Tag Archives: punch prasad

Punch Prasad: సర్జరీ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎమోషనల్ అయిన కమెడియన్!

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని కడప నవ్విస్తూ ఉంటారు. ఇలా పైకి నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే పంచ్ ప్రసాద్ నవ్వు వెనక ఎన్నో కన్నీటి గాథలు కష్టాలు ఉన్నాయని చెప్పాలి. ఈయన పైకి నవ్వుతూ కనిపించిన ఆరోగ్యం పరంగా తాను ఎంతో నరకం అనుభవించారు అనే విషయం మనకు తెలిసిందే.

రెండు కిడ్నీలు పాడవడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పంచ్ ప్రసాద తన ఆరోగ్య సమస్యలను కూడా పక్కనపెట్టి ప్రేక్షకులను సందడి చేయడానికి వేదిక పైకి వచ్చేవారు అయితే ఈయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో ఈయనని పరీక్షించిన వైద్యులు తనకు వెంటనే సర్జరీ జరగాలని సూచించారు. ఈ విధంగా పంచ్ ప్రసాద్ కిసర్జరీ చేయాలని చెప్పడంతో నూకరాజు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.

Punch Prasad: ఎమోషనల్ అయిన ప్రసాద్..


ఇక ఈ విషయం జబర్దస్త్ మాజీ జడ్జ్ ఏపీ మినిస్టర్ రోజా వరకు చేరడంతో ఈమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ప్రసాద్ సర్జరీకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇలా సర్జరీ సక్సెస్ అయిన తరువాత ప్రసాద్ దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు అయితే ఈయన ఆరోగ్యం కుదట పడటంతో తిరిగి బుల్లితెరపై సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసినటువంటి ఈయన తన పరిస్థితిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Punch Prasad: పంచ్ ప్రసాద్ కి అండగా నిలిచిన జగన్ సర్కార్… సర్జరీకి ఏర్పాట్లు?

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయనకు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు అయితే రోజురోజుకీ ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే సర్జరీ చేయించడం కోసం సరైన డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి త్వరగా సర్జరీ చేయాలి అని లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది అంటూ ఈయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ మరొక కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని చేయడమే కాకుండా తనకు డబ్బు సహాయం చేయాలి అంటే ఫోన్ పే గూగుల్ పే నెంబర్లను కూడా ఈ వీడియోలో పొందుపరిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి సరైన ఆరోగ్య అందేలా చూడాలని సర్జరీకి అవసరమైన సదుపాయాలను తనకు కల్పించాలంటూ మంత్రి ఆర్కే రోజా సీఎం రిలీఫ్ ఫండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కమెడియన్ ప్రసాద్ కి వైద్య సదుపాయాలను అందించాలని సూచించారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయనకు ఏపీ సీఎంఓ ద్వారా సహాయం అందుతుంది.

Punch Prasad: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం


ఇదివరకే ఒక నేటిజన్ఈ వీడియోని ముఖ్యమంత్రి సహాయనిది కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణ టాగ్ చేయగా ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పటికే తాము ప్రసాద్ కుటుంబ సభ్యులను అప్రోచ్ అయ్యామని ఆయన చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రసాద్ వైద్య చికిత్సకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవడం విశేషం.

Punch Prasad: తను లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని… పిల్లలను గుర్తు చేసుకుంటే ఏడుపాగదు: పంచ్ ప్రసాద్

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ ఆరోగ్యం రోజురోజుకీ క్షమించిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు రోజా గారు నాగబాబు గారు తనకు ఆర్థికంగా చాలా సహాయం చేశారని తెలియజేశారు.

నూకరాజు తనకు తమ్ముడి కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు. ఇక కిరాక్ ఆర్ పి లక్ష రూపాయల వరకు సహాయం అందించారని తెలిపారు.ఇక నేను ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే తనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని ప్రసాద్ తెలిపారు. అయితే తన పిల్లల గురించి ఆలోచించి సర్జరీ కాస్త ఆలస్యం చేశానని ఈయన వెల్లడించారు. తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

Punch Prasad: పిల్లల గురించి తలుచుకుంటే ఏడుపొస్తుంది…


తన భార్య తన పిల్లల కన్నా నన్నే చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారని ఆమె లేకపోతే నేను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని అంటూ ఈయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నా పిల్లల గురించి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగవని ఒకప్పుడు నా గురించి చాలామంది ఆలోచించి తనకు సహాయం చేస్తామని చెప్పినా నేను వద్దని చెప్పానని ప్రసాద్ తెలిపారు. అయితే డాక్టర్లు మాత్రం టాబ్లెట్స్ వాడటం కన్నా సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని చెప్పారు. కానీ ఈ సర్జరీ కొందరికి సక్సెస్ అవుతుంది మరికొందరికి సక్సెస్ కాదు అన్న భయంలో తాను ఉన్నానని తెలిపారు.ఇలా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Punch Prasad: మరింత విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం… దాతల సాయం కోసం ఎదురుచూపులు?

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా కమెడియన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొంతకాలంగా తన రెండు కిడ్నీలో ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ప్రసాద్ రెండు కిడ్నీలో ఫైల్ అవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ దాతల కోసం ఎదురుచూశారు. అయితే తనకు కిడ్నీ దొరికింది అంటూ ఒకానొక సమయంలో తన భార్య సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నూకరాజు సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలియజేశారు.

రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రసాద్ అన్న కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని లేకపోతే ఏ క్షణం అయినా ఏదైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారని నూకరాజు తెలిపారు.

Punch Prasad: ఫోన్ పే చేయవచ్చు..


ఇక డాక్టర్లు సర్జరీ చేయాలి అంటే భారీగా డబ్బు అవసరం అవుతుంది అందుకోసమే ఎవరైనా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నామని నూకరాజు తెలిపారు. అంతేకాకుండా ఈయనకు ఎవరైనా తనకు ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ కి చేయొచ్చు అంటూ నెంబర్ ఇవ్వడమే కాకుండా తన భార్య బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Punch Prasad: ముక్కులో నుంచి రక్తం కారేది… కిడ్నీ డోనర్ దొరికిన సర్జరీ చేయలేదు: పంచ్ ప్రసాద్

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ మెప్పిస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన రోజు రోజుకు తన అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాస్త ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తుంది. ఇలా తన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటూ ఉన్నారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ…తాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.పెళ్లయిన కొత్తలో తనకు ప్రతిరోజు ముక్కులో నుంచి రక్తం కారేది అయితే తన భార్య డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళగా అప్పుడే తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని ప్రసాద్ తెలిపారు.

అదేవిధంగా తన కాలులో చీము రావడంతో బాగా నొప్పి వేసేదని నడవలేని పరిస్థితికి కూడా తాను వెళ్లిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటున్నానని తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఇక తనకు సర్జరీ చేయడానికి కిడ్నీ డోనర్ అవసరమైంది. ప్రస్తుతం తనకు కిడ్నీ డోనర్ కూడా దొరికారని కానీ కాలిలో చీము రావడం నొప్పి చేయటం వల్ల డాక్టర్లు సర్జరీ చేయలేదని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత సర్జరీ నిర్వహిస్తారని తెలిపారు.

Punch Prasad: తన క్షేమం కోరిన వారందరికీ రుణపడి ఉంటా…

ఇక ఈయన సర్జరీకి అయ్యే ఖర్చును భరించడం కోసం ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ కిరాక్ ఆర్ పి సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇక తన కోసం తనకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన వారందరికీ ఈయన ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇక తనకోసం ఓ అభిమాని ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలు కాలినడకన ఎక్కి వెళ్లారని తెలిసింది. అయితే తనను అభిమానించేవారు ఇంతలా ఉన్నారా అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.

Punch Prasad: కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇంటిని చూసారా… రంగు ముగ్గులతో ఎంత అందంగా ఉందో.. వీడియో వైరల్!

Punch Prasad: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. ఇలా పంచ్ ప్రసాద్ తన కామెడీతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అందరిని ఎంతగానో నవ్వించే ప్రసాద్ జీవితంలో ఎంతో విషాదం ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిత్యం మందులు వాడుతూనే ఈయన బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయింది. ఈయన నడవలేని స్థితిలోకి కూడా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ప్రసాద్ కి తాను సర్జరీ చేయిస్తానని ఆర్పి మాట ఇచ్చారు.

ఇప్పుడిప్పుడే తన అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకుంటున్న ప్రసాద్ తిరిగి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసాద్ తన భార్య పిల్లలతో కలిసి తన సొంతూరికి వెళ్లారు.ఈ క్రమంలోనే ప్రసాద్ తన సొంత ఊరిలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వీడియోని హోమ్ టూర్ వీడియోగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసారు.

Punch Prasad: రంగురంగు ముగ్గులు…

ప్రస్తుతం ప్రసాద్ హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తన హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉందని పై పోషన్లో తన తల్లి ఉంటుందని కింద తన పిన్ని ఉంటుందని తెలిపారు. తన పిన్ని తన తల్లికి సొంత చెల్లెలు కావడంతో ఇప్పటివరకు రూపాయి కూడా రెంట్ ఇవ్వలేదని తన అమ్మ తన చెల్లిని వదిలి ఉండలేదని తెలిపారు. ఇక ఈ ఇంట్లో ప్రసాద్ సాధించిన గిఫ్ట్ లన్నింటినీ కూడా చూపించారు. ఇక వీరి ఇల్లంతా కూడా రంగురంగు ముగ్గులతో ఎంతో అందంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=tSeYNGfYdBg

Punch Prasad: ఫ్యామిలీ ఫోటోని చూపించి ఎమోషనల్ అయిన పంచ్ ప్రసాద్… నేను అమ్మ తప్ప ఎవరూ లేరంటూ?

Punch Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్విస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే తన రెండు కిడ్నీలు పాడవడంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.

జబర్దస్త్ కమెడియన్స్ జడ్జిల సహాయంతో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ప్రస్తుతం డయాలసిస్ ద్వారా ఆయన కాలం గడుపుతున్నారు. ఇక తనకు అలాంటి సమస్య ఉందని తెలిసినప్పటికీ తన భార్య తన కిడ్నీలను దానం చేస్తానని చెప్పి తనని పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే పంచ్ ప్రసాద్ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ తమ ఆటపాటలతో పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు.అయితే పంచ్ ప్రసాద్ మాత్రం తన ఫ్యామిలీ ఫోటోని చూపించి ఒక్కసారిగా తాను ఎమోషనల్ అవ్వడమే కాకుండా అందరి చేత కంటతడి పెట్టించారు.

Punch Prasad: ఇదే ఆఖరి మా ఫ్యామిలీ ఫోటో…

ఈ కార్యక్రమంలో పంచ్ ప్రసాద్ తన ఫ్యామిలీ ఫోటోని చూపించి తన ఫ్యామిలీలో నేను నా తల్లి తప్ప ఎవరు బ్రతకలేదని ఇదే మా ఆఖరి ఫ్యామిలీ ఫోటో అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇలా పంచ ప్రసాద్ తన ఫ్యామిలీ గురించి చెప్పడంతో అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఒకవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ తన బాధను పక్కనపెట్టి నవ్విస్తున్నప్పటికీ తన జీవితంలో ఇంత విషాదం ఉందా అని ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు.

Punch Prasad: నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. ఆయన పరిస్థితి చూస్తే కన్నీళ్లాగవు?

Punch Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి మంచి హోదాను కల్పించింది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ ఒకరు.

పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోను తన పంచ్ డైలాగులతో అందరిని సందడి చేసేవారు. అయితే ఈయన గతంలో ఓసారి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విషమ పరిస్థితులలోకి వెళ్లిపోయారు ఆ సమయంలో జబర్దస్త్ కమెడియన్లు, రోజా నాగబాబు వంటి వారు ఆర్థిక సహాయం చేసి ఆయనకు సర్జరీ చేశారు.

ఈ విధంగా సర్జరీ చేయించుకున్నటువంటి ప్రసాద్ కొన్ని రోజుల తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చి ఎప్పటిలాగే తన పంచ్ డైలాగులతో అందరినీ సందడి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఏం జరిగింది అని అందరూ సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నూకరాజు ఆసియా పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణాలను తెలియజేశారు.

దీన పరిస్థితిలో భార్య పిల్లలు..

పంచ్ ప్రసాద్ మరోసారి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈయన పరిస్థితి మరోసారి క్షీణించడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కిడ్నీ వ్యాధి కారణంగా పంచ్ ప్రసాద్ కాళ్లు కూడా చచ్చుబడిపోయాయని, ఈయన కనీసం నడవలేని స్థితిలో కూడా ఉన్నారని తెలియజేశారు.ఇలా పంచ్ ప్రసాద్ మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయన భార్య పిల్లలు ఎంతో దీనస్థితిలో ఉన్నారని వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలియజేయడంతో ఎంతో మంది అభిమానులు ఆయనకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఆ కమెడియన్ అన్న మాటకు కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన యాంకర్ సుమ.. ఏమన్నాడంటే?

బుల్లితెరపై గత రెండు దశాబ్దాల కాలం నుంచి తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరలో ఏ చానల్ పెట్టిన సుమ మనకు దర్శనమిస్తారు.అదే విధంగా పలు ఈవెంట్లు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకునే సుమకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది.

సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈవారం క్యాష్ పోగ్రామ్ కి పంచ్ ప్రసాద్, జబర్ధస్త్ నూకరాజు, జబర్ధస్త్ ఇమాన్యూయేల్, జబర్ధస్త్ బాబులు గెస్టులుగా వచ్చారు. అదేవిధంగా వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చారు. వీరందరితో కలిసి సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ ప్రసాద్ అందరి పై పంచులు వేస్తూ హైలెట్ అయ్యారు. అద్భుతమైన టైమింగ్ లతో మాటకు మాట చెబుతూ పంచులు వేస్తూ అందరిని ఆకర్షించాడు.ఎప్పుడు అందరికీ పంచులు వేసే సుమకు సైతం ప్రసాద్ పంచులు వేస్తూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ప్రసాద్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక నూకరాజు చివర్లో తన అన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ప్రసాద్ మాట్లాడుతూ.. ఈయన నా మేనమామ.. ఈయన వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను థాంక్యూ మామయ్య. ఈయన సహాయ సహకారం లేకపోతే నేను ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాడిని అంటూ పంచ్ వేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. కానీ సుమ మాత్రం కోపంతో చేతిలో ఉన్న కార్డ్స్ విసిరి తనలో తానే నవ్వుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.