Tag Archives: rakul preet singh

Rakul Preet Singh: సీక్రెట్ గా ఆ పనులు చేయడం ఇష్టం లేదు..! అంతా ఓపెన్ గానే అంటున్న రకుల్!

Rakul Preet Singh: ఫిలిం ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రెకప్ లు చాలా కామన్. ఇది బాలీవుడ్ లో చాలా ఎక్కువ. రోజుకో లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిలో చాలా మంది ఓపెన్ అవుతుంటారు.. కొంత మంది తన రిలేషన గురించి గుట్టుగా ఉంచుతారు.

Rakul Preet Singh: సీక్రెట్ గా ఆ పనులు చేయడం ఇష్టం లేదు..! అంతా ఓపెన్ గానే అంటున్న రకుల్!

ఎప్పుడో పార్టీలో, ఏదో కార్యాక్రమానికి  వెళ్లినప్పుడు.. ఫోటోలకు చిక్కుతుంటాయి ప్రేమ జంటలు. ఇప్పటికే మలైకా అరోరా- అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ లో ఉన్నామని బహిరంగంగానే అంగీకరించారు. ఇటీవల పెళ్లితో ఒకటైన విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ తాము ఎప్పుడూ ప్రేమలో ఉన్నామని బహిరంగంగా ఎప్పుడూ అంగీకరించలేదు.

Rakul Preet Singh: సీక్రెట్ గా ఆ పనులు చేయడం ఇష్టం లేదు..! అంతా ఓపెన్ గానే అంటున్న రకుల్!

కియారా అద్వానీ కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నారని తెలుసు కానీ ఎప్పుడూ.. అంగీకరించలేదు.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన జాకీ భగ్నానీతో రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ దాచుకోలేదు. తాము ప్రేమలో ఉన్నట్లు భయం లేకుండా అంగీకరించింది.


మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం..

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది రకుల్. ఇంత పెద్ద సెలబ్రెటీ అయి ఉండీ.. మీరు మీ రిలేషన్ ను వెల్లడించారని అడగ్గా…రకుల్ నవ్వేసింది. ‘ఇందులో దాచిపెట్టడానికి ఏముందసలు! రహస్యంగా దాక్కుని పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసింది.
కానీ మేమిద్దరం ఆ టైప్ కాదని.. మాకసలు అలాంటి ఆలోచనలే లేవని రకులు చెప్పుకొచ్చింది. ప్రేమలో పడటం తప్పు కాదు. మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం. మా రిలేషన్‌నీ గౌరవిస్తాం. అందుకే ఓపెన్‌గా చెప్పేశా’ అని వెల్లడించింది. సీక్రెట్ గా రిలేషన్స్ మెయింటైన్ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా చెప్పేసింది రకుల్. ప్రస్తుతం రకుల్ సినిమాలో బిజీగా ఉంది. చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో చాలా బిజీ అయింది ఈ అమ్మడు. తెలుగులో ఇటీవల నటిాంచిన కొండపొలం సినిమా… నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

రకుల్ పెళ్లి అతనితో జరగదు… జరిగినా జైలుకు వెళుతుంది : వేణు స్వామి

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన 31 వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నాని తో ఈ దేశం లో ఉన్నాను అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రకుల్ జాకీ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపించాయి. జాకీ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే విషెస్ చెబుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు.

ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వివాహం జరిగినా కూడా వెళ్ళిపోతారు అంటూ వాకిలి చేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ నేపథ్యంలోనే రకుల్ జాకీ భగ్నాని ల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణు స్వామి వీరిద్దరి పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాకీది మకర రాశి, అతని జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడి పై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిపారు. రకుల్ ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబసౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్ళి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని తెలిపారు.

సంతానం కలగకపోవడం సహా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని, రకుల్ ఒక కేసు విషయమై జైలు వెళ్లే అవకాశం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సమంత నాగ చైతన్య ల వివాహానికి సంబంధించిన విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమే అయ్యింది. నాగచైతన్య సమంత ల విషయంలో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్,జాకీ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ప్రియుడిని పరిచయం చేసిన రకుల్… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నేడు స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ ద్వారా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ… థాంక్యూ మై లవ్ ఈ సంవత్సరం నువ్వే నాకు అతి పెద్ద బహుమతి నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన అందుకు, నన్ను ఎంతో సంతోష పెడుతున్నందుకు థాంక్స్.. మనిద్దరం ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను కలిసి పంచుకుందాం.. నువ్వు నా లవ్ గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.

ఇలా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమిస్తున్నటువంటి బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని పెళ్లిచేసుకోబోతున్నానని చెప్పక పోయినప్పటికీ తనతో ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇక రకుల్ ప్రీతిసింగ్ సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన కొండపొలం సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కొండపొలం సినిమాపై పవన్ మామ ఇలా అన్నాడు.. హీరో వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతోనే తనకున్న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దీని తర్వాత అతడు వెంటనే ఒప్పుకున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ సినిమా.

దీనిని ప్రముఖ దర్శకుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. దీనిని సన్నపురెడ్డి వెంట రామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ చిత్రంగా దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఈ సినమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉండగా.. వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలోని ‘నీ కళ్లు నీలి సముద్రం’అనే సాంగ్ లో తాను చేసిన నటనకు మెచ్చి తనకు ఈ అవకాశాన్ని దర్శకుడు ఇచ్చాడని అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కథను తాను మొదట విన్నానని.. దానిని తన మామ అయిన పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పానని.. అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తాను కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి వహిస్తున్నాడు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ క‌నిపించ‌నున్నాడు. అడవికి వెళ్లి అక్కడ తన కుటుంబాన్ని , తన గొర్రెలను క్రూరమైన జంతువుల నుంచి ఎలా కపాడుతాడనేది ఈ సినిమా అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నాడు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా మారిపోయింది.. సర్జరీ చేయించుకుందా? వైరల్ అవుతున్న ఫోటో..

రకుల్ ప్రీతి సింగ్ మొదట కన్నడంలో గిల్లి అనే చిత్రంలో నటించి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత తెలుగులో ఆమెకు మొదటి సినిమా ‘కేరటం’.. తర్వాత వెంటాద్రి ఎక్స్ ప్రెస్. ఇలా ఆమె తెలుగులో కూడా తనకంటూ పేరు సంపాదించుకొని స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆమె గురించి చెప్పుకునేది ఏంటంటే.. తమ అందం కోసం కృత్రిమ మెరుగులు దిద్దుకుంటోందట. తాజాగా ఒక ఫోటో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమె పెదవులు మునుపటి కన్నా వేరే విధంగా ఉన్నాయి. ఆకృతి మారింది. ముఖకవళికలు పూర్తిగా మారిపోవడంతో ఆమె సర్జరీ చేయించుకుందని మాట్లాడుకుంటున్నారు.

ర‌కుల్ ప్రీత్‌సింగ్ త‌న లుక్ లో మ‌రింత మెరుగుప‌రుచుకునేందుకు కాస్మోటిక్ స‌ర్జరీ చేయించుకుంద‌న్న వార్త‌లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. లుక్ మార్చుకునేందుకు సినీన‌టులు కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం కొత్తేమి కాక‌పోవ‌డంతో ర‌కుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటూ తెగ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు.

బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుది. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ల కోసం ఎక్కువగా దర్శక, నిర్మాతలు చూస్తూ ఉంటారు. అందుకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందా అన్న సందేహం కలుగుతోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ర‌కుల్ ప్రీత్ సింగ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ప్ర‌స్తుతం ర‌కుల్ తెలుగులో వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి కొండ‌పొలం చేస్తోంది. మ‌రోవైపు హిందీలో డాక్ట‌ర్ జీ, థ్యాంక్ గాడ్‌, మేడే చిత్రాల్లో న‌టిస్తోంది. కొండపొలం సినిమా వచ్చే నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.

వీడియో వైరల్: కాపాడండి అంటూ రకుల్ ఆర్తనాదాలు.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎక్స్ప్రెస్ రేంజ్ లో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ సరసన రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈమె అటాక్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ లో పాల్గొన్నారు. ఈ విధంగా డబ్బింగ్ స్టూడియోలో నిలబడి హెల్ప్ మీ అంటూ.. గట్టిగా ఏడుస్తుంది. తనను ఎవరో కట్టి పడేయడంతో తనను కాపాడాలని రకుల్ గట్టిగా అరుస్తూ ఉంది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ రకుల్ అరవకండి.. డబ్బింగ్ సన్నివేశం జరుగుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

సమంత, కాజల్ బాటలోనే రకుల్… త్వరలోనే అధికారిక ప్రకటన!

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పలువురు నటీమణులు వెబ్ సిరీస్ లో అడుగు పెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని కోడలు సమంత, వెండితెర చందమామ కాజల్ అగర్వాల్, మిల్క్ బ్యూటీ తమన్నా లాంటివారు పలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరి స్టార్ సెలబ్రిటీల చూపుకూడా వెబ్ సిరీస్ ల పై పడింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకుల్లో బాగా డిమాండ్ పెరిగినా ఓటీటీ కంటెంట్‌తో త్వరలోనే ఆకట్టుకోవాలని రకుల్ ప్రీత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే సరికొత్త కథలను వినే పనిలో పడ్డారు. దర్శకులు కొత్త వారైనా కథలో నైపుణ్యం ఉంటే చేయడానికి ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఓటీటీ అనేది బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ వేదికపై విడుదల కావడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరైన కథ నచ్చితే ఓటీటీ లో ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమైనట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన ఆ పాత్రను రకుల్ ఒప్పుకుందట.. ఎందుకో తెలుసా.??

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది..గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేని ఈ అమ్మడు.. ఇటీవలే నితిన్ సరసన చెక్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టింది.. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు.. హిందీ సినిమాలు చేస్తోంది రకుల్.. ఇందులో భాగంగానే ఓ హిందీ సినిమాలో కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుంది.. కండోమ్ కంపెనీలో ఒక లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ?

అందరూ ఆమెను ‘సెక్స్’క్యూటివ్ గా ట్రీట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో రకుల్ పాత్ర పని ఏమిటంటే..కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్, అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పనిని చేయబోతుంది రకుల్. బాలీవుడ్ లో రానున్న ఈ మూవీ పక్కా కామెడీ మూవీగా తెరకెక్కనుంది. ‘కండోమ్ టెస్టర్’ పాత్రని రకుల్ పోషించబోతుంది. ఐతే, ఈ పాత్రలో నటించే ఛాన్స్ రకుల్ కి లక్కీగా వచ్చింది.

నిజానికి ఈ పాత్రను మొదట జాన్వీ కపూర్ తో లేదా అనన్య పాండేతో చేయించాలని అనుకున్నారు మేకర్స్.కానీ వాళ్ళు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత సారా అలీ ఖాన్ ను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా నో చెప్పింది. మొత్తమ్మీద ఈ పాత్ర చేసేందుకు ఆ ముగ్గురూ ముందుకు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు.

రకుల్ కి ఇప్పుడు ఎలాగూ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.అందుకే హిందీలో వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది. ఏది ఏమైనా బోల్డ్ క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది. ఇంతకీ ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఇక వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సరికొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడు..!!

‘సెక్స్’ క్యూటివ్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల నితిన్ సరసన చెక్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ చేసిన విషయం తెలిసిందే..ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..ఇదిలా ఉంటె ఈ అమ్మడు కొత్తగా ఒప్పుకున్న సినిమా ఒకటి అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా ఆమె కనిపించబోతుంది. కార్పొరేట్ కంపెనీల్లో ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంటుంది.

మరి కండోమ్ కంపెనీల్లో పనిచేసే లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో మరి. అసలు వాళ్ళను ‘సెక్స్’క్యూటివ్ అని సరదాగా అనుకోవచ్చు ఏమో..ఇంతకీ రకుల్ పని ఏమిటంటే.. కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్ అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పని అన్నమాట. అసలు ఇలాంటి పనిని అమ్మాయిలు చేస్తారా? అంటే.. సినిమా కాబట్టి ఏమైనా చేస్తారు.

సో.. రకుల్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎలాగూ కామెడీ సినిమా కాబట్టి మసాలా అంశాలు మస్తుగా దట్టిస్తారు. పైగా ఆ టైపు క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది.ఇంతకీ ఈ ఆణిముత్యాన్ని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రకుల్ ఒప్పుకోవడానికి ఒక కారణం ఉంది. హిందీలో వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరో. కాబట్టే.. రకుల్ కండోమ్ కంపెనీ ‘సెక్స్’క్యూటివ్ నటించడానికి వెంటనే ఒప్పేసుకుంది.

ఏది ఏమైనా రకుల్ పక్కా బిజినెస్ విమెన్.హీరోలను పట్టుకోవడంలో రకుల్ మాస్టర్ డిగ్రీ చేసింది. ఏది ఏమైనా పెద్దగా అందం అభినయం లేకపోయినా.. విపరీతమైన బోల్డ్ నెస్ తో ఎప్పటికప్పుడు మంచి కిక్ ఇస్తూ మొత్తానికి ఆ రకంగా రకుల్ ముందుకు పోతుంది. ఇక బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని, ఎప్పటినుండో తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి ఒక స్టార్ హీరో ఆమెకు వరుసగా ఆఫర్లు కూడా ఇప్పించాడు. అయినా రకుల్ అక్కడ బి గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది…!!

బికినీ వేసిన శ్రీరెడ్డి.. సమంత, రకుల్ లను ట్రోల్ చేస్తూ…?

రెండేళ్ల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలపై, ప్రముఖ కుటుంబాల్లోని వారసులపై, హీరోయిన్లపై సంచలన ఆరోపణలు చేసి శ్రీరెడ్డి వార్తల్లోకెక్కింది. మొదట్లో కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినా ఆ తరువాత కాలంలో ఆమెకు మద్దతు ఉపసంహరించుకున్నారు. అనంతరం కోలీవుడ్ కు మకాం మార్చి అక్కడ శ్రీరెడ్డి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.

కొన్నిరోజుల క్రితం సమంత బికినీ ఫోటోను విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో బికినీ ఫోటోను షేర్ చేసింది. శ్రీరెడ్డి బికినీ ఫోటోను షేర్ చేయడంలో వింతేం లేకపోయినా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ గురించి కామెంట్లు చేస్తూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరెడ్డి బికినీ ఫోటో తెగ వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి బికినీ స్ట్రక్చర్ అంటే ఇది వదినా అంటూ సమంతపై కామెంట్ చేసింది.

నా బికినీ ఫోటో చూసిన తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫీల్ అవుతుందని శ్రీరెడ్డి పేర్కొంది. శ్రీరెడ్డి పెట్టిన బికినీ ఫోటోకు వేల సంఖ్యలో లైకులు, లక్షల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. 800 మంది శ్రీరెడ్డి ఫోటోను షేర్ చేశారు. గత కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేసూ ఉండటం గమనార్హం. శ్రీరెడ్డి పోస్టులపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫోటోలను నాచురల్ లవర్స్ కోసం షేర్ చేశానని.. నేచురల్ అందం.. మేకప్ లేకుండా అని పోస్ట్ లో శ్రీరెడ్డి పేర్కొన్నారు. అయితే శ్రీరెడ్డి ప్రముఖులను టార్గెట్ చేస్తున్నా ఆమె పోస్టులపై సినీ సెలబ్రిటీలు ఎవరూ స్పందించకపోవడం గమనర్హం.