందరూ ఎంతో షాక్ అయ్యారు.

ఈ విధంగా పూర్ణ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని చెబుతూ అందరికి షాక్ ఇచ్చింది.మే నెలలో నిశ్చితార్థం జరుపుకున్న పూర్ణ జూన్ లోనే వివాహం చేసుకున్నారు. అయితే తన పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో దుబాయిలో ఘనంగా జరిగిందని వీసా సమస్య కారణంగా ఎవరిని తన పెళ్లికి ఆహ్వానించలేకపోయామని ఈమె తెలిపారు.

Poorna: తల్లి కాబోతున్న పూర్ణ…

ఇకపోతే ఇప్పుడు కూడా తన పెళ్లి ప్రస్తావన బయటకు పెట్టడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పూర్ణ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె ప్రెగ్నెంట్ కావడంతో తన పెళ్లి సీక్రెట్ బయట పెట్టారని తెలుస్తుంది. తన బేబీ బంప్ కనిపించడంతో అందరూ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈమె తన పెళ్లి సీక్రెట్ బయటపెట్టినట్టు తెలుస్తుంది.

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం రెండు రోజుల పాటు ప్రసారమవుతూ ఈ కార్యక్రమం ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

ఇక ఈ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించినరోజాకు మంత్రిపదవి రావడంతో ఇక జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ వేదిక పై రోజాకు ఘనంగా వీడ్కోలు తెలిపారు.ఈ వేదిక పై రోజా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పూర్ణ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ ప్రోమోలో భాగంగా పూర్ణ పైమాకి ముద్దు పెట్టడంతో ఇమ్మాన్యుయేల్ కూడా తనకి ముద్దు కావాలని అడుగుతాడు.

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

ఇమ్మాన్యుయేల్ అడగడంతో పూర్ణ తనకు ముద్దు పెడతా అని చెప్పగా బుగ్గపై ముద్దు పెడుతుందని ఇమ్మాన్యుయేల్ ఎంతో ఆశగా అక్కడికి వెళ్తాడు అయితే పూర్ణ తన చేతిపై ముద్దు పెట్టి షాక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ సైతం తనకి ముద్దు కావాలని అడుగుతాడు. సుధీర్ ఇలా అడిగేసరికి పూర్ణ తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అడ్డుపడిన రష్మి…

నువ్వు నా బుగ్గ పై కొరికితే నీకు ముద్దు పెడతా అని చెప్పడంతో సుధీర్ సరేనంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు.ఈ సమయంలో రష్మి కల్పించుకుని పూర్ణ గారు మీరు ముద్దు పెడితే నేను ఒప్పుకోను అంటూ అడ్డుపడుతుంది. అయితే ఈ ప్రోమోలో సుధీర్ కి పూర్ణ ముద్దు పెట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ప్రోమో పై స్పందిస్తూ పూర్ణ ఢీ లోనే కాకుండా ఇక్కడ కూడా బుగ్గ కొరడాలు మొదలుపెట్టింది నువ్వు మారవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

డబ్బే కావాలంటే.. మరో స్థితిలో ఉండేదాన్ని.. నేను అలా చేయాలనుకోలేదు: పూర్ణ

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ఢీ’ రియాల్టీ డ్యాన్స్ షోలో ఒక జడ్జిగా పూర్ణ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె తెలుగులో ‘సీమ టపాకాయ్’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అల్లరి నరేష్ తో జతకట్టారు. అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తర్వాత పలు క్రేజీ సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అవును’ సినిమా చేస్తున్న సమయంలో తనకు బోయపాటి నుంచి ఆఫర్ వచ్చిందని.. అనుకోని కారణాల వల్ల వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుతం ‘అఖండ’లో ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ఇలా మాట్లాడారు. నిజానికి ఇప్పుడీ చిత్రంలో నేను పోషించిన పాత్రను తొలుత మరో నటిచేయాల్సింది. తర్వాత ఆ పాత్రకు నన్ను సంప్రదించగానే షాకయ్యా.

ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాది ఓ చిన్న పాత్రై ఉంటుందేమో అనుకున్నా. బోయపాటి సర్‌ కథ గురించి.. నా పాత్రకున్న ప్రాధాన్యత గురించి చెప్పాక చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ఇక మంచి చెడులను తెలుసుకుంటూ.. కేరళ నుంచి వచ్చిన తాను తెలుగులో సంపూర్ణంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇక సెలెబ్రిటీలు అనే వాల్లు పబ్లిక్ ప్రాపర్టీ అని.. ఎదుకంటే.. వాళ్ల వళ్లనే సెలెబ్రిటీ హోదా వచ్చిందని చెప్పుకొచ్చారు.

నెగిటివ్ .. పాజిటివ్ కామెంట్లను ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక డబ్బే కాలవాలంటే.. తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసి ఉండాలని.. కెరీర్ సాఫీగా కొనసాగాలంటే.. మంచి పాత్రల్లోనే నటించాలని చెప్పింది. ఏదేమైనా ఇప్పుడు బోయపాటి – బాలకృష్ణల కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ చిత్రంలో నేను భాగమయ్యా. ఎంతో సంతృప్తిగా ఉందన చెప్పారు.

పూర్ణతో ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రవిబాబు.. ఏమన్నారంటే..?

రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కమెడియన్ గా కూడా అతడు తన మార్క్ ను చూపించాడు. మొదటిసారిగా అల్లరితో దర్శకుడి అవతారమెత్తి ఆ జోనర్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

అల్లరి సినిమా హిట్ కావడంతో.. తర్వాత ఎన్నో సినిమాలను తెరపైకి ఎక్కించాడు. అందులో నచ్చావులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అతడు థ్రిల్లర్లు, హర్రర్ సినిమాల వైపు కన్నేశాడు. అందులో భాగంగానే అతడు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా భూమిక, పూర్ణలను ఎంచుకున్నాడు.

దాదాపు వీళ్లతోనే ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో రవిబాబుకు వీళ్లకు మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కోడై కూశాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ సినిమా తీసినా ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు.

అటువంటి క్యారెక్టర్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్ణతో వరుసాగా మూడు సినిమాలు తీశాను.. కేవలం ఆమె అభినయం కారణంగానే తన సినిమాల్లో పెట్టుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. తనతో మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు వస్తారు.. అస్సలు ఇష్టపడతారా.. అంటూ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు అంటూ చెప్పుకొచ్చాడు.

అలా జరగడంతో.. 3 నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది : నటి పూర్ణ

సాధారణంగా చాలామందికి టెర్రస్ మీద అంటే మేడ మీద ప్రేమ కథలు జరిగే ఉంటాయి. చిన్నతనం నుంచి ఏదో ఒక సందర్భంలో ఇలా టెర్రస్ పైకి ఎక్కి ప్రేమ వ్యవహారాలను నడిపే ఉంటారు. మేడ మీదకు చదువుకోవడానికి వెళ్లినప్పుడో.. లేదా బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడో ప్రేమ కథలు నడిచే ఉంటాయి.

ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీలు అంటారు. ఇలాంటి స్టోరీలు వారి వారి జీవితంలో జరిగే విషయాలను తమ కళ్ల ముందుకు తీసుకొచ్చేందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ప్రయత్నిస్తున్నాడు. దాని కోసం తన యూ ట్యూబ్ ఛానల్ లో స్వీయ నిర్మాణంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య ఢీ డాన్స్ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్‌కి జడ్జీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇలా టెర్రస్ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్ షోలకు సంబందించిన ప్రముఖ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైపర్ ఆది, ప్రియమణి, అనసూయ తమ టెర్రస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుని ప్రమోషన్ చేశారు. తాజాగా నటి పూర్ణ తన టెర్రస్ అనుభవాలను పంచుకున్నారు.

ఆమె లవ్ స్టోరీ కాకుండా టెర్రస్ పై జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చారు. తన ఇంటి చుట్టు పక్కల ఉండే వాళ్లు అంతా తనకు బ్రదర్స్ అని.. అందుకే ఎలాంటి లవ్ స్టోరీలు లేవని చెప్పారు. చిన్నతనంలో ఓ రోజు టెర్రస్ మీద నుంచి కిందపడగా.. తలకు పెద్ద గాయం అయిందని.. మూడు నెలల ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నామని.. శేఖర్ మాస్టార్ కు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు పూర్ణ.

నయనతారలా చేయాలని ఉంది.. నేనంత స్టార్ హీరోయిన్ ను కాదు: హీరోయిన్ పూర్ణ

ప్రస్తుతం బుల్లితెరపై ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహిస్తున్న మళయాళీ భామ పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. సీమ టపాకాయ్ సినిమాతో మొదటి సారిగా అల్లరి నరేశ్ సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

తర్వాత కమెడియన్ శ్రీనివాస్ సరసన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కూడా నటించారు. ఆ తర్వాత పూర్ణకి తెలుగులో ఎక్కువగా ఆఫర్లు రాలేదు. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కలిపి మొత్తం 40 సినిమాల్లో నటించింది పూర్ణ. అటు సినిమాల్లో.. ఇటు బుల్లితెరపై నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించిన సుందరి సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. దీనిలో హీరోగా బుల్లితెర నటుడు అర్జున్ అంబటి నటించారు.

ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘సుందరి’ చిత్రంలో తాను చేసింది స్టార్‌ హీరోయిన్స్‌ స్థాయివారు చేసే పాత్ర.. నేనింకా ఆ స్థాయికి రాలేదు. కానీ తన మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె హైదరాబాద్ లోని విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతే కుండా తనకు నయనతార స్పూర్తి అంటూ చెప్పారు. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది అంటూ ఆమె అన్నారు.

చిత్ర నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని ఇన్ని రోజులు ఆగామని ఆయన చెప్పారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుందన్నారు. ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ అని డైరెక్టర్ చెప్పారు.

ఆ ఫీలింగ్ ఆపుకోలేక ఆ డాన్సర్ బుగ్గను కొరికేసిన జడ్జ్ పూర్ణ..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీఈ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ షోలో న్యాయనిర్ణేతలుగా పూర్ణ, ప్రియమణి వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి జడ్జిమెంట్ పలు వివాదాలకు కారణమవుతోంది. సాధారణంగా కంటెస్టెంట్ లకు జడ్జిలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.వారు డాన్స్ బాగా చేస్తే వారు ఫర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం జడ్జిగా వ్యవహరిస్తున్న వారి పని. కానీ డీ షోలో మాత్రం కంటెస్టెంట్ లకు హగ్గులు,ముద్దులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.

అదేవిధంగా యాంకర్ ప్రదీప్, ఆదితో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గతంలో ఢీ అంటే కేవలం రష్మి, సుధీర్ మధ్య మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఉండేవి. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సన్నివేశాలను పూర్ణ ప్రియమణి ఇద్దరు యాంకర్ తో కూడా రొమాన్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ ఏకంగా తన బుగ్గపై కొరకడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో వస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన” మాటేరాని చిన్నదాని.. కళ్ళు పలికే ఊసులు”.. అనే సూపర్ హిట్ పాటకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేశారు.

ఈ విధంగా డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ తన సీట్ నుంచి వెళ్లి ఏకంగా ఆ డాన్సర్ బుగ్గపై గట్టిగా కొరకడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వీరి వ్యవహారం హగ్గుల నుంచి కిస్ లు వరకు వెళ్లి ప్రస్తుతం బుగ్గ కొరకడం వరకు వెళ్ళారంట తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.