Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ మెప్పిస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన రోజు రోజుకు తన అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాస్త ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తుంది. ఇలా తన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటూ ఉన్నారు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ…తాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.పెళ్లయిన కొత్తలో తనకు ప్రతిరోజు ముక్కులో నుంచి రక్తం కారేది అయితే తన భార్య డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళగా అప్పుడే తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని ప్రసాద్ తెలిపారు.
అదేవిధంగా తన కాలులో చీము రావడంతో బాగా నొప్పి వేసేదని నడవలేని పరిస్థితికి కూడా తాను వెళ్లిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటున్నానని తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఇక తనకు సర్జరీ చేయడానికి కిడ్నీ డోనర్ అవసరమైంది. ప్రస్తుతం తనకు కిడ్నీ డోనర్ కూడా దొరికారని కానీ కాలిలో చీము రావడం నొప్పి చేయటం వల్ల డాక్టర్లు సర్జరీ చేయలేదని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత సర్జరీ నిర్వహిస్తారని తెలిపారు.
ఇక ఈయన సర్జరీకి అయ్యే ఖర్చును భరించడం కోసం ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ కిరాక్ ఆర్ పి సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇక తన కోసం తనకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన వారందరికీ ఈయన ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇక తనకోసం ఓ అభిమాని ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలు కాలినడకన ఎక్కి వెళ్లారని తెలిసింది. అయితే తనను అభిమానించేవారు ఇంతలా ఉన్నారా అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…