Tollywood Actress: సినిమా ఇండస్ట్రీలో నటీమణులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు మాత్రం ప్రముఖ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది నటీమణులు వ్యాపారవేత్తలతో ఏడడుగులు నడిచారు. మరి బిజినెస్ మేన్ లని పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
శిల్పా శెట్టి: తెలుగు హిందీ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.
ఆసిన్: గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న ఆసిన్ అనంతరం పలు తెలుగు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈమె మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ప్రియమణి: పెళ్లయిన కొత్తలో, రగడ, యమదొంగ వంటి పలు సినిమాలలో నటిస్తున్న ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్ చేసే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇది రెండవ వివాహం.
పూర్ణ: అవును సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
కాజల్: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను సొంతం చేసుకుని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన కాజల్ స్నేహితుడు కావడం విశేషం.
హన్సిక: దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమె ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈయనకు కూడా ఇది రెండవ వివాహం.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…