Tag Archives: rajinikanth

Rajinikanth: రజనీకాంత్ జైలర్ సీక్వెల్ లో నటించబోతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Rajinikanth: టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ చివరగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్‌ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్‌ తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్..

ఈ చిత్ర షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్‌ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్‌, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Rajinikanth: ఆ విషయంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా రికార్డ్ అందుకున్న రజనీకాంత్?

Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీనియర్ హీరో రజనీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈ ఏడాది రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే టాప్ హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు. 2023 వ సంవత్సరంలో పలు భాష హీరోలు వివిధ సినిమాల ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.

ప్రభాస్ నటించిన సలార్ విజయ్ లియో రజనీకాంత్ జైలర్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుక్ ఖాన్ జవాన్, డంకీ, పఠాన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ హీరోలలో అధికంగా రెమ్యూనరేషన్ రజనీకాంత్ తీసుకున్నారని తెలుస్తుంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించినటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా నిర్మాత భారీగా లాభాలను పొందడంతో చిత్ర బృందానికి ఖరీదైన కానుకలను అందించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజనీకాంత్ కు డబ్బులు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.

రజనీ తర్వాత ప్రభాస్…

ఇలా ఈ ఏడాది అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి స్టార్ హీరోగా ఇండియాలోనే రజినీకాంత్ రికార్డు సృష్టించారని తెలుస్తోంది. ఈయన తర్వాత ప్రభాస్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఆ తర్వాత షారుక్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరోల జాబితాలో ఉన్నారని తెలుస్తుంది.

Rajinikanth: అందుకే యోగి ఆదిత్యనాథ్ కాళ్లు పట్టుకున్నాను… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన రజినీ!

Rajinikanth: తమిళ తలైవా రజినీకాంత్ స్టార్ డం గురించి చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లి ఎంతోమంది యోగులను మునులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. రజనీకాంత్ తనని కలవడానికి వస్తున్నారు అనే విషయం తెలియగానే యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకడానికి బయటకు వచ్చారు అయితే రజనీకాంత్ కారు దిగిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫోటోలు చూసినటువంటి రజనీకాంత్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎంతో స్టార్డం ఉన్నటువంటి రజినీకాంత్ ఇలా తనకన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం ఏంటి అంటూ రజనీకాంత్ వ్యవహార శైలి పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈ విషయం గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.

Rajinikanth: స్వామీజీ కాళ్లకు నమస్కారం చేయడం నా పద్ధతి…

ఇకపోతే తాజాగా రజనీకాంత్ తన ట్రిప్ ముగించుకొని తిరిగి చెన్నై వచ్చారు. ఈ క్రమంలోనేఎయిర్ పోర్టులో మీడియా ఈ విషయం గురించి రజనీకాంత్ ను ప్రశ్నించడంతో ఆయన ఒకే ఒక్క మాటలో ఈ ప్రశ్నలకు ఈ విమర్శలకు సమాధానం ఇచ్చారు.ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ వయసులో తన కన్న చిన్నవారైనా సరే వారు యోగి లేదా స్వామీజీ అయితే తప్పకుండా వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటానని ఇది నా పద్ధతి అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramya Krishna: ఆ సీన్ చేసే ముందు ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించాను… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ గారితో కలిసి నరసింహ సినిమాలో నటించాలని ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ కావడం చాలా విశేషమైన తెలిపారు. అయితే ఈ సినిమాలో తాను నీలాంబరి అనే పాత్రలో నటించానని ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ఉన్న పాత్ర అని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నీలాంబరిగా నేను సౌందర్య చెంపపై కాలు పెట్టే సన్నివేశంలో నటించాను. అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను చాలా ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఈమె తెలియజేశారు.

Ramya Krishna: నటించలేకపోయాను…


ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ సౌందర్య పై పగ తీర్చుకోవడం కోసం అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది అయితే ఈ సన్నివేశం విన్న తర్వాత అది నేను చేయలేనని డైరెక్టర్ గారికి చెప్పడంతో ఆయన ఈ సీన్ చాలా అవసరమని చెప్పారు. ఇక డైరెక్టర్ గారు అలా చెప్పేసరికి చేసేది ఏమీ లేక తాను ఈ షాట్ పూర్తి చేశానని తెలిపారు. అయితే ఈ షార్ట్ చేయడానికి ముందు నేను దేవుళ్లను ప్రార్థించి మరి ఈ షార్ట్ చేశానని ఈమె తెలియజేశారు. ఈ సన్నివేశం షూట్ చేయడం పూర్తి అయిన తర్వాత కూడా రెండు మూడు రోజులపాటు తాను ఎంతో కంగారుగా ఆందోళనగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh: కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తే సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందేనా… ఇదీ మరీ దారుణం?

Keerthy Suresh: కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు కథ ప్రాధాన్యత ఉంటే హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు.ఇలా కీర్తి సురేష్ ఇదివరకే సూపర్ స్టార్ రజనీకాంత్ కు అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాలో ఈమె రజనీకాంత్ కు చెల్లెలుగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈమె చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఈమె చెల్లెలు పాత్రలో నటిస్తుందన్నగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.

గతంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయని తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇలా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడం వల్లే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Keerthy Suresh: కథ బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుంది…


అయితే కొందరు మాత్రం కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.సినిమాలో నటీనటుల వల్ల సినిమాలు ఎప్పటికీ ఫ్లాప్ అవ్వని సినిమాలో కథ బలంగా ఉంటే సినిమా ఆటోమెటిగ్గా హిట్ అవుతుంది కానీ ఇలా సినిమా ఫ్లాప్ ను ఒకరి మీద తోసేయడం మంచిది కాదు అంటూ కొందరు కీర్తి సురేష్ పట్ల వస్తున్నటువంటి ఈ వార్తలపై విమర్శలు చేస్తున్నారు.

Danush: మాజీ మామ రజనీకాంత్ జైలర్ సినిమాపై స్పందించిన ధనుష్… ఎంత ప్రేమనో?

Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ధనుష్ ఒకరు. హీరోగా ఎన్నో విభిన్న కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ధనుష్ 2004వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకొని రజనీకాంత్ కు అల్లుడు అయ్యారు. ఇలా రజినీకాంత్ కి ధనుష్ అల్లుడు మాత్రమే కాకుండా పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఇక ధనుష్ ఐశ్వర్య వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న సమయంలోనే వీరిద్దరు గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ రజనీకాంత్ గారి పట్ల తనకు ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం తగ్గదని పలు సందర్భాలలో ధనుష్ తెలియజేశారు.అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఆయన సినిమాలు అంటే ఈయనకు ఎంత ఇష్టమో తాజాగా మరోసారి రుజువు చేసుకున్నారు.ఇక నేడు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Danush: బంధం వీడిన అభిమానం వీడలేదు…


జైలర్ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇట్స్ జైలర్ వీక్ అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే జైలర్ సినిమా కోసం ధనుష్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. ఈ ట్వీట్ చూసినటువంటి కొందరు అభిమానులు ధనుష్ తన మాజీ మామ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ రజినీకాంత్ పట్ల ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ తగ్గదని మరోసారి ధనుష్ నిరూపించుకున్నారు.

Ramya Krishna: జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయం అదే… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా.నటిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను 1999వ సంవత్సరంలో రజనీకాంత్ సరసన నరసింహ సినిమాలో అవకాశమందుకొని స్క్రీన్ షేర్ చేసుకున్నాను సుమారు 24 సంవత్సరాల తర్వాత మరోసారి అవకాశం రావడం విశేషం అని తెలిపారు.

ఇక నరసింహ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ తో నటించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో తన పాత్ర ఏంటి అని కూడా ఆలోచించకుండా సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.ఇందులో నాది ఫస్ట్ హీరోయిన్ పాత్రనా లేకపోతే సెకండ్ హీరోయిన్ పాత్రనా అన్న విషయాల గురించి కూడా తాను ఆలోచించలేదని తెలిపారు.

Ramya Krishna: ఎలా స్వీకరిస్తారో అనే భయం వేసింది


ఇక నాకు సినీ కెరియర్ లో నేను తీసుకున్నటువంటి అత్యుత్తమమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది నరసింహ సినిమాలో నటించడమేనని ఈమె తెలిపారు.ఇక ఈ సినిమాలో తాను సౌందర్య మొహంపై కాలు పెట్టే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం చేసే సమయంలో తాను ఎంతో భయపడ్డాను. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అంటూ ఈ సందర్భంగా నరసింహ సినిమా విశేషాలను రమ్యకృష్ణ మరోసారి గుర్తు చేసుకున్నారు.

Rajinikanth: రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన చేసేదేం లేదు… రజిని సోదరుడు కామెంట్స్ వైరల్!

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్షీణించడంతో రాజకీయాలలోకి రావాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇలా ఈయన రాజకీయాలలోకి రాకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపాలని కూడా పలువురు కోరుకున్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ రాజకీయాల గురించి ఆయన సోదరుడు సత్యనారాయణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తిరుచెందూర్ కుమార స్వామి వారిని దర్శించుకున్నటువంటి సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ…

రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు అయితే ఆయన రాజకీయాలలోకి వచ్చిన చేసేదేమీ లేదని సత్యనారాయణ తెలియజేశారు. అయితే తాను ఇలా మాట్లాడటానికి గల కారణాలను కూడా సత్యనారాయణ తెలియజేశారు. ప్రస్తుతం రజనీకాంత్ గారికి 70 సంవత్సరాల వయసు ఈ వయసులో ఆయన రాజకీయాలలోకి వచ్చిన ఎలాంటి ప్రయోజనాలు ఉండవని సత్యనారాయణ తెలిపారు.


Rajinikanth: ఆరోగ్యంగా ఉంటే చాలు…


ఆయన రాజకీయాలలోకి రాకపోయినా సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని ఆయన సోదరుడు కోరుకున్నారు. ఇలా రజనీకాంత్ రాజకీయాలు గురించి ఆలోచన విరమించుకున్న అనంతరం ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని ఈ సినిమా త్వరలోనే విడుదల కానందని సత్యనారాయణ పేర్కొన్నారు.

Hero Suman: చంద్రబాబు టైం బాగాలేదు… రజని మాట్లాడిన మాటలలో తప్పులేదు: సుమన్

Hero Suman: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఈయన ఎన్టీఆర్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి కూడా తెలియజేశారు.ఇలా రజనీకాంత్ చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడటంతో వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు దీంతో రజినీకాంత్ పై విమర్శలు చేయడంతో రజనీ ఫ్యాన్స్ హీరో రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రజనీకాంత్ వైఎస్ఆర్సిపి పార్టీ పేరు కూడా పలకలేదు కేవలం ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే మాట్లాడారు అందుకే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు సుమన్ స్పందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో మాట్లాడిన మాటలలో ఏ మాత్రం తప్పు లేదని ఆయన తెలిపారు.

Hero Suman: చేసింది చేయలేదని చెప్పలేం కదా..


చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని రాజకీయాలన్న తర్వాత ఎత్తు పల్లాలు సర్వసాధారణం అయితే చంద్రబాబు నాయుడు టైం బాగాలేక ప్రజలు మార్పును కోరుకున్నారని కానీ ఆయన చేసింది చేయలేదని చెప్పడం భావ్యం కాదు అంటూ సుమన్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Soundarya Rajinikanth: రజనీకాంత్ చిన్న కుమార్తె ఇంట్లో చోరీ… పోలీసులను ఆశ్రయించిన సౌందర్య రజనీకాంత్!

Soundarya Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే ఈమె పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇంట్లో తన ఎస్ యువి కారు తాళాలు కనిపించకపోవడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు.

ఈమె ఒక ప్రైవేట్ కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేలోపు తన కారు తాళాలు కనిపించడం లేదు అంటూ సౌందర్య రజనీకాంత్ చెన్నైలోని తేనాం పేట పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మొన్నేమో అక్క ఇంట్లో నేడేమో చెల్లెలు ఇంట్లో దొంగతనాలు జరగడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గత కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు నగలు దొంగతనానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె తన ఇంటి పనిమనిషి అలాగే డ్రైవర్ పై సందేహాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Soundarya Rajinikanth: కనిపించని కారు తాళాలు..


ఐశ్వర్య రజనీకాంత్ తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ చాలీ చాలని జీతాలు ఇవ్వటం వల్లే తాను దొంగతనానికి పాల్పడ్డానంటూ ఆమె పనిమనిషి ఈశ్వరి పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. ఇలా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగినటువంటి దొంగతనం మర్చిపోకముందే తిరిగి సౌందర్య రజనీకాంత్ ఇంట్లో కూడా దొంగతనం జరగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.