Tag Archives: pre release event

Karthika Deepam: ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న కార్తీకదీపం 2… చరిత్రలో ఇదే తొలిసారి?

Karthika Deepam: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలకు సిద్ధమయింది అంటే ఆ సినిమాకు సంబంధించి ఎన్నో వేడుకలు జరుపుతూ ఉంటారు. ఇక సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలా సినిమాలకు ఈ విధమైనటువంటి వేడుకలు జరగడం సర్వసాధారణం. కానీ సీరియల్స్ కి ఎప్పుడైనా ఇలా ప్రీ రిలీజ్ వేడుకలు జరగడం చూశారా..

వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉన్న ఇది నిజమే మొట్టమొదటిసారి సీరియల్స్ చరిత్రలోనే ఆ సీరియల్ ప్రసారానికి ముందు ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంత వేడుక చేస్తున్నటువంటి ఆ సీరియల్ మరేది కాదు కార్తీకదీపం ఇది నవ వసంతం అనే సీరియల్ అని చెప్పాలి.

కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు వంటలక్కగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమి విశ్వనాథ్ అలాగే నిరుపమ్. ఈ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వీరిద్దరూ దాదాపు ఈ సీరియల్ 1569 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ముఖ్య అతిథులుగా వంటలక్క డాక్టర్ బాబు..

ఇక ఈ సీరియల్ కి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తిరిగి కార్తీకదీపం 2 సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సీరియల్ స్టార్ మాలో మార్చి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న నేపథ్యంలో మార్చ్ 21 ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Nagababu: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేసిన నాగబాబు.. రైళ్లు పరిగెత్తాలంటూ?

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు దీంతో నాగబాబు ఇంకా గట్టిగా అరవండి ఈ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ ఈయన కామెంట్లు చేశారు.

తాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఇక్కడికి వస్తున్నానని తెలిపారు. ఇలా నాగబాబు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వారి అరుపులు మానలేదు దీంతో నాగబాబు మాట్లాడుతూ ఈ ఎనర్జీ మొత్తం మీరు ఓట్లు వేయడంలో కూడా చూపించండి అంటూ ఈయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఎనర్జీ ఓట్లు వేయడంలో ఉండాలి..
ఇకపోతే నాగబాబు ఈసారి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. జనసేన టిడిపి కూటమి కలసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. అయితే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లను కేటాయించారని తెలుస్తోంది.

Anchor Suma: యాంకర్ సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. వీడియో వైరల్?

Anchor Suma: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. తెలుగులో ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ అనే విధంగా గొప్ప పేరు సంపాదించుకుంది యాంకర్ సుమ. అయితే మొన్నటి వరకు వరుసగా ఫ్రీ రిలీజ్ వేడుకలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు షోలు అంటూ బిజీగా గడిపిన సుమ ప్రస్తుతం యాంకరింగ్ కు కాస్త దూరంగానే ఉంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ సుమ చేసిన పనికి ఒక హీరో కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఏం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సోహెల్. ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు త్వరలో బూట్‌కట్ బాలరాను అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, మూవీ హీరోయిన్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. ఈ షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. సోహెల్ సుమ అడ్డా షోలో మాట్లాడుతూ..

మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

రీసెంట్ గా సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశాను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాను. సరే అక్కతో మాట్లాడి చెప్తా అన్నాడు. తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి అక్కా నేను అమౌంట్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేసాడు. అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి సపోర్ట్ చేయడానికే అని నాకు ఫ్రీగా చేస్తాను అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C2pXhP3p4rK/?utm_source=ig_embed&ig_rid=7593249a-c7ac-41c9-a923-f400b381cbaa

Sreeleela: గుంటూరు కారం ఈవెంట్ లో శ్రీ లీల కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Sreeleela: నటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకేక్కినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇటీవల గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఈమె నెట్టెడ్ శారీ ధరించి వచ్చారు. బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ శారీలో శ్రీ లీలా చాలా క్యూట్ గా కనిపించారు. దీంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఎంతో మంది అభిమానులు ఫోకస్ చేస్తూ శ్రీ లీల కట్టుకున్నటువంటి చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ కార్యక్రమానికి శ్రీ లీల కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర ఏకంగా 1.59 లక్షల రూపాయల ఖరీదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీర కోసం ఈమె ఇంత ఖరీదు చేసిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు పైనే ఆశలు..

శ్రీ లీల మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈమె కూడా ఈ సినిమా పట్ల చాలా ఎక్సైట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి మరి ఈ సినిమా శ్రీ లీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Mahesh Babu: నాన్న లేరు.. అన్నీ మీరే అంటూ ఎమోషనల్ అయిన మహేష్ బాబు?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా వేడుకను గుంటూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన తండ్రి కృష్ణ మరణించిన తర్వాత మొదటి సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ వేదికపై మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతికి నా సినిమా వస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మాలో ఉందని తెలిపారు.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను చూసి నాన్న నాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపేవారు కానీ ఈసారి నాన్న లేరు. ఇకపై ఆ విషయాలన్నీ మీరే నాకు తెలియచేయాలి. మీరే నా అమ్మానాన్న అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన ఎమోషనల్ కామెంట్ చేయడమే కాకుండా అభిమానులందరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇలా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అవడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

నాకన్నీ మీరే…

ఇక మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాకి కూడా కృష్ణ తన అభిప్రాయాలను తెలియజేసే వారు మొదటిసారి కృష్ణ గారు లేకుండా గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు తన తండ్రిని గుర్తుచేసుకొని ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Ram Charan: విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి అభిమానిని అంటున్న రామ్ చరణ్.. చరణ్ కామెంట్స్ వైరల్!

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ సేమ్ అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా మంచి హిట్ అవటంతో హీరోగా విశ్వక్ మరొక మెట్టు పైకి ఎదిగాడు. ప్రస్తుతం ‘ఓరి దేవుడా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. పీవిపీ సినిమా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అలనాటి హీరో దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా.. ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రాజమండ్రిలో అక్టోబర్ 16వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించారు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ గురించి రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ…” రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వక్ సేల్ గురించి తెలియని వారు లేరు. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ అతి తక్కువ కాలంలోనే గల్లీ గల్లీకి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

Ram Charan: మాట ఇస్తే తప్పడు…

విశ్వక్ ఏదైనా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడని మంచి పేరు ఉంది. ఇలా విశ్వక్ వ్యక్తిత్వానికి నేను ఒక పెద్ద అభిమానిని. ఉప్పెన సినిమా లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ అన్న నీ కోసమైనా ఈ సినిమా చూస్తాను” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ గురించి రాంచరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Suma: వెండితెర కార్యక్రమాలకు దూరమైన సుమక్క… బోసిపోయిన సినిమ ఈవెంట్లు!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు పెట్టంrడి సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఈమె క్యాష్ కార్యక్రమానికి మినహ ఏ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో నటించలేదు.

సుమ బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ వెండితెరపై పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఇలా ఏ కార్యక్రమం జరిగిన ఆ కార్యక్రమంలో తప్పకుండా సుమ ఉండాలి. సుమ ఉంటేనే ఆ కార్యక్రమానికి మరింత హైప్ ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తూ సుమ డేట్స్ అడిగిమరీ వారి కార్యక్రమాలను నిర్ణయించుకుంటారు.

ఇలా సినిమా ఈవెంట్లకు ఎంతో కీలకంగా మారినటువంటి సుమ గత కొంతకాలం నుంచి ఎక్కడ సినిమా ఈవెంట్లలో కనిపించడం లేదు. ఇలా సుమ లేకపోవడంతో ఇతర యాంకర్లతో కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ సుమ లేని వెలితి స్పష్టంగా కనపడుతుంది. సుమా లేకుండానే నాగార్జున నటించిన ది ఘోస్ట్ , మెగాస్టార్ గాడ్ ఫాదర్, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ వంటి మూడు భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్లు జరిగిపోయాయి.

Anchor Suma: హాలిడే వెకేషన్ లో యాంకర్ సుమ…

ఈ విధంగా సుమ వెండితెరకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటో ఆమె సోషల్ మీడియా ఖాతాలను చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. వరుస షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ కొంతకాలం పాటు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈమె వెకేషన్ వెళ్లినప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఎన్నో వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇలా సుమ వెకేషన్ లో ఉండటం వల్ల సినిమా ఈవెంట్లకు ఈమె దూరంగా ఉన్నారు.

ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, ఐకాన్ స్టార్!

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నారు. ఈ వయసులో కూడా అదే రీతిలో సినిమాలు చూస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,సాంగ్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. బాలకృష్ణ, అల్లు అర్జున్ ఒకే వేదిక పైకి కనిపించబోతుండడంతో అల్లు అర్జున్ అభిమానులు, బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు.ఇప్పటికే తమన్ కంపోజిషన్ లో విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇటీవల రిలీజైన ట్రైలర్ ను చూసి ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇదివరకు సింహా, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తనకు లైఫ్ ఇచ్చింది కూడా ఆ దర్శకులే.. హీరో సందీప్ కిషన్..

సన్నీ నవీన్‌, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్‌ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్‌ కొండెపు, సృజన్‌ యారబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కథానాయకుడు సందీప్‌కిషన్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జయకిషోర్ మాట్లాడుతూ.. తన సినిమా కొవిడ్‌ కారణంగా ఆలస్యం కాలేదని.. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయిందని.. ప్రస్తుతం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.

మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని తెలిపారు.

తనకు హీరోగా లైఫ్ ఇచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ దర్శకులే.. ఈ సినిమ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది అంటూ సన్నీ పేర్కొన్నాడు. ఇతకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.