Tag Archives: Ravi

Jabardasth Rohini: వీల్ చైర్ లో యాంకరింగ్ చేసిన జబర్దస్త్ రోహిణి… అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Jabardasth Rohini: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రోహిణి ఇలా సీరియల్స్ ద్వారా కామెడీ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.

ఇలా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.గతంలో ఈమెకు రోడ్డు ప్రమాదంలో భాగంగా కాలికి సర్జరీ చేసి కాలిలో రాడ్ వేసినట్లు తెలిపారు. అయితే ఆ రాడ్ కాలిలో ఉండటం వల్ల తనకు డాన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉందని అందుకే సర్జరీ ద్వారా ఆ రాడ్ తీసేయించుకోబోతున్నాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని చేశారు.

ఈ విధంగా రోహిణికి వైద్యులు సర్జరీ చేసి కాలిలో ఉన్నటువంటి రాడ్ తొలగించారు. ఇలా ఈమెకు సర్జరీ కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.పూర్తిగా ఆరోగ్యం కుదట పడిన తర్వాతే ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని భావించారు. అయితే ఈమె ప్రస్తుతం ఆరోగ్యము ఇంకా కుదట పడలేదని స్టిక్స్ సహాయంతో నడుస్తున్నారు ఇలాంటి సమయంలోనే ఈమె బుల్లితెర కార్యక్రమాలకు హాజరయ్యారు.

Jabardasth Rohini: నిలబడలేని స్థితిలో ఉన్న రోహిణి…


ఇలా బుల్లితెరపై ప్రసారం కాబోతున్నటువంటి ఓ కార్యక్రమంలో భాగంగా యాంకర్ గా వ్యవహరించారు కనీసం నడవడానికి రాని పక్షంలో ఈమె యాంకరింగ్ చేయడానికి వచ్చారు అయితే వీల్ చైర్ లో కూర్చుని యాంకర్ రవితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చూసినటువంటివారు ఇలాంటి పరిస్థితులలో యాంకరింగ్ చేయడం అవసరమా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ భారీ స్థాయిలో ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.

Racha Ravi: చెల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రచ్చ రవి.. ఒకసారి వచ్చి పోవమ్మా అంటూ?

Racha Ravi: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రచ్చ రవి కూడా ఒకరు. జబర్దస్త్ లో తన పంచులతో సెటైర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రచ్చ రవి.. తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఓకే ఒక్క డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటి ఎక్కడ చూసినా కూడా ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది.

ఇలా జబర్థస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి అటు వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన బలగం సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాడు. సినిమా విడుదల అయిన తరువాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రచ్చ రవి తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జీవితంలో ఎంత సంపాదించినా కూడా మన అనే వారు తోడుగా లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఇక ఈ ఇంటర్వ్యు లో రచ్చ రవి మాట్లాడుతూ..”ప్రతీ రాఖీ పండక్కి చెల్లి దగ్గరికి పోయి రాఖీ కట్టించుకునేవాడిని. కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు నాతో మాట్లాడం లేదు. మా ఇంటికి రావడం లేదు. 2016లో జరిగిన నా ఇంటి గృహప్రవేశానికి ఆఖరిసారిగా ఇంటికీ వచ్చింది.
అప్పటి నుండి నా ఇంటి గడప తోక్కలేదు ఈ రోజు నేను ఇంత సంపాదించి ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులతోపాటు నా చెల్లెలు కూడా కారణం.

Racha Ravi: ఇంత సంపాదించిన చెల్లి మాట్లాడలేదు…

సినిమాల మీద ఉన్న ఇష్టంతో సొంత ఊరిని వదిలి పట్నానికి వచ్చేటప్పుడు తను ఇచ్చిన రూ. 123 రూపాయల తీసుకునే నేను హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు నా ఎదుగుదలను కోరుకున్న నా చెల్లెలు ఇప్పుడు నేను జీవితంలో పైకి ఎదిగి ఇంత సంపాదించిన తర్వాత నాకు దూరం అయింది. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా చెల్లెలు నా ఇంటికి రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకనైనా అన్నీ మరిచిపోయి ఇంటికి రా చెల్లి అంటూ తన చెల్లిని వేడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అచ్చం బలగం సినిమాలో జరిగిన సన్నివేశం లాగే ఉంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Gunasekhar Son In Law: గుణశేఖర్ అల్లుడు ఎవరు… తన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Gunasekhar Son In Law: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పౌరాణిక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గుణశేఖర్ తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే గుణశేఖర్ ఈ సినిమా ద్వారా తన కుమార్తె నీలిమ గుణను కూడా ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నీలిమ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ప్రఖ్య అనే వ్యక్తిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 31 నిమిషానికి ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాదులోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుణశేఖర్ అల్లుడు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి నేటిజన్స్ అరా తీస్తున్నారు.

Gunasekhar Son In Law:వందల కోట్ల ఆస్తి కలిగిన రవి ప్రఖ్య…

గుణశేఖర్ అల్లుడు రవి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యా, పారిశ్రామిక వ్యాపారవేత్త. ఇక శ్రీ శక్తి అధినేత డాక్టర్ రామకృష్ణ శ్రీ సత్య దంపతుల కుమారుడు. ఇలా రవి ప్రఖ్యా ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిగా వందల కోట్లకు ఆస్తిపరుడని చెప్పాలి.ఇక రవి కూడా పలు బిజినెస్ లను చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విషయం తెలిసిన నేటిజన్స్ మొత్తానికి గుణశేఖర్ అల్లుడు బాగా సౌండ్ పార్టీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Neelima Guna: ఘనంగా నీలిమ గుణ వివాహం… హాజరైన సినీ సెలబ్రిటీలు.. ఫోటోలు వైరల్!

Neelima Guna: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. పౌరాణిక చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించే గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కోసం తన కుమార్తె నీలిమను నిర్మాతగా పరిచయం చేశారు.

ఇకపోతే నీలిమ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఈమె వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొద్ది రోజుల క్రితం నీలిమ నిశ్చితార్థం హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యా వ్యాపారవేత్త శ్రీ శక్తి గ్రూప్ అధినేత కుమారుడు రవి ప్రఖ్యాతో ఈమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా ఈమె వివాహ బంధం కొత్త జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. నీలిమ రవిల వివాహం శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాదులోనే ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

Neelima Guna: నీలిమ వివాహానికి హాజరైన మెగాస్టార్ దంపతులు…


ఇక ఈ వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నీలిమ గుణ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు, అల్లు అరవింద్ వంటి పలువురు దర్శక నిర్మాతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tollywood Anchors: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్లు వీళ్లే?

Tollywood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ల పేర్లు చెప్పమంటే వెంటనే సుమ, అనసూయ ,రష్మీ, శ్రీముఖి, ప్రదీప్, రవి ఇలా వరుసగా అందరి పేర్లు టకటక చెప్పేస్తాము.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమా కార్యక్రమాలు టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాంకర్లు సైతం నేటితరం యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…

సుమ: దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. సుమ షెడ్యూల్ చూసుకొని సినిమా ఈవెంట్లు నిర్వహించుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.ఇక సుమ ఒక్కో ఈవెంట్ కు సుమారు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

ప్రదీప్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షో కి ప్రదీప్ రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

అనసూయ:జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వెండి తెర సినిమాలతో బిజీగా ఉన్నారు.

రష్మీ:జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

శ్రీముఖి: ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి హవ కొనసాగుతుంది ఏ టీవీ ఛానల్ లోకి వెళ్లిన శ్రీముఖి కార్యక్రమం ఏదో ఒకటి ప్రసారమవుతోంది.ఇక శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కి సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

రవి: ప్రదీప్ తర్వాత మేల్ యాంకర్ గా గుర్తింపు పొందిన రవి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Tollywood Anchors:

శ్యామల: యాంకర్ శ్యామల సైతం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కి సుమారు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితోపాటు యాంకర్ వర్షిని మంజూష వంటి వాళ్ళు ఒక్కో ఎపిసోడ్ 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Neelima Guna: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ.. వైరల్ అవుతున్న ఫోటో!

Neelima Guna: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో గుణశేఖర్ దిట్ట. ఇలా గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించే సినిమాలకు ఈయన పెద్ద కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు.

నీలిమ గుణ ఇదివరకే రుద్రమదేవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నీలిమ గుణ సరికొత్త బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.తన నిశ్చితార్థ ఫోటోలను నీలిమ గుణ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని జీవితాంతం సాగే కొత్త ప్రయాణం మొదలైంది అంటూ క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నీలిమ గుణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే విషయంపై అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

Neelima Guna:  త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటన..

ఇక నీలిమ గుణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రవి ప్రఖ్యా అని మాత్రమే తెలుస్తుంది. ఆయన ఏం చేస్తారు తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్నట్లు ప్రకటించారు.

రవి ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర జరిగింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రవి ఫ్యాన్స్..!

బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకొని ఎవరు ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి రవిని ఎలిమినేట్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు. ఇకపోతే ముందుగానే సోషల్ మీడియాలో 12వ వారం రవి ఎలిమినేట్ అవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రవి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల విషయంలో ఎంతో ఎనర్జిటిక్ గా టాస్క్ లను పూర్తి చేస్తూ ఉన్నటువంటి రవి టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలుస్తారని ప్రతి ఒక్క ప్రేక్షకులు భావించారు. అలాంటి టాప్ త్రీ కంటెస్టెంట్ ఉన్నఫలంగా ఎలిమినేట్ కావడంతో రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవికి ఓట్లు తక్కువ పడ్డాయి అంటే నమ్మశక్యంగా లేదని వాదిస్తున్నారు.

మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ ఎలిమినేషన్ జరిగిందని రవి ఎలిమినేషన్ వెనుక పెద్ద కుట్ర జరిగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్ వెనుక ఎలాంటి కుట్ర లేకపోతే రవికి వచ్చిన ఓట్లు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

రవి హౌస్ లో ఉన్నటువంటి సిరి, కాజల్, ప్రియాంక కన్నా ఎంతో అద్భుతంగా ఆడతారని అలాంటిది వారు సేఫ్ అయ్యి రవి ఎలిమినేషన్ కావడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.కావాలనే లేడీ కంటెస్టెంట్ లను సేవ్ చేస్తూ రవిని బయటకు పంపారని, రవి లేని బిగ్ బాస్ కార్యక్రమం మేము చూడము అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవిభార్య కూతురు.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎన్నో ఎమోషన్ సన్నివేశాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దాదాపు 80 రోజులు కావడంతో ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులను హౌస్ లోపలకి పంపించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కాజల్, శ్రీరామ్, మానస్, సిరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సన్నీ, రవి, పింకీ,షన్ను మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి భార్య నిత్య రావడంతో సంతోషపడిన రవి అనంతరం తన కూతురు రాలేదని బాధపడ్డారు. అయితే కొంత సమయానికి తన కూతుర్ని పంపించి బిగ్ బాస్ రవికి సర్ ప్రైస్ ఇచ్చారు.

ఇలా తన కూతురిని చూడటంతో రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం రవి తనకు బిగ్ బాస్ అంకుల్ ని చూపించమని కోరింది. అలాగే రవి కూతురు వియా రావడంతో హౌస్ మొత్తం ఎంతో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రతి రోజు టీవీలో నిన్ను చూస్తూ మమ్మీ ఏడుస్తుందని వియా తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

రవి కోసం బిగ్ బాస్ గుమ్మాడి గుమ్మాడి అనే పాటను ప్లే చేయడంతో హౌ సభ్యులందరూ ఎంతో సరదాగా డాన్స్ చేశారు.ఈ విధంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ నుంచి బయటకు రావాలని సూచించడంతో కంటెస్టెంట్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఫేక్ అకౌంట్లతో రవి కుటుంబాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేసిన రవి భార్య!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రవి ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రవి తన అద్భుతమైన ఆట తీరుతో విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి నుంచి ప్రతి వారం రవి నామినేషన్ లో ఉంటూ ఆ టెన్షన్ ని తట్టుకొనీ టాస్క్ లలో తన అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బయట నుంచి ఎంతో మంది మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మరొక కంటెస్టెంట్ అభిమానులు ఇతర కంటెస్టెంట్ లను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సర్వసాధారణం. అయితే రవి విషయంలో మాత్రం కేవలం రవిని మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై రవి భార్య నిత్య స్పందిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ తమని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారంటూ తన సన్నిహితుల దగ్గర బాధ పడినట్లు తెలుస్తోంది. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ లు ముందుగానే ఒక పిఆర్ టీమ్ ను పెట్టుకొని వారి గురించి ప్రమోషన్ చేయమని చెబుతారు.

ఈ క్రమంలోనే వారిని హైలెట్ చేయడం కోసం ఇలా పక్కవారి గురించి నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. ఏదిఏమైనా రవి విషయంలో ఇలా జరగడం బాధగా ఉందని తన భార్య నిత్య తన సన్నిహితుల దగ్గర బాధ పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదటినుంచి రవి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ఇతను కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని భావిస్తున్నారు.

అలాంటి వారికి ఓట్లు వేయకండి.. తన సపోర్ట్ వాళ్లకే .. యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొన్నటి వరకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కూడా అయిపోవడంతో బిగ్ బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు, క్రికెట్ ముగిసిపోవటంతో మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ క్రేజ్ పెరిగింది. దీనిపై బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

దీనికి కారణం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన సన్నీకి, షణ్ముఖ్ మధ్య గొడవనే చెప్పాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కూడా సన్నీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఓ పెద్ద పోస్టును దీప్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ఆ గొడవలో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని.. తనను హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ దీప్తి అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన శివజ్యోతి షణ్ముఖ్ కు సపోర్టు చేయగా.. కొందరు షణ్ముఖ్ దే తప్పు అంటూ భావిస్తున్నారు.

తాజాగా సీనియర్ టీవీ యాంకర్ ప్రశాంతి షణ్ముఖ్ బిహేవియర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హౌస్ లో గేమ్ చూసి ఓటు వేయండి.. అంతేకాని బయట వారి పాపులారిటీ చూసి ఓట్లు వేయకండి అంటూ షణ్ముఖ్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది యాంకర్ ప్రశాంతి. హౌస్ లో టాప్ 5 లో ఎవరుంటారో తనకు తెలుసని.. వాళ్లందరికీ తన సపోర్టు ఉంటుందని ఆమె పేర్కొంది. హౌస్ లో గేమ్ లు మంచిగా ఆడిన వారికి మాత్రమే ఓట్లు వేయండి అంటూ యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్ చేశారు.