Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ మెప్పిస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన రోజు రోజుకు తన అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాస్త ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తుంది. ఇలా తన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటూ ఉన్నారు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ…తాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.పెళ్లయిన కొత్తలో తనకు ప్రతిరోజు ముక్కులో నుంచి రక్తం కారేది అయితే తన భార్య డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళగా అప్పుడే తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని ప్రసాద్ తెలిపారు.
అదేవిధంగా తన కాలులో చీము రావడంతో బాగా నొప్పి వేసేదని నడవలేని పరిస్థితికి కూడా తాను వెళ్లిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటున్నానని తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఇక తనకు సర్జరీ చేయడానికి కిడ్నీ డోనర్ అవసరమైంది. ప్రస్తుతం తనకు కిడ్నీ డోనర్ కూడా దొరికారని కానీ కాలిలో చీము రావడం నొప్పి చేయటం వల్ల డాక్టర్లు సర్జరీ చేయలేదని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత సర్జరీ నిర్వహిస్తారని తెలిపారు.
ఇక ఈయన సర్జరీకి అయ్యే ఖర్చును భరించడం కోసం ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ కిరాక్ ఆర్ పి సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇక తన కోసం తనకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన వారందరికీ ఈయన ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇక తనకోసం ఓ అభిమాని ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలు కాలినడకన ఎక్కి వెళ్లారని తెలిసింది. అయితే తనను అభిమానించేవారు ఇంతలా ఉన్నారా అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…