Tag Archives: pushpa movie

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులు దాటిపోయిన ఎక్కడ చూసినా ఈ సినిమాలో పాటలు ఈ సినిమాలో డైలాగులు వినపడుతూనే ఉన్నాయి.

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో విదేశాలలో సైతం పుష్ప సినిమాకు భారీ ఈ స్థాయిలో ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ లు అలాగే చూపే బంగారమాయే శ్రీవల్లి అనే పాటకు ఎంతోమంది అచ్చం అల్లుఅర్జున్ మాదిరిగానే డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ పాటకు డాన్స్ వేసి అందరిని నవ్వించారు. ఈ విషయం మర్చిపోకముందే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

నిజంగానే నరేంద్రమోడీ కాదండోయ్…

పుష్ప సినిమాలో ఈ పాటకు నిజంగానే నరేంద్రమోడీ డాన్స్ చేశారా అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే… క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీ స్టెప్పులేసినట్టు క్రియేట్ చేసి శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేయించారు. ఈ పాటకు ప్రధానమంత్రి డాన్స్ చేయడమే కాకుండా తగ్గేదె లే అనే మూమెంట్ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా అంటున్న యాంటీ ఫాన్స్.

Pushpa Movie Trolling: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి ప్యాన్ ఇండియా మూవీ పుష్ఫ మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము రేపుతోంది. హిందీ, తమిళ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వసూళ్లను సాధిస్తోంది.

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా..?

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ లు సినిమా విడుదలకు ముందే క్రేజ్ ను పెంచాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా నిర్వహించింది.  అయితే ప్రస్తుతం అందరి చూపు “పుష్ప: ది రూల్” పై పడింది. పుష్ప 2 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై సుకుమార్ కూడా క్లారిటీ ఇస్తున్నాడు.

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా..?

ఫిబ్రవరి నుంచి పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభ కావచ్చనే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప 1 లో చాలా క్యారెక్టర్లు క్లియర్ గా లేవు. దీంతో రెండో భాగంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

పుష్ప పార్ట్ 2 అవసరమా అంటూ భారీ ట్రోలింగ్..

ముఖ్యంగా అజయ్ క్యారెక్టర్ తో పాటు, పుష్ప తండ్రి ఎవరో తెలియాల్సి ఉంది. దీంతో పాటు మంగళం శ్రీను, ద్రాక్షాయణి క్యారెక్టర్లు పుష్పపై ఎలా పగ తీర్చుకుంటాయి అనేదానితో పాటు విలన్ ఫహాద్ ఫాజిల్, బన్నీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువైంది. ఇప్పటికే పుష్ప-1 హిట్ కాలేదని.. పుష్ప -2 తీయడం అవసరమా.. అంటూ ట్రోలింగ్, కామెంట్లు చేస్తున్నారు.

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోలో.. పుష్ప టీం సందడి..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమాలో భారీ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా వసూళ్ల కిక్ ఇచ్చింది. ఇటు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన బాలయ్య బాబు.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ఆహా ఓటీటీలో మొదలైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో సక్సెస్ అయింది. తొలి షోలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసిన  టాక్ షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.  ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారితో సరదాగా ముచ్చటించారు బాలకృష్ణ.

అఖండ టీం టాక్ షోలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో స్టెప్పులు కూడా వేసి అందరిని మెప్పించారు.  ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. ఈ షో డిసెంబర్24న ప్రసారం కానుంది.  ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈషోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు.

దీనికి సంబంధించిన షోను క్రిస్మస్ కానుగా ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. బన్నీతో పాటు పుష్ప టీం కూడా సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్ప సినిమా హిట్ తో బన్నీ తన సత్తాను చాటాడు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు అఖండ… మరో వైపు పుష్ప ఇలా ఇద్దరి మధ్యలో టాక్ షో ఏవిధంగా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు

పుష్పలో మంగళం శ్రీనుగా సునీల్.. ద్రాక్షయణిగా అనసూయ మెప్పించారా.. ప్రేక్షకుల స్పందన ఏమిటి?

భారీ అంచానాల మధ్య రిలీజ్ అయిన పుష్ప మూవీ నిన్ననే విడుదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ కావడంతో… అలవైకుంఠపురం వంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా ప్రారంభమైనప్పట నుంచి సునీల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

మంగళం సీను వంటి విలన్ పాత్రలో సునిల్ మొదటిసారిగా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. డిఫరెంట్ గెటప్ తో క్రూరంగా కనిపిస్తుండటంతో ఈ పాత్ర ఎలా ఉంటుందో అని ముందు నుంచే ఇంట్రెస్ట్ నెలకొంది. మంగళం శ్రీను పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ల సిండికేట్ నాయకుడిగా సునీల్ నటించారు. సునీల్ కు భార్యగా ద్రాక్షాయణి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటించింది. వీరిద్దరి గెటప్ లు సినిమాపై బజ్ ను మరింత పెంచాయి.

అయితే మంగళం శ్రీను పాత్ర సినిమాలో పెద్దగా పేలలేదని అభిమానులు అనుకుంటున్నారు. విలన్ గా సునీల్ ఒకే కానీ.. భయపెట్టలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సమంత ఐటెం సాంగ్.. మంగళం శ్రీను అడ్డాలోనే జరుగుతుంది. దీని తర్వాత మంగళం శ్రీనుకు పుష్ప వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. సినిమాలో సునీల్ మంగళం శ్రీను పాత్ర చాలా ప్రాధాన్యం ఉన్నదే. పుష్ప మంగళంశ్రీనును ఎలా ఎదుర్కొన్నాడనేది తెరపైనే చూడాలి. ఇక మరోవైపు ద్రాక్షాయణిగా అనసూయ క్యారెక్టర్ కూడా అనుకున్నంత గొప్పగా లేదని తెలుస్తోంది. అయితే ఈ క్యారెక్టర్ కు మాత్రం ఓ ట్విస్ట్ ఉంటుంది.

సినిమా రిలీజ్ కు ముందు మంగళం శ్రీను క్యారెక్టర్ పై సునీల్ చాలా గొప్పగా చెప్పారు. విలన్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చానని.. ఇప్పటికి తన కోరిక తీరిందన్నాడు. మంగళం శ్రీను క్యారెక్టర్ కోసం పదేళ్లు పెద్ద వ్యక్తిగా కనిపించానని చెప్పుకొచ్చారు. సుకుమార్ కరోనా టైంలోనే ఈ క్యారెక్టర్ గురించి చెప్పారని తెలిపారు. ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని నటించానని అన్నారు. ఇతర భాషల్లో కూడా మంచి అవకాశం వస్తే నటిస్తానని అన్నాడు.

పుష్ప రెండు పార్ట్ లకు కారణం రాజమౌళినే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచానాలు నెలకొన్నాయి. కాగా  ఈసినిమాను రెండు పార్టులుగా తీసున్న విషయం తెలిసిందే. అయితే బహుబలితో రెండు పార్టులుగా సినిమా తీయడం అనే సంప్రదాయాన్ని రాజమౌళి తీసుకువచ్చారు. ఇప్పుడు సుకుమార్ కూడా రాజమౌళిలాగే పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజమౌళి చెప్పినందుకే సుకుమార్ పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారట.

అయితే మొదట పుష్ప సినిమాను ఒకే పార్టులో తీయడం సాధ్యం కాదనే అనుకున్నారట సుకుమార్..దీనికి అనుగుణంగానే రెండు పార్టులుగా తీసేందుకు కథను కూడా చిత్ర యూనిట్ సిద్ధం చేసుకుంది. రెండు పార్టులకు సంబంధించి కథతో మార్పులు కూడా చేశారు. కాగా ఎమైదో తెలియదు కానీ మళ్లీ పుష్ఫను ఒకే పార్ట్ గా తీద్దాం అని అనుకున్నారట సుకుమార్ ఈవిషయాన్ని బన్నికి, మైత్రి మూవీ మేకర్స్ కు తెలియజేశారు. 

ఈ విషమం అటు తిరిగి.. ఇటు తిరిగి జక్కన్న చెవిలో పడిందట. వెంటనే రాజమౌళి.. సుకుమార్ కు ఫోన్ చేసి.. సినిమాను ఒకే పార్టులో తీద్దాం అనుకుంటున్నారట నిజమేనా..? అని అడిగారు. దీనికి సుకుమార్ అవును రెండు పార్టులు ఎందుకు అని అనిపించిందని అన్నారట.. రాజమౌళి మాత్రం రెండు పార్టులుగా సినిమాను తీయండి. అందుకు కథలో మార్పులు చేయండని సలహా కూడా ఇచ్చారట.

దీంతో సుకుమార్ పుష్ప మూవీని రెండు పార్టులుగా మలిచారు. ప్రస్తుతం మనం మొదటి పార్టును చూశాం. అయితే కథ సాగదీసినట్లు ఉండటం… బలమైన సన్నివేశాలు పడకపోవడంతో.. మూవీని ఒకే పార్టులో తీస్తే బాగుండనే విషయాన్ని ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారట. ఒకే పార్టులో తీస్తే కథనం మరింత బాగుండనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

పుష్ప సినిమాలో విలన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? నాగార్జున కి ఆయనకు ఉన్న లింక్ ఏంటో తెలుసా?

అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాతో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ ఒక మెయిల్ విలన్ గా పరిచయం కానున్నాడు. మలయాళం లో అతను స్టార్ యాక్టర్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించి తన కంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు.

ఫహద్ నటించిన కొన్ని సినిమాలు కరోనా నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదల అయ్యి ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చాయి. ఫహద్ కి తెలుగు సినిమాకి కాస్త కనెక్షన్ ఉంది. ఎలా అంటే ఫహద్ తండ్రి ఫాజిల్ తెలుగులో హీరో నాగార్జున నటించిన కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫాజిల్ మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకరు. అలా ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఫహద్. 2002లో కైయేతుమ్ దూరత్ అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. అలా 2011లో చాప్ప కురిషు సినిమాలో నటనకు గాను కేరళ ప్రభుత్వం నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇకపోతే పుష్ప సినిమాలో మెయిన్ విలన్ రోల్ కు సుకుమార్ మొదట విజయ్ సేతుపతిని ఎంచుకున్నారట.

మొదట ఈ సినిమాకు ఓకే చెప్పిన విజయ్ సేతుపతి ఆ తర్వాత పలు కారణాల వల్ల వదులుకున్నాడు. అలా బన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేశారు ఫహద్. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ ను ఢీ కొట్టే పాత్రలో గుండుతో ఒక వైవిధ్యమైన లుక్ కనిపిస్తున్నాడు.

ఇకపోతే ఫహద్ మలయాళం తార నజ్రియా నజీమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నజ్రియా కూడా త్వరలోనే నాని సరసన కథానాయికగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.

‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ చూడటానికి రెడీగా ఉండండంటూ.. సమంత మాస్ లుక్ ఫొటో విడుదల..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ వేర్వేరుగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. అటు ముందు రంగస్థలం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు సుకుమార్.. ఆ తర్వాత రెండేళ్ళకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డులను తిరగరాసాడు.

అలాంటి ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సారిగా రష్మిక ఈ సినిమాలో డిగ్లామరస్ రోల్ లో నటించడం విశేషం. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది.

మొదటి పార్ట్ ను డిసెంబర్‌ 17న క్రిస్ మస్ పండుగ కానుకగా విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే అన్ని పాటల చిత్రీకరణ పూర్తైంది. కేవలం మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. తన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు సుక్కు. తొలి సినిమా ఆర్య నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే ఐటం సాంగ్ పెట్టాడు.

ఈ పాట కోసం పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి మాజీ అక్కనేని కోడలు సమంత ఫైనల్ అయింది. ఇక తాజాగా సమంత ఐటెం సాంగ్ కు సంబంధించి పుష్ప టీం క్రేజీ అప్ డేట్ ను ఇచ్చింది. సమంత పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సమంత కలసి చేస్తున్న రాకింగ్ నంబర్ ను భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ని చూడటానికి సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టర్ లో సమంత లంగా జాకెట్‌ ధరించి, ఫుల్ మాస్‌ లుక్‌లో.. తన బ్యాక్‌ సైడ్‌ చూపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం.

పుష్ప సినిమాలో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సునీల్..!

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లు, సాంగ్ లు రిలీజ్ చేయగా ఇవి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సామీ సాంగ్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినిపిస్తోంది.

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్టు పార్టుకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన 10 శాతం చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.ఆయన ఫస్టులుక్ కు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే.అయితే ఆయన ఫస్టు పార్టు చివరలో, కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో తెరపై ప్రత్యక్షమవుతాడట సెకండ్ పార్టు కోసం వెయిట్ చేసేలా చేస్తారని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా ఫస్టు పార్టులో సునీల్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడ‌ట‌.ఇక తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పుష్ప చిత్రంలో తన రోల్ గురించి తెలిపాడు సునీల్.ఇందులో త‌న‌కుమంచి పాత్ర దొరికింద‌ని అన్నాడు.రామ్ చ‌ర‌ణ్ సినిమాతో పాటు గా మంచి పాత్ర‌లు త‌న‌కు దొరుకుతున్నాయ‌ని తెలిపారు.ఇక సునీల్ రీసెంట్‌గా హెడ్స్ అండ్ టేల్స్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

సునీల్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హెడ్స్‌ అండ్‌ టేల్స్‌,‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఈ సినిమాకు నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ 5 లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది.

అఖిల్ పాటలు వింటూ లాంగ్ డ్రైవ్ లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కాస్త విరామం దొరకడంతో తన ఫ్యామిలీతో కలిసి ఇటీవలే మాల్దీవులలో ఎంజాయ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్ రోడ్లపై ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే తన కూతురు అల్లు అర్హ, భార్య స్నేహ రెడ్డి ని తీసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు.

అల్లుఅర్జున్ స్వయంగా కారు నడుపుతుండగా, అల్లు అర్హ మొబైల్స్ లో గేమ్ ఆడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని స్నేహ రెడ్డి చేసి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అఖిల్ లేటెస్ట్ మూవీ అయినా మోస్ట్ ఎలిజిబుల్ సినిమా లోని బుజ్జి గులాబి లాగా సాంగ్ వినిపిస్తోంది.ఈ వీడియో ని బట్టి చూస్తే అల్లు అర్జున్ వింటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా దీక్షకు నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.

ఈ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా నటుడు ఫాహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కి రష్మిక మందన నటిస్తోంది. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఎక్కువగా అడవి నేపథ్యంలోనే జరుగుతోంది. ఇందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ,భాషలలో ఈ సందర్భంగా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆకట్టుకుంటున్న శ్రీవల్లి ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ ప్రోమో సాంగ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో రష్మిక… శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండుభాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అంతక ముందు వచ్చిన మూవీ అల వైకుంఠపురం మ్యూజికల్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో ఏ సాంగ్ చూసినా.. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాదించుకున్నాయి.

తర్వాత వస్తున్న పుష్ఫ సినిమాలో ఓ సాంగ్ రిలీజ్ అయింది. అదే దాక్కో దాక్కో సాంగ్. ఐదు భాషలో విడుదలైన ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. మళ్లీ రెండో సాంగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి హింట్ కూడా ఇచ్చారు దేవీశ్రీప్రసాద్. సోమవారం ఆ సాంగ్ కు సంబంధించి కొన్ని పదాలను సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. దానిని అధికారికంగా ఈ రోజు ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వ‌దిలారు.

‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం అనగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు.